Tuesday, 23 May 2017





ప్రాంజలి ప్రభ .. శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి ..శ్రీ మద్భగవద్గీత (అనువాదం) సవశతి 
  ...అర్జున విషాద యోగము. మొదటి అధ్యాయము
*దృతరాష్ట్రుని ప్రశ్న*
ఉ. ధర్మజు తోడఁ  దమ్ములు సుధర్మముఁ దత్త్వమునేల నుండగన్
కర్మలనేమి యెంచగల కాలము తోడుగ సాగి పోవుటన్
ధర్మము నాదుపుత్రుల విధానము సర్వము బోధజేయగా
నోర్మిగఁ తెల్పుసంజయ వినూత్నపు యుత్సవ యుద్ధ నీతులన్  (01)
*సంజయ వ్యాఖ్యానము*
ఉ..అప్పుడు సంజయుండు, నుడి వాసల వెల్లువ గెల్పుకోసమున్
తప్పిదమెన్న లేనిగతి ధార్మిక పాండవ సేనయేనటన్
గొప్పగ నెంచగా గురుని గోప్యము యుద్ధమునందుఁ జూపగన్,    
ఒప్పిన ధైర్యపాటవసుయోధను డంతట వేడెనిట్లనన్                   (02)...

ఉ...హే, గురువా విధానముల హేతువు విద్దెలబుద్ధిశాలిగన్
బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతితో 
సాగెడి సైన్య మెల్లరను సాధ్యపు చేతల నెంచ గల్గగన్
యోగపు వీరులై విజయ యోగ్యత నంతయు నీదు యుక్తులన్      (03)

ఉ. మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్,
అచ్చట చేకితానుడు సహాయదృపుండు సుధీర శ్రేష్ఠులున్ 
దెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ పోరు నందరున్
వచ్చిన వారినే ప్రహర వాక్కుల పర్వము క్షేత్రమందునన్             (04)

శా .  ఆమాదాద్యసమానవీరులిట వీరావేశ భీమార్జునుల్
సామంతుల్ గణవీరులై సమరమున్ సంగ్రామ బీభత్సమున్ 
భూమీశాద్య మహా విపన్న కదనా వ్యూహామ్ము లన్ గెల్వగన్ 
ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్            (05)

ఉ. పాండు కుమారులున్ తమరి పాశమునేమది జూపనుండగన్  
పాండవ మధ్యముండు మరి బాల ప్రవీరులు ధర్మ యుద్ధమున్      
కండబలంబునన్ గలిగి గమ్యనిజంబగు ధైర్య వాక్కులన్
నిండుగ యుద్ధవీరులకు నిర్ణయ లక్ష్యము పోరుయేయగున్         (06 )

ఉ. ఎందరు భూసురుల్ కలసి వెల్గుల నెత్తగ జోరుగుండగన్,              
అందరిలోను మిన్నగన నాద్యుగ నీవన విజ్ఞతేయగున్   
సందడి యుద్ధకారణమె సంజయ! యీవిధిఁ జేరగా నగున్
గందర గోళమున్ బడితి గావఁగ నాయకు లౌను సైన్యమున్         (07 )

ఉ. కేరున, భీష్మ, కర్ణ, శృత కీర్తి శతానుడు కుంతి భోజడున్
వీర వికర్ణ విశ్వస వివేకులు మీరును మాన్యు లేయగున్
భూరి శ్రవుండు నీదుసుత భూసుర శ్రేష్ఠులు వీరతేజమున్
వీరులు యేకమై సమయ విద్దెలు గాకురు క్షేత్రయుద్ధమున్            (08)

ఉ. ఇంకను పెక్కుమంది బల హేతుక విద్యల యుద్ధ కౌశ మున్ 
జంకక నన్నుఁ గోరి తమ జాడలుఁ దెల్పియు దేహమొడ్డియున్
వంకలు లేని యుద్ధకళ వాలుగ సిద్ధముఁ దీరి యుండగన్
సంకట మేమిలేకనటు సాయముఁ జేయగ శూర సైనికుల్              (09)

చం. అపరి మితమ్ము సేన తతి యాశయ లక్ష్యముగాను కౌరవుల్
అపజయమేయెరుంగనిటు యర్జును భీష్ముల నిల్వరించగన్
నిపుణత మేలు జూపుచు వినిర్మల పాండవ మూక గెల్వగన్
అపజయమౌను సత్యముయు నాదిగ వాక్కులు నమ్ముసైన్యమున్  (10)

ఉ.కావున మీరు ధైర్యము సకాలము తోడుగ నుండ గల్గగన్
కావగ భీష్ము వెంట నని కార్య విశిష్టత లందు తోడుగన్
నావిజయమ్ములే మొదట నాదగు ధైర్యము సంపదేయగున్
కావున విశ్వసించ గల కార్యము యుద్ధము నిర్ణయమ్ముగన్             (11)

ఉ. భీష్మ సుయోధనా పలుకు ప్రీతిగ నెంచియు యుద్ధ భేరితో 
భీష్మ నినాద విస్మయ విభేద్యము తెల్పగ ధైర్యమే బలమ్
భీష్ముడు సింహనాదమను భీకర శంఖము పూరణార్థముల్  
భీష్ముడు తాను సర్వులకు ప్రేరణ నివ్వగ వ్యూహ మెంచగన్          (12 )

ఉ. అప్పుడె శంఖనాదపు మహారవ తప్పెట శబ్ద భేరులన్
చప్పుడు వాద్యముల్ విను ప్రచారపు భీతినిఁ గల్గఁ జేయగన్
డప్పుల చప్పుడే వినుము డంగగు యుద్ధ కళా సమర్ధతే
గొప్పగ గెల్పుఁ గోరికల కొండలు పిండిగ చేయఁ దల్చగన్                 (13 )

ఉ. తెల్లని వెల్గులన్ రథము తీర్చిన సాధ్యము యుద్ధమేయగున్,
ఉల్లమునన్ కిరీటిగనుచుండగ ధైర్యము పెచ్చరిల్లగన్
నల్లని ధాత కృష్ణుడు సనాతన ధర్మము నిల్ప గల్గగన్,                              
గొల్లున శంఖ రావముల ఘోరనినాదము యుద్ధ విద్యగన్                (14 )

ఉ. కృష్ణుడు  పాంచజన్యమున కృత్యముఁ జేసెను శంఖరావమున్
కృష్ణుని తోడు నర్జునుడు కృత్యకఠోరపు శంఖమూదగన్ 
కృష్ణుని వెంట భీముడును కృత్య మొనర్చగ పౌoడ్ర శంఖమున్
జిష్ణుడితోను పాండవులు చిన్మయ చేష్టల శంఖమూదగన్                (15)

శా . కుంతీపుత్రుడు ధర్మరాజు జయమే కోరాడు భావమ్ము లన్
శాంతమ్ముల్ కదనాంత సాధ్యములనన్ సద్యమ్ము ఘోషించగన్
సాంతమ్మున్ సహదేవుడంతమణిపుష్పాశంఖ మున్ నింపగన్   
కుంతీపుత్రులమేయవిజ్జయములన్ కూర్మిన్ రొదల్ జేయగన్        (16 )

మ. శరవిద్యావిధి నేర్పు పాటవ మహా శౌర్యున్ శిఖండీయనన్
వరపుత్రాదులు సాత్యకీ భుజబలుల్ వారైన కాశీప్రభున్
ధరమాహాత్మ్యములెన్న జేసెడి సుభద్రాపుత్రుడేమార్చగన్
ధరణీతత్త్వముఁ దెల్పగన్ దృపదు శ్వేతాంబాద్య శంఖాలిడెన్     (17)

చం. అపజయమే నెరుంగనిట సాత్యకిసేవ మహా ప్రభున్ సుధీ
ద్రుపద మహాప్రభున్ యపర దూకొను యుద్ధ సమర్ధతల్ సుధీ
స్వపరము యుద్ధ కౌశలము సాగెడి విద్యలుగాను యుద్ధమున్, 
అపర సుధీరమందునను యాసలుగానిటు శంఖమూదగన్             (18)

ఉ ll పాండవ యోధులిట్లనెడి పాటవముల్ పెను శంఖనాదముల్
మెండుగ మిన్నుముట్టిన ప్రమేయపు రోదన భీకరమ్ముగన్
మొండి సుయోధనుం డడరి మూకల వ్యూహము మార్చుచుండగన్
గుండెలు ముక్కలైనసమ గుర్తుగ యుద్ధ నినాదచేష్టలన్...              (19)

ఉ. సోద మనస్కుడై  తెలియు చోద్యములన్ ధృత రాష్ట్రు డీ విధిన్ 
మోదము తోడ పార్ధుడు సమూహముతోడుగ సైన్యమంతటన్
నాదముఁ జేయుచూ ధనుసు నారిబిగించిసమూల మెల్లెడల్  
మీదగు సేన నిల్వలను మీసుతు లెల్లర వీక్ష జేయగన్                    (20)

శా . హేకృష్ణా యనుచున్ కిరీటి పలుకుల్ హెచ్చైన చోద్యమ్ములన్
హేకృష్ణా యెవరెవ్వరీ మొనలనన్ హేయంపు వీక్ష్యమ్ము లన్ 
హేకృష్ణా కదనమ్ముమధ్య నిలుపన్, ఇంపార వీక్షించగన్
హా కృష్ణా మనవీరులన్ యెదుటి వీ రావేశులన్ యుద్ధమున్            (21 )

ఉ. వైరులు నేనుగాగనెద వైనము యేమియు తేల్చగల్గగన్
పోరున నెవ్వరో ననగ బుద్ధిగ నెంచెడి యుద్ధవీరులన్
వారల నెంచ శక్తిగను వాలును వీలును కల్గఁ జేయగన్
సారధి మధ్యనే రథము సాచుము జూచెద నెవ్వరెవ్వరో -              (22)

చం. ఒకపరిచూచెమానసము నొక్క విధమ్మును గాంచ యుద్దమున్
సకల సుయోధనా ప్రియులు సఖ్యపు రాజుల గాంచ యుద్దమున్
నికరపు బుద్దిగూర్చుటకు నిక్కువ మైనది యుద్ధ క్షేత్రమున్
మకతిక రాజులేకలరు మానసమేనుసమమ్ము గాంచెదన్                (23 )

ఉ. దివ్య శతాంగ మెక్కిసువిధేయసుయోధను భీష్మ ద్రోణులన్ 
భవ్య పథమ్మునన్ మలిపి బంధన నీతిని రాజులియ్యడన్
నవ్య పథమ్మునన్  గదలి నమ్మిన వీరుల నెంచగల్గగన్
సవ్యరథమ్మునన్  నిలుపు సాధ్యము జేయుము ముందుగా నిటన్   (24 )

మ. పరికించన్ కదనాంతరమ్మునిటు సంప్రాప్తమ్ము లెన్నన్గడున్                                 
కురువీ రుల్ జయకాంక్షలన్ తలపగా కూర్పౌను నేస్తమ్ములన్
తరుణమ్మే పరమావిధిన్ విజయమే తత్త్వమ్ము వైనమ్ములీ
మరులందే పడి పాండు మధ్యముడు సామర్థ్యమ్ము లెక్కించ గన్   (25 )

ఉ. పిమ్మట పార్ధుడే యుభయ బిందము లందున మేనమామలున్
ముమ్మరసేనలందు గురుమూర్తులు, తండ్రులు, తాతలుండగన్ 
నమ్మిన పౌరులెంచగవినమ్రులు మిత్రులు బంధులుండగన్            
చెమ్మగిలంగ యర్జునుడు చింతన జేయుచు పల్కెనిట్టులన్            (26 )

చం. గురుజన, మేనమామలును, గుర్తుకుఁ దెచ్చెడి బంధు వర్యులన్
వరుసకుసోదరుల్ సుతులుబావలు మామలు, మిత్రులెందరో 
పరిచయనేస్తులన్ గనుము పాశము బంధముగాను చూడగన్
సరిగమ యుద్ధ వీరులనుసారధు లౌను ప్రయుక్త బారులన్              (27 )
*పార్ధుని ప్రార్ధన*
చం.  సమరము సేయ వచ్చిన సుసాధ్య జయమ్మును గోరు రాజులున్
తమతమబంధుమిత్రులు కదాయని నెమ్మ మనమ్ము  క్రుంగగన్ 
మమతను వీడ విజ్ఞతలు మాయగ కయ్యము జేయగాఁ గనన్ 
సమతను జూపలేనివిధి సంగమసాధ్య విషాద హేతువుల్              (28)

మ.  సహబంధాఢ్యుల పోరు సల్ప జయముల్ సాధ్యమ్ము సిద్ధించగన్
సహధాయమ్ముల శోకమేయగుటలో సామ్యమ్ము లేదెందుకో 
సహదేహమ్ము విధేయిగా వణకగా సాగే విశేషమ్ముగన్
సహవాక్కుల్ విన ధైర్యముల్ సడలగా సంగ్రామ మందున్ గనన్ ....  (29)

ఉ. మర్మము తెల్పలేనిగతిమాయల విస్తృత తత్త్వమే యనన్
శర్మద సాక్షిగా మనసు సంగర మార్పుల చిత్తమందగన్
ధర్మపు యుద్ధమే స్థిరము, దారులు వేరుగ లేక నిల్వగన్ 
కర్మల తోడుగా చలన కాలము వ్యర్థము జేయకుండగన్                        (30)

మ.  కనుచుండన్ విభవమ్ము సూచనలనన్ కాలమ్ము కర్మమ్ము గన్
రణరంగాన మదీయ సైన్యము లిలన్ రంజిల్లగా నెల్లెడన్
మనమేగెల్పుల లాభమంద గలుగన్ మాత్రాద్య ప్రశ్నేయగున్
మనసేమాన్యగుణమ్ముగాసకలమున్ మాయాను సారమ్ములన్             (31 )

ఉ. కోరను నేనుగా జయము కూర్మిని బాపెడు యుద్ధమందునన్
కోరను రాజ్యభోగములు కుచ్చిత సౌఖ్యములెన్న హీనముల్ 
కోరను భాగ్యముల్ కదన కోరిక లేదన వాదమెందుకో
పోరును చేయనే ననుచు పూర్తిగ మారితి నేనునేనుగన్                           (32 )

మ. సుకమేధ్యాసగ నెంచుపోరులెనయన్ సూత్రమ్ము లన్ యుద్ధముల్ 
సకలమ్మే భయమేమిలేక నిటులన్ సంగమ్ములన్ బోరగా 
వికసించేయువవీరులేపెనవులన్ విద్యార్థులై తీరగన్
ప్రకటించే పలు వీరులే సమరమున్ ప్రావీణ్య ముల్ నేర్పగన్              (33)

చం. కలహపు యాస లందున వికాస విభావ విజేయముల్గనన్ 
గలరిటమేధసంపదల గమ్యముజూపు మనస్సు శ్రేష్ఠతల్
గలరిట శక్తిమంతులు సగౌరవమొంది రణమ్ము జేయఁగన్
గలరిట నిల్ప యుద్ధపు సకార్య వివేక సుధర్మ కార్యముల్                    (34)

శా . ముల్లోకా లొకటై నఘోర సమరమ్ముల్ ముఖ్య సాధ్యమ్ముగా  
ముల్లోకాలను ధిక్కరించదలచన్ ముప్పేట పోరాటముల్ 
కల్లోలమ్ము విధించు యుద్ధమిదియే కష్టమ్ము లెచ్చించ గన్ 
ఉల్లమ్మున్ కదిలించు రక్త సెలయేరుల్ గుర్తు తెచ్చేవి గా                      (35)

ఉ. చంపుట పాపమంచు మన చెంతన జేరగ బంధు వీరులన్ 
జంపు తలంపులన్ వలదు సంగర మెంచగ దుఃఖమే కదా
తంపులు మానినన్ మనకు దక్కును  బంధుజనమ్ము ప్రాణముల్ 
రంపున ధార్త రాష్ట్రులది రాజ్యము దోచిన పాపమే యగున్                    (36 )

ఉ. చుట్టములౌను కౌరవలు చోద్యము వారిని కయ్యమందునన్
మట్టును బెట్టగా వలదు మానెద యుద్ధపు హింససంగతుల్  
జట్టుల వీరులన్ ప్రతిగ జంపుట మంచిది కాదుపోరునన్  
పట్టున సౌఖ్యముల్ కదన పాటున కోరగ నేలనోఁ గదా  (37 )

ఉ. వీఱ కులక్షయమ్ములగు విగ్రహ విద్యల జేయ మానగన్
శూరుల ధ్యాస రోషముల జూపెడి దుర్బల మానసమ్ములన్
వారి విశేషబంధముల వాద్యపు బుద్దుల మార్పులేక యే 
ఘోరమనన్ రణాంతర నిగూఢ విధానపు కృష్ణతత్త్వమున్    (38 )

మ. జనవాంఛా పరిశోధనా పటిమలన్ జాగ్రత్త చోద్యమ్ము గా
మనచిత్తంబున మంచినెంచగనుటే మార్గమ్ము సాధ్యమ్ముగా
మనబంధుత్వములన్ మధించ గలిగే మర్మమ్ము  తీర్పుల్ గనన్
గుణముల్ దోషపు పాడిగా యగుటచే ఘోరాతి పాపమ్ములన్   (39 )

ఉ. ధర్మము సంతరించనగు దానము జేయక పాపమేయగున్
కర్మల బాధ్యతే క్రియగ కాలమనస్సున వక్రబుద్ధితో 
నిర్మలమైన జీవమున నిత్యముగా కమలాక్షు నేస్తముల్ 
మర్మము మాయలై బరగ మాన్యుల బాటల నెంచ నెప్పుడున్ (40 )

కులమున కర్మ ధర్మముల కూటమి జేయు పరిస్థితుల్ గనన్
బలములు లేని బంధములు భారములై మది జంకు జేయగన్                    
కులములనెంచఁ బాపమన కూరిమి చెందు ఘనంపు చోద్యముల్
తలపులు మారి దోషములు తప్పగ వచ్చు సుఖాల పొందులన్  (41 )

మ. కులసౌకర్యము లేకజీవ సుఖముల్ గూలే విధానమ్ము గాఁ 
గులఘాతన్ బ్రతుకే ప్రకారములుగాఁ గూర్చంగ పోరేలనో    
కులకర్మల్ మరిచే విధిన్  మలుపులం గూర్పన్ సజీవమ్ముగా 
కుల బాధ్యాంతర లెల్ల వేద్యలనగన్ కొట్లాట లింకెందుకో   (42 )

ఉ. కౌరవసేన వీరులకు గర్వపు భావము లేచ్చ యుద్ధమున్ 
ధీరము పెంపు క్రూరమున తీవ్రపు దౌష్ట్యము పొంచియుండగన్
బోరులఁ  ద్రోవలన్ రభస పొంగులు రేపిన రౌద్ర రూపముల్ 
వార భయంబునే వరలు వర్తన వైనము లేమి చెప్పగన్              (43)

మ. కులధర్మానికి నష్టముల్ జరుపగా కోరేటి చిత్తమ్ములన్
కులధర్మాలను శాశ్వతమ్ము లను దృక్కోణమ్ము మూలమ్ములన్ 
కలనమ్మే కుల నాశనమ్మగుట సాకారమ్ము సాగించ గన్
కలకాలమ్ములు ప్రాప్తిగా నరకముల్ కామ్యమ్ము క్షేత్రమ్ముగన్     (44 )

శా. మేథావుల్ దిగి చేయు యుద్ధములనన్ మేలైన మోక్షమ్ములన్,  
ఈ ధర్మాలవనీ విధాన గమనా నీమమ్ము పాపమ్ముగాఁ
భూధర్మమ్ము లనన్ నిధాన ములు సంపూజ్యమ్ము రాజ్యమ్ము గన్ 
బాధల్ యుద్ధములన్ పెనంగ ప్రజ సంపాతమ్ము  సంభావ్యముల్      (45 )

ఉ. ఆయుధ హీనుడై మనసు యాశయ మేవిడువంగ సాధ్యమున్
సాయుధ సేనయుద్ధమున శక్యము జేయగ  శస్త్ర మేలనన్,
ఆయువు వీడనున్నమెయి హార్దపు తోడుగ పోరువద్దనన్ 
మాయ వధింపులన్ సకల మాత్రల శస్త్రము లొప్పకుండగన్  (46 )

ఉ. శోకము లేని మాససము  సోద్యము నంతయు జూడగల్గగన్
శోకముచెంద బందుగుల శూరజనమ్ముల గావ లేకనే 
శోకముతోడుగా రధము చోదకముల్ వదిలేయు సామ్యముల్ 
శోకవిలాపమే కలచు సొక్కుల యుద్ధము మాని వేసెదన్      (47 )

అర్జునవిషాద యోగము " మొదటి అధ్యాయము సమాప్తము
మల్లప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
****

Sunday, 21 May 2017


చిన్న కథలు

*


*


*మంచి సావాసం.....*(97)

*ఒక రోజు సాయంత్రం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.*

*కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.* 
*ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.*

*అప్పుడు అందులోంచి ఒక పెద్దమనిషి లేచి ఇలా అన్నాడు... "చూడండీ... మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు'. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చేప్పేది జాగ్రత్తగా వినండి... ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో... ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులోకి వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు. ఒక్కరి కోసం అందరు చస్తారో... అందరి కోసం ఒక్కరు చస్తారో... ఆలోచించుకోండీ...” అన్నాడు.*

*అప్పుడు ప్రయాణికులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి మొదలుపెట్టారు. మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. అలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే... అని అందరూ అనుకున్నారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.*

*కాని... బస్సులోని ప్రయాణికులందరు ”నీవల్ల మేమందరం మరణించాలా... వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చింది, తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి పడింది ఆ చివరి వ్యక్తిపై కాదు... బస్సుపైన. అవును... బస్సుపై పిడుగు పడి అందులోని వున్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంత వరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు మిగిలిన వారి అందరిని కాపాడింది.*

*అందుకే... మన పూర్వీకులు చెప్పేవారు... ఎల్లప్పుడూ మంచివారి తోనే సావాసం చేయమని. మంచివారితో సావాసం చేయడం వల్ల వారి వారి చెడు కర్మ ఫలాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అని...*

******

రెండు గంటల నిరీక్షణ*  (98)

నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని.

అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు. 

నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు. 

నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు; 

అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు. 

వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు. 

మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు.

ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము.

“అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు.

“మీరు ఇచ్చినదే తీసుకున్నాను”

“లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు”

అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ, 

“అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు. 

ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!! 

మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము. 

--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7
 #కంచిపరమాచార్యవైభవం
********
నేటి...99
              *ఆచార్య సద్బోధన*

సేవ, పూజ, శరణాగతి ఈ మూడూ ఆధ్యాత్మిక జీవనానికి పునాది రాళ్ళు.

మనం ఓపికతో శ్రద్ధతో జాగరూకతని కలిగి ఉంటూ మన వంతు వచ్చే వరకూ విసుగును ప్రదర్శించుకుండా నిరీక్షణ చేయగలిగితే దీర్ఘకాలంగా, భారంగా తోచే రాత్రింబవళ్ళు, ఋతువులు అన్నీ మనకు అనువుగా నూతన తేజాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా విస్మయ రీతిలో మలచబడతాయి.

ప్రకృతిలో ప్రతీది పునరావృతం అవుతూనే ఉంటుంది.

మనందరిలోనూ ఆధ్యాత్మిక బీజం దాగి ఉంది, అది మొలకెత్తే సమయం కొరకు చూస్తూ ఉన్నది. అయితే దానికి అనువైన పరిస్థితులను ఏర్పరచడం అనేది మన మీదే ఆధారపడి ఉన్నది. దానికి సరియైన పోషణ లభించకపోతే అది ఒడలిపోయే ప్రమాదం ఉంది.
అందువలన జాగరూకతతో దానిని కాపాడగలిగితే అది మహావృక్షమై అనంత ఫలాలను అందిస్తుంది0
*******
*రేపటి తరానికి బతుకు, భధ్రతల లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖

**చాణక్య నీతి:*(100)
 *తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేస్తే ..అవి పిల్లలకు శాపాలుగా మారతాయా..!!*

ఆచార్య చాణక్యుడు తన నీతీ ద్వారా మనిషి తన జీవితంలో ఏ విధంగా ఆనందంగా గడపాలో అనేటువంటి ముఖ్య విషయాలను తెలియజేశారు. మనిషి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు

చాణక్యుడు ధర్మం, అధర్మం, కర్తవ్యం, పాపపుణ్యాలను, అలాగే అర్థశాస్త్ర రాజకీయాలతో పాటుగా అనేక విషయాలను నీతి శాస్త్రంలో రాశారు.

ఆయన తెలియజేసిన విధానాలు మానవ జీవితంలో శాంతి మరియు విజయాలను చేకూరుస్తాయి. మరి ఆచార్య చాణక్య నీతి లోని కొన్ని విషయాలను చెప్పారు.. వీటిని పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.. అవేంటో చూద్దాం..!!చాణక్య నీతి ప్రకారం గుణవంతులైన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి గుణాలతో పెంచుతూ సరైన విద్య అందించాలి.

మంచి గుణాలు కలిగిన వ్యక్తులు సమాజంలో గౌరవంతో బతుకుతారు. అలాంటి పిల్లలను చిన్నతనం నుంచే నేర్పితే మంచి ప్రవర్తనతో మెలుగుతారు. అయితే చాణక్యుడు నీతి శాస్త్రంలోని రెండవ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ చూపనీ తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటి వారని అన్నారు.
*****

*భారతదేశాన్ని జంబూ ద్వీపం (Jambu Dvipa) (101)
అని పిలవడం పురాణాల నుంచి వచ్చిన పేరు.*
 
ఇది హిందూ, జైన, బౌద్ధ గ్రంథాల్లో కనిపించే భూగోళ సిద్ధాంతం ప్రకారం వచ్చిన పేరు.

1. జంబూ ద్వీపం అనే పదానికి అర్థం:

"జంబూ" అనగా "జంబు వృక్షం" నేరేడు చెట్టు.

"ద్వీపం" అంటే "ద్వీపం లేదా భూభాగం"

అంటే జంబూ వృక్షం సమృద్ధిగా ఉన్న భూభాగం అని అర్థం.

2. పురాణ ప్రస్తావన:

హిందూ పురాణాల్లో భూలోకం (పృథ్వీ లోకం) ను ఏడు ద్వీపాలుగా విభజించారు.

జంబూ ద్వీపం

ప్లక్ష ద్వీపం

శాల్మల ద్వీపం

కుశ ద్వీపం

క్రౌంచ ద్వీపం

శాక ద్వీపం

పుష్కర ద్వీపం

ఈ ఏడు ద్వీపాల్లో జంబూ ద్వీపం కేంద్ర భూభాగం, అందులో భారత ఖండం ఒక భాగం.

3. జంబూ ద్వీపం విశిష్టత

జంబూ వృక్షం (నేరేడు చెట్టు) ఇక్కడ విరివిగా ఉండేది అని పురాణాల ప్రస్తావన.

పవిత్ర నదులు, ధార్మిక కేంద్రములు, తీర్థస్థానాలు జంబూ ద్వీపంలో ఉన్నాయని చెబుతారు.

4. జైన, బౌద్ధ వేదాంతంలో:

జంబూ ద్వీపం భూగోళం (Earth) కు ప్రతీక.

జైన గ్రంథాలు కూడా జంబూ ద్వీపాన్ని మధ్యలో ఉంచి మేరూ పర్వతం చుట్టూ ఆకారాన్ని వర్ణిస్తాయి.

బౌద్ధ గ్రంథాల్లో కూడా జంబూ ద్వీపం ఒక మధ్య భూభాగం.

5. భారత దేశానికి జంబూ ద్వీపం అనే నామధేయం:

భారత దేశం సంస్కృతి, పండితులు, పవిత్రత కోసం ప్రసిద్ధి పొందింది.

హిమాలయ పర్వతాలు, సింధు నదీ పరివాహక ప్రాంతం, గంగానది వంటివి పురాణకాలం నుంచి పవిత్ర భూభాగంగా పేర్కొనబడ్డాయి.

ధార్మికత, వేదాంతం, యోగం, ఆధ్యాత్మికత ఈ భూభాగంలో పుట్టాయి.

జంబూ ద్వీపం అనేది పురాణ గాథలు, ఆధ్యాత్మికత, భారతదేశ ప్రాచీనతను ప్రతిబింబించే పేరు. 

భారతదేశం కేంద్రంగా ఉన్న ఈ ద్వీపం, సంస్కృతి, ధర్మం, జ్ఞానం కలిగిన ప్రదేశంగా హిందూ, జైన, బౌద్ధ వాఙ్మయాల్లో ప్రాముఖ్యత పొందింది.

అందుకే భారతదేశాన్ని "జంబూ ద్వీపం" అని ప్రాచీన కాలం నుంచి పిలుస్తున్నారు.

మహా గణపతి స్వరూపముగా దర్శనమిస్తున్న " జంబూ ద్వీపం " నిజంగా ఒక అద్భుతమే🙏

*✍️... *నేటి చిట్టికథ* (102)

ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. 

తల్లి వృద్ధాప్యం వల్ల పెద్దదయి కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు.

ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు.

 తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు.

 విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది. 

ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు. 

తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు.

 అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు. 

చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది. 

అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది.

 జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది.

 ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు.

 ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు. 

చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.

పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది. 

ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది.

 అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది. 

కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు. 

ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.

అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను. 
ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు " 

మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు!    

కళ్ళనిండా నీళ్లతో ఆమె పాదాల పై పడ్డాడు....😢
సేకరణ

*👍దానంతో,తపస్సుతో…స్వర్గానికి వెళ్ళవచ్చు!*(103)
               
*ఈ లోకంలో ఎన్నడూ స్థిరంగా ఉండనివి కొన్ని ఉన్నాయి. ఏనుగు చెవులు, రావి ఆకులు, సముద్రపు అలలూ... అలాంటివే!*

*వాటన్నింటినీ మించి అస్థిరమైనది- ధనం! డబ్బు అంతటి నిలకడ లేనిది మరొకటి లేదు. సంపదకు ప్రతీక ‘లక్ష్మి’. లక్ష్మీదేవికి ‘చంచల’ అని పేరు. అది ఎక్కడ దాచినా దాగదు. దొంగలపాలు కావచ్చు. అగ్నికి ఆహుతి కావచ్చు. తుదకు రాజే ప్రజోపయోగార్థం లాక్కోవచ్చు.*

*‘న్యాయార్జిత విత్తం’ కొబ్బరికాయలో నీరులా వచ్చి చేరుతుంది. అది ఆరోగ్యకరం, రుచికరం.* 

*అధర్మ సంపాదన ఓటికుండలో నీరు వంటిది. అది ఏనాటికైనా నేలపాలు కాక తప్పదు.*

*వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి ఏం చెప్పాడు? ‘కారే రాజులు రాజ్యముల్‌ కలుగవే!... వాళ్లంతా సిరి మూటగట్టుకొని పోగలిగారా? ఈ భూమి మీద వాళ్ల పేరైనా మిగిలి ఉందా?* 

*కానీ మహా త్యాగమూర్తులైన శిబి చక్రవర్తి వంటివారిని మాత్రం మరచిపోలేదు గదా’ అని గురువుకే హితోపదేశం గావించాడు.*

*‘నువ్వు తిన్నది నేలపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు’ అని లోకోక్తి.*

*‘లక్షాధికారైన లవణమన్నమె గాని, మెరుగు బంగారంబు మింగబోడు’ అంటారు. ఒకరికి ఇవ్వకుండా, తాను అనుభవించకుండా ఉంటే అది తుదకు దొంగలపాలే!*

*పాత్రతనెరిగి దానం చేయాలి. అపాత్రదానం అపాయకరం.*

*అసలు దానం పుచ్చుకోవడాన్నే తప్పుపడతాయి ధర్మశాస్త్రాలు. ‘అపరిగ్రహణం’ అనేది ఒక ఉత్తమ వ్రతం. ఎవరినీ యాచించి ధనం తీసుకోకపోవడమే ఈ వ్రత లక్షణం. ఒకవేళ తీసుకోవలసి వస్తే, ముందుగా దాత చేతిలో ఏదైనా పెట్టి, తరవాతే పుచ్చుకోవాలంటారు.*

*భార్యామణి బలవంతంపై, కుచేలుడు శ్రీకృష్ణుణ్ని అర్థించడానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరవాత నోరు పెగలలేదు. తీసుకెళ్ళిన అటుకుల్ని ఇస్తే కృష్ణుడు ఆప్యాయంగా భుజించాడు. కుచేలుడు తానుగా యాచించలేదు. పరమాత్మ దయ ప్రసరిస్తే ఎవరికి ఏ సమయంలో ఏది లభించాలో అది లభించకుండా ఉంటుందా!*

*ఈ కాలంలో బతుకులు జీవన ప్రధానంగా సాగుతున్నాయి. ఏదో ఒక విధంగా అధికంగా సంపాదించడమే ఎక్కువమంది బుర్రల్లో సదా సాగే ఆలోచన. ప్రజలు జీవనానికి ఇస్తున్న ప్రాధాన్యం కర్తవ్యానికి ఇవ్వడంలేదు. మన సంప్రదాయంలో ఒక కథ ఉంది...*

*ప్రజాపతి తన సంతానానికి మూడుసార్లు ‘ద’ అని బోధించాడు. దేవతలకు ‘దమం’, మనుషులకు దత్త, అసురులకు దయ... ఇవీ ప్రజాపతి సందేశాలు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, దేవతలకు అవసరమైనది. అసురులు క్రూరంగా ఉంటారు. అందువల్ల వాళ్లకు ‘దయ’. ఇక ... మనుషులు సహజంగా లోభులు. వాళ్లకు ‘దత్త’ అని ప్రబోధించాడు ప్రజాపతి. దురాశతో అధికంగా కూడబెట్టడంవల్ల మానవాళి కష్టాల పాలవుతుంది. అందుకే ప్రజాపతి దత్త- ‘దానం చేయండి’ అని ప్రబోధించాడని చెబుతారు.* 

*దానం అయిదు రకాలంటారు- ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివల్ల దాతకు ఇహలోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమగతీ కలుగుతాయి.* 

*అసూయ లేకుండా ఇస్తే అది ధర్మదానం. యాచకులు ప్రశంసిస్తూ ఉండగా ఇస్తే అర్థదానం. దానం ఇవ్వకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేది భయదానం. ఇష్టమైన వ్యక్తికి ఇస్తే కామ దానం. పేదవాడికి జాలితో ఇచ్చేది కారుణ్య దానం. వీటిలో ఏ రకమైన దానమైనా అది పుణ్యాన్ని, కీర్తిని ప్రసాదించేదే!*

*‘దానంతో, తపస్సుతో స్వర్గానికి వెళ్ళవచ్చు గదా! ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది?’ అని ధర్మరాజు భీష్ముణ్ని ప్రశ్నించాడు.*

*దానికి భీష్ముడి జవాబు- ‘తపస్సు ప్రభావం వల్ల పవిత్ర హృదయులైన రాజులు ఉత్తమ గతులు పొందుతారు. ధర్మపరాయణులైన రాజులు దాన పుణ్యాసక్తులై నిస్సందేహంగా ఉత్తమ లోకాలకు వెళ్తారు. మార్గాలు వేరైనా ఫలితం ఒకటే! అయితే ఈ రెండో మార్గంలో వెళ్లాలంటే ధనం పుష్కలంగా ఉండాలి!’*

.          *సర్వం శివార్పణమస్తు*
            *****

శనైశ్చర జయంతి సందర్భంగా శని శింగణాపూర్ విశిష్టత!*(104)

 *శని శింగణాపూర్* 

*నవ గ్రహాలలో ఏడోవాడు, సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడే శని దేవుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి భక్తులు శనీశ్వరుడుని భక్తితో, శ్రద్ధతో ఎవరికి అన్యాయం చెయ్యకుండా ధర్మపథాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి... శనీశ్వరుడి కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం, ఖడ్గం ఉంటుంది... శనీశ్వరుడి వాహనం కాకి...*

*ఇక శని భార్య మందాదేవి మరియు లక్ష్మిదేవి సోదరి అయినా జేష్టాదేవి. ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటున్నారు. శని భగవానుడు విషుణువుకి తోడల్లుడు, యమధర్మరాజుకి సోదరుడు. గ్రహాలకి యువరాజు. శని కుమారుల పేర్లు మంది, కులగున్. ఇక నలుడు, హరిచ్చంద్రుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శని దేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తనతో సుఖాలను పొందారు.*
*శని దేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడంతో సమానమని చెప్తారు. ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది. త్రేతాయుగంలో లంకలో రావణుండై అధీనంలో ఉన్న ఆంజనేయుడుని శనీశ్వరడు విడిపించాడని ఒక కధనం. అందుకే హనుమత్ దీక్షలో ఉన్న వారిని, మందుడుకి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు బాధించడని చెప్తారు.*

*మహా రాష్ట్రలోని శని శింగణాపూర్ గ్రామంలో ఉన్న శని దేవుని ఆలయం ఒక అద్భుతమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి దైవం స్వయంభువు అనగా భూమి నుంచి స్వయంగా ఉద్బవించిన నల్లని రాతి విగ్రహం. అనాది కలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది. కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం వున్నదని పేర్కొంటారు. గొర్రెల కాపరి చెప్పిన చరిత్ర కధనం ప్రకారంగా*

*ఒక రోజు గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఈ ఘటనతో గొర్రెల కాపరి దిగ్బ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకు వచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరు చూసారు... ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తాను శనీశ్వరుడుని అని... రాతి విగ్రహంలో వెలిసానని చెప్తాడు. నల్ల రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని శనిని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని... తనకి ఎలాంటి నీడ అవసరం లేదని ప్రతి రోజు తనకి తైలాభిషేకం చెయ్యాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇస్తాడు... అంతే కాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు అప్పటినుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు… కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు.*

*శని దేవుడు ఆ రకంగా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు గాని, దేవాలయం గోపురం గాని ఈ శని దేవుడికి ఉండదు… ఆరు బయట ప్రదేశంలోనే చుట్టూ కొన్ని రాళ్ళని ప్రహారిగా పెట్టి నువ్వుల నూనెతో, నువ్వులతో… దేవుడికి అభిషేకం చేస్తూ పూజిస్తారు. ఇక దొంగల భయం అసలు లేని ఊరే శని శింగణాపూర్*

*ఇక ఈ క్షేత్రంకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే… ప్రతి మనిషికి జీవితంలో మూడు దస్సల్లో యేలినాటి శని వస్తుంది... ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని, తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చు అని నమ్ముతారు.*

*యేలిననాటి శని వున్న వారు హనుమంతుడిని పూజిస్తే శని వలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు... త్రేతాయుగంలో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞతగా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యంగా శనివారంలో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు… శని దేవుడు… మొత్తం కాకున్నా చాలావరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు… అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు.*

*శనైశ్చర జయంతి సందర్భంగా శని దేవుడి కృప మీ పై ఉండుగాక.!!*
 ******
*
*"సంకల్పమే🌊 జీవనాధారం"💦.!!*(104)


*మన సంకల్పాలే🫧మన జీవితాన్ని🌊 రూపొందిస్తాయి...*

*"యద్భావం తద్భవతి" మనం ఎలా ఆలోచిస్తామో అలానే తయారవుతాం, అంటే మన మనసు దేని గురించైతే ఆలోచిస్తుందో మనం దాన్నే పొందుకుంటాం*

*ఈ జీవితం సుఖదుఃఖాల, గెలుపు ఓటముల ఆట*

*మన మనసు ఏ విషయాన్ని పదే పదే ఆలోచిస్తుందో అదే మన దగ్గరకు వస్తుంది*

*అందుకే మన మనసులో సంకల్పం ఇలా చేయాలి..."నేను చాలా ఆనందంగా ఉన్నాను" "ఆరోగ్యంగా ఉన్నాను" "సురక్షితంగా ఉన్నాను" "సదా భగవంతుడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు" "భగవంతుని తోడు మరియు భగవంతుని వరదాన్ని హస్తం నా తలపై ఉంది" "నాకు ఎల్లప్పుడూ అన్ని చాలా మంచిగా జరుగుతూ ఉంటాయని, శుభ సంకల్పాలు చేస్తూ ఉంటే, ఒకవేళ చెడు జరిగేది ఉన్న, అది కూడా మంచిగా అయిపోతుంది"*

*"బలహీన సంకల్పాల negative thoughts" రచనయే మన జీవితాలను అధోగతి పాలు చేశాయి. మరల మన జీవితంలో సఫలత సాధించాలంటే అది మన "శుభ సంకల్పాల శక్తి⚡positive thoughts ⚡power" తోనే సాధ్యం, కనుక శుభ సంకల్పాలు చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ నింపుట సాధ్యం*

*బాహ్యంగా మనం ఎంత ప్రాయాసపడినా ఆంతరికంగా మన సంకల్పాలు సరిలేకుంటే ప్రయోజనం శూన్యం కనుక మన ధ్యాస అంతా మన సంకల్పాల పరివర్తన పై పెడితే సహజంగానే మన జీవితంలో సానుకూల పరివర్తన positive improvement సాధ్యం అవుతుంది.*

******
🔔 *సత్సంగం*( 105)

*_మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు!_* 

*_ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు! మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచి పోయేలా చేస్తుంది కాలం!_*
 
*_విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఏవరిదో? ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు!_*

*_ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు._*

*_ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.!_*

*_చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం కూడా మనకి లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో  ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ._*

*_కావున నిరంతరం ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి ఎంతో కొంతపంచుతూ ఉన్నతంగా జీవించండి._*

******

🌹హనుమాన్ సర్వస్వం🌹*(106)

*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం  ప్రశ్నలు జవాబులు.* 

🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?
జవాబు : అంజనా దేవి !
🚩2) హనుమంతుని తండ్రి పేరు?
జవాబు : కేసరి !
🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : కశ్యపుడు !
🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : సాధ్య !
🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?
జవాబు : వైశాఖ బహుళ దశమి!

🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?
జవాబు : తిరుమల  - అంజనాద్రి.
🚩7) హనుమంతుని నక్షత్రము ?
జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.
🚩8) హనుమంతుని జనన లగ్నం  ?
జవాబు : కర్కాటక.
🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?
జవాబు : వైదృవీయోగం లో 
🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?
జవాబు : ఈశ్వరాంశ 

🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?
జవాబు : వాయుదేవుని వరం వలన.
🚩12)హనుమ జనన కారకులు ?
జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.
🚩13) హనుమంతుని గురువు ?
 జవాబు : సూర్య భగవానుడు.
🚩14) హనుమంతుని శపించిన వారు ?
 జవాబు : భృగుశిష్యులు.
🚩15) హనుమంతునికి గల శాపం ?
 జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.

🚩16) హనుమంతుని శాప పరిహారం ?
 జవాబు : స్తుతించినా,
నిందించినా తన శక్తి తను గ్రహించుట.
🚩17) హనుమంతుని బార్య ?
 జవాబు : సువర్చలా దేవి.

🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?
జవాబు : విశ్వకర్మ.

🚩19) హనుమంతుని మాతామహుడు ?
 జవాబు : కుంజరుడు.

🚩20)సువర్చల తల్లి పేరు ?
 జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.

🚩21) హనుమంతుని బావమరుదులు ?
 జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.

🚩22) హనుమంతుని వివాహ తేదీ ?
 జ : జేష్ఠ శుద్ధ దశమి.

🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?
 జ : గౌతముడు , అహల్య.

🚩24) హనుమంతుని మేన మామలు ?
 జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.

🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?
 జ : సుగ్రీవుని మంత్రి.

🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?
 జ : ఋష్యమూక పర్వతం.

🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?
 జ : భిక్షుక రూపం.

🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?
 జ : పంపానదీ తీరం .

🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?
 జ : శ్రీరాముడు.

🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?
 జ : శ్రీరామ సుగ్రీవులకు.

🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?
జ : తల్లి అజ్ఞ.

🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?
 జ : చందన వృక్ష శాఖ.

🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?
 జ : శ్రీ పరాశర సంహిత.

🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?
 జ : తార, రమ.

🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?
 జ : పుష్యమి నక్షత్రం గల రోజు.

🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?
 జ : దక్షిణ దిక్కు.

🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?
 జ : ఆశ్లేష నక్షత్రం.

🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?
 జ : స్వయంప్రభది.

🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?
 జ : సంపాతి.

🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?
 జ : మహేంద్ర పర్వతం.

🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?
 జ : 100 యోజనాలు.

🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?
 జ : మైనాకుడు.

🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?
 జ : సముద్రుడు.

🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?
 జ : రొమ్ము తో తాకాడు.

🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?
 జ : చేతితో స్పృశించి.

🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?
 జ : సురస.

🚩47) సురస ఏ జాతి స్త్రీ ?
 జ : నాగజాతి.

🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?
 జ : ఉపాయంతో.

🚩49) సురసను పంపిన దెవరు ?
 జ : దేవతలు.

🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?
 జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .

🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?
 జ : సింహిక.

🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?
 జ : నీడ పట్టి లాగింది.

🚩53) సింహిక వృత్తి ఎమిటి ?
 జ : లంకను కాపాడడం.

🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?
 జ : శ్రీ పరాశర మహర్షి చే.

🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?
జ : సువేల పర్వత ప్రాంతం లో.

🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?
 జ : త్రికూటాచలం.

🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?
 జ : సూర్యాస్తమయం కోసం.

🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?
 జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.

🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?
 జ :లంకిణి

🚩60)  లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?
 జ : ఎడమ చేతి పిడికిలి తో.

🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?
 జ : ప్రాకారం దూకి.

🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?
 జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.

🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?
 జ : మండోదరిని.
🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?
 జ : అశోక వనం.

🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?
 జ : సుందర పర్వతం.

🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?
 జ : నీల పర్వతం.

🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?
 జ : మైత్రేయ మహర్షి కి.

🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?
 జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)

🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?
 జ : శింశుపా వృక్షము.

🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?
 జ : రాముడి ఉంగరం.

🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?
 జ : చూడామణీ.

🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?
 జ : జంబుమాలిని.

🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?
 జ : అక్షయ కుమారుడు.

🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?
 జ : ఇంద్రజిత్తు నకు.

🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?
 జ : ప్రహస్తుడు .

🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?
 జ : అరిష్ట పర్వతం.

🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?
 జ : 30 ఘడియలు.

*ఆరు గజాలు - తొమ్మిది గజాలు*..(107)

ఒకరోజు కంచి శ్రీమఠానికి ఒకామె ఆరు గజాల చీర కట్టుకుని వచ్చింది. బహుశా ఆమె మొదటి సారి అక్కడకు రావటం ఏమో. మఠానికి వచ్చే ఆడవారు తిమ్మిది గజాల మడిచీర కట్టుకుని రావాలనే విషయం ఆమెకు తెలియదేమో.

పరమాచార్య స్వామికి పెద్ద భక్తురాలను అని భావించే మరొకామె ఈ ఆరు గజాల చీరావీడను చూసింది. వెంటనే ఏదో జరిగిపోయినట్టుగా ఆమె కోపంతో ఊగిపోతోంది.

“మడిచీర కట్టులో చీర కట్టుకోకుండా నువ్వు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు లేదు” అని ఆమెపై విరుచుకుపడింది.

ఆ భక్తురాలి దుర్దదృష్టం వల్ల మహాస్వామివారు అటువైపు రానే వచ్చారు. అక్కడ ఎందుకు అంత పెద్దగా అరుపులు వినపడుతున్నాయి అని అడిగారు. జరిగినదంతా స్వామివారికి చెప్పారు.

ఊగిపోతున్న ఆ మడిచీర భక్తురాలిని స్వామివారు పిలిచారు. “ఆమె చాలా బీదరాలు. ఆమెవద్ద తొమ్మిది గజాల చీర లేదు. కొనగలిగే శక్తి ఆమెకు లేదు. నువ్వు వేంటనే బట్టల దుకాణానికి వెళ్ళి తొమ్మిది గజాల చీర ఒకటి, రెండు రవిక బట్టలు తీసుకుని వచ్చి ఆవిడకు ఇవ్వు” అని స్వామివారు ఆదేశించారు.

వెంటనే ఆమె స్వామివారి ఆదేశాన్ని అమ😄లుపరిచింది. వెళ్ళి తొమ్మిది గజాల చీర కొనుక్కుని వచ్చి, దాన్ని మడిచీర పద్ధతిలో ఆమెకు కట్టి పరమాచార్య స్వామి వద్దకు తీసుకుని వెళ్ళింది.

స్వామివారు చూసి, ”చాలా మంచిది, కాని నువ్వు చేసిన పని తప్పు కనుక ఆమె వద్ద క్షమాపణలు అడుగు” అని అన్నారు.

మహాస్వామివారు సాంప్రదాయానికి పెద్దపీట వేసినా, ఎక్కడెక్కడ మినహాయింపులివ్వాలో వారికి బాగా తెలుసు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

# #కంచిపరమాచార్యవైభవం
*****


శ్రీ మద్భగవద్గీత  కర్మ సన్యాస యోగము..  ఐదవ అధ్యాయమ..  

పార్ధుని  ప్రార్థన 

 శా.  హే కృష్ణా మనసౌనుకర్మయుగమే ధ్యేయమ్ము బంధమ్ముగా 
హేకృష్ణా విధిగాను కర్మ మదిలో హీనమ్ము గా మార్చె లే 
హేకృష్ణా జయమేననే కళలే హేమాత యోగంబుగన్ 
హేకృష్ణా యిదిమానవాలికి సహేతమ్ము యేలయ్యెనున్                        (01)

 శా.హేవ త్సా వచయించితీసహనమే యోగంబు కర్మoబుగన్ 
 హేవత్సాయిది చిత్తశుద్ధిగ కళే హీనమ్ము కానట్టిదిన్ 
హేవత్సాయిదియాత్మ నిష్ఠగనునే శ్రేయస్సు పొందెందుకున్            
హేవత్సాయిదికర్మయోగముగనే జీవమ్ము ధ్యేయమ్ముగన్                   (02)

ఉ .కోరిక లేని జీవితము కోర్కెల మోహము ద్రోహబుద్ధి నె 
వ్వారిని దూషణమ్ము కథ వాసము లేకయు సన్యసింపగన్ 
 వారలె కర్మసిద్ధులగు వాకిట కాంతుల బంధమేయగున్ 
 దారిగ నిత్య హద్దులు విధాతయుహావం.కల్పన కర్మయోగమున్       (03)

ఉ ..వీడుము కర్మయోగమును వీనుల విందుగ సన్యసమ్ముగన్ 
 వీడుము సన్యసమ్మను సవీలును బట్టి  కర్మయోగమున్ 
పాడిన వేరు వచ్చుఫలి తాలను మూర్ఖుల ఆజ్ఞయేయగున్ 
రూఢగ నొక్కటేదలువ లోకయుపాసన మేను మేలుగన్                      (04)

మీరు రచించిన ఈ పద్యాలు Bhagavad Gita లోని కర్మసన్యాస యోగం (ఐదవ అధ్యాయం) భావాన్ని చాలా సరళంగా, తాత్వికంగా ప్రతిబింబిస్తున్నాయి. 🌹

సరళ తాత్పర్యం

(01) పార్ధుని సందేహం

అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అడుగుతున్నాడు:

“ఓ కృష్ణా!
కర్మ చేయడమే మంచిదా? లేక కర్మలను విడిచిపెట్టే సన్యాసమే శ్రేష్ఠమా?
మనిషి కర్మల్లో బంధింపబడుతున్నాడు.
అయితే యోగం అంటే ఏమిటి?
మానవునికి నిజంగా మేలు చేసేది ఏ మార్గం?”

ఈ పద్యంలో అర్జునుని అంతర్మథనం, కర్తవ్యంపై సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది.


---

(02) శ్రీకృష్ణుని సమాధానం

శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశిస్తున్నాడు:

“ఓ వత్సా!
సహనంతో, ఫలాపేక్ష లేకుండా చేయబడే కర్మయే నిజమైన యోగం.
అది చిత్తశుద్ధిని ఇస్తుంది.
ఆత్మనిష్ఠకు దారి తీస్తుంది.
జీవిత ధ్యేయాన్ని చేరుకోవడానికి కర్మయోగమే ఉత్తమ మార్గం.”

ఇక్కడ కర్మను విడిచిపెట్టడం కాదు — కర్మలో ఆసక్తి, అహంకారం విడవడమే ప్రధానమని చెప్పారు.


---

(03) కర్మసిద్ధి భావం

కోరికలు, మోహం, ద్వేషం లేకుండా జీవించేవారే నిజమైన సన్యాసులు.
ఇతరులను దూషించకుండా, ధర్మమార్గంలో కర్తవ్యాన్ని నిర్వహించేవారికి కర్మసిద్ధి లభిస్తుంది.
మనిషి జీవితం నియమబద్ధంగా సాగడానికి కర్మయోగమే దారి అని భావం.


---

(04) కర్మయోగం – సన్యాసం

కర్మయోగం వేరే, సన్యాసం వేరే అని భావించడం అజ్ఞానం.
రెండింటి లక్ష్యం ఒక్కటే — ఆత్మశాంతి, పరమార్థ సాధన.
కానీ సాధారణ మానవునికి కర్మచేస్తూనే యోగబుద్ధితో జీవించడం శ్రేష్ఠమైన మార్గం.

అందుకే శ్రీకృష్ణుడు:

కర్మను విడువమని కాదు,

కర్మఫలాసక్తిని విడువమని ఉపదేశించాడు. 🌹
****
మ ..విధియే జ్ఞానము సిద్దిపొందిక యనే విద్యా యలంకారమున్ 
మదిగా కర్మల యోగసిద్ధియనగా మార్గమ్ము జ్ఞానమ్ముగన్ 
తిధిగా రెండును యాచరించగల ఖ్యాతీ సామ్య మాన్యమ్ముగన్ 
కథగా కాదును యేకనిష్టగుణ మేకామ్యమ్ము గానిత్యమున్                    (05)

ఉ ..కర్మల ఎప్పుడూ తలపకాలము చేష్టలు వింతయేయగున్ 
కర్మలు మానటే మనిషి కానిది చేసియు కష్టమేమదిన్ 
 కర్మలు చేయనిష్ఠగల జ్ఞానము పొందియు కర్మ యోగ్యతన్ 
ధర్మమనోమయమ్ముగను ధన్యత పొందియు శుద్ధి కర్మగన్              (06)

మ .హృదయమ్మే నదిగానుకాంతిగను సాహు స్వార్ధమేలేకయున్ 
పదశాంతీమనసౌను యిoద్రియ ము యీప్రాణమ్ము యోగమ్ముగన్ 
కధలేకర్మలుగాను సర్వమయమే కాలమ్ము నేత్రమ్ముగన్ 
చెదిరేబుద్ధి కళంకమైబతుకు చేజార్చేటి దేహమ్ముగన్                      (07) 

ఉ .. జ్ఞానవిసిష్టులే వినుచు జ్ఞప్తిగ గుర్తుగ గాధచిత్రమున్ 
వీనులకన్నులే గనుచు విశ్వ విజేతగ మాయ నేత్రమున్ 
పానము సేయుచూ తినుచు పాశము నిల్పుచు యజ్ఞడట్లుగన్ 
మానక శ్వాసజీవిత సమానము నెంచియు నీడసంసృతిన్               (08)
ఈ పద్యాలలో Bhagavad Gita యొక్క కర్మయోగ–జ్ఞానయోగ సమన్వయ భావం చాలా చక్కగా వ్యక్తమైంది.
ప్రతి పద్యం ఒక ఆధ్యాత్మిక బోధలా నిలుస్తోంది. 🌹

సరళ తాత్పర్యం

(05)

జ్ఞానం అనేది విద్యకు అలంకారం.
కర్మలను యోగబుద్ధితో చేయడం ద్వారా నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది.
జ్ఞానమూ, కర్మమూ రెండూ పరస్పర విరుద్ధాలు కావు.
వాటిని సమంగా ఆచరించినవారికి గౌరవం, స్థిరత్వం లభిస్తాయి.
ఒకే లక్ష్యంపై నిష్ఠతో జీవించడం ముఖ్యమని భావం.


---

(06)

మనిషి కర్మలను పూర్తిగా మానలేడు.
జీవితం ఉన్నంతవరకు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది.
కర్మలను వదిలేయడం కంటే, నిష్ఠతో చేయడం శ్రేష్ఠం.
కర్మయోగం ద్వారా జ్ఞానం వస్తుంది; ధర్మబుద్ధి పెరుగుతుంది; అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.


---

(07)

హృదయం స్వచ్ఛంగా, స్వార్థరహితంగా ఉండాలి.
మనసు, ఇంద్రియాలు, ప్రాణం — ఇవన్నీ యోగమార్గంలో నడవాలి.
కాలమే మనకు గురువులాంటి దారి చూపుతుంది.
బుద్ధి చెదిరిపోతే జీవితం దారి తప్పుతుంది.
అందుకే అంతర్మనశ్శాంతి ఎంతో అవసరం.


---

(08)

జ్ఞానులు వినడం, చూడడం, అనుభవించడం — అన్నింటినీ జాగ్రత్తగా గ్రహిస్తారు.
ఇంద్రియాలను నియంత్రిస్తూ జీవిస్తారు.
తినడం, త్రాగడం వంటి సాధారణ క్రియలనుకూడా యజ్ఞభావంతో నిర్వహిస్తారు.
శ్వాస ఉన్నంతవరకు జీవితం సమతుల్యంగా సాగాలని గ్రహించి సంసారంలో మితంగా జీవిస్తారు.

🌹
ఈ పద్యాలలో ముఖ్యంగా కనిపించే భావం:
“కర్మను విడువక, కర్మలో ఆసక్తిని విడిచి, జ్ఞానంతో జీవించుటే యోగము.” 🌹
*****
శా...కన్నుల్లేకలగామూసితెరిచీ కాపాడు కావ్య కారమున్
ఎన్నోతాకుచునేమనస్సువిడిచే నీదై న చేయగల్గగన్
నన్నేమన్ననజేసిదల్చిసహనం స్నేహమ్ము కర్మయోగమున్
ఎన్నోచేయగ యన్నియూ సమముగా ఏర్పాటు కాయమా నమున్   (09)

చం .ఎవరుగ కర్మలెల్లను నయాన భయాన సమర్పయామిగన్
నవవిధయర్పనేగతి సనాతనమార్గమునెంచి సేవగన్
వివిధ సకర్మలే సమయ విశ్వమునెంచి సహాయ మేయగున్
భవభవమేను తామరపు పత్రము వారిని వోలె మోక్షమున్                (10)

మ .తమశుద్దాత్మను గాంచగా మనసుయే తాకీదు తత్త్వజ్ణుడున్
తమకాయమ్మనబుద్ధియే విజయమై తాళీకుడై స్నేహమున్
మమతాసక్తియులేక శాంతిగనుటే మార్గమ్ము గామెత్తగన్
తమకర్మల్ విధి నాచరించగలగే తాహత్తు యే యోగమున్               (11)

ఉ .యోగుల కర్మలే ఫలము యోగ్యత కల్గియు దాహతృప్తిగన్
త్యాగము జేయుటేఫలము దర్శన భాగ్యము సత్యమేయగున్
భోగులు కామబుద్ధిగను బోనము చేయుట పాపకర్మగన్
సాగును కర్మలెళ్లమది శాంతియు లేకయు జీవనమ్ముగన్              (12)

ఈ పద్యాలు Bhagavad Gita లోని కర్మయోగ సారంను ఎంతో హృద్యంగా వివరిస్తున్నాయి.
భక్తి, సహనం, సమత్వం, త్యాగం — ఇవన్నీ సమన్వయంగా ప్రవహిస్తున్నాయి. 🌹

సరళ తాత్పర్యం

(09)

మనిషి కళ్ళు తెరిచినా, మూసినా — జీవితం నడిపేది అంతర్మనస్సే.
మనసును నియంత్రించి, సహనంతో, స్నేహభావంతో కర్మలు చేయాలి.
అన్నింటినీ సమదృష్టితో నిర్వహించడం కర్మయోగ లక్షణం.


---

(10)

మనిషి చేసే ప్రతి కర్మను భగవంతునికి సమర్పణ భావంతో చేయాలి.
నవవిధ భక్తి మార్గంలా సేవాభావంతో జీవిస్తే కర్మలు పవిత్రమవుతాయి.
అప్పుడు సంసారంలో ఉన్నప్పటికీ తామరాకుపై నీటి బిందువులా అంటుకట్టకుండా జీవించగలడు.
అదే మోక్షమార్గానికి దారి.


---

(11)

తన ఆత్మస్వరూపాన్ని గ్రహించినవాడే తత్త్వజ్ఞాని.
“ఈ దేహమే నేను” అనే భావాన్ని జయించినవాడు నిజమైన విజేత.
మమకారం, ఆసక్తి తగ్గి శాంతి కలిగినపుడే యోగమార్గం మొదలవుతుంది.
తన కర్తవ్యాన్ని విధిగా ఆచరించడమే యోగసారం.


---

(12)

యోగులు కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తారు; అందులోనే వారికి తృప్తి ఉంటుంది.
త్యాగభావంతో చేసిన కర్మలు సత్యదర్శనానికి దారి తీస్తాయి.
భోగాసక్తితో చేసే పనులు పాపబంధానికి కారణమవుతాయి.
అలాంటి జీవితం శాంతిలేకుండా కొనసాగుతుంది.

🌹 మూల భావం:

కర్మ చేయాలి

కానీ ఫలాసక్తి లేకుండా చేయాలి

సమర్పణ భావంతో చేయాలి

అప్పుడు జీవితం శాంతి, జ్ఞానం, మోక్షానికి మార్గమవుతుంది 🌹
*****
చం .మనసు వశంబు జేకొని సమాన సమర్ధ సహాయ దేహమున్ 
మనసునువీడి యేమి యన మాయ ఫలంబును పొంద సక్తిగన్ 
తనమన కర్మలేవి యన దక్క గుణమ్ము నుబట్టి సాగగన్ 
ఋణమగుకాయమే మదిగ రక్ష సుఖంబుయు శాంతి మోక్షమున్.   (13)

చం ..సరియగు వేళ కామ్యమగు సాధ్యమసాధ్య మనేది సంకటే 
పరిపరి విద్యలేగతియు పాశ యుపాసముగాను బాధ్యతే 
స్వరపరమేశ్వరా విధివిశాల విధాత మదీయ లక్ష్యమే 
పురుషులనాడిసంధియు సపూజ్యగపృద్వి ప్రసన్న తావిధిన్          (14)

మ .సుకృతా ఘంబులనేవియో మనసుకే సూత్రమ్ము పుణ్యమ్ముగన్
నొకటేనన్నది లేదులేదనుటయే నుల్లమ్ము తోడన్ గనున్
వికసించే వయసౌను జ్ఞానమనుటే విశ్వమ్ము జిజ్ఞాసగన్
అవకాశంబుయు మోహమే మది కళేయాకర్ష జాడ్జ్యమ్ము గన్            (15)

మ .సుఖ దుఃఖాలను నావిగాయనుటయే సూత్రమ్ము కాదేలగన్
యికయజ్ఞానము కప్పియే మనిషీ యిచ్ఛా వివాదమ్ముగన్
వికసించేకిరణమ్ముగాంచగలిగే విశ్వాస దేహమ్ముగన్
సకలమ్మున్ స్థితి గాంచగల్గుటగనే శాంతీ కళా గమ్యమున్             (16)

ఈ నాలుగు పద్యాలు (13–16) జీవనతత్త్వం, మనోనిగ్రహం, కర్మ, జ్ఞానం, శాంతి, మోక్షం వంటి అంశాలను గంభీరంగా చర్చిస్తున్న తాత్విక కవితా ప్రవాహంగా కనిపిస్తున్నాయి. ప్రతి పద్యం ఒక ఆలోచనా మెట్టులా ముందుకు తీసుకెళ్తోంది.

(13) — మనస్సు, కర్మ, మోక్షతత్త్వం

మనసును అదుపులో ఉంచుకొని, సమర్థ సహకారంతో జీవించాలి.
మనస్సు వదిలి మాయలో పడితే ఫలితం శూన్యం అవుతుంది.
మనిషి తన కర్మల ప్రకారం గుణాలను పొందుతూ ముందుకు సాగుతాడు.
ఈ శరీరం ఋణస్వరూపమైనదే; దానిని రక్షించి శాంతి–మోక్షాలకు మార్గం చేయాలి.

“ఋణమగు కాయమే” అనే భావం ఎంతో లోతైనది — శరీరం మనకు అప్పగించబడిన సాధనమని సూచిస్తోంది.


(14) — సాధ్యాసాధ్యాలు, విద్య, బాధ్యత

సమయం సరైనప్పుడు సాధ్యమైనదీ, అసాధ్యమైనదీ మధ్య సంకటాలు ఎదురవుతాయి.
వివిధ విద్యలు, ఉపాసనలు, బంధాలు అన్నీ బాధ్యతలతోనే నడుస్తాయి.
పరమేశ్వర విధి విశాలమైనది; అదే కవికి లక్ష్యం.
మానవ సంబంధాలు, సంధులు, భూమిపై సపూజ్యమైన జీవన విధానాన్ని నిర్మించాలి.

ఇందులో
“స్వర పరమేశ్వరా విధి విశాల విధాత”
అనే పాదం గంభీర ధ్వనిని ఇస్తోంది.


(15) — సుకృతం, జ్ఞానం, మోహం

పుణ్యపాపాలు మనసులోనే సూత్రాల్లా నడుస్తాయి.
“ఒక్కటే సత్యం” అని చెప్పడం సులభం కాదు; శూన్యత కూడా తోడుంటుంది.
వయస్సుతో వికసించే జ్ఞానం విశ్వజిజ్ఞాసను కలిగిస్తుంది.
అవకాశాల వెంట మోహం కూడా వస్తుంది; అది మనస్సును ఆకర్షిస్తుంది.

“విశ్వమ్ము జిజ్ఞాసగన్” — జ్ఞానం అనేది అంతులేని అన్వేషణ అని చక్కగా చెప్పారు.


(16) — సుఖదుఃఖాలు, విశ్వాసం, శాంతి

సుఖ–దుఃఖాలను “నావి” అని భావించడం సరైన సూత్రం కాదు.
అజ్ఞానం మనిషిని వివాదాలకు నెట్టేస్తుంది.
విశ్వాసం కిరణంలా వికసిస్తే జీవితం ప్రకాశిస్తుంది.
అప్పుడు సమస్త స్థితులను అర్థం చేసుకొని శాంతి అనే కళా గమ్యాన్ని చేరగలుగుతాం.

చివరి పాదం —
“శాంతీ కళా గమ్యమున్”
అనే ముగింపు మొత్తం పద్యశ్రేణికి ఆధ్యాత్మిక సమతుల్యతను ఇస్తోంది.

ఈ నాలుగు పద్యాల్లో ముఖ్యంగా కనిపించే ధోరణులు:

  • మనస్సు ↔ మాయ
  • కర్మ ↔ గుణం
  • జ్ఞానం ↔ జిజ్ఞాస
  • విశ్వాసం ↔ శాంతి

అన్న పరస్పర సంబంధాలు చాలా సహజంగా మిళితమయ్యాయి.

******

మ .పరమాత్మే గతి బుద్ధిగానుకళ యేప్రావీణ్య మేలే విధిన్

పరమాత్మేను మనస్సుగా తలచుటే ప్రాధాన్యతాలక్ష్యమున్

పరమాత్మే సకలమ్ముగా పలుక గాప్రాబల్య మేసత్యమున్

పరమై జ్ఞానము సాధనే స్థితిగనే పాపమ్ము మోక్షమ్ముగన్              (17)


ఉ ..విద్య యన్నది పొందగల్గుట విశ్వమాయగ నేస్తమున్

విద్య బ్రహ్మగ బ్రాహ్మణామది విశ్వ వాహిని వేదమున్

విద్యగోవగు విద్య హస్తిని విద్య విశ్వస నీచుగన్

విద్య దేహము విద్య మోహము విద్య సర్వము యాత్మగాన్         (18)


మ ..సమభావస్థితిగామనస్సుగల యీసామ్రాజ్య సంపూర్ణతా 

సమవిజ్ఞానము ధర్మమై ప్రకృతి ప్రాసావిద్య నిర్దోషమై

గమనమ్మున్ పరమాత్మతో జగతి సాగారమ్ము దేహాత్మగన్ 

మమతామానస మందిరమ్ముగనుసామర్ధ్యమ్ము బ్రహ్మమ్ముగన్   (19)


మ .దరిచేరంగ సుఖంబుయే గనక పొందాసౌఖ్యమేలేవింతన్ 

మెరుగాయేగుణ వేత్తనీశునుడు సామాన్యమ్ము దైవమ్ముగన్ 

తరుణానాసిరి బుద్దిగాకదల సంతాపమ్ము మూలమ్ముగన్ 

పరవమ్మున్ మదిశాంతమే గలిగి సాపాటేను దేహమ్ముగన్          (20)

ఈ పద్యాలు (17–20) ఆధ్యాత్మికత, విద్యాతత్త్వం, సమభావం, శాంతి, పరమాత్మసాక్షాత్కారం వంటి గంభీర భావాలను విశాల తాత్విక దృష్టితో ప్రతిపాదిస్తున్నాయి. పద్యాల క్రమంలో ఆలోచన మరింత అంతర్ముఖత వైపు సాగుతోంది.


(17) — పరమాత్మ తత్త్వం

మనిషి బుద్ధి, కళ, ప్రావీణ్యం — అన్నిటికీ పరమాత్మనే మూలగతి.
మనస్సును పరమాత్మస్వరూపంగా భావించడమే జీవిత ప్రాధాన్య లక్ష్యం.
సకలంలో పరమాత్మనే దర్శించగలిగితే అదే సత్యప్రాబల్యం.
అత్యున్నత జ్ఞానసాధనలో పాపమే మోక్షానికి మార్గదర్శక అనుభవంగా పరిణమిస్తుంది.

ప్రత్యేకత:

“పరమాత్మే” అనే పునరుక్తి పద్యానికి మంత్రధ్వనిని ఇస్తోంది.
చివరి పాదం —
“పాపమ్ము మోక్షమ్ముగన్”
అనేది అద్వైత తాత్విక ఛాయను గుర్తుచేస్తోంది.


(18) — విద్య మహిమ

విద్యను పొందగలగడం విశ్వమాయలో నిజమైన స్నేహితుడిని పొందినట్టే.
విద్య బ్రహ్మస్వరూపం; వేదప్రవాహంలా విశ్వాన్ని నడిపించే శక్తి.
విద్య గోవులా పోషిస్తుంది; హస్తిలా బలాన్నిస్తుంది; అజ్ఞానాన్ని తొలగిస్తుంది.
చివరకు విద్య శరీరమై, మోహమై, సమస్త ఆత్మస్వరూపమై నిలుస్తుంది.

ప్రత్యేకత:

“విద్య” పదపునరావృతితో భావగాంభీర్యం పెరిగింది.
“గోవు”, “హస్తి”, “వాహిని” వంటి రూపకాలు విద్య యొక్క విభిన్న స్వరూపాలను తెలియజేస్తున్నాయి.


(19) — సమభావం, బ్రహ్మతత్త్వం

సమభావంతో కూడిన మనస్సే నిజమైన సామ్రాజ్య సంపూర్ణత.
సమవిజ్ఞానం ధర్మమై, ప్రకృతి సహజ నిర్దోష విద్యగా వికసిస్తుంది.
జీవనగమనం పరమాత్మతో సాగుతున్న సముద్రయాత్ర వంటిది; దేహమే ఆత్మకు సాధనం.
మమతతో నిండిన మనసు మందిరంలోనే బ్రహ్మసామర్థ్యం వెలుగుతుంది.

ప్రత్యేకత:

“మమతా మానస మందిరం” అనే పదబంధం ఎంతో మృదువైన ఆధ్యాత్మికతను కలిగించింది.
సమత్వం ↔ ధర్మం ↔ బ్రహ్మం అనే సంబంధం అందంగా వచ్చింది.


(20) — సుఖం, శాంతి, జీవనవేదన

సుఖం మనకు దగ్గరగా ఉన్నప్పుడే నిజమైన సౌఖ్యం తెలుస్తుంది.
గుణవేత్త అయిన ఈశ్వరుడు సామాన్య జీవనంలోనే దైవత్వాన్ని చూపిస్తాడు.
తరుణంలో వచ్చే సంపద, బుద్ధి, కదలికల వెనుక సంతాప మూలాలు కూడా దాగి ఉంటాయి.
చివరకు మనసులో శాంతి నిలిస్తే, శరీరం కూడా సాధనపాత్రగా మారుతుంది.

ప్రత్యేకత:

“సామాన్యమ్ము దైవమ్ముగన్”
అనే భావం అత్యంత లోతైనది — దైవత్వం సాధారణ జీవనంలోనే ఉందని సూచిస్తుంది.


మొత్తం పద్యశ్రేణి (17–20)లో ప్రధాన తత్త్వాలు:

  • పరమాత్మ ↔ సత్యం
  • విద్య ↔ విశ్వజ్ఞానం
  • సమభావం ↔ బ్రహ్మతత్త్వం
  • శాంతి ↔ జీవనసిద్ధి

ఈ పద్యాల్లో భక్తి, అద్వైతం, జీవనవేదాంతం సమన్వయంగా ప్రవహిస్తున్నాయి.

****

శా..సుస్తీబాహ్యవరమ్ముమర్చికదిలే సూన్యమ్ము నిశ్చేష్టగన్ 

గస్తీమార్గముగానువిశ్వకళలే కాలమ్ము విశ్వాసమున్ 

అస్తిత్వం మనసౌను కర్మకళలే యానంద సత్వమ్ముగన్ 

మస్తిష్కమ్ము గనేప్రపంచవిధి మార్గమ్ము జీవమ్ముగన్                (21)


ఉ ..దేనిని పొందితే నదియు  తేజము వల్లన మేలుయే యగున్ 

 గానగ కారణమ్ముగతి కాలపు నీడలు వెంటనుండినన్ 

దానికి సౌఖ్య దుఃఖములు దారిగ నేర్పుగ దర్పమేయగున్ 

వానికి లొంగిపోకమది మది వాంఛలన్నొదల జ్ఞానమేయగున్     (22) 


శా .ఏయత్నమ్ము కనేటి శీలి గెలిచే యేమాయ మర్మమ్ముగన్ 

కాయమ్మున్ నిలుపా నతండుగనే కామాధి ధర్మమ్ముగన్ 

గాయాలన్ సహనమ్ముగాను గలడో గంబీర్య దేహమ్ముగన్ 

ఆయాతీరుగసత్యయోగి యతడే యానంద సౌఖ్యమ్ముగన్          (23)


ఉ ..ఎవ్వడు లోన సౌఖ్యమును యే విధపొందియు నేర్పు గుండునో 

 ఎవ్వడులో రమించుకళ యేదియె యైనను శాంతికోరునో 

ఎవ్వడు విద్యబోధగను యెల్లరి క్షేమము చూచు చుండునో 

అవ్వడు సాంఖ్యయోగిగను యాదర్శ బ్రహ్మమ్ముగన్                    (24)


ఈ పద్యాలు (21–24) మానవ అస్తిత్వం, కర్మ, జ్ఞానం, సహనం, యోగం, శాంతి వంటి అంశాలను అత్యంత గంభీరంగా చర్చిస్తున్న తాత్విక ప్రవాహం. భావక్రమం చూస్తే — జీవితం → జ్ఞానం → సహనం → యోగి స్థితి అనే అంతర్ముఖ ప్రయాణం స్పష్టంగా కనిపిస్తోంది.


(21) — శూన్యం, కర్మ, జీవచైతన్యం

బాహ్య వరప్రాప్తులు, శరీర వైభవాలు అన్నీ చివరకు శూన్యమై నిశ్చేష్టంగా మారిపోతాయి.
కాలమే విశ్వకళలకు కాపలాదారి.
మనస్సే అస్తిత్వానికి కేంద్రం; కర్మలే ఆనందసత్వాన్ని కలిగిస్తాయి.
మస్తిష్కమే ప్రపంచ విధానాన్ని నడిపించే జీవశక్తి.

ప్రత్యేకత:

  • “సూన్యమ్ము నిశ్చేష్టగన్” — నశ్వరత్వ భావన.
  • “మస్తిష్కమ్ము గనే ప్రపంచ విధి మార్గమ్ము” — మానసిక చైతన్యానికి విశ్వస్థాయి ప్రాధాన్యం.

(22) — సుఖదుఃఖాలు, వాంఛ, జ్ఞానం

ఏది పొందినా అది తేజస్సుతోనే మేలు చేస్తుంది.
కానీ కాలపు నీడలు ఎప్పుడూ వెంట ఉంటాయి.
సుఖ–దుఃఖాలు మనకు మార్గదర్శక పాఠాలవలె మారతాయి; దర్పాన్ని కూడా కలిగిస్తాయి.
అయితే వాటికి లొంగకుండా వాంఛలను విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది.

ప్రత్యేకత:

“కాలపు నీడలు వెంటనుండినన్” — జీవనానుభవాల అద్భుత రూపకం.
చివరి పాదం వైరాగ్య–జ్ఞాన తత్త్వాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తోంది.


(23) — సహనం, సత్యయోగి

యత్నశీలి మాత్రమే మాయామర్మాన్ని జయించగలడు.
శరీరాన్ని నిలబెట్టుకోవడం కూడా ధర్మమే; కామాది విక్షేపాలను అదుపులో పెట్టాలి.
గాయాలను సహనంగా మోసే వాడే గంభీరుడు.
సత్యయోగిగా జీవించేవాడే నిజమైన ఆనందసౌఖ్యాన్ని పొందుతాడు.

ప్రత్యేకత:

  • “గాయాలన్ సహనమ్ముగాను” — జీవిత గాయాలను ఓర్పుగా భరించడం.
  • “సత్యయోగి” — ఆచరణలో సత్యం నిలబెట్టే యోగి భావన.

ఈ పద్యం జీవనసాధకుని లక్షణాలను బలంగా ప్రతిపాదిస్తోంది.


(24) — సాంఖ్యయోగి లక్షణం

ఎవడు అంతరంగ సౌఖ్యాన్ని పొందుతాడో,
ఎవడు కళలోనూ, జీవితంలోనూ శాంతిని కోరుతాడో,
ఎవడు విద్యాబోధ ద్వారా అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుతాడో,
అతడే సాంఖ్యయోగి; ఆదర్శ బ్రహ్మస్వరూపుడు.

ప్రత్యేకత:

ఈ పద్యం గురుత్వం–లోకహితం–శాంతి అనే మూడు మూలాలను సమన్వయించింది.

“యెల్లరి క్షేమము చూచు చుండునో”
అనే పాదం నిజమైన జ్ఞాని వ్యక్తిత్వాన్ని చక్కగా నిర్వచిస్తోంది.


మొత్తం (21–24) తాత్విక ప్రవాహం

ఈ నాలుగు పద్యాల్లో:

  • శూన్యత ↔ అస్తిత్వం
  • సుఖదుఃఖం ↔ జ్ఞానం
  • సహనం ↔ యోగం
  • లోకక్షేమం ↔ బ్రహ్మస్థితి

అనే ఆధ్యాత్మిక–జీవన సంబంధాలు ఎంతో సహజంగా మిళితమయ్యాయి.

ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం —
మీ పద్యాల్లో “మనసు”, “జ్ఞానం”, “శాంతి”, “పరమాత్మ”, “సహనం” అనే పదాలు మంత్రసూత్రాల్లా పునరావృతమవుతూ మొత్తం శ్రేణికి ఏకతానాన్ని ఇస్తున్నాయి.

*****

ఉ ..నీరద దేహరూప దివి నిర్జర పాపము చేయగుండగన్ 

 శారద నామ మాధురికి జ్ఞాన ప్రభావము ముగ్ధమేయగున్ 

 దారిగ సంశయమ్ము లను దాతగ దీక్షయు సాధనేయగున్ 

 సారసలోచనా మనసు సర్వం నేస్తము బ్రహ్మ వేత్తగన్                (25)


ఉ. సారధి పేరుపేరున సుసాధ్యము లెల్లరి యుద్ధ నాణ్యతన్ 

వారల నెల్ల పోరు పరివారము బట్టినెరుంగు మర్జునా 

వారల తాత బందువుల వాంఛలు తీర్చగ వచ్చి యుండగన్ 

పోరును సేయులక్షణము భూపతి జాతికి నెంచగల్గగన్..             .. (26)


ఉ . నన్నెవరూ మనస్సును ననాదిన నాటిన తత్వ బుద్దిగా

అన్ని తపో మయమ్ముగ సహాయ వినమ్రత నెంచ యుక్తిగా

అన్నియు లక్షణాల పరకాయము నెంచియు యుండ శక్తిగా

అన్ని సజీవులై మనసె ఆశ్రిత పుత్తడి కాంతి ముక్తిగా                      (27)


మ . జయమేయిoద్రియమౌను సత్యమగు వాంఛావాక్కు విధ్యేలు లే

భయకోపాదులు వీడిశాంతిమయ ప్రాబళ్యమ్ము నిత్యమ్ముగన్

నియమమ్ముల్ వినిచేయుటే మనసు సాన్నిధ్యమ్ము సత్యమ్ముగన్

ప్రియమోనే వశమేనుమోక్షముయె సంప్రీతి స్వరమ్మేనులే             (28)

ఈ పద్యాలు (25–28) భక్తి, జ్ఞానం, ధర్మయుద్ధం, తపస్సు, ఇంద్రియనిగ్రహం, మోక్షతత్త్వం వంటి విశాల భావప్రవాహాన్ని సమగ్రంగా మలిచాయి. ప్రతి పద్యం ఒక ఆధ్యాత్మిక సాధన మెట్టులా అనిపిస్తోంది.


(25) — శారదా జ్ఞానమాధుర్యం

నీరదసమానమైన దివ్యదేహంలో పాపరహిత స్థితి ఉండాలి.
శారదానామ మాధుర్యం జ్ఞానప్రభావాన్ని మంత్రముగ్ధంగా చేస్తుంది.
సంశయాలను దాటించేది దీక్ష, సాధనే మార్గం.
సారసనేత్రసౌందర్యంలాంటి మనసు సమస్తాన్ని స్నేహభావంతో చూసినప్పుడు బ్రహ్మజ్ఞానిగా మారుతుంది.

ప్రత్యేకత:

  • “శారద నామ మాధురి” — సరస్వతీ తత్త్వాన్ని మాధుర్యరూపంలో ఆవిష్కరించారు.
  • “సర్వం నేస్తము బ్రహ్మ వేత్తగన్” — సమస్తాన్ని స్నేహంగా చూసే దృష్టియే బ్రహ్మజ్ఞానం అని సూచన.

(26) — సారథి, యుద్ధధర్మం

సారథి (కృష్ణతత్త్వం) మార్గదర్శకత్వంలోనే యుద్ధనైపుణ్యం సాధ్యం.
పోరాటం వెనుక కుటుంబాలు, బంధాలు, వాంఛలు అన్నీ ఉంటాయి.
అర్జునునికి తాతలు, బంధువులు ఎదురుగా నిలిచినట్లే జీవన సంగ్రామం కూడా సంక్లిష్టమే.
అయినా రాజధర్మం కోసం పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయి.

ప్రత్యేకత:

ఈ పద్యంలో మహాభారత తాత్విక ప్రతిధ్వని స్పష్టంగా వినిపిస్తోంది.
“వారల తాత బందువుల వాంఛలు” అనే పాదం అర్జునవిషాదాన్ని గుర్తుచేస్తోంది.


(27) — తపస్సు, వినమ్రత, జీవకాంతి

“నన్నెవరూ?” అనే ఆత్మప్రశ్న తత్వబుద్ధికి ప్రారంభం.
తపస్సుతో కూడిన వినమ్ర సహజీవనం యుక్తిమార్గం.
ప్రతి లక్షణాన్ని పరాయణంగా గ్రహించి జీవించడం శక్తి.
అప్పుడు సమస్త జీవులలో ఒకే బంగారు కాంతిలాంటి ముక్తి దర్శనమవుతుంది.

ప్రత్యేకత:

  • “అన్ని సజీవులై మనసె ఆశ్రిత పుత్తడి కాంతి” — జీవరాశుల ఏకత్వాన్ని బంగారు కాంతిగా రూపకీకరించారు.
  • ఆత్మవిచారణ → వినమ్రత → సమత్వం అనే క్రమం అందంగా వచ్చింది.

(28) — ఇంద్రియజయం, శాంతి, మోక్షం

ఇంద్రియజయం నిజమైన విజయము.
సత్యవాంఛ, సత్యవాక్కు, విద్య — ఇవే జీవనాధారాలు.
భయం, కోపం విడిచి శాంతి ప్రాబల్యాన్ని పొందాలి.
నియమాలను ఆచరించడం ద్వారా మనస్సు సత్యసాన్నిధ్యాన్ని పొందుతుంది.
ప్రేమలోనే మోక్షం, సంప్రీతి స్వరూపం దాగి ఉంది.

ప్రత్యేకత:

  • “జయమే యింద్రియమౌను” — నిజమైన గెలుపు బాహ్యవిజయం కాదు, అంతరజయం అని గంభీరత.
  • “ప్రియమోనే వశమేను మోక్షము” — ప్రేమ ↔ మోక్షం అనే అత్యంత మృదువైన తాత్విక ముగింపు.

మొత్తం (25–28) తాత్విక ప్రవాహం

ఈ పద్యాల్లో:

  • శారదా జ్ఞానం ↔ బ్రహ్మవేత్త
  • ధర్మయుద్ధం ↔ కర్తవ్యసంకటము
  • తపస్సు ↔ సమత్వం
  • ఇంద్రియజయం ↔ మోక్షం

అనే ఆధ్యాత్మిక–జీవన సంబంధాలు సుస్పష్టంగా మిళితమయ్యాయి.

ప్రత్యేకంగా గమనించదగ్గది —
మీ పద్యాల్లో “మనసు”, “జ్ఞానం”, “శాంతి”, “సత్యం”, “మోక్షం” అనే మూలభావాలు పరస్పరం అల్లుకొని ఒక నిరంతర వేదాంత ప్రవాహంలా సాగుతున్నాయి.

******

మ . అతిధీరుo డతి దాన సూరుoడతి రమ్యాకారుడత్యంత సు

వ్రతు దంచుందను సన్నుతించు కవి వాగ్వాపార మెల్ల న్ యధా

ర్ధతమం బై విలసిల్ల మది సాధ్యాప్రేమ యజ్ఞముగన్

స్వత సిద్ధీ భగవత్ మహత్యమగు విశ్వాసమ్ము మహేశ్వరమ్            (29)


 సన్యాసయోగో నామ పంచమో ధ్యాయః ( తెలుగు పద్యాల భావము సమాప్తము ) **

మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ


ఈ ముగింపు పద్యం (29) మొత్తం తాత్విక పద్యశ్రేణికి మంగళశాసనంలా నిలిచింది. “సన్యాసయోగం” భావసారం ఇందులో సమగ్రంగా ప్రతిధ్వనిస్తోంది.

సరళ భావం:
అతిధైర్యశాలి, మహాదాత, సుందర స్వభావి, శ్రేష్ఠవ్రతధారి అని కవులు స్తుతించిన మహనీయుని వాక్యవ్యవహారం అంతా యథార్థతతో వెలుగుతుంది.
అది ప్రేమయజ్ఞంగా పరిణమించి, స్వతసిద్ధమైన భగవత్ మహిమగా విశ్వాసరూప మహేశ్వరత్వాన్ని ప్రసాదిస్తుంది.


భావ విశేషాలు

  • “అతిధీరుoడు, దానసూరుoడు” — ఆదర్శ పురుషుని లక్షణాలను గంభీరంగా చిత్రించారు.
  • “కవి వాగ్వాపారము” — కవిత్వాన్ని కేవలం అలంకారంగా కాక, యథార్థ వాక్యసాధనగా చూపారు.
  • “ప్రేమ యజ్ఞము” — మొత్తం శ్రేణికి హృదయసారం.
  • “స్వత సిద్ధీ భగవత్ మహత్యము” — ఆత్మసాధన చివరికి దైవమహిమగా వికసిస్తుందని సూచన.
  • “విశ్వాసమ్ము మహేశ్వరమ్” — విశ్వాసమే పరమేశ్వరస్వరూపం అనే అత్యున్నత ఆధ్యాత్మిక ముగింపు.

మొత్తం శ్రేణిపై సంక్షిప్త దర్శనం

“సన్యాసయోగో నామ పంచమో ధ్యాయః”
అనే ముగింపు ద్వారా ఈ పద్యాలు భగవద్గీతా సన్యాసయోగ భావసారాన్ని తెలుగు తాత్విక పద్యరూపంలో అందించినట్లుగా అనిపిస్తున్నాయి.

ఈ శ్రేణి అంతటా ప్రధానంగా ప్రవహించిన భావాలు:

  • మనోనిగ్రహం
  • కర్మతత్త్వం
  • సమభావం
  • విద్య–జ్ఞానం
  • శాంతి
  • పరమాత్మసాక్షాత్కారం
  • ప్రేమ ↔ మోక్షం

అన్నీ పరస్పర అనుసంధానంతో సాగాయి.

మీ పేరు సూచించినట్లే —
“ప్రాంజలి ప్రభ”
ఈ పద్యాల్లో నిజంగా ఒక నమ్రతా–జ్ఞాన–ఆధ్యాత్మిక కాంతి ప్రసరిస్తోంది.

మల్లాప్రగడ రామకృష్ణ