Thursday, 25 May 2017
Wednesday, 24 May 2017
Tuesday, 23 May 2017
Monday, 22 May 2017
నేనే ప్రేయసి మనసులో - నేస్తమై ప్రాణమైనాలే
నేనే ప్రేమ పిలుపులలో - నేఁధర్మ దాహమైనాలే
నేనే ప్రేక్షక కళలలో - నే సత్య మోహమైనాలే
నేనే ప్రేమేము వయసులో - నేటి దేశ మైనాలే
*
దేవీ ప్రేమము మనసులో - దీపమై ప్రజ్వలించెన్గా
భావావేశము కవితగా - భాసురమ్మై వెలింగెన్గా
జీవానందము నిజముగా+ - చేతనమ్మై చలించెన్గా
నీవే నాకని తలువఁగా - నెమ్మి కన్నుల్ చెమర్చెన్గా
*
దారిద్ర్యమ్మున ధనముకై - తాను వెళ్లెన్ విదేశమ్ముల్
దూరమ్మందున నుడుపమా - త్రోవలోఁ గాంచినావేమో
దారిం జెప్పుము వలపుతో+ - చిక్కి ఖేదాత్మగా నుంటిన్
ఘోరమ్మీ విరహకథయున్ - గొంతులో వెల్గగా నయ్యెన్
*
కోపమ్మొందుచు వరుసముం - గొండపై నుండఁగాఁ జెప్పన్
శాపగ్రస్తుఁడు విరహియై - శాలినిం బాసి యక్షుండే
కూపమ్మందు జనకజ తా+ - కూర్మితోఁ జేసెనో స్నానం
బా పేర్వుం గృహముగఁ గొనెన్ - యక్షుఁ డావేళ రామాద్రిన్
*
విరహి - మ/న/స/ర/ర/గగ UUU IIIIIU - UIU UIU UU
*****
Sunday, 21 May 2017
చిన్న కథలు
*
*
*మంచి సావాసం.....*(97)
*ఒక రోజు సాయంత్రం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.*
*కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.*
*ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.*
*అప్పుడు అందులోంచి ఒక పెద్దమనిషి లేచి ఇలా అన్నాడు... "చూడండీ... మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు'. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చేప్పేది జాగ్రత్తగా వినండి... ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో... ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులోకి వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు. ఒక్కరి కోసం అందరు చస్తారో... అందరి కోసం ఒక్కరు చస్తారో... ఆలోచించుకోండీ...” అన్నాడు.*
*అప్పుడు ప్రయాణికులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి మొదలుపెట్టారు. మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. అలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే... అని అందరూ అనుకున్నారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.*
*కాని... బస్సులోని ప్రయాణికులందరు ”నీవల్ల మేమందరం మరణించాలా... వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చింది, తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి పడింది ఆ చివరి వ్యక్తిపై కాదు... బస్సుపైన. అవును... బస్సుపై పిడుగు పడి అందులోని వున్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంత వరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు మిగిలిన వారి అందరిని కాపాడింది.*
*అందుకే... మన పూర్వీకులు చెప్పేవారు... ఎల్లప్పుడూ మంచివారి తోనే సావాసం చేయమని. మంచివారితో సావాసం చేయడం వల్ల వారి వారి చెడు కర్మ ఫలాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అని...*
******
రెండు గంటల నిరీక్షణ* (98)
నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.
ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని.
అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు.
నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు.
నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు;
అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు.
వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు.
మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు.
ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము.
“అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు.
“మీరు ఇచ్చినదే తీసుకున్నాను”
“లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు”
అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ,
“అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు.
ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!!
మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము.
--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7
#కంచిపరమాచార్యవైభవం
********
నేటి...99
*ఆచార్య సద్బోధన*
సేవ, పూజ, శరణాగతి ఈ మూడూ ఆధ్యాత్మిక జీవనానికి పునాది రాళ్ళు.
మనం ఓపికతో శ్రద్ధతో జాగరూకతని కలిగి ఉంటూ మన వంతు వచ్చే వరకూ విసుగును ప్రదర్శించుకుండా నిరీక్షణ చేయగలిగితే దీర్ఘకాలంగా, భారంగా తోచే రాత్రింబవళ్ళు, ఋతువులు అన్నీ మనకు అనువుగా నూతన తేజాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా విస్మయ రీతిలో మలచబడతాయి.
ప్రకృతిలో ప్రతీది పునరావృతం అవుతూనే ఉంటుంది.
మనందరిలోనూ ఆధ్యాత్మిక బీజం దాగి ఉంది, అది మొలకెత్తే సమయం కొరకు చూస్తూ ఉన్నది. అయితే దానికి అనువైన పరిస్థితులను ఏర్పరచడం అనేది మన మీదే ఆధారపడి ఉన్నది. దానికి సరియైన పోషణ లభించకపోతే అది ఒడలిపోయే ప్రమాదం ఉంది.
అందువలన జాగరూకతతో దానిని కాపాడగలిగితే అది మహావృక్షమై అనంత ఫలాలను అందిస్తుంది0
*******
*రేపటి తరానికి బతుకు, భధ్రతల లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖
**చాణక్య నీతి:*(100)
*తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేస్తే ..అవి పిల్లలకు శాపాలుగా మారతాయా..!!*
ఆచార్య చాణక్యుడు తన నీతీ ద్వారా మనిషి తన జీవితంలో ఏ విధంగా ఆనందంగా గడపాలో అనేటువంటి ముఖ్య విషయాలను తెలియజేశారు. మనిషి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు
చాణక్యుడు ధర్మం, అధర్మం, కర్తవ్యం, పాపపుణ్యాలను, అలాగే అర్థశాస్త్ర రాజకీయాలతో పాటుగా అనేక విషయాలను నీతి శాస్త్రంలో రాశారు.
ఆయన తెలియజేసిన విధానాలు మానవ జీవితంలో శాంతి మరియు విజయాలను చేకూరుస్తాయి. మరి ఆచార్య చాణక్య నీతి లోని కొన్ని విషయాలను చెప్పారు.. వీటిని పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.. అవేంటో చూద్దాం..!!చాణక్య నీతి ప్రకారం గుణవంతులైన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి గుణాలతో పెంచుతూ సరైన విద్య అందించాలి.
మంచి గుణాలు కలిగిన వ్యక్తులు సమాజంలో గౌరవంతో బతుకుతారు. అలాంటి పిల్లలను చిన్నతనం నుంచే నేర్పితే మంచి ప్రవర్తనతో మెలుగుతారు. అయితే చాణక్యుడు నీతి శాస్త్రంలోని రెండవ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ చూపనీ తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటి వారని అన్నారు.
*****
*భారతదేశాన్ని జంబూ ద్వీపం (Jambu Dvipa) (101)
అని పిలవడం పురాణాల నుంచి వచ్చిన పేరు.*
ఇది హిందూ, జైన, బౌద్ధ గ్రంథాల్లో కనిపించే భూగోళ సిద్ధాంతం ప్రకారం వచ్చిన పేరు.
1. జంబూ ద్వీపం అనే పదానికి అర్థం:
"జంబూ" అనగా "జంబు వృక్షం" నేరేడు చెట్టు.
"ద్వీపం" అంటే "ద్వీపం లేదా భూభాగం"
అంటే జంబూ వృక్షం సమృద్ధిగా ఉన్న భూభాగం అని అర్థం.
2. పురాణ ప్రస్తావన:
హిందూ పురాణాల్లో భూలోకం (పృథ్వీ లోకం) ను ఏడు ద్వీపాలుగా విభజించారు.
జంబూ ద్వీపం
ప్లక్ష ద్వీపం
శాల్మల ద్వీపం
కుశ ద్వీపం
క్రౌంచ ద్వీపం
శాక ద్వీపం
పుష్కర ద్వీపం
ఈ ఏడు ద్వీపాల్లో జంబూ ద్వీపం కేంద్ర భూభాగం, అందులో భారత ఖండం ఒక భాగం.
3. జంబూ ద్వీపం విశిష్టత
జంబూ వృక్షం (నేరేడు చెట్టు) ఇక్కడ విరివిగా ఉండేది అని పురాణాల ప్రస్తావన.
పవిత్ర నదులు, ధార్మిక కేంద్రములు, తీర్థస్థానాలు జంబూ ద్వీపంలో ఉన్నాయని చెబుతారు.
4. జైన, బౌద్ధ వేదాంతంలో:
జంబూ ద్వీపం భూగోళం (Earth) కు ప్రతీక.
జైన గ్రంథాలు కూడా జంబూ ద్వీపాన్ని మధ్యలో ఉంచి మేరూ పర్వతం చుట్టూ ఆకారాన్ని వర్ణిస్తాయి.
బౌద్ధ గ్రంథాల్లో కూడా జంబూ ద్వీపం ఒక మధ్య భూభాగం.
5. భారత దేశానికి జంబూ ద్వీపం అనే నామధేయం:
భారత దేశం సంస్కృతి, పండితులు, పవిత్రత కోసం ప్రసిద్ధి పొందింది.
హిమాలయ పర్వతాలు, సింధు నదీ పరివాహక ప్రాంతం, గంగానది వంటివి పురాణకాలం నుంచి పవిత్ర భూభాగంగా పేర్కొనబడ్డాయి.
ధార్మికత, వేదాంతం, యోగం, ఆధ్యాత్మికత ఈ భూభాగంలో పుట్టాయి.
జంబూ ద్వీపం అనేది పురాణ గాథలు, ఆధ్యాత్మికత, భారతదేశ ప్రాచీనతను ప్రతిబింబించే పేరు.
భారతదేశం కేంద్రంగా ఉన్న ఈ ద్వీపం, సంస్కృతి, ధర్మం, జ్ఞానం కలిగిన ప్రదేశంగా హిందూ, జైన, బౌద్ధ వాఙ్మయాల్లో ప్రాముఖ్యత పొందింది.
అందుకే భారతదేశాన్ని "జంబూ ద్వీపం" అని ప్రాచీన కాలం నుంచి పిలుస్తున్నారు.
మహా గణపతి స్వరూపముగా దర్శనమిస్తున్న " జంబూ ద్వీపం " నిజంగా ఒక అద్భుతమే🙏
*✍️... *నేటి చిట్టికథ* (102)
ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు.
తల్లి వృద్ధాప్యం వల్ల పెద్దదయి కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు.
ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు.
తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు.
విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది.
ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు.
తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు.
అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు.
చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది.
అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది.
జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది.
ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు.
ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు.
చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.
పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది.
ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది.
అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది.
కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు.
ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.
అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను.
ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు "
మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు!
కళ్ళనిండా నీళ్లతో ఆమె పాదాల పై పడ్డాడు....😢
సేకరణ
*👍దానంతో,తపస్సుతో…స్వర్గానికి వెళ్ళవచ్చు!*(103)
*ఈ లోకంలో ఎన్నడూ స్థిరంగా ఉండనివి కొన్ని ఉన్నాయి. ఏనుగు చెవులు, రావి ఆకులు, సముద్రపు అలలూ... అలాంటివే!*
*వాటన్నింటినీ మించి అస్థిరమైనది- ధనం! డబ్బు అంతటి నిలకడ లేనిది మరొకటి లేదు. సంపదకు ప్రతీక ‘లక్ష్మి’. లక్ష్మీదేవికి ‘చంచల’ అని పేరు. అది ఎక్కడ దాచినా దాగదు. దొంగలపాలు కావచ్చు. అగ్నికి ఆహుతి కావచ్చు. తుదకు రాజే ప్రజోపయోగార్థం లాక్కోవచ్చు.*
*‘న్యాయార్జిత విత్తం’ కొబ్బరికాయలో నీరులా వచ్చి చేరుతుంది. అది ఆరోగ్యకరం, రుచికరం.*
*అధర్మ సంపాదన ఓటికుండలో నీరు వంటిది. అది ఏనాటికైనా నేలపాలు కాక తప్పదు.*
*వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి ఏం చెప్పాడు? ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే!... వాళ్లంతా సిరి మూటగట్టుకొని పోగలిగారా? ఈ భూమి మీద వాళ్ల పేరైనా మిగిలి ఉందా?*
*కానీ మహా త్యాగమూర్తులైన శిబి చక్రవర్తి వంటివారిని మాత్రం మరచిపోలేదు గదా’ అని గురువుకే హితోపదేశం గావించాడు.*
*‘నువ్వు తిన్నది నేలపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు’ అని లోకోక్తి.*
*‘లక్షాధికారైన లవణమన్నమె గాని, మెరుగు బంగారంబు మింగబోడు’ అంటారు. ఒకరికి ఇవ్వకుండా, తాను అనుభవించకుండా ఉంటే అది తుదకు దొంగలపాలే!*
*పాత్రతనెరిగి దానం చేయాలి. అపాత్రదానం అపాయకరం.*
*అసలు దానం పుచ్చుకోవడాన్నే తప్పుపడతాయి ధర్మశాస్త్రాలు. ‘అపరిగ్రహణం’ అనేది ఒక ఉత్తమ వ్రతం. ఎవరినీ యాచించి ధనం తీసుకోకపోవడమే ఈ వ్రత లక్షణం. ఒకవేళ తీసుకోవలసి వస్తే, ముందుగా దాత చేతిలో ఏదైనా పెట్టి, తరవాతే పుచ్చుకోవాలంటారు.*
*భార్యామణి బలవంతంపై, కుచేలుడు శ్రీకృష్ణుణ్ని అర్థించడానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరవాత నోరు పెగలలేదు. తీసుకెళ్ళిన అటుకుల్ని ఇస్తే కృష్ణుడు ఆప్యాయంగా భుజించాడు. కుచేలుడు తానుగా యాచించలేదు. పరమాత్మ దయ ప్రసరిస్తే ఎవరికి ఏ సమయంలో ఏది లభించాలో అది లభించకుండా ఉంటుందా!*
*ఈ కాలంలో బతుకులు జీవన ప్రధానంగా సాగుతున్నాయి. ఏదో ఒక విధంగా అధికంగా సంపాదించడమే ఎక్కువమంది బుర్రల్లో సదా సాగే ఆలోచన. ప్రజలు జీవనానికి ఇస్తున్న ప్రాధాన్యం కర్తవ్యానికి ఇవ్వడంలేదు. మన సంప్రదాయంలో ఒక కథ ఉంది...*
*ప్రజాపతి తన సంతానానికి మూడుసార్లు ‘ద’ అని బోధించాడు. దేవతలకు ‘దమం’, మనుషులకు దత్త, అసురులకు దయ... ఇవీ ప్రజాపతి సందేశాలు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, దేవతలకు అవసరమైనది. అసురులు క్రూరంగా ఉంటారు. అందువల్ల వాళ్లకు ‘దయ’. ఇక ... మనుషులు సహజంగా లోభులు. వాళ్లకు ‘దత్త’ అని ప్రబోధించాడు ప్రజాపతి. దురాశతో అధికంగా కూడబెట్టడంవల్ల మానవాళి కష్టాల పాలవుతుంది. అందుకే ప్రజాపతి దత్త- ‘దానం చేయండి’ అని ప్రబోధించాడని చెబుతారు.*
*దానం అయిదు రకాలంటారు- ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివల్ల దాతకు ఇహలోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమగతీ కలుగుతాయి.*
*అసూయ లేకుండా ఇస్తే అది ధర్మదానం. యాచకులు ప్రశంసిస్తూ ఉండగా ఇస్తే అర్థదానం. దానం ఇవ్వకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేది భయదానం. ఇష్టమైన వ్యక్తికి ఇస్తే కామ దానం. పేదవాడికి జాలితో ఇచ్చేది కారుణ్య దానం. వీటిలో ఏ రకమైన దానమైనా అది పుణ్యాన్ని, కీర్తిని ప్రసాదించేదే!*
*‘దానంతో, తపస్సుతో స్వర్గానికి వెళ్ళవచ్చు గదా! ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది?’ అని ధర్మరాజు భీష్ముణ్ని ప్రశ్నించాడు.*
*దానికి భీష్ముడి జవాబు- ‘తపస్సు ప్రభావం వల్ల పవిత్ర హృదయులైన రాజులు ఉత్తమ గతులు పొందుతారు. ధర్మపరాయణులైన రాజులు దాన పుణ్యాసక్తులై నిస్సందేహంగా ఉత్తమ లోకాలకు వెళ్తారు. మార్గాలు వేరైనా ఫలితం ఒకటే! అయితే ఈ రెండో మార్గంలో వెళ్లాలంటే ధనం పుష్కలంగా ఉండాలి!’*
. *సర్వం శివార్పణమస్తు*
*****
శనైశ్చర జయంతి సందర్భంగా శని శింగణాపూర్ విశిష్టత!*(104)
*శని శింగణాపూర్*
*నవ గ్రహాలలో ఏడోవాడు, సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడే శని దేవుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి భక్తులు శనీశ్వరుడుని భక్తితో, శ్రద్ధతో ఎవరికి అన్యాయం చెయ్యకుండా ధర్మపథాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి... శనీశ్వరుడి కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం, ఖడ్గం ఉంటుంది... శనీశ్వరుడి వాహనం కాకి...*
*ఇక శని భార్య మందాదేవి మరియు లక్ష్మిదేవి సోదరి అయినా జేష్టాదేవి. ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటున్నారు. శని భగవానుడు విషుణువుకి తోడల్లుడు, యమధర్మరాజుకి సోదరుడు. గ్రహాలకి యువరాజు. శని కుమారుల పేర్లు మంది, కులగున్. ఇక నలుడు, హరిచ్చంద్రుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శని దేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తనతో సుఖాలను పొందారు.*
*శని దేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడంతో సమానమని చెప్తారు. ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది. త్రేతాయుగంలో లంకలో రావణుండై అధీనంలో ఉన్న ఆంజనేయుడుని శనీశ్వరడు విడిపించాడని ఒక కధనం. అందుకే హనుమత్ దీక్షలో ఉన్న వారిని, మందుడుకి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు బాధించడని చెప్తారు.*
*మహా రాష్ట్రలోని శని శింగణాపూర్ గ్రామంలో ఉన్న శని దేవుని ఆలయం ఒక అద్భుతమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి దైవం స్వయంభువు అనగా భూమి నుంచి స్వయంగా ఉద్బవించిన నల్లని రాతి విగ్రహం. అనాది కలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది. కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం వున్నదని పేర్కొంటారు. గొర్రెల కాపరి చెప్పిన చరిత్ర కధనం ప్రకారంగా*
*ఒక రోజు గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఈ ఘటనతో గొర్రెల కాపరి దిగ్బ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకు వచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరు చూసారు... ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తాను శనీశ్వరుడుని అని... రాతి విగ్రహంలో వెలిసానని చెప్తాడు. నల్ల రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని శనిని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని... తనకి ఎలాంటి నీడ అవసరం లేదని ప్రతి రోజు తనకి తైలాభిషేకం చెయ్యాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇస్తాడు... అంతే కాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు అప్పటినుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు… కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు.*
*శని దేవుడు ఆ రకంగా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు గాని, దేవాలయం గోపురం గాని ఈ శని దేవుడికి ఉండదు… ఆరు బయట ప్రదేశంలోనే చుట్టూ కొన్ని రాళ్ళని ప్రహారిగా పెట్టి నువ్వుల నూనెతో, నువ్వులతో… దేవుడికి అభిషేకం చేస్తూ పూజిస్తారు. ఇక దొంగల భయం అసలు లేని ఊరే శని శింగణాపూర్*
*ఇక ఈ క్షేత్రంకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే… ప్రతి మనిషికి జీవితంలో మూడు దస్సల్లో యేలినాటి శని వస్తుంది... ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని, తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చు అని నమ్ముతారు.*
*యేలిననాటి శని వున్న వారు హనుమంతుడిని పూజిస్తే శని వలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు... త్రేతాయుగంలో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞతగా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యంగా శనివారంలో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు… శని దేవుడు… మొత్తం కాకున్నా చాలావరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు… అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు.*
*శనైశ్చర జయంతి సందర్భంగా శని దేవుడి కృప మీ పై ఉండుగాక.!!*
******
*
*"సంకల్పమే🌊 జీవనాధారం"💦.!!*(104)
*మన సంకల్పాలే🫧మన జీవితాన్ని🌊 రూపొందిస్తాయి...*
*"యద్భావం తద్భవతి" మనం ఎలా ఆలోచిస్తామో అలానే తయారవుతాం, అంటే మన మనసు దేని గురించైతే ఆలోచిస్తుందో మనం దాన్నే పొందుకుంటాం*
*ఈ జీవితం సుఖదుఃఖాల, గెలుపు ఓటముల ఆట*
*మన మనసు ఏ విషయాన్ని పదే పదే ఆలోచిస్తుందో అదే మన దగ్గరకు వస్తుంది*
*అందుకే మన మనసులో సంకల్పం ఇలా చేయాలి..."నేను చాలా ఆనందంగా ఉన్నాను" "ఆరోగ్యంగా ఉన్నాను" "సురక్షితంగా ఉన్నాను" "సదా భగవంతుడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు" "భగవంతుని తోడు మరియు భగవంతుని వరదాన్ని హస్తం నా తలపై ఉంది" "నాకు ఎల్లప్పుడూ అన్ని చాలా మంచిగా జరుగుతూ ఉంటాయని, శుభ సంకల్పాలు చేస్తూ ఉంటే, ఒకవేళ చెడు జరిగేది ఉన్న, అది కూడా మంచిగా అయిపోతుంది"*
*"బలహీన సంకల్పాల negative thoughts" రచనయే మన జీవితాలను అధోగతి పాలు చేశాయి. మరల మన జీవితంలో సఫలత సాధించాలంటే అది మన "శుభ సంకల్పాల శక్తి⚡positive thoughts ⚡power" తోనే సాధ్యం, కనుక శుభ సంకల్పాలు చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ నింపుట సాధ్యం*
*బాహ్యంగా మనం ఎంత ప్రాయాసపడినా ఆంతరికంగా మన సంకల్పాలు సరిలేకుంటే ప్రయోజనం శూన్యం కనుక మన ధ్యాస అంతా మన సంకల్పాల పరివర్తన పై పెడితే సహజంగానే మన జీవితంలో సానుకూల పరివర్తన positive improvement సాధ్యం అవుతుంది.*
******
🔔 *సత్సంగం*( 105)
*_మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు!_*
*_ఫెయిర్ అండ్ లవ్లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు! మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచి పోయేలా చేస్తుంది కాలం!_*
*_విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఏవరిదో? ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు!_*
*_ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు._*
*_ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.!_*
*_చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం కూడా మనకి లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ._*
*_కావున నిరంతరం ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి ఎంతో కొంతపంచుతూ ఉన్నతంగా జీవించండి._*
******
🌹హనుమాన్ సర్వస్వం🌹*(106)
*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు.*
🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?
జవాబు : అంజనా దేవి !
🚩2) హనుమంతుని తండ్రి పేరు?
జవాబు : కేసరి !
🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : కశ్యపుడు !
🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : సాధ్య !
🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?
జవాబు : వైశాఖ బహుళ దశమి!
🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?
జవాబు : తిరుమల - అంజనాద్రి.
🚩7) హనుమంతుని నక్షత్రము ?
జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.
🚩8) హనుమంతుని జనన లగ్నం ?
జవాబు : కర్కాటక.
🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?
జవాబు : వైదృవీయోగం లో
🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?
జవాబు : ఈశ్వరాంశ
🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?
జవాబు : వాయుదేవుని వరం వలన.
🚩12)హనుమ జనన కారకులు ?
జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.
🚩13) హనుమంతుని గురువు ?
జవాబు : సూర్య భగవానుడు.
🚩14) హనుమంతుని శపించిన వారు ?
జవాబు : భృగుశిష్యులు.
🚩15) హనుమంతునికి గల శాపం ?
జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.
🚩16) హనుమంతుని శాప పరిహారం ?
జవాబు : స్తుతించినా,
నిందించినా తన శక్తి తను గ్రహించుట.
🚩17) హనుమంతుని బార్య ?
జవాబు : సువర్చలా దేవి.
🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?
జవాబు : విశ్వకర్మ.
🚩19) హనుమంతుని మాతామహుడు ?
జవాబు : కుంజరుడు.
🚩20)సువర్చల తల్లి పేరు ?
జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.
🚩21) హనుమంతుని బావమరుదులు ?
జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.
🚩22) హనుమంతుని వివాహ తేదీ ?
జ : జేష్ఠ శుద్ధ దశమి.
🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?
జ : గౌతముడు , అహల్య.
🚩24) హనుమంతుని మేన మామలు ?
జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.
🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?
జ : సుగ్రీవుని మంత్రి.
🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?
జ : ఋష్యమూక పర్వతం.
🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?
జ : భిక్షుక రూపం.
🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?
జ : పంపానదీ తీరం .
🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?
జ : శ్రీరాముడు.
🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?
జ : శ్రీరామ సుగ్రీవులకు.
🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?
జ : తల్లి అజ్ఞ.
🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?
జ : చందన వృక్ష శాఖ.
🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?
జ : శ్రీ పరాశర సంహిత.
🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?
జ : తార, రమ.
🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?
జ : పుష్యమి నక్షత్రం గల రోజు.
🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?
జ : దక్షిణ దిక్కు.
🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?
జ : ఆశ్లేష నక్షత్రం.
🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?
జ : స్వయంప్రభది.
🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?
జ : సంపాతి.
🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?
జ : మహేంద్ర పర్వతం.
🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?
జ : 100 యోజనాలు.
🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?
జ : మైనాకుడు.
🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?
జ : సముద్రుడు.
🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?
జ : రొమ్ము తో తాకాడు.
🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?
జ : చేతితో స్పృశించి.
🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?
జ : సురస.
🚩47) సురస ఏ జాతి స్త్రీ ?
జ : నాగజాతి.
🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?
జ : ఉపాయంతో.
🚩49) సురసను పంపిన దెవరు ?
జ : దేవతలు.
🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?
జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .
🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?
జ : సింహిక.
🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?
జ : నీడ పట్టి లాగింది.
🚩53) సింహిక వృత్తి ఎమిటి ?
జ : లంకను కాపాడడం.
🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?
జ : శ్రీ పరాశర మహర్షి చే.
🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?
జ : సువేల పర్వత ప్రాంతం లో.
🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?
జ : త్రికూటాచలం.
🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?
జ : సూర్యాస్తమయం కోసం.
🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?
జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.
🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?
జ :లంకిణి
🚩60) లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?
జ : ఎడమ చేతి పిడికిలి తో.
🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?
జ : ప్రాకారం దూకి.
🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?
జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.
🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?
జ : మండోదరిని.
🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?
జ : అశోక వనం.
🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?
జ : సుందర పర్వతం.
🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?
జ : నీల పర్వతం.
🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?
జ : మైత్రేయ మహర్షి కి.
🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?
జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)
🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?
జ : శింశుపా వృక్షము.
🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?
జ : రాముడి ఉంగరం.
🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?
జ : చూడామణీ.
🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?
జ : జంబుమాలిని.
🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?
జ : అక్షయ కుమారుడు.
🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?
జ : ఇంద్రజిత్తు నకు.
🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?
జ : ప్రహస్తుడు .
🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?
జ : అరిష్ట పర్వతం.
🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?
జ : 30 ఘడియలు.
*ఆరు గజాలు - తొమ్మిది గజాలు*..(107)
ఒకరోజు కంచి శ్రీమఠానికి ఒకామె ఆరు గజాల చీర కట్టుకుని వచ్చింది. బహుశా ఆమె మొదటి సారి అక్కడకు రావటం ఏమో. మఠానికి వచ్చే ఆడవారు తిమ్మిది గజాల మడిచీర కట్టుకుని రావాలనే విషయం ఆమెకు తెలియదేమో.
పరమాచార్య స్వామికి పెద్ద భక్తురాలను అని భావించే మరొకామె ఈ ఆరు గజాల చీరావీడను చూసింది. వెంటనే ఏదో జరిగిపోయినట్టుగా ఆమె కోపంతో ఊగిపోతోంది.
“మడిచీర కట్టులో చీర కట్టుకోకుండా నువ్వు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు లేదు” అని ఆమెపై విరుచుకుపడింది.
ఆ భక్తురాలి దుర్దదృష్టం వల్ల మహాస్వామివారు అటువైపు రానే వచ్చారు. అక్కడ ఎందుకు అంత పెద్దగా అరుపులు వినపడుతున్నాయి అని అడిగారు. జరిగినదంతా స్వామివారికి చెప్పారు.
ఊగిపోతున్న ఆ మడిచీర భక్తురాలిని స్వామివారు పిలిచారు. “ఆమె చాలా బీదరాలు. ఆమెవద్ద తొమ్మిది గజాల చీర లేదు. కొనగలిగే శక్తి ఆమెకు లేదు. నువ్వు వేంటనే బట్టల దుకాణానికి వెళ్ళి తొమ్మిది గజాల చీర ఒకటి, రెండు రవిక బట్టలు తీసుకుని వచ్చి ఆవిడకు ఇవ్వు” అని స్వామివారు ఆదేశించారు.
వెంటనే ఆమె స్వామివారి ఆదేశాన్ని అమ😄లుపరిచింది. వెళ్ళి తొమ్మిది గజాల చీర కొనుక్కుని వచ్చి, దాన్ని మడిచీర పద్ధతిలో ఆమెకు కట్టి పరమాచార్య స్వామి వద్దకు తీసుకుని వెళ్ళింది.
స్వామివారు చూసి, ”చాలా మంచిది, కాని నువ్వు చేసిన పని తప్పు కనుక ఆమె వద్ద క్షమాపణలు అడుగు” అని అన్నారు.
మహాస్వామివారు సాంప్రదాయానికి పెద్దపీట వేసినా, ఎక్కడెక్కడ మినహాయింపులివ్వాలో వారికి బాగా తెలుసు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
# #కంచిపరమాచార్యవైభవం
*****
Saturday, 20 May 2017
స్వర్ణ రేఖలు 41---060
స్వర్ణ రేఖలు..(41)
మనిషి ఎలా జీవించాలి గురువుగారు
కర్మణుసారం బుద్ది, జ్ఞానాను సారం కదలిక, గుణానుసారం జీవనమ్ అంతా మట్టి కుండ బ్రతుకు అన్నాడు రామమూర్తి
కారు నడుపుతున్న చిరoజీవితో
.వివరించండి గురువుగారు..
ఇప్పటికే నిండిన కుండ నిబ్బరంగా, స్థిరంగా ఉంటుంది. ఇంకా నిండుతున్న కుండ తన శబ్దం, కదలికల ద్వారా తన స్థితిని తెలియజేస్తుంది. కానీ ఖాళీగా ఉన్న కుండ చివరికి ఆకాశం వైపు తిరిగి, ఒక చినుకైనా పడాలని ఎదురు చూస్తుంది.
నిజమైన జ్ఞానంతో నిండిన మనిషి కూడా అలాంటి నిండిన కుండలాగానే ప్రశాంతంగా, వినయంగా, స్థిరంగా ఉంటాడు; అతడు ఆడంబరాన్ని ప్రదర్శించడు. ఇంకా నేర్చుకుంటున్న వ్యక్తి తన అపూర్ణతను ప్రదర్శనల ద్వారా లేదా అస్థిర ప్రవర్తన ద్వారా తెలియజేస్తాడు. జ్ఞానం లేని మనిషి మాత్రం ఎప్పుడూ మరింత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు — ఇదే మానవ స్వభావం.
అలాగే స్త్రీలు కూడానా ప్రేమ మనసుగా నిండినకుండా....
ఖాళీగా నుండక సహాయ సహకారం చేస్తూ దాహం తీరుస్తూ కదలిక కుండలా ఉంటుంది..
స్త్రీలు త్యాగానికి, నిస్వార్థ సమర్పణకు నిజమైన ధర్మనిధులు. వారు ఉదారహృదయాన్ని కలిగి ఈ లోకంలో శాంతితో జీవించడానికి ప్రయత్నిస్తారు. అయితే స్త్రీలు స్వయంగా దృఢసంకల్పంతో కార్యానికి దిగినప్పుడు, వారు కాళీమాతవలె శక్తివంతులై అత్యంత కఠినమైన కార్యాలనుకూడా సాధించగలరు.
స్త్రీలు త్యాగం, సహనం, కరుణ, సౌమ్యతలకు ప్రతిరూపాలు. కానీ పరిస్థితి కోరినప్పుడు అదే స్త్రీలు అపారమైన శక్తి, దృఢనిశ్చయాన్ని ప్రదర్శించగలుగుతారు.
చూడు బాబు స్త్రీ పురుషుల యేకము సర్వజగతికి మూలం
“స్వర్ణ రేఖలు”(42)
కారులో పోతున్నప్పుడు చిరంజీవికి ఒక ప్రశ్న అడగాలని ఆలోచన తో
గురువుగారు.– తప్పు, శిక్ష, రాజధర్మం గురించి బివారిస్తారా
1. తప్పు చేయడం మానవ సహజం –
తప్పును అంగీకరించడం మహత్తు.
మనిషి తప్పు చేయకుండా ఉండలేడు. కానీ
తప్పు చేశానని ఒప్పుకోవడం, దానిని సరిచేయాలనే మనసు కలగడం నిజమైన జ్ఞానం.
2. శిక్ష యొక్క ఉద్దేశ్యం ప్రతీకారం కాదు – సరిదిద్దడం.
రాజధర్మంలో శిక్ష అనేది కోపంతో ఇచ్చే దండన కాదు.
దోషిని మారుస్తూ ధర్మాన్ని నిలబెట్టే సాధనం.
3. సమయోచిత తెలివి జీవనరక్షకము.
కష్టకాలంలో ధైర్యం, ఆలోచన కలిసివస్తే
మరణం కూడా మార్గం విడిచిపెడుతుంది.
4. సేవాభావం హృదయాలను గెలుస్తుంది.
క్రూరమైన పులులు కూడా ప్రేమతో చేసిన సేవను గుర్తించాయి.
అయితే మనుషులు గుర్తించకపోవడం తగదు.
5. వినయం – సత్యం కలిసి ఉంటే కఠిన హృదయమూ కరుగుతుంది.
అహంకారంతో కాదు, వినయంతో చెప్పిన మాట
రాజుని హృదయాన్ని కదిలించింది.
6. రాజధర్మం – న్యాయం తోడు కరుణ.
రాజు కఠినంగా ఉండాలి, కానీ కఠినత్వమే ధర్మం కాదు.
తప్పు చేసిన వాడిలో మార్పు కనిపిస్తే క్షమించడం కూడా ధర్మమే.
7. పునరావకాశం జీవన సత్యం.
నిజాయితీ, సేవ, తెలివి ఉన్నవారికి
జీవితం మరో అవకాశం తప్పకుండా ఇస్తుంది.
స్వర్ణ రేఖ
“తప్పును అంగీకరించిన వినయం,
శిక్షను జ్ఞానంగా మార్చిన తెలివి, యోగం
రాజధర్మాన్ని కరుణతో నిలబెట్టిన న్యాయం –
పద్య భావం :
మనిషి చేసిన తప్పును వినయంతో అంగీకరించినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది. శిక్షను భయంగా కాకుండా జ్ఞానంగా స్వీకరించి దాని ద్వారా తనను తాను మార్చుకునే తెలివి కలవాడే నిజమైన యోగి. అలాగే రాజధర్మం అనేది కఠిన న్యాయంతో పాటు కరుణను కలిపి ఉండాలి. ఈ మూడు — వినయం, జ్ఞానంగా మారిన శిక్ష, కరుణతో కూడిన న్యాయం — కలిసి మనిషి జీవితాన్ని రక్షించే మార్గదర్శక సూత్రాలుగా నిలుస్తాయి. ఇవే నిజమైన “స్వర్ణ రేఖలు.”
తే. గీ.
తప్పు ఒప్పిన వినయంబు తేజమగును
శిక్షయనునది జ్ఞానము చిత్తశుద్ధి
న్యాయ కరుణ ధర్మము జీవమార్గమగును
జీవన స్వర్ణరేఖల జీవయాత్ర.
భావం
తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించే వినయం మనిషికి తేజస్సును ఇస్తుంది. శిక్ష అనేది శత్రుత్వం కాదు; అది మనిషిని జ్ఞానవంతునిగా మార్చి మనస్సును శుద్ధి చేసే సాధనం. న్యాయం, కరుణ కలిసిన ధర్మమే జీవన మార్గం. ఈ సూత్రాలే మనిషి జీవిత యాత్రను సురక్షితంగా నడిపించే స్వర్ణరేఖలు
స్వర్ణరేఖలు...(43)
రామమూర్తి కారు వేగంగా వెళ్తోంది. మధ్యలో చెక్పోస్ట్ వచ్చింది.
పోలీసు ఆపి అడిగాడు —
“బాబు, కారు కొత్తగా ఉంది. అన్నీ కాగితాలు ఉన్నాయా?”
రామమూర్తి నవ్వుతూ చెప్పాడు —
“అన్నీ ఉన్నాయి సార్. కారు పేపర్లు, లైసెన్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయి.”
అంతలో ఒక పోలీసు,
“ఇవ్వాళ్టి టీవీలో చూసాం కదా, మీరు పంతులుగారే కదా?” అని అడిగాడు.
రామమూర్తి చెప్పబోతుండగా వారు మళ్లీ అన్నారు —
“మీ నిజాయితీ మాకు తెలుసు. అయినా విధి ప్రకారం చూడాలి.”
అన్నీ పరిశీలించారు. ఎలాంటి తప్పూ లేకపోవడంతో వారిని పంపేశారు.
కారు మళ్లీ బయలుదేరింది.
అప్పుడే గురువుగారు నవ్వుతూ అడిగారు —
“కొత్త కారుకి, కొత్త పెళ్లానికి తేడా ఏమిటో తెలుసా?”
చిరంజీవి అర్థం కాక నిశ్శబ్దంగా ఉన్నాడు.
అంతలో కారు ఒక్కసారిగా ఆగిపోయింది.
ఎందుకు ఆగిందో ఎవరికీ అర్థం కాలేదు. చిరంజీవికి కొంచెం భయం వేసింది.
అప్పుడే గురువుగారు అన్నారు —
“నా ప్రశ్నకు సమాధానం ఇదే.”
“కొత్త కారు అయితే ఎలా నడపాలో, దానికి ఏమి అవసరమో తెలుసుకొని జాగ్రత్తగా నడపాలి.
అలాగే కొత్త పెళ్లాం అయితే ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి.”
రామమూర్తి చిరంజీవిని అడిగాడు —
“నీకు పెళ్లి అయిందా?”
“లేదు” అన్నాడు.
“సరే. కారు ఎలా పనిచేస్తుందో మెకానిక్లా తెలుసా?”
“రాదు.”
“అయితే తోస్తే కదులుతుందా?”
“తోసేవారు ఎవరుంటారు?” అన్నాడు చిరంజీవి.
గురువుగారు నవ్వుతూ —
“నేనున్నాను కదా! నువ్వు స్టీరింగ్ దగ్గర కూర్చో. రోడ్డు కొంచెం పల్లం ఉంది, కదులుతుంది.”
“మీ వల్ల కాదు” అన్నాడు చిరంజీవి.
గురువుగారు నవ్వి చెప్పారు —
“కావడి మోసిన చేతులు ఇవి. మల్లయుద్ధం చేసిన దేహం ఇది. ప్రయత్నం చేస్తే దారి దొరుకుతుంది.
అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు కదా!”
చిరంజీవి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు.
గురువుగారు తోశారు.
అంతే —
చైతన్య రథం మళ్లీ కదిలింది.
సూక్తి:
కొత్తది ఏదైనా — కారు అయినా, సంబంధం అయినా —
అర్థం చేసుకొని నడిపితేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది.
తే. గీ.
కొత్త బండి నడిపె విద్య కోరుమనసు
కొత్త బంధము గౌరవం గొప్ప భవము
అర్థముగ జీవితమదియె మార్గమగును
స్వర్ణరేఖ యెల్లల జీవి సాగు గీత
సరళ భావం:
కొత్త కారు నడపడం నేర్చుకోవాలనే మనసు కావాలి.
కొత్త బంధానికి గౌరవం అనే గొప్ప భావం ఉండాలి.
అర్థం చేసుకుంటే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది.
అదే ప్రతి జీవి ప్రయాణానికి స్వర్ణరేఖ.
స్వర్ణ రేఖలు…(44)
కారు నెమ్మదిగా ముందుకు సాగుతోంది.
ఎఫ్.ఎం రేడియోలో ఒక కవిగారు రచించిన పాట మెల్లగా వినిపిస్తోంది.
“నిజమేదియో కలయేదియో నిను జూడఁగా నెఱుగన్గదా…”
పాట నెమ్మదిగా కారంతా నింపుతోంది.
శేషు విని నవ్వాడు.
“ఎంత చక్కగా ఉంది సాహిత్యం… నాకు బాగానే ఉంది కానీ అర్థం కావడం లేదు,” అన్నాడు.
రామ్మూర్తి కొంచెం ఆవేశంగా అన్నాడు —
“అవును, ఎలా అర్థమవుతుంది నాయనా! ఆంగ్లపిచ్చిలో పడి అమ్మభాషను మరిచారు. మన దేశంలోనే బ్రతుకుతూ దేశసేవ చేస్తే ఎంత ఆనందం! ఇతర దేశాలకు వెళ్లి దినదిన గండంగా జీవిస్తూ కోట్లు సంపాదించడం దేనికి? అక్కడి వారికి ఊడిగం చేయటమే కదా! తక్కువ జీతమయినా తల్లితండ్రుల సేవలో ఉండే సుఖం అక్కడ దొరుకుతుందా?”
శేషు నిశ్శబ్దంగా విన్నాడు.
కొద్దిసేపటి తరువాత రామ్మూర్తి స్వరం నిదానమైంది.
“సరే… ఈ పాట భావం చెబుతాను విను,” అన్నాడు.
“మనకు ఎంతో ప్రీతిపాత్రమైన వారిని చూసినప్పుడు — ఇది నిజమా? లేక కలలా అనిపిస్తుంది.
మనసు ఆనందంతో నిండినప్పుడు అది నిజమా లేక అనుమానమా అన్నది కూడా తెలియదు.
ఎప్పుడో కనిపించిన ఆ మధురమైన నవ్వు ఎక్కడో మాయమైపోతుంది.
ఆ చిరునవ్వులో ప్రేమ ఉందో, చిన్న కోపముందో కూడా వెంటనే అర్థం కాదు.
సముద్ర అలపై కనిపించే తెల్లని నురుగు ఎంత అందంగా ఉంటుందో — అలాగే మనకు ప్రియమైన వారి సౌందర్యం మెరిసిపోతుంది.
అది ధృవతారలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మన హృదయం ఎప్పుడో ఆనందంతో వికసిస్తుంది… ఎప్పుడో బాధతో విరిగిపోతుంది.
అది అంతా విధి వ్రాసినదా అనిపిస్తుంది.
మన కళ్లలో కనిపించే కథ తీపిగా ఉందో, కఠినంగా ఉందో కూడా తెలియదు.
పర్వతాలపై ప్రతిధ్వనించే గీతంలా ఆ భావం మనసులో మార్మోగుతుంది.
శరదృతువులో చంద్రకాంతి ఎంత మధురంగా ఉంటుందో, అలాగే మన ఆశలు మెరిసిపోతాయి.
కానీ చివరకు జీవితం ఒక యాత్ర మాత్రమే. మరణం కూడా ఆ యాత్రలో భాగమే.
అందుకే కవి అన్నాడు — ఇది అంతా మాయలాంటిదే.”
రామ్మూర్తి చిరునవ్వుతో అన్నాడు —
“ఇది ఒక మనసులో కలిగే అనుభూతి నాయనా…”
కారు నిశ్శబ్దంగా ముందుకు సాగుతోంది.
స్వర్ణ రేఖలు..(45)
జన్మజన్మల బంధం నిజమా అని అడిగాడు చిరంజీవి
విను చిరంజీవి విధాత సృష్టి ఎవ్వరికీ అర్ధంకాదు
*ప్రతిజీవికిఈ6విషయాలు జన్మకు ముందే నిర్ణయించబడతాయి*కర్మ ఫలము.
*భూమ్మీద జన్మించే ప్రతి మనిషి తలరాతనేది అతడు పూర్వ జన్మలో చేసినకర్మలనుఅనుసరించి ముందే లెక్కించబడి ఉంటుంది. ఒక వ్యక్తి గర్భంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి అతడు మరణించే వరకు ప్రతి దానివెనుకకర్మఫలంఅనేదికచ్చితంగాఉంటుంది.
గత జన్మలో చేసిన పాపం పుణ్యాల ఫలాన్ని అదేజన్మలోఅనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని ఆ జీవుడు మరో జన్మలో అనుభవించాల్సిఉంటుంది.అదిపాపమైనాకావచ్చు.. పుణ్యమైనా కావచ్చు..
ఆకర్మఫలంఆధారంగానేవిధిరాతఅనేదివ్రాయబడి ఉంటుంది. మనిషి జన్మించక ముందే ఈ ఆరు విషయాలు ముందే నిర్మించబడతాయి. వీటిని భూమి మీదకు వచ్చాక మార్చుకోవడం అనేది కుదరని పని మరి ఆ ఆరు విషయాలుఏంటోఇప్పుడు తెలుసుకుందాం.
1.పుట్టుక 2.జ్ఞానం 3.వివాహం 4.ఐశ్వర్యం 5.సంతానం 6.మరణం
1.పుట్టుక:-
మానవుని జన్మ ఎక్కడ ఏ విధంగా జరగాలి. ఎవరి కడుపున ఎలా పుట్టాలిఅనేదిగర్భంలోనికి ప్రవేశించకముందేనిర్ణయించబడి ఉంటుంది.
*అతడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మలో ఎక్కడ ఎవరికి ఏ ఇంట్లో పుట్టాలి అనేది విధాత నిర్ణయిస్తారు. దీనిని ఎవరు మార్చలేరు.
*కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ధనవంతుల ఇంట్లో వారి పిల్లలుబుద్ధివిహీనంతోనూ అంగవైకల్యంతోనో పుడుతూ ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నఏదివారుఅనుభవించలేరు వారు గత జన్మలో చేసిన పాపపు కర్మలకు ఫలితంగా వారు ఈ జన్మలోఇలాజన్మించవలసి వచ్చింది. అది కర్మఫలం అంటే దీనిని ఎవరు మార్చలేరు.
2.జ్ఞానం:-
*ఇక రెండవది అతడు ఎంత బుద్ధిమంతుడు జ్ఞానంతో ఉండాలి అనేది ముందుగానే లిఖించబడి ఉంటుంది. ఒక గురువు తన శిష్యులు అందరికీ ఒకే విధంగానే జ్ఞానాన్ని పంచుతాడు. వారిలో ఒకరుమంచిగాచదువుకొని పెద్ద ఉద్యోగ సంపాదిస్తే మరొకరుమాత్రంమందమతి గానే ఉంటూ చెడు సహవాసాలకు అలవాటు పడిఅందరిచేతచీదరించుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తిత్వం జ్ఞానం అనేది అతడు గత జన్మలోచేసిన కర్మలఆధారంగానేనిర్ణయించబడి ఉంటాయి.
3.వివాహం:-
*ఇక మూడవది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి. అనేది ఆవిధాతముందేనిర్ణయిస్తాడు.
*అతని తలరాత ఆధారంగానే ఎటువంటి జీవిత భాగస్వామి అతని జీవితంలోకిరావాలి.ముందుగానే ఫిక్స్చేసిఉంటుంది దీనినిఎవరుతప్పించలేరు
4.ఐశ్వర్యం:-
*నాలుగవది అతని వద్ద ఎంత ధనం ఉండాలి ఆ వ్యక్తి ధనవంతుడిగా ఉండాలా లేకపేదవాడిగా ఉండాలని అతడు పూర్వజన్మలో చేసిన కర్మలఆధారంగానేనిర్ణయించబడిఉంటుంది.
కొంతమందికి ఎంత కష్టపడినా ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాదు .కొంతమంది పుట్టుకతోనేఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఏ పని చేసినా బాగా కలిసి వస్తూ ఉంటుంది.ఇదంతా కర్మఫలం అనుసరించే జరుగుతూ ఉంటుంది.
5.సంతానం:-
*ఇక ఐదవది సంతానం ఒక వ్యక్తికి ఎంతమంది సంతానం కలగాలి. ఆ సంతానం ఎటువంటి వారై ఉండాలి. అనేది వాళ్లపాపపుణ్యాలనుబట్టి నిర్ణయింపబడిఉంటుంది.
6.మరణం:-
*ఇకఆరవదిమానవుడు మరణం అనేది ఎప్పుడూ ఎలాఏవిధంగాసంభవిస్తుంది అనే విషయం ముందుగానేనిర్ణయించబడి ఉంటుంది. అతడు రోగాలబారినపడిబాధపడుతూ మరణించాల లేక హాయిగా సహజ మరణం పొందాల.. లేక ప్రమాదం బారిన పడి మృతిఒడిలోకి చేరాలా అనేది ఆ వ్యక్తి గతజన్మలోచేసినకర్మలను బట్టినిర్ణయించబడిఉంటుంది.
స్వర్ణ రేఖలు (46)
చిరంజీవి కారు నడుపుతుండగా గురువుగారిని అడిగాడు.
చిరంజీవి:
“గురువుగారు… హితులు, సన్నిహితులు అంటే ఏమిటి? వివరించగలరా?”
గురువుగారు:
“నెమ్మదిగా కారు నడుపు బాబూ… ముందే చూడాలి.
ఇప్పుడు మన స్నేహితులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.”
కొద్దిసేపు ఆగి గురువుగారు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
గురువుగారు:
“మన ఒక మంచి స్నేహితుడు ఇరవై సంవత్సరాల క్రితమే పోయాడు.
మరొకడు పదేళ్ల క్రితం.
ఇలా ఒక్కొక్కరు వెళ్లిపోయారు.”
చిరంజీవి:
“అది చాలా బాధగా ఉంటుంది గురువుగారు.”
గురువుగారు:
“అవును బాబూ.
ఒక్కొక్క స్నేహితుడు పోయినప్పుడు ఒక్కొక్క గాయం.
ఆ గాయాలన్నీ కలిసి వృద్ధాప్యంలో ఒక పెద్ద శూన్యతగా మారుతాయి.
డెబ్బై, డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అది సహజం.”
చిరంజీవి:
“పిల్లలు ఉంటారు కదా గురువుగారు?”
గురువుగారు:
“పిల్లలు బాగానే ఉంటారు. గౌరవం కూడా ఉంటుంది.
కానీ వాళ్ళకు వాళ్ళ పనులు, వ్యాపకాలు ఉంటాయి.
స్నేహితుడితో ఉండే ఆ సరదా క్షణాలు వేరే.”
చిరంజీవి:
“అది నిజమే గురువుగారు.”
గురువుగారు:
“ఉదయం కాఫీ తాగేటప్పుడు
‘ఏరా బాగున్నావా?’ అని అడిగే స్నేహితుడు ఉండాలి.
ఒక పని వచ్చినప్పుడు
‘ఇది ఎలా చేయాలి?’ అని నమ్మకంగా అడగగలిగే మిత్రుడు ఉండాలి.
మంచి డాక్టర్ ఎవరని చెప్పగలిగే స్నేహితుడు ఉండాలి.”
కొద్దిసేపు నిశ్శబ్దం.
గురువుగారు:
“ఒక స్నేహితుడు ఒకసారి అన్నాడు –
‘నా భార్య చనిపోయిన తర్వాత నేను మొదటిసారి నీ ముందే ఏడ్చాను.
నువ్వు నన్ను ఓదార్చలేక… నాతో పాటు ఏడ్చావు.’
ఆ రోజు నాకు తెలిసింది –
స్నేహం అంటే ఒంటరితనాన్ని జయించడం అని.”
చిరంజీవి:
“చాలా గొప్ప మాట గురువుగారు.”
గురువుగారు:
“మరో స్నేహితుడు ఇలా అన్నాడు –
‘నా సమస్య ఎవరికి చెప్పలేదు.
కానీ నువ్వు వస్తే చెప్పగలనని అనిపించింది.
చావు భయం కాదు… ఒంటరిగా చావడం భయంగా ఉంది’ అన్నాడు.”
చిరంజీవి:
“అలాంటి మిత్రుడు ఉంటేనే ధైర్యం.”
గురువుగారు:
“అవును బాబూ.
డాక్టర్ దగ్గరకు వెళ్తుంటే
‘నేను కూడా వస్తా’ అని చెప్పే మిత్రుడు ఉండాలి.
ఒంటరితనం అనిపిస్తే
‘రా… ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం’ అనేవాడు ఉండాలి.
‘ఏరా గుర్తొచ్చావు… ఎలా ఉన్నావు?’
అని అడిగే స్నేహితుడు ఉండాలి.”
చిరంజీవి:
“అది నిజమైన బంధం గురువుగారు.”
గురువుగారు:
“రాత్రి పదకొండు గంటలకు కూడా
‘నిద్ర పట్టడం లేదు రా… మాట్లాడాలి’ అని చెప్పగలిగే మిత్రుడు ఉంటే
అదే గొప్ప సంపద.
‘నేనున్నా రా… భయపడకు’ అనే మాటలో ఎంత ధైర్యం ఉందో తెలుసా?”
చిరంజీవి:
“అలాంటి స్నేహం వృద్ధాప్యంలో పెద్ద ఆధారం.”
గురువుగారు:
“అవును.
మన చివరి రోజుల్లో మనకు నిజమైన ఆసరా స్నేహమే.
కానీ చిన్న చిన్న మాటలతో,
ఇగోతో,
అనవసరమైన అహంతో
మంచి స్నేహాలను పాడుచేసుకుంటారు.”
చిరంజీవి:
“అది నిజంగా పెద్ద నష్టం.”
గురువుగారు:
“కొంతమందితో కలవకపోవచ్చు.
దానితో పెద్ద నష్టం లేదు.
కాని మంచి స్నేహితులను చిన్న కారణాలతో వదులుకుంటే
చివరికి ఎవరూ మిగలరు.”
చిరంజీవి:
“అది గుర్తుంచుకోవాలి గురువుగారు.”
గురువుగారు:
“అందుకే బాబూ…
మంచి స్నేహాన్ని చిన్న కారణాలతో పాడుచేసుకోకండి.
అది జీవితంలో అమూల్యమైన బంధం.”
స్వర్ణ రేఖలు.. (47)
చిరంజీవి కారు నడుపుతూనే అడిగాడు –
“గురువుగారు… వయసు అంటే ఏమిటి? వలపు అంటే ఏమిటి?
వాటిని ఆపలేమా?”
రామమూర్తి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.
చెప్తే తప్పు… చెప్పకపోతే ఒప్పుకాదు అనిపించింది.
ఆ తర్వాత నెమ్మదిగా పలికాడు.
“బాబూ… వయసు అనేది కాలం వేసే గీత.
వలపు అనేది మనసు వేసే పూలదారి.
కాలం ఆగదు… వలపు ఆరదు.”
చిరంజీవి నవ్వుతూ అడిగాడు –
“అంటే ప్రేమకు వయసు అడ్డుకాదా గురువుగారు?”
గురువుగారు చిరునవ్వు నవ్వాడు.
“ప్రేమకు వయసు ఎక్కడుంది బాబూ!
మనసు కలిసిన చోటే అది పుడుతుంది.”
కొద్దిసేపటికి గురువుగారు సరదాగా అన్నాడు –
“సరదాగా వస్తావా… జ్ఞాపకాలు ఇస్తాను.
సరసంగా ఉంటావా… అనుభవాలు చెబుతాను.
మనసు తెరుస్తావా… ప్రేమ రహస్యాలు నేర్పుతాను.”
చిరంజీవి ఆసక్తిగా అడిగాడు –
“అది ఎలా గురువుగారు?”
గురువుగారు కిటికీ బయటకి చూస్తూ చెప్పాడు –
“మూడు ముళ్లు పడిన రాత్రి నుంచి
ఇద్దరి జీవితాలు ఒక్క దారిలో నడుస్తాయి.
దూరాలు దగ్గరవుతాయి.
మనసు తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి.
ఆమె నవ్వు ఉదయరాగంలా ఉంటుంది.
ఆమె చూపు వసంతగాలిలా తాకుతుంది.
మాటలు మెల్లగా సంగీతమవుతాయి.
ఆప్యాయత పెరిగితే
కౌగిలి ఒక భరోసా అవుతుంది.
ముద్దు ఒక మౌన భాష అవుతుంది.
రాత్రి పగలుతో కలిసినట్టుగా
ఇద్దరి జీవితం ఒక్కటవుతుంది.
చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది.
ఆశలు దుప్పటిలా చుట్టుకొని
ఇద్దరూ ఒకరికి ఒకరు ఆసరా అవుతారు.
కోరికలు యజ్ఞాగ్నిలా వెలుగుతాయి.
ఆమె జుట్టు పరిమళం గాలిలా తాకుతుంది.
ఆమె అడుగులు సంగీతంలా వినిపిస్తాయి.
ఆమె కౌగిలిలో మనసు విశ్రాంతి పొందుతుంది.
అప్పుడు ప్రేమ
ఒక పాఠశాల అవుతుంది.
ఆమె ఒడిలోనే
జీవిత రహస్యాలు నేర్చుకుంటాడు మనిషి.”
చిరంజీవి నిశ్శబ్దంగా విన్నాడు.
చివరగా గురువుగారు అన్నాడు –
“బాబూ…
వయసు శరీరానికి వస్తుంది.
వలపు మాత్రం మనసులో పుడుతుంది.
శరీరం వృద్ధమవుతుంది…
ప్రేమ మాత్రం ఎప్పుడూ యౌవనమే.”
బాబు కారు ఆపు.. ఆపు. అన్నాడు రామ్మూర్తి..
ఏమన్నా చుట్ట, సిగరెట్టు త్రాగాల, నీవు తాగుతావా ఏంటి?
ఏదో కొ ద్దిగా అలవాటైనది దమ్ము పీల్చక పోతే...
ఆ పొతే ఆరోగ్యం బాగుపడుతుందా చెడి పోతుందా
నా కర్ధం కాలేదు చెప్పు అన్నాడు రామ్మూర్తి తో
పోనీ ఈరోజు ఈదినం దుమపానరహిత రోజు తెలుసా..తాతగారికి దగ్గు ఆపండి చుట్ట ఆపండి అంటూ కారు అపాడు చిరంజీవి
సశేషం
స్వర్ణ రేఖలు… (48)
“బాబు… కారు ఆపు… కాస్త ఆపు,” అన్నాడు రామమూర్తి.
చిరంజీవి కారు పక్కకు ఆపాడు.
చిరంజీవి:
“ఏమైంది గురువుగారు?”
రామమూర్తి చిరునవ్వు నవ్వాడు.
“ఏమీలేదు బాబూ… ఒక చిన్న అలవాటు.
కాస్త దమ్ము పీల్చాలి అనిపిస్తోంది.”
చిరంజీవి ఆశ్చర్యంగా చూశాడు.
చిరంజీవి:
“అంటే… మీరు కూడా సిగరెట్ తాగుతారా గురువుగారు?”
రామమూర్తి:
“అలవాటు అంటే అలవాటే బాబూ.
కొద్దిగా దమ్ము పీల్చకపోతే ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది.
కానీ ఒక సందేహం మాత్రం ఉంది.”
చిరంజీవి:
“ఏమిటది గురువుగారు?”
రామమూర్తి:
“ఇది తాగితే ఆరోగ్యం బాగుపడుతుందా?
లేదా చెడిపోతుందా?
నాకు కూడా స్పష్టంగా తెలియదు.
కానీ వినేది మాత్రం చెడిపోతుందనే.”
చిరంజీవి నవ్వుతూ అన్నాడు.
చిరంజీవి:
“గురువుగారు… ఈ రోజు ఏ రోజు తెలుసా?”
రామమూర్తి:
“ఏ రోజు బాబూ?”
చిరంజీవి:
“ఈ రోజు ధూమపాన రహిత దినం అని ప్రచారం చేస్తున్నారు.”
రామమూర్తి కాసేపు ఆలోచించాడు.
రామమూర్తి:
“అలానా! అయితే ఒక ప్రశ్న బాబూ…
ఈ ధూమపానం ఎక్కడి నుంచి వచ్చింది?
ఎప్పటి నుంచి మొదలైంది?
మనుషులకు ఈ అలవాటు ఎవరు నేర్పారు?”
చిరంజీవి కొద్దిగా వివరించడం ప్రారంభించాడు.
చిరంజీవి:
“గురువుగారు… పొగాకు మొక్కలు మొదటగా
అమెరికా ఖండంలోని స్థానిక ప్రజలు ఉపయోగించేవారు.
అక్కడి గిరిజనులు పొగను ఒక ఆచారంగా,
కొన్ని వైద్య విధానాల్లో కూడా వాడేవారు.
తర్వాత పదహారో శతాబ్దంలో
యూరప్ దేశాలకు ఇది చేరింది.
అక్కడి నుంచి వ్యాపారంతో ప్రపంచమంతా పాకింది.
మన దేశానికి కూడా అదే కాలంలో వచ్చింది.
మొదట రాజసభల్లో, తర్వాత సామాన్యుల్లో అలవాటైంది.
కాలక్రమంలో సిగరెట్, బీడి వంటి రూపాల్లో విస్తరించింది.”
రామమూర్తి తల ఊపాడు.
రామమూర్తి:
“అంటే ఒకప్పుడు ఆచారం…
తర్వాత అలవాటు…
ఇప్పుడు వ్యసనం అయిందన్నమాట.”
చిరంజీవి:
“అదే గురువుగారు.
ఇప్పుడైతే వైద్యులు చెబుతున్నారు –
ధూమపానం శరీరానికి హానికరం అని.”
రామమూర్తి చేతిలో ఉన్న సిగరెట్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
రామమూర్తి:
“బాబూ…
మనిషి కొన్నిసార్లు
తెలుసుకున్నా అలవాటు వదలలేడు.
కానీ తెలిసిన తర్వాత వదిలితే
అదే నిజమైన విజయం.”
అని చెప్పి సిగరెట్ను మెల్లగా పక్కన పెట్టాడు.
రామమూర్తి:
“పోనీలే బాబూ…
ఇవాళ ధూమపాన రహిత దినమని చెప్పావుగా.11/3
ఈరోజైనా దీనికి సెలవు ఇచ్చేద్దాం.”
చిరంజీవి చిరునవ్వుతో కారు స్టార్ట్ చేశాడు.
కారు ముందుకు సాగింది…
మాటల్లో మరో స్వర్ణ రేఖ మెరిసింది. ✍️
.f. M..గీతం
దేవుడే దిక్కు! – ధూమపాన రహిత గీతం
పల్లవి :
పొగ పీల్చుట హానికరం – జీవనానికి ముప్పురా
సిగరెట్ బీడి దూరమైతే – సిరి సుఖాలు నిల్చురా
ఆరోగ్యమే ఆభరణం – ఆలోచించు మనసారా
విడువరా ఈ చెడు అలవాటు – వెలుగొందు బ్రతుకారా!
చరణం 1 :
సరదాగా మొదలైనది – అలవాటై పెరుగునురా
మెల్లగా మన జీవితం – మంటల్లో దహించునురా
వదలుటకు కష్టమైనా – ధైర్యంతో విడువరా
చావు దరి చేరకముందే – చైతన్యంతో మేల్కొరా!
చరణం 2 :
ఊపిరితిత్తులు క్షీణించి – ఊపిరే కష్టమవునురా
లోపల దాగిన రోగాలు – ఒక్కొక్కటి బయలుదేరునురా
వైద్యులు చెప్పు మాటలు – వినరా ఓ మనుష్యులారా
ఆరోగ్యమే జీవనసారం – ఆలోచించు సోదరులారా!
చరణం 3 :
ఎన్నో హెచ్చరికలైన – చెవిలో పడనివారికీ
చెడలవాటు విడువనివారికీ – దేవుడే దిక్కురా
నేడు నుంచే ప్రమాణం – పొగచుట్టు దూరమురా
నూరేళ్లు బ్రతకాలని – నిశ్చయమే మార్గమురా!
*****
స్వర్ణ రేఖలు.. (49)
“గురువుగారు! గద్ద (గ్రద్ద) గురించి ఐదు సూత్రాలు మనుషులకు కూడా వర్తిస్తాయని విన్నాను. వాటి అర్థం చెప్పగలరా?” అని వినయంగా అడిగాడు చిరంజీవి.
గురువుగారు చిరునవ్వుతో చెప్పారు: “అవును బాబూ! ప్రకృతిలోని ప్రతి జీవి మనకు ఏదో ఒక పాఠం చెబుతుంది. గద్ద జీవితం మనుషులకు ఐదు మంచి సూత్రాలు నేర్పుతుంది” అని వివరించడం ప్రారంభించారు.
మొదటిది – దూరదృష్టి.
గద్ద ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ దూరంగా ఉన్న ఆహారాన్ని కూడా గమనిస్తుంది. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ చూసే శక్తి దానికి ఉంటుంది. అలాగే మనిషి కూడా చిన్న విషయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి.
రెండవది – ఒంటరిగా నిలబడే శక్తి.
గద్దలు ఎక్కువగా ఒంటరిగా ఎగురుతాయి. అవి గుంపులపై ఆధారపడవు. సరైన సమయం కోసం ఓపికగా వేచి చూసి ఒక్కసారిగా దూకి వేటను పట్టుకుంటాయి. అలాగే జీవితంలో లేదా వ్యాపారంలో మనిషి తన శక్తిపై నమ్మకం ఉంచుకుని సరైన అవకాశాన్ని గుర్తించాలి.
మూడవది – సవాళ్లను స్వీకరించడం.
తుఫాను వచ్చినప్పుడు చాలా పక్షులు దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం భయపడదు. ఆ గాలిని ఉపయోగించుకుని ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. ఇదే మనకు పాఠం — సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని అవకాశంగా మార్చుకోవాలి.
నాలుగవది – ప్రతికూలతను సహనంతో ఎదుర్కోవడం.
వయసు పెరిగే కొద్దీ గద్ద పాత ఈకలు రాలిపోతాయి. కొత్తవి రావడానికి కొంతకాలం బాధ పడుతుంది. అయినా ఓపికగా ఎదురు చూస్తుంది. అలాగే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సహనంతో ఎదుర్కొంటే కొత్త అవకాశాలు వస్తాయి.
ఐదవది – నాణ్యతను ఎంచుకోవడం.
గద్ద చనిపోయిన జంతువులను తినదు. అది బలమైన వేటగాడు. తనకు తగిన మంచి వేటనే ఎంచుకుంటుంది. అలాగే మనిషి కూడా చిన్న చిన్న లాభాల కోసం కాకుండా మంచి లక్ష్యాలు, మంచి మార్గాలు ఎంచుకోవాలి.
చివరగా గురువుగారు చెప్పారు:
“బాబూ! గద్ద మనకు నేర్పేది ఇదే — దూరదృష్టి కలిగి ఉండాలి, ఒంటరిగా నిలబడగల ధైర్యం ఉండాలి, సవాళ్లను స్వీకరించాలి, కష్టాలను ఓపికగా భరించాలి, మంచి లక్ష్యాలను ఎంచుకోవాలి. ఈ ఐదు గుణాలు ఉంటే మనిషి జీవితంలోనూ, వ్యాపారంలోనూ గొప్పగా ఎదుగుతాడు.”
గురువుగారి మాటలు విని చిరంజీవి ఆనందంగా తల ఊపాడు. కారు నడుపు తున్నాడు
.
“
స్వర్ణ రేఖలు (50)
రామ్మూర్తిగారు అష్టపది గూర్చి తెలపగలరు
ఇది ఒక కవిత్వం వినసొంపుగా అర్ధసత్యంగా ఉంటుంది
నాకు గుర్తున్నా పక్తులు తెలిపేదా
అటులనే అన్నాడు చిరoజీవి...
తెలిపేదా...
పంచుకో బాధను, పెంచుకో బoధము, తుంచుకో దుష్టజన సాంగత్యాన్ని వెంటనే.
బలిమి లేకున్నా, తెలివి లేకున్నా, కలిమి లేకున్నా, చెలిమి వెంటనే
పోషకాహారాన్ని భుజిస్తూ, దోషరహితంగా జీవిస్తూ,
ద్వేషయసూయ తొలగిస్తూ, మార్పు జీవిగా వెంటనే
ప్రాంతం యేదైనా, పంతం యేదైనా, శాంతం యేదైనా, సొంతం గమ్యం వెంటనే
డబ్బు పోయినా, గబ్బు మిగిల్చినా, జబ్బు లొచ్చినా, గబ్బిలంలా మారకు వెంటనే
ఇక్కడ నేనున్నా, అక్కడ నీవున్నా, ఇక్కట్లు వెంటున్నా మక్కువ మార్చకు వెంటనే
సూర్యశక్తి గమనించు, సౌర్యయుక్తి శోధించు,
ఆర్యసూక్తి బేధించు, కార్యనారి అనుకరించు వెంటనే
జోరుగా పరుగులు, తీరుగా ఆటలు, ధీరత మెరుపులు, భారత భాగ్యత వెంటనే
లేదు అనేముందు, కాదు అనేముందు,
రాదు అనే ముందు జన్మసార్ధక్య మిదేనని వెంటనే
అద్భుతంగా జెప్పారు నేను జెప్పనా
జెప్పు చిరంజీవి
కాటువేసే కాలనాగులు, మాటువేసే గుంటనక్కలు, పోటువేసే తెలివిదున్నలు, ఆటుపోటుగా కుక్కలు వెంటనే
సీస పద్యం
ఏ భాష పలికేది యే తీరు తెలిపేది
ఏ బావ మొలిచేది యేది యేది
ఏ సౌఖ్య ఫలమేది యే వాక్య గతి యేది
ఏ కావ్య పదమేది యేది యేది
ఏ నవ్వు విధమేది యే పువ్వు కళ యేది
ఏ రవ్వ వెలుగేది యేది యేది
ఏ దేహ తపమేది యే దాహ విలువేది
ఏ మోహ నిజమేది యేది యేది
తే. గీ.
ఏది మనసు కవిత గాన మేది మేది
ఏది వయసు యేమగుతీరు యేది యేది
ఏది జయము యేదపజయ యేది యేది
ఏది నిత్య సత్య పలుకు యేది యేది
చెప్పట్లతో అభినందనలు
ఏది.. ఏది. ఏది అద్భుతం
***
స్వర్ణ రేఖలు.. (51)
గురువుగారు యుద్ధంఒకవైపు జనకుల ఘోష మరోవైపు
ఇది స్వార్ధ పోరాటమా, అవకాశ ఉబలటమా, మూర్ఖంగా యుద్దమా జనాన్ని పట్టించు కోని వైనమా....
ద్వేషం ఉన్న చోట దయ్యాలు సంచరిస్తాయి; దయా ప్రేమలు ఉన్న చోట దేవుడు నివసిస్తాడు. మనిషి హృదయంలోని మమత మంచిని పెంచినప్పుడు జీవితం శాంతిమయంగా మారి అన్ని చింతలు క్రమంగా తొలగిపోతాయి; ఎందుకంటే ప్రేమ, కరుణలు దైవత్వాన్ని ఆహ్వానిస్తాయి, ద్వేషం మాత్రం అంధకారాన్నీ అశాంతినీ తీసుకొస్తుంది.
మనము ప్రేమతో పెంచిన పిల్లలు మనల్ని వదిలి విదేశ దేశాలకు వలస వెళ్తున్నారు; అదే సమయంలో మన వృద్ధ తల్లిదండ్రులు తమ చివరి దశను వృద్ధాశ్రమాలలో గడపవలసిన పరిస్థితికి చేరుతున్నారు. ఇది ఆధునిక జీవితంలోని ఒక బాధాకరమైన విరోధాభాసాన్ని వెల్లడిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచుటకు జీవితమంతా త్యాగాలు చేసినప్పటికీ, కాలక్రమేణా కుటుంబ బంధాలు క్రమంగా సడలిపోతూ తరతరాల మధ్య భావోద్వేగ దూరాన్ని సృష్టిస్తున్న ఒక విషాద చక్రాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
కాని ఇప్పుడు వలసి పోతున్నారు ప్రతుకు తెరువుకోసం కాదా...
నేటి యుద్ధ పరిణామం.. ఆవేదన.. అలాపన..
*
కన్నీళ్లు నీకేల కష్టమ్ము తల్లీ
మున్నీరు మాయేను ముఖ్యమ్ము తల్లీ
యే న్నీరు యేమిధ్య యేదిక్కు తల్లీ
కన్నీరు కళ్ళేను కాలంబు తల్లీ
చిన్నారి కోల్పోయె జీవమ్ము తల్లీ
ఉన్నాది వీడేను ఉవ్వేట్టు తల్లీ
అన్నాది ఆశ్రంబు లేకేను తల్లీ
ఎన్నాళ్ళు యీఖర్మ యేమాయ తల్లీ
ఆకాశమందుండి యస్త్రాలు నీపై
అకారమేదందు యాదండు నీపై
ప్రాకార మేమందు ప్రాణంబు నీపై
స్వీకార మేయుద్ధ శీఘ్రoబు నీపై
లోకమ్ములో యుద్ధ రోగమ్ము తల్లీ
ఏకమ్ము లో యుద్ధ యోగమ్ము తల్లీ
చిక్కాము యీయుద్ధ చిత్తమ్ము తల్లీ
కక్కాము యీయుద్ధ కర్మయ్యె తల్లీ
నీయన్న నీభర్త నేఁడిందు లేరే
నీకన్న నీవన్న నీమున్న లేరే
ఈయుద్ధ మామృత్యు నృత్యమ్ము తల్లీ
యీయుద్ధ ప్రేమమ్ము నీడల్లె తల్లీ
స్త్రీగా జనించంగ దేవుండు రాఁడో
క్రీఁగంటిలో వాని క్లేశమ్ము తల్లీ
ప్రేమమ్ మనోనేత్ర పీయూష తల్లీ
జ్ఞానం మహా మాయ జ్ఞప్తేది తల్లీ
రోజాలలో ముండ్లు రోజంత గ్రుచ్చన్
కాజాలలో తీపి కాలంబు గ్రుచ్చున్
కూజాలలో నీరు కూలంగ గ్రుచ్చున్
పిజాలలో ప్రేమ పీకల్లె గ్రుచ్చున్
రాజిల్లు డెందమ్ము రక్తమ్ము తల్లీ
భాజిల్లు భాగ్యమ్ము బంధమ్ము తల్లీ
రోజిల్లు లోగిల్లు రోగమ్ము తల్లీ
రాజిల్లు ఖర్మేమి రాబందు తల్లీ
నీయేడ్పులో నవ్వు నిర్మోహనమ్మే
మోయంగ నీకౌనె మోదమ్ము తల్లీ
మాయేడ్పు లోనువ్వు మర్మోహనమ్మే
ధ్యేయంబు లేదేమి దేహమ్ము తల్లీ
*
విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ
స్వర్ణ రేఖలు.. (52)
కారును ఎవరో అపారు ఎందుకో తెలియదు కొందరు మీరెవరో మాకుతెలియదు మాతృభాష లో విద్య బోధించాలి పరభాష మనకొద్దు అంటూ కొందరు నినాదం జెస్తున్నారు.
గురువుగారు మీరు మా ఆహ్వానం మన్నించి మీ అభిప్రాయాలు తెలపండి మా సభ్యులకు కోరారు
చిరంజీవి ఒక్క నిముషం మాట్లాడి వెల్దామా...
మన మాతృభాష మన జీవితాన్ని దారితీస్తూ, మన వ్యక్తిత్వాన్ని మరియు సంస్కృతిని పోషిస్తుంది. అది పిల్లల హృదయాలలో ప్రేమ, మమకారాల మాధుర్యాన్ని నింపుతుంది. అందువల్ల ప్రతి మనిషి తన మాతృభాషను మాట్లాడటం, గౌరవించడం, పరిరక్షించడం అనే దృఢ సంకల్పం చేయాలి; తద్వారా దాని ఉష్ణత, వారసత్వం రాబోయే తరాలకు సజీవంగా కొనసాగుతుంది.
మనిషి నడత తరచుగా మారుతూ ఉంటుంది; ఎందుకంటే మనసు స్వభావతః స్థిరంగా ఉండక, సులభంగా ప్రభావితమయ్యేది. మనసు జ్ఞానం, మంచి ఉపదేశం, ధర్మమార్గం వంటి సత్సూచనలను వినకుండా తిరస్కరించినప్పుడు, అది మనిషిని కీడు మరియు దుర్భాగ్యాల వైపుకు నడిపిస్తుంది. అందువల్ల, నిజమైన మానవ మహత్తు తన మనసును జయించి నియంత్రించగలగడంలోనే ఉంటుంది. తన మనసును నియమశీలంగా, సద్మార్గంలో ఉంచగల వ్యక్తి నిజంగా గొప్పవాడు, గౌరవనీయుడు, మహనీయుడు అవుతాడు.
పద్యం :
కాలాభవామృత కామ్యం కదంబ గుణవా దీప వాకిలిగనే
స్థూలావిశాలత సూత్రం కు చోన్నత ఫలంబున్ సమంబు విపునే
కోలాహలక్షమత మూల్యం మరాల విరజాజుల్ సుఖాల గణనే
బాలావిధానతగ బాల్యం సహాయ సమపోషన్ విశాల ఫలకే
భావం :
కాలగమనంలో మనిషి జీవితం అనేక గుణాల సమాహారంగా వికసిస్తుంది. మంచి గుణాలు మన జీవనద్వారానికి దీపంలా మారి దారి చూపిస్తాయి. విశాల దృష్టి, స్థిరమైన ఆలోచనలు మనిషికి ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి. ప్రపంచంలోని కోలాహలాన్ని సహనంతో ఎదుర్కొనగలిగితే జీవితం సుఖమయమవుతుంది. బాల్యంలో పొందిన మంచి విధానం, సంస్కారం మరియు సహకారం భవిష్యత్తు జీవితానికి బలమైన పునాది అవుతుంది.
అంటూ ముగించాడు..
చిరంజీవి మాట్లాడుతూ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యో నమః 🙏
సలహా – నమ్మకం – స్నేహం – బంధం అనే విలువలు
పద్యం :
మాటగ పవిత్ర నమ్మకం మానసంబు
చెలిమి గ పటిష్టం కళ చిత్త మార్గ
బంధ మన్నది శాశ్వతం బలుపు కాదు
జీవి అనుభవాచరణమే జేతు జయము
భావం :
మనిషి మాట పవిత్రంగా ఉండాలి; అది నమ్మకాన్ని కలిగించాలి. అలాంటి నమ్మకం ఉన్నప్పుడు స్నేహం బలపడుతుంది మరియు మనసుకు సరైన మార్గాన్ని చూపుతుంది. బంధం అనేది కేవలం మాటల బలం వల్ల కాదు; అది నిజమైన అనుభవం, ఆచరణతోనే శాశ్వతంగా నిలుస్తుంది. అటువంటి జీవనాచరణే నిజమైన విజయాన్ని అందిస్తుంది.
అది కేవలం మాతృభాష వలనే జరుగుతుంది మనం మనం ఏకమై మాతృభాష లో చదువుదాం, వ్రాద్దాం, మాట్లాడుదాం
సర్వేజనాసుఖినోభవంతు అంటూ ముగించాడు
స్వర్ణ రేఖలు.(.53..54,)
విలువైన సలహాలు (విదేశీ జానపద హాస్య కథ) గురించి తెలియపరుస్తా విను అను రామ్మూర్తి గారు 😁నెమ్మదిగా తెలిపారు కారు నడుపు తున్నప్పుడు
ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. ఉండడానికి ఒక చిన్న ఇల్లు గానీ, పండించుకోడానికి కొంచెం పొలం గానీ లేదు. పొద్దున లేచినప్పటి నుంచీ రాత్రి పండుకునేదాకా ఎంత పనిచేసినా కమ్మగా కడుపునిండా తినిన రోజూ లేదు. కంటినిండా కలలుగంటూ నిద్రపోయిన రాత్రీ లేదు. పెళ్లయితే తలరాత మారుతుంది అనుకున్నాడు కానీ ఇద్దరూ కలసి ఒళ్ళొంచి ఎంత కష్టపడినా ఏ మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది పరిస్థితి. దానికితోడు ఒక కొడుకు కూడా భూమి మీదికి వచ్చినాడు. చూస్తుండగానే పిల్లోనికి పదేళ్ల వయసొచ్చింది.
"కట్టుకున్న పెళ్ళానికి, కడుపున పుట్టిన కొడుకుకి కడుపునిండా తిండి కూడా పెట్టలేని బతుకూ ఒక బతుకేనా..." అనుకుంటూ ఒక రోజు పెళ్ళాంతో "నేను ఇక్కడే ఇలాగే ఉంటే మన బతుకు ఒక ఇంచు కూడా ముందుకు పోదు. ధైర్యం చేసి ముళ్ళదారిలో ముందడుగు వేస్తేనే బతుకుదారి బాగుపడేది. నువ్వు సంపాదించే దానితో పిల్లోన్ని చూసుకో. నేను ఏదైనా నగరానికి పోయి హాయిగా బతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొని వస్తా" అంటూ వంద జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.
నాలుగు వారాలు నడిచీ నడిచీ చివరికి ఒక నగరానికి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఎక్కడ చూసినా అందరూ తనలాంటి పేదవాళ్లే పనుల కోసం వెతుకుతా కనపడ్డారు. వారం రోజులు వీధుల్లో పడుకుంటా, చెరువుల్లో స్నానం చేస్తా పనుల కోసం వెతికాడు. ఏ ఇంటి తలుపు కొట్టినా పొమ్మనేటోళ్లే తప్ప రమ్మనేటోళ్లు కనపడలేదు.
చివరికి ఒక పెద్ద మనిషి కనబడ్డాడు. అతను బాగా చదువుకున్నవాడు. తెలివైనవాడు. నగరంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సలహాలు ఇచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. అతని దగ్గరికి పోయి "అయ్యా తినడానికి తెచ్చుకున్న డబ్బులు అన్నీ నిన్నటికే అయిపోయాయి. పొద్దున్నుంచీ ఉత్త నీళ్లు తప్ప కడుపుకింత తిండి లేదు. ఏదైనా పని ఉంటే చెప్పండి. ఇంటి ముందు కుక్కలా నమ్మకంగా ఉంటా... ఒంటికి కవచంలా కాపాడుతూ ఉంటా..." అన్నాడు.
ఆ పెద్దమనిషి "నీ మాటల్లోనే నీ మంచితనం, నిజాయితీ అర్థం అవుతా వున్నాయి. ఉండడానికి గది ఇస్తా. తినడానికి తిండి పెడతా. జీతం మాత్రం నువ్వు తిరిగి ఎప్పుడు వెళతావో అప్పుడు ఒకేసారి ఇస్తా. ఆశకు పోకుండా ఎంత ఇస్తే అంత తీసుకో" అన్నాడు. ఆ మాత్రం ఆసరా దొరకడం కూడా అదృష్టమే అనుకుంటూ మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు.
నెమ్మదిగా కాలం దొర్లుతావుంది. చూస్తుండగానే పది సంవత్సరాలు పూర్తయిపోయాయి. పెళ్ళాం పిల్లలు పదే పదే కళ్ళముందు మెదులుతా ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు కారుతా ఉన్నాయి. గుండె బరువెక్కుతా ఉంది. ఇక లాభం లేదనుకొని యజమాని దగ్గరికి పోయి "అయ్యా... అడుగుపెట్టి పదేళ్లు అవుతావుంది. కళ్ళు మూసినా తెరిచినా ఇళ్ళూ ఇల్లాలే కనపడతా ఉన్నాయి. ఇక ఇక్కడ కాలు నిలవడం కష్టం. మీరు అనుమతించి నా జీతం గనుక ఇస్తే ఇంటికి పోతా" అన్నాడు.
దానికి యజమాని "ఈ లోకంలో ఎవరు ఎంత కష్టపడినా పెళ్ళాం బిడ్డల పెదాలపై చిరునవ్వు చూడడానికే కదా... నమ్మకంగా నా మనసు తెలుసుకొని పనిచేశావు. నీలాంటివాడు మరలా దొరకడు. నువ్వు వెళతానంటే బాధగానే వుంది" అంటూ భుజంతట్టి వాని చేతిలో జీతం కింద మూడు బంగారు నాణాలు పెట్టాడు.
ఆ పేదరైతు సంబరంగా ఆ నాణాలను కళ్ళకు అద్దుకొని పోతావుంటే ఆ పెద్దమనిషి "చూడు... నీవు గనక నాకు ఒక బంగారు నాణెం తిరిగి ఇస్తే నీకు జీవితంలో ఉపయోగపడే ఒక మంచి సలహా ఇస్తా. లేదంటే నీ ఇష్టం. ఇంత తక్కువ ధరకు నేనింతవరకూ ఎవరికీ ఏ సలహాను ఇవ్వలేదు" అన్నాడు.
రైతు ఆలోచనలో పడ్డాడు. "తన యజమాని ఎంత తెలివైనవాడో అతనికి బాగా తెలుసు. ఎక్కడెక్కడి దేశాలవాళ్ళు అతని కోసం వచ్చి అడిగినంత ధనమిచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటారు. మూడు నాణాలలో ఒక్కటి ఇద్దాం. ఇంకా రెండు ఉంటాయి కదా" అనుకుని అతని చేతిలో ఒక బంగారు నాణెం పెట్టాడు.
యజమాని చిరునవ్వు నవ్వి "బాగా గుర్తు పెట్టుకో. నీకు సంబంధం లేని విషయాలలో పొరపాటున కూడా జోక్యం చేసుకోవద్దు" అని చెప్పాడు.
రైతు వినయంగా అలాగేనంటూ తిరిగి పోతావుంటే ఆ పెద్దమనిషి "చూడు... ఇంకో బంగారు నాణెం ఇస్తే ఇంకో సలహా ఇస్తా" అన్నాడు. రైతు ఆలోచనలో పడ్డాడు. చేతిలో ఉన్నవి రెండే. కానీ అతను ఇచ్చే సలహాలు ఆ బంగారు నాణాల కంటే ఎంతో విలువైనవి. డబ్బు కోసం చూసుకుంటే బంగారం కన్నా విలువైన సలహా పోగొట్టుకోవచ్చు" అనుకొని రెండవ వరహా అతని చేతిలో పెట్టాడు.
ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "బాగా గుర్తు పెట్టుకో... నీకు తెలియని కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు" అని చెప్పాడు.
అలాగేనంటూ ఆ రైతు వెనక్కి తిరగగానే ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "చూడు... నాకు ఇంకో వరహా ఇస్తే ఇంకో సలహా చెప్తా" అన్నాడు. పేద రైతు ఆలోచనలో పడ్డాడు. "చేతిలో ఒకే ఒక్క వరహా ఉంది. ఇది ఉంటే ఏమి లేకుంటే ఏమి. సలహా మాత్రం వదులుకోకూడదు" అనుకుంటూ దానిని కూడా అతని చేతిలో పెట్టేశాడు.
ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "బాగా గుర్తుపెట్టుకో. తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి" అన్నాడు.
మూడు వరహాలకు మూడు సలహాలు అందుకొని ఆ రైతు ఇంటిదారి పట్టాడు. అలా ఒక వారం రోజులు నడిచాక ఒక అడవిలో ఒక వింత దృశ్యం కనపడింది. ఒక గంధర్వుడు ఒక చెట్టు మీద కూర్చుని ఆకులకు బంగారు నాణాలు అంటిస్తూ ఉన్నాడు. అది చూస్తూనే అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. 'అలా ఎందుకు అంటిస్తా ఉన్నాడో కనుక్కోవాలి' అనుకున్నాడు. అంతలో ఆ రైతుకు తన యజమాని చెప్పిన "నీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోకు" అనే సలహా గుర్తుకు వచ్చింది. దాంతో 'మనకెందుకులే అనవసరంగా' అనుకుంటూ అక్కడినుంచి ముందుకు నడిచాడు.
అలా నాలుగు అడుగులు వేశాడో లేదో ఆ గంధర్వుడు అతన్ని పిలిచి "మిత్రమా... నూరు సంవత్సరాలుగా ఈ చెట్టు ఆకులకు వరహాలు అంటిస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలలో ఎందుకిలా అంటిస్తా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోతావున్నది నీవు ఒక్కనివి మాత్రమే" అన్నాడు.
దానికి ఆ రైతు "అయ్యా... మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నాకు సంబంధం లేని విషయాలతో నాకెందుకు" అన్నాడు. అది విని గంధర్వుడు సంతోషంగా "అదీ మాటంటే. ప్రతి ఒక్కడూ పనున్నా లేకున్నా పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడమే తప్ప, తన పని తాను చేసుకోడు. మొదటిసారి ఇలాంటి కమ్మని మాట వినడం. నీకు బహుమతి ఖచ్చితంగా ఇవ్వవలసిందే" అంటూ ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని అటూ ఇటూ బలంగా ఊపాడు. అంతే గలగలగల బంగారు నాణాలు కొన్ని పైనుంచి కిందపడ్డాయి. "ఇవన్నీ నీకోసమే. తీసుకో" అన్నాడు గంధర్వుడు. రైతు సంబరంగా వాటిని ఒక సంచి నిండా నింపుకొని తనకు అంత మంచి సలహా ఇచ్చిన యజమానికి మనసులోనే దండం పెట్టుకుంటూ అక్కడినుంచి బైలుదేరాడు.
అలా ఒక వారం రోజులు ఆ అడవిలో నడుస్తూ పోతూవుంటే అతనికి ఒకచోట గాడిదల మీద సరుకులు వేసుకొని పోతూవున్న ఒక వ్యాపారి కనబడ్డాడు. అతన్ని చూసి ఆ రైతు "అయ్యా... నడిచీ నడిచీ కాళ్ళు పీకుతా ఉన్నాయి. ఒక గాడిద మీద నన్ను కూర్చొనిస్తే ఒక బంగారు వరహా యిస్తా" అన్నాడు. ఆ వ్యాపారస్తుడు సంబరంగా 'సరే' అన్నాడు.
వాళ్లు అలా కొంతదూరం పోయేసరికి ఒకచోట ఒక పూటకూళ్ల ఇల్లు కనపడింది. ఆ వ్యాపారస్తుడు "మిత్రమా... నాకు చాలా ఆకలిగా ఉంది. కడుపునిండా తిని కమ్మగా కాసేపు విశ్రాంతి తీసుకుందాం" అన్నాడు. అంతలో ఆ రైతుకు "కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు" అని తన యజమాని చెప్పిన రెండవ సలహా గుర్తుకు వచ్చింది. దాంతో "అయ్యా... మీరు వెళ్లి తిని రండి. నేను ఇక్కడే ఈ గాడిదలకు కాపలాగా ఉంటాను. నాకు ఆకలిగా లేదు" అన్నాడు.
దాంతో వ్యాపారస్తుడు సరేనని ఆ పెంకుటిల్లు లోపలికి పోయాడు. అలా పోయిన కాసేపటికి అక్కడ పెద్ద ఎత్తున భూమి కనిపించింది. దాంతో కళ్ళముందే ఆ పెంకుటిల్లు ధన ధన ధన కూలిపోయి పాపం లోపలున్న వాళ్లంతా అందులోనే సమాధి అయిపోయారు. దాన్ని చూడగానే రైతు భయంతో వణికిపోయాడు. యజమాని సలహా పట్టించుకోకుండా తాను కూడా లోపలికి పోయివుంటే ఇప్పటికల్లా ఏమైపోయేవాడినో కదా అనుకుంటూ తన యజమానికి మనసులోనే దండం పెట్టుకొని ఆ గాడిదలను తోలుకొని అక్కడినుండి బైలుదేరాడు.
అలా రెండు వారాలు ప్రయాణించి చివరికి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు కొట్టాడు. ఇల్లు వదిలి పది సంవత్సరాలు దాటింది. జుట్టు పెరిగి, గడ్డం పెరిగి, వయసు పెరిగి మొత్తం రూపం అంతా మారిపోయి ఉన్నాడు. అదిగాక అప్పటికే మసక మసక చీకటి పడతా ఉంది. దాంతో తలుపు తెరిచిన రైతుపెళ్ళాం తన మొగున్ని గుర్తుపట్టలేకపోయింది.
"ఎవరు మీరు. ఏం కావాలి" అంది.
అతను కూడా వెంటనే విషయం చెప్పకుండా సరదాగా పెళ్ళాన్ని ఆటపట్టించాలని "అమ్మా... చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈరోజు రాత్రికి ఇక్కడ ఎక్కడైనా ఉండవచ్చా. పొద్దున్నే వెళ్ళిపోతా" అన్నాడు. దాంతో ఆమె జాలిపడి "ఇంటి లోపలికి ఎవరినీ రానివ్వలేను. కాకపోతే బయట ఉన్న గుడిసెలో విశ్రాంతి తీసుకోవచ్చు" అంది.
రైతు చిరునవ్వుతో "పొద్దున్నే నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టి తాను చేసిన పనికి ఎంత సిగ్గుపడుతుందో ఏమో" అని నవ్వుకుంటూ 'అలాగేనమ్మా' అని గాడిదలను తీసుకొనిపోయి ఆ గుడిసెలో కట్టేసి విశ్రాంతి తీసుకోసాగాడు.
ఒక గంట గడిచేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో ఒక యువకుడు వచ్చి ఆ ఇంటి తలుపు కొట్టాడు. తలుపు తెరవగానే నవ్వుకుంటూ లోపలికి పోయి తలుపు మూసేశాడు. అది చూడగానే రైతు అదిరిపోయాడు. "అరెరే... నా పెళ్ళాం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోగానే చూసి చూసి ఇంక రానేమో అనుకొని వేరేవాన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. ఈ పెళ్ళాం బిడ్డల కోసమే కదా ఇన్ని రోజులూ ఇంత కష్టపడి సంపాదించింది. వీళ్ళు లేనప్పుడు ఇక బ్రతికి ఏం లాభం. వీళ్లను చంపి నేను చస్తా" అని కోపంతో ఊగిపోతూ కత్తి అందుకున్నాడు. అంతలో అతనికి "తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి" అని తన యజమాని చెప్పిన సలహా గుర్తుకు వచ్చింది.
దాంతో ఆ రాత్రంతా ఆలోచిస్తా ఉన్నాడు. కోపం కొంచెం కొంచెం తగ్గుతా ఉంది. అంతలో తొలికోడి కూసింది. ఇంట్లో దీపం వెలిగించిన వెలుతురు, పనులు చేస్తున్న చప్పుళ్ళు వినబడతావున్నాయి. కాసేపటికి తలుపు తెరుచుకుంది. రాత్రి తాను చూసిన యువకుడు బయటికి వచ్చాడు.
"అమ్మా... నేను పనికి పోయి వస్తా. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు అన్నీ తీసుకొని వస్తా" అన్నాడు. ఆమె లోపలినుంచి "అలాగే నాయనా... జాగ్రత్తగా వెళ్లి రా" అంది.
ఆ మాటలు వినేసరికి ఆ రైతు మొహంలో నెత్తురు చుక్క లేదు. "అయ్యో... నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టనట్లే, నేను నా కొడుకుని గుర్తుపట్టలేకపోయా. ఆవేశంతో తొందరపడి ఏదైనా చేసివుంటే జీవితాంతం బాధపడవలసి వచ్చేది. తొలికోపం ఎవరికైనా మంచిది కాదు" అనుకుంటూ వాళ్ల ముందుకు వచ్చి, తాను ఎవరో చెప్పి కొడుకుని మనసారా కౌగిలించుకున్నాడు.
ఆ తరువాత తన వద్ద ఉన్న బంగారు నాణాలతో వాళ్లు మంచి పొలం కొనుక్కొని, పెద్ద మిద్దె కట్టుకొని జీవితాంతం హాయిగా కలసిమెలసి జీవించారు.
****
శ్రీమహాభారతం లోని "ధర్మవ్యాధుని" కథ!!
విలువ : ధర్మము
అంతర్గత విలువ : సత్ప్రవర్తన
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
నీతి :
“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.🙏
" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "
విలువ : ధర్మము
అంతర్గత విలువ : సత్ప్రవర్తన
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
నీతి :
“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.🙏
" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "
*అనగనగా...*ప్రాంజలి*
పెళ్లయిన_తర్వాత తొలిసారిగా తన తల్లి ఇంటికి వచ్చిన కుమార్తె రిసెప్షన్ వారం రోజుల పాటు సాగింది.
కూతురికి నచ్చినదంతా వారం రోజులుగా చేసారు. అత్తగారి ఇంటికి తిరిగి వెళుతుండగా, తండ్రి ఆమెకు చాలా సువాసన గల అగరబత్తిని ఇచ్చి, “అమ్మా, మీ అత్తమామల ఇంట్లో పూజ చేసేటప్పుడు, ఈ ధూపం వేయాలి....” అన్నాడు.
అందుకు ఆమె తల్లి మెల్లిగా
“కూతురు మొదటిసారి అత్తమామల ఇంటికి వెళుతోంది ఈసమయంలో ఎవరైనా అమ్మాయికి అగరుబత్తీలు ఇస్తారా?” అంది.
అది విన్న ఆయన వెంటనే జేబులో చేయి వేసి జేబులో ఉన్న డబ్బు అంతా కూతురికి ఇచ్చాడు.
అత్తమామల ఇంటికి చేరుకోగానే అత్తగారు కోడలు బాగ్ అందుకొని “మీ పేరెంట్స్ నీకు ఏం ఇచ్చారు?” అని అడిగితే విశేషమేమీ కనిపించక అగరబత్తీల కట్ట వైపు చూసింది. కోపంతో అత్తగారు మొహం చాటేసి “రేపు పూజలో ఈ అగరబత్తిని పెట్టమని కోడలికి చెప్పింది...”
ఉదయాన్నే కూతురు పూజకు కూర్చునేసరికి అగరబత్తుల మూట విప్పగా అందులోంచి ఓ ఉత్తరం బయటపడింది.
అందులో ఇలా రాసి ఉంది...
“అమ్మా! ఈ అగరబత్తి ఆటోమేటిక్గా కాలిపోతుంది, కానీ ఇది ఇంటిని సువాసనగా మారుస్తుంది. అంతే కాదు, ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని తన సువాసనతో ఉల్లాసంగా చేస్తుంది...!!
కొన్నిసార్లు నువ్వు నీ భర్తపై కోపం తెచ్చుకునే అవకాశం ఉంది లేదా కొన్నిసార్లు మీ అత్తగారితో మరియు మామగారిపై కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు ఎవరి మాట వినవలసి ఉంటుంది తెలుసా??
నీ హృదయం ఆలోచన, ప్రవర్తన మారినట్లైతే నువ్వు ఆ బహుమతిని గుర్తుంచుకోవాలి -
అగరుబత్తీలను కావాలని కాల్చినా, పూజలో కాల్చినా, పడకగదిలో కాల్చినా అది సువాసననే ఇస్తుంది అలాగే నువ్వు స్వయంచాలకంగా తట్టుకుని, నీ ప్రవర్తన మరియు చర్యల ద్వారా అందరినీ సువాసన భరితంగా, ఉల్లాసంగా ఉంచాలి తప్ప గొడవలు పడకూడదు. “
అని తండ్రి చేతి వ్రాతతో ఉంది ఆ లెటర్ లో.
ఈ ఉత్తరం చదివిన కూతురు ఏడవడం మొదలుపెట్టింది, అత్తగారు పరుగున వచ్చారు, కోడలు ఏడుస్తున్న పూజగదికి భర్త, మామ కూడా చేరుకున్నారు.
"అరే, చెయ్యి పగిలిందా?” - అడిగాడు భర్త
"ఏం జరిగిందో చెప్”పు - అన్నాడు మామగారు.
చుట్టుపక్కల వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అత్తగారు తనిఖీ చేయడం ప్రారంభించారు.
తన తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఉత్తరాన్ని చూసి, ఆ ఉత్తరం చదవగానే, కోడలును కౌగిలించుకుని, ఆ ఉత్తరాన్ని మామగారికి ఇచ్చింది.
కళ్లద్దాలు పెట్టుకోకపోవడం వల్ల కొడుకుకు లెటర్ ఇచ్చి చదవమని...చెప్పాడు.
విషయం మొత్తం అర్థమయ్యేలోపే ఇల్లంతా ఉలిక్కిపడ్డట్టు అయ్యింది.
అత్తగారు బిగ్గరగా చెప్పారు, “ఈ ఉత్తరం ఫ్రేమ్ చేయబడాలి, ఇది నా కోడలు అందుకున్న అత్యంత విలువైన బహుమతి, ఇది పూజా మందిరం వైపు ఫ్రేమ్ చేయబడి ఉండాలి..” అని...
ఆపై ఎప్పుడూ ఆ ఫ్రేమ్ తన ముత్యాల్లాంటి రాసిన మాటలతో ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని దాని అర్థంతో పరిమళింపజేస్తూనే వుంది.
“మన కుమార్తెలు రెండు వంశాలను పరిమళింపజేయాలి, పుట్టినింటికి, అత్తగారింటికి పేరు తేవాలి .... అలా పేరు తెచ్చే స్త్రీ మూర్తులకు వందనం..
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🌟 *బ్రేకింగ్ న్యూస్:*
*పిల్లలు చివరకు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఉద్యోగాన్ని కనుగొన్నారు... తాతగా ఉండటం!*😁🌹🎉
*పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడిని దీనిపై వ్యాసం రాయమని అడిగారు:*
*“నా ఆకాంక్షలు”*
*అతను రాశాడు —*
*నేను రాష్ట్రపతిని కావాలని కోరుకోవడం లేదు,*
*నేను డాక్టర్ని కావాలని కోరుకోవడం లేదు,*
*నేను శాస్త్రవేత్తని కావాలని కోరుకోవడం లేదు,*
*ఇవేవీ కాదు!*
*నా భవిష్యత్ ఆశయం* *తాతగా మారడం!*
*ఎందుకంటే తాతగా ఉండటం నిజంగా గొప్ప విషయం! ❤️*
*ఎందుకంటే నా తాత —*
*🌞 ఉదయం ఆలస్యంగా మేల్కొనగలడు,*
*😴 మధ్యాహ్నం నిద్రపోగలడు,*
*📺 సాయంత్రం టీవీ చూడగలడు మరియు త్వరగా నిద్రపోగలడు.*
*📚 హోంవర్క్ లేదు,*
*🎒 వేసవి అసైన్మెంట్లు లేవు,*
*📘 ట్యూషన్ కూడా లేదు.*
*☘️ ఏమీ చేయలేకపోతే, అతను చెట్టు కింద కూర్చుని గాలిని ఆస్వాదించవచ్చు,*
*♟️ లేదా పార్కుకు వెళ్లి ఎవరితోనైనా చెస్ ఆడవచ్చు.*
*🎮 అతను కోరుకున్నంత కాలం వీడియో గేమ్లు ఆడగలడు - ఎవరూ ఫిర్యాదు చేయరు!*
*☕ ఉదయం కాఫీ,*
*🍵 మధ్యాహ్నం టీ,*
*🍷 రాత్రి వైన్ - రాజులా సంతోషంగా జీవించడం.*
*🚌 బస్సుల్లో ఉచిత ప్రయాణం,*
*💺 మరియు అదృష్టవంతులైతే, ఎవరైనా సీటు కూడా అందిస్తారు.*
*🚄 హై-స్పీడ్ రైళ్లు మరియు సినిమాలు - సగం ధరకే!*
*🍱 అతను తనకు నచ్చినది తినవచ్చు —*
*ఉల్లిపాయ పకోడీలు, రైస్ కేకులు, టెంపురా, సూప్, టోఫు, గ్రిల్డ్ సాసేజ్, ముల్లంగి కేక్ మరియు మరిన్ని వంటి వేడి ఆహారాలు.*
*టోఫు పుడ్డింగ్, షేవ్డ్ ఐస్, బొప్పాయి పాలు, ఐస్ క్రీం, జెల్లీ, పుడ్డింగ్, ముంగ్ బీన్ జెల్లీ, చీజ్ వంటి చల్లని విందులు —*
*మరియు ఎవరూ అతన్ని ఆపలేరు (అతను ఎక్కువగా తిననంత వరకు 😉).*
*🎨 అతను తనకు నచ్చినది చేయగలడు —*
*పాడవచ్చు, నృత్యం చేయవచ్చు, పెయింట్ చేయవచ్చు, పియానో లేదా ట్రంపెట్ వాయించవచ్చు, పర్వతారోహణ చేయవచ్చు లేదా ట్రెక్కింగ్ చేయవచ్చు!*
*💰 మరియు అతని జేబులో డబ్బు ఉంటే, అతను ప్రపంచాన్ని చుట్టి రాగలడు!*
*✨ తాతగా ఉండటం నిజంగా అద్భుతమైనది!*
*🌼 ప్రేరణ:*
*తాతలు తాము నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారో కూడా గ్రహించకపోవచ్చు! 😄*
*🌹👍 ఈ గుంపులోని అన్ని తాతలు మరియు అమ్మమ్మలకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 💖*
— *తాతగా ఉండటం అనేది అంతిమ కలల ఉద్యోగం*!”
😁😁 😁 😁 😁
*ఆచార్య సద్బోధన:*
➖➖➖
```
*మనుషులందరూ పసితనాన్ని ఇష్టపడటానికి కారణం కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన మనసులు, వారి లేత ముఖాల్లో ప్రతిఫలించే చిరునవ్వులు.
*ఇవే నవ్వులు జీవిత కాల అనుభవసారాన్ని గ్రహించి తలపండినవారి ముఖాల్లోనూ కని పిస్తాయి.
*ముఖాన చిరునవ్వును ధరించడానికి మనమేం శ్రమించనక్కర్లేదు. డబ్బు ఖర్చు చేయనక్కర్లేదు. విరిసీ విరియని పూరేకుల్లా పెదాలను కాస్త విప్పారిస్తే సరి.
*మన చిరునవ్వే బలమైన ఆయుధమై ప్రత్యర్థిని బలహీనుణ్ని చేస్తుంది.
*మనిషి జీవితంలో సుఖం దుఃఖం పడుగుపేకల్లాంటివి. ఏ ఒక్కటీ మనలను ఎల్లకాలం అంటి పెట్టుకుని ఉండదు.
*సమస్యల కారుమబ్బు వీడినా, కొంతమంది విషాద ఛాయలను మనసు నుంచి తొలగించుకోలేరు. కనిపించిన వారికల్లా తమ గోడు వినిపిస్తుంటారు. అనుక్షణం అదే ఆలోచనతో వర్తమానంలో దక్కిన ఆనందాన్ని అనుభూతించలేరు.
*మరికొంతమంది ఎంత తీవ్రమైన కష్టాల్లో ఉన్నా ముఖాన చిరునవ్వు చెదరనివ్వరు. వారి గురించి మనకు మరొకరు చెప్పినా, లేదా కొంతకాలానికి మనకై మనం గ్రహించినా వారి చిరునవ్వు వెనకాల గూడు కట్టుకుని ఉన్న బాధ ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ల ఆత్మ స్థైర్యం, గుండెబలం నివ్వెరపరుస్తాయి.
*శాంతికి పర్యాయపదంగా నిలిచేవి ధవళవర్ణ కపోతం(తెల్ల పావురం), బుద్ధుడి చిరునవ్వు.
*చిరునవ్వుతో కూడిన రాయబారి సంధి ప్రయత్నాలు ఎంతటి యుద్ధాలనైనా నివారించగలవు.
*రాఖీ కట్టిన చెల్లి, కట్టించుకున్న అన్న ముఖాల్లోని ఆనందం మహార్ణవం. చూడటానికి రెండు కళ్లు చాలవు.```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
Subscribe to:
Comments (Atom)
