Thursday, 25 May 2017
Wednesday, 24 May 2017
Tuesday, 23 May 2017
ప్రాంజలి ప్రభ .. శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి ..శ్రీ మద్భగవద్గీత (అనువాదం) సవశతి
...అర్జున విషాద యోగము. మొదటి అధ్యాయము
*దృతరాష్ట్రుని ప్రశ్న*
ఉ. ధర్మజు తోడఁ దమ్ములు సుధర్మముఁ దత్త్వమునేల నుండగన్
కర్మలనేమి యెంచగల కాలము తోడుగ సాగి పోవుటన్
ధర్మము నాదుపుత్రుల విధానము సర్వము బోధజేయగా
నోర్మిగఁ తెల్పుసంజయ వినూత్నపు యుత్సవ యుద్ధ నీతులన్ (01)
*సంజయ వ్యాఖ్యానము*
ఉ..అప్పుడు సంజయుండు, నుడి వాసల వెల్లువ గెల్పుకోసమున్
తప్పిదమెన్న లేనిగతి ధార్మిక పాండవ సేనయేనటన్
గొప్పగ నెంచగా గురుని గోప్యము యుద్ధమునందుఁ జూపగన్,
ఒప్పిన ధైర్యపాటవసుయోధను డంతట వేడెనిట్లనన్ (02)...
ఉ...హే, గురువా విధానముల హేతువు విద్దెలబుద్ధిశాలిగన్
బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతితో
సాగెడి సైన్య మెల్లరను సాధ్యపు చేతల నెంచ గల్గగన్
యోగపు వీరులై విజయ యోగ్యత నంతయు నీదు యుక్తులన్ (03)
ఉ. మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్,
అచ్చట చేకితానుడు సహాయదృపుండు సుధీర శ్రేష్ఠులున్
దెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ పోరు నందరున్
వచ్చిన వారినే ప్రహర వాక్కుల పర్వము క్షేత్రమందునన్ (04)
శా . ఆమాదాద్యసమానవీరులిట వీరావేశ భీమార్జునుల్
సామంతుల్ గణవీరులై సమరమున్ సంగ్రామ బీభత్సమున్
భూమీశాద్య మహా విపన్న కదనా వ్యూహామ్ము లన్ గెల్వగన్
ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్ (05)
ఉ. పాండు కుమారులున్ తమరి పాశమునేమది జూపనుండగన్
పాండవ మధ్యముండు మరి బాల ప్రవీరులు ధర్మ యుద్ధమున్
కండబలంబునన్ గలిగి గమ్యనిజంబగు ధైర్య వాక్కులన్
నిండుగ యుద్ధవీరులకు నిర్ణయ లక్ష్యము పోరుయేయగున్ (06 )
ఉ. ఎందరు భూసురుల్ కలసి వెల్గుల నెత్తగ జోరుగుండగన్,
అందరిలోను మిన్నగన నాద్యుగ నీవన విజ్ఞతేయగున్
సందడి యుద్ధకారణమె సంజయ! యీవిధిఁ జేరగా నగున్
గందర గోళమున్ బడితి గావఁగ నాయకు లౌను సైన్యమున్ (07 )
ఉ. కేరున, భీష్మ, కర్ణ, శృత కీర్తి శతానుడు కుంతి భోజడున్
వీర వికర్ణ విశ్వస వివేకులు మీరును మాన్యు లేయగున్
భూరి శ్రవుండు నీదుసుత భూసుర శ్రేష్ఠులు వీరతేజమున్
వీరులు యేకమై సమయ విద్దెలు గాకురు క్షేత్రయుద్ధమున్ (08)
ఉ. ఇంకను పెక్కుమంది బల హేతుక విద్యల యుద్ధ కౌశ మున్
జంకక నన్నుఁ గోరి తమ జాడలుఁ దెల్పియు దేహమొడ్డియున్
వంకలు లేని యుద్ధకళ వాలుగ సిద్ధముఁ దీరి యుండగన్
సంకట మేమిలేకనటు సాయముఁ జేయగ శూర సైనికుల్ (09)
చం. అపరి మితమ్ము సేన తతి యాశయ లక్ష్యముగాను కౌరవుల్
అపజయమేయెరుంగనిటు యర్జును భీష్ముల నిల్వరించగన్
నిపుణత మేలు జూపుచు వినిర్మల పాండవ మూక గెల్వగన్
అపజయమౌను సత్యముయు నాదిగ వాక్కులు నమ్ముసైన్యమున్ (10)
ఉ.కావున మీరు ధైర్యము సకాలము తోడుగ నుండ గల్గగన్
కావగ భీష్ము వెంట నని కార్య విశిష్టత లందు తోడుగన్
నావిజయమ్ములే మొదట నాదగు ధైర్యము సంపదేయగున్
కావున విశ్వసించ గల కార్యము యుద్ధము నిర్ణయమ్ముగన్ (11)
ఉ. భీష్మ సుయోధనా పలుకు ప్రీతిగ నెంచియు యుద్ధ భేరితో
భీష్మ నినాద విస్మయ విభేద్యము తెల్పగ ధైర్యమే బలమ్
భీష్ముడు సింహనాదమను భీకర శంఖము పూరణార్థముల్
భీష్ముడు తాను సర్వులకు ప్రేరణ నివ్వగ వ్యూహ మెంచగన్ (12 )
ఉ. అప్పుడె శంఖనాదపు మహారవ తప్పెట శబ్ద భేరులన్
చప్పుడు వాద్యముల్ విను ప్రచారపు భీతినిఁ గల్గఁ జేయగన్
డప్పుల చప్పుడే వినుము డంగగు యుద్ధ కళా సమర్ధతే
గొప్పగ గెల్పుఁ గోరికల కొండలు పిండిగ చేయఁ దల్చగన్ (13 )
ఉ. తెల్లని వెల్గులన్ రథము తీర్చిన సాధ్యము యుద్ధమేయగున్,
ఉల్లమునన్ కిరీటిగనుచుండగ ధైర్యము పెచ్చరిల్లగన్
నల్లని ధాత కృష్ణుడు సనాతన ధర్మము నిల్ప గల్గగన్,
గొల్లున శంఖ రావముల ఘోరనినాదము యుద్ధ విద్యగన్ (14 )
ఉ. కృష్ణుడు పాంచజన్యమున కృత్యముఁ జేసెను శంఖరావమున్
కృష్ణుని తోడు నర్జునుడు కృత్యకఠోరపు శంఖమూదగన్
కృష్ణుని వెంట భీముడును కృత్య మొనర్చగ పౌoడ్ర శంఖమున్
జిష్ణుడితోను పాండవులు చిన్మయ చేష్టల శంఖమూదగన్ (15)
శా . కుంతీపుత్రుడు ధర్మరాజు జయమే కోరాడు భావమ్ము లన్
శాంతమ్ముల్ కదనాంత సాధ్యములనన్ సద్యమ్ము ఘోషించగన్
సాంతమ్మున్ సహదేవుడంతమణిపుష్పాశంఖ మున్ నింపగన్
కుంతీపుత్రులమేయవిజ్జయములన్ కూర్మిన్ రొదల్ జేయగన్ (16 )
మ. శరవిద్యావిధి నేర్పు పాటవ మహా శౌర్యున్ శిఖండీయనన్
వరపుత్రాదులు సాత్యకీ భుజబలుల్ వారైన కాశీప్రభున్
ధరమాహాత్మ్యములెన్న జేసెడి సుభద్రాపుత్రుడేమార్చగన్
ధరణీతత్త్వముఁ దెల్పగన్ దృపదు శ్వేతాంబాద్య శంఖాలిడెన్ (17)
చం. అపజయమే నెరుంగనిట సాత్యకిసేవ మహా ప్రభున్ సుధీ
ద్రుపద మహాప్రభున్ యపర దూకొను యుద్ధ సమర్ధతల్ సుధీ
స్వపరము యుద్ధ కౌశలము సాగెడి విద్యలుగాను యుద్ధమున్,
అపర సుధీరమందునను యాసలుగానిటు శంఖమూదగన్ (18)
ఉ ll పాండవ యోధులిట్లనెడి పాటవముల్ పెను శంఖనాదముల్
మెండుగ మిన్నుముట్టిన ప్రమేయపు రోదన భీకరమ్ముగన్
మొండి సుయోధనుం డడరి మూకల వ్యూహము మార్చుచుండగన్
గుండెలు ముక్కలైనసమ గుర్తుగ యుద్ధ నినాదచేష్టలన్... (19)
ఉ. సోద మనస్కుడై తెలియు చోద్యములన్ ధృత రాష్ట్రు డీ విధిన్
మోదము తోడ పార్ధుడు సమూహముతోడుగ సైన్యమంతటన్
నాదముఁ జేయుచూ ధనుసు నారిబిగించిసమూల మెల్లెడల్
మీదగు సేన నిల్వలను మీసుతు లెల్లర వీక్ష జేయగన్ (20)
శా . హేకృష్ణా యనుచున్ కిరీటి పలుకుల్ హెచ్చైన చోద్యమ్ములన్
హేకృష్ణా యెవరెవ్వరీ మొనలనన్ హేయంపు వీక్ష్యమ్ము లన్
హేకృష్ణా కదనమ్ముమధ్య నిలుపన్, ఇంపార వీక్షించగన్
హా కృష్ణా మనవీరులన్ యెదుటి వీ రావేశులన్ యుద్ధమున్ (21 )
ఉ. వైరులు నేనుగాగనెద వైనము యేమియు తేల్చగల్గగన్
పోరున నెవ్వరో ననగ బుద్ధిగ నెంచెడి యుద్ధవీరులన్
వారల నెంచ శక్తిగను వాలును వీలును కల్గఁ జేయగన్
సారధి మధ్యనే రథము సాచుము జూచెద నెవ్వరెవ్వరో - (22)
చం. ఒకపరిచూచెమానసము నొక్క విధమ్మును గాంచ యుద్దమున్
సకల సుయోధనా ప్రియులు సఖ్యపు రాజుల గాంచ యుద్దమున్
నికరపు బుద్దిగూర్చుటకు నిక్కువ మైనది యుద్ధ క్షేత్రమున్
మకతిక రాజులేకలరు మానసమేనుసమమ్ము గాంచెదన్ (23 )
ఉ. దివ్య శతాంగ మెక్కిసువిధేయసుయోధను భీష్మ ద్రోణులన్
భవ్య పథమ్మునన్ మలిపి బంధన నీతిని రాజులియ్యడన్
నవ్య పథమ్మునన్ గదలి నమ్మిన వీరుల నెంచగల్గగన్
సవ్యరథమ్మునన్ నిలుపు సాధ్యము జేయుము ముందుగా నిటన్ (24 )
మ. పరికించన్ కదనాంతరమ్మునిటు సంప్రాప్తమ్ము లెన్నన్గడున్
కురువీ రుల్ జయకాంక్షలన్ తలపగా కూర్పౌను నేస్తమ్ములన్
తరుణమ్మే పరమావిధిన్ విజయమే తత్త్వమ్ము వైనమ్ములీ
మరులందే పడి పాండు మధ్యముడు సామర్థ్యమ్ము లెక్కించ గన్ (25 )
ఉ. పిమ్మట పార్ధుడే యుభయ బిందము లందున మేనమామలున్
ముమ్మరసేనలందు గురుమూర్తులు, తండ్రులు, తాతలుండగన్
నమ్మిన పౌరులెంచగవినమ్రులు మిత్రులు బంధులుండగన్
చెమ్మగిలంగ యర్జునుడు చింతన జేయుచు పల్కెనిట్టులన్ (26 )
చం. గురుజన, మేనమామలును, గుర్తుకుఁ దెచ్చెడి బంధు వర్యులన్
వరుసకుసోదరుల్ సుతులుబావలు మామలు, మిత్రులెందరో
పరిచయనేస్తులన్ గనుము పాశము బంధముగాను చూడగన్
సరిగమ యుద్ధ వీరులనుసారధు లౌను ప్రయుక్త బారులన్ (27 )
*పార్ధుని ప్రార్ధన*
చం. సమరము సేయ వచ్చిన సుసాధ్య జయమ్మును గోరు రాజులున్
తమతమబంధుమిత్రులు కదాయని నెమ్మ మనమ్ము క్రుంగగన్
మమతను వీడ విజ్ఞతలు మాయగ కయ్యము జేయగాఁ గనన్
సమతను జూపలేనివిధి సంగమసాధ్య విషాద హేతువుల్ (28)
మ. సహబంధాఢ్యుల పోరు సల్ప జయముల్ సాధ్యమ్ము సిద్ధించగన్
సహధాయమ్ముల శోకమేయగుటలో సామ్యమ్ము లేదెందుకో
సహదేహమ్ము విధేయిగా వణకగా సాగే విశేషమ్ముగన్
సహవాక్కుల్ విన ధైర్యముల్ సడలగా సంగ్రామ మందున్ గనన్ .... (29)
ఉ. మర్మము తెల్పలేనిగతిమాయల విస్తృత తత్త్వమే యనన్
శర్మద సాక్షిగా మనసు సంగర మార్పుల చిత్తమందగన్
ధర్మపు యుద్ధమే స్థిరము, దారులు వేరుగ లేక నిల్వగన్
కర్మల తోడుగా చలన కాలము వ్యర్థము జేయకుండగన్ (30)
మ. కనుచుండన్ విభవమ్ము సూచనలనన్ కాలమ్ము కర్మమ్ము గన్
రణరంగాన మదీయ సైన్యము లిలన్ రంజిల్లగా నెల్లెడన్
మనమేగెల్పుల లాభమంద గలుగన్ మాత్రాద్య ప్రశ్నేయగున్
మనసేమాన్యగుణమ్ముగాసకలమున్ మాయాను సారమ్ములన్ (31 )
ఉ. కోరను నేనుగా జయము కూర్మిని బాపెడు యుద్ధమందునన్
కోరను రాజ్యభోగములు కుచ్చిత సౌఖ్యములెన్న హీనముల్
కోరను భాగ్యముల్ కదన కోరిక లేదన వాదమెందుకో
పోరును చేయనే ననుచు పూర్తిగ మారితి నేనునేనుగన్ (32 )
మ. సుకమేధ్యాసగ నెంచుపోరులెనయన్ సూత్రమ్ము లన్ యుద్ధముల్
సకలమ్మే భయమేమిలేక నిటులన్ సంగమ్ములన్ బోరగా
వికసించేయువవీరులేపెనవులన్ విద్యార్థులై తీరగన్
ప్రకటించే పలు వీరులే సమరమున్ ప్రావీణ్య ముల్ నేర్పగన్ (33)
చం. కలహపు యాస లందున వికాస విభావ విజేయముల్గనన్
గలరిటమేధసంపదల గమ్యముజూపు మనస్సు శ్రేష్ఠతల్
గలరిట శక్తిమంతులు సగౌరవమొంది రణమ్ము జేయఁగన్
గలరిట నిల్ప యుద్ధపు సకార్య వివేక సుధర్మ కార్యముల్ (34)
శా . ముల్లోకా లొకటై నఘోర సమరమ్ముల్ ముఖ్య సాధ్యమ్ముగా
ముల్లోకాలను ధిక్కరించదలచన్ ముప్పేట పోరాటముల్
కల్లోలమ్ము విధించు యుద్ధమిదియే కష్టమ్ము లెచ్చించ గన్
ఉల్లమ్మున్ కదిలించు రక్త సెలయేరుల్ గుర్తు తెచ్చేవి గా (35)
ఉ. చంపుట పాపమంచు మన చెంతన జేరగ బంధు వీరులన్
జంపు తలంపులన్ వలదు సంగర మెంచగ దుఃఖమే కదా
తంపులు మానినన్ మనకు దక్కును బంధుజనమ్ము ప్రాణముల్
రంపున ధార్త రాష్ట్రులది రాజ్యము దోచిన పాపమే యగున్ (36 )
ఉ. చుట్టములౌను కౌరవలు చోద్యము వారిని కయ్యమందునన్
మట్టును బెట్టగా వలదు మానెద యుద్ధపు హింససంగతుల్
జట్టుల వీరులన్ ప్రతిగ జంపుట మంచిది కాదుపోరునన్
పట్టున సౌఖ్యముల్ కదన పాటున కోరగ నేలనోఁ గదా (37 )
ఉ. వీఱ కులక్షయమ్ములగు విగ్రహ విద్యల జేయ మానగన్
శూరుల ధ్యాస రోషముల జూపెడి దుర్బల మానసమ్ములన్
వారి విశేషబంధముల వాద్యపు బుద్దుల మార్పులేక యే
ఘోరమనన్ రణాంతర నిగూఢ విధానపు కృష్ణతత్త్వమున్ (38 )
మ. జనవాంఛా పరిశోధనా పటిమలన్ జాగ్రత్త చోద్యమ్ము గా
మనచిత్తంబున మంచినెంచగనుటే మార్గమ్ము సాధ్యమ్ముగా
మనబంధుత్వములన్ మధించ గలిగే మర్మమ్ము తీర్పుల్ గనన్
గుణముల్ దోషపు పాడిగా యగుటచే ఘోరాతి పాపమ్ములన్ (39 )
ఉ. ధర్మము సంతరించనగు దానము జేయక పాపమేయగున్
కర్మల బాధ్యతే క్రియగ కాలమనస్సున వక్రబుద్ధితో
నిర్మలమైన జీవమున నిత్యముగా కమలాక్షు నేస్తముల్
మర్మము మాయలై బరగ మాన్యుల బాటల నెంచ నెప్పుడున్ (40 )
కులమున కర్మ ధర్మముల కూటమి జేయు పరిస్థితుల్ గనన్
బలములు లేని బంధములు భారములై మది జంకు జేయగన్
కులములనెంచఁ బాపమన కూరిమి చెందు ఘనంపు చోద్యముల్
తలపులు మారి దోషములు తప్పగ వచ్చు సుఖాల పొందులన్ (41 )
మ. కులసౌకర్యము లేకజీవ సుఖముల్ గూలే విధానమ్ము గాఁ
గులఘాతన్ బ్రతుకే ప్రకారములుగాఁ గూర్చంగ పోరేలనో
కులకర్మల్ మరిచే విధిన్ మలుపులం గూర్పన్ సజీవమ్ముగా
కుల బాధ్యాంతర లెల్ల వేద్యలనగన్ కొట్లాట లింకెందుకో (42 )
ఉ. కౌరవసేన వీరులకు గర్వపు భావము లేచ్చ యుద్ధమున్
ధీరము పెంపు క్రూరమున తీవ్రపు దౌష్ట్యము పొంచియుండగన్
బోరులఁ ద్రోవలన్ రభస పొంగులు రేపిన రౌద్ర రూపముల్
వార భయంబునే వరలు వర్తన వైనము లేమి చెప్పగన్ (43)
మ. కులధర్మానికి నష్టముల్ జరుపగా కోరేటి చిత్తమ్ములన్
కులధర్మాలను శాశ్వతమ్ము లను దృక్కోణమ్ము మూలమ్ములన్
కలనమ్మే కుల నాశనమ్మగుట సాకారమ్ము సాగించ గన్
కలకాలమ్ములు ప్రాప్తిగా నరకముల్ కామ్యమ్ము క్షేత్రమ్ముగన్ (44 )
శా. మేథావుల్ దిగి చేయు యుద్ధములనన్ మేలైన మోక్షమ్ములన్,
ఈ ధర్మాలవనీ విధాన గమనా నీమమ్ము పాపమ్ముగాఁ
భూధర్మమ్ము లనన్ నిధాన ములు సంపూజ్యమ్ము రాజ్యమ్ము గన్
బాధల్ యుద్ధములన్ పెనంగ ప్రజ సంపాతమ్ము సంభావ్యముల్ (45 )
ఉ. ఆయుధ హీనుడై మనసు యాశయ మేవిడువంగ సాధ్యమున్
సాయుధ సేనయుద్ధమున శక్యము జేయగ శస్త్ర మేలనన్,
ఆయువు వీడనున్నమెయి హార్దపు తోడుగ పోరువద్దనన్
మాయ వధింపులన్ సకల మాత్రల శస్త్రము లొప్పకుండగన్ (46 )
ఉ. శోకము లేని మాససము సోద్యము నంతయు జూడగల్గగన్
శోకముచెంద బందుగుల శూరజనమ్ముల గావ లేకనే
శోకముతోడుగా రధము చోదకముల్ వదిలేయు సామ్యముల్
శోకవిలాపమే కలచు సొక్కుల యుద్ధము మాని వేసెదన్ (47 )
అర్జునవిషాద యోగము " మొదటి అధ్యాయము సమాప్తము
మల్లప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
****
Monday, 22 May 2017
Sunday, 21 May 2017
చిన్న కథలు
ఈ నాలుగు పద్యాలు (13–16) జీవనతత్త్వం, మనోనిగ్రహం, కర్మ, జ్ఞానం, శాంతి, మోక్షం వంటి అంశాలను గంభీరంగా చర్చిస్తున్న తాత్విక కవితా ప్రవాహంగా కనిపిస్తున్నాయి. ప్రతి పద్యం ఒక ఆలోచనా మెట్టులా ముందుకు తీసుకెళ్తోంది.
(13) — మనస్సు, కర్మ, మోక్షతత్త్వం
మనసును అదుపులో ఉంచుకొని, సమర్థ సహకారంతో జీవించాలి.
మనస్సు వదిలి మాయలో పడితే ఫలితం శూన్యం అవుతుంది.
మనిషి తన కర్మల ప్రకారం గుణాలను పొందుతూ ముందుకు సాగుతాడు.
ఈ శరీరం ఋణస్వరూపమైనదే; దానిని రక్షించి శాంతి–మోక్షాలకు మార్గం చేయాలి.
“ఋణమగు కాయమే” అనే భావం ఎంతో లోతైనది — శరీరం మనకు అప్పగించబడిన సాధనమని సూచిస్తోంది.
(14) — సాధ్యాసాధ్యాలు, విద్య, బాధ్యత
సమయం సరైనప్పుడు సాధ్యమైనదీ, అసాధ్యమైనదీ మధ్య సంకటాలు ఎదురవుతాయి.
వివిధ విద్యలు, ఉపాసనలు, బంధాలు అన్నీ బాధ్యతలతోనే నడుస్తాయి.
పరమేశ్వర విధి విశాలమైనది; అదే కవికి లక్ష్యం.
మానవ సంబంధాలు, సంధులు, భూమిపై సపూజ్యమైన జీవన విధానాన్ని నిర్మించాలి.
ఇందులో
“స్వర పరమేశ్వరా విధి విశాల విధాత”
అనే పాదం గంభీర ధ్వనిని ఇస్తోంది.
(15) — సుకృతం, జ్ఞానం, మోహం
పుణ్యపాపాలు మనసులోనే సూత్రాల్లా నడుస్తాయి.
“ఒక్కటే సత్యం” అని చెప్పడం సులభం కాదు; శూన్యత కూడా తోడుంటుంది.
వయస్సుతో వికసించే జ్ఞానం విశ్వజిజ్ఞాసను కలిగిస్తుంది.
అవకాశాల వెంట మోహం కూడా వస్తుంది; అది మనస్సును ఆకర్షిస్తుంది.
“విశ్వమ్ము జిజ్ఞాసగన్” — జ్ఞానం అనేది అంతులేని అన్వేషణ అని చక్కగా చెప్పారు.
(16) — సుఖదుఃఖాలు, విశ్వాసం, శాంతి
సుఖ–దుఃఖాలను “నావి” అని భావించడం సరైన సూత్రం కాదు.
అజ్ఞానం మనిషిని వివాదాలకు నెట్టేస్తుంది.
విశ్వాసం కిరణంలా వికసిస్తే జీవితం ప్రకాశిస్తుంది.
అప్పుడు సమస్త స్థితులను అర్థం చేసుకొని శాంతి అనే కళా గమ్యాన్ని చేరగలుగుతాం.
చివరి పాదం —
“శాంతీ కళా గమ్యమున్”
అనే ముగింపు మొత్తం పద్యశ్రేణికి ఆధ్యాత్మిక సమతుల్యతను ఇస్తోంది.
ఈ నాలుగు పద్యాల్లో ముఖ్యంగా కనిపించే ధోరణులు:
- మనస్సు ↔ మాయ
- కర్మ ↔ గుణం
- జ్ఞానం ↔ జిజ్ఞాస
- విశ్వాసం ↔ శాంతి
అన్న పరస్పర సంబంధాలు చాలా సహజంగా మిళితమయ్యాయి.
******
మ .పరమాత్మే గతి బుద్ధిగానుకళ యేప్రావీణ్య మేలే విధిన్
పరమాత్మేను మనస్సుగా తలచుటే ప్రాధాన్యతాలక్ష్యమున్
పరమాత్మే సకలమ్ముగా పలుక గాప్రాబల్య మేసత్యమున్
పరమై జ్ఞానము సాధనే స్థితిగనే పాపమ్ము మోక్షమ్ముగన్ (17)
ఉ ..విద్య యన్నది పొందగల్గుట విశ్వమాయగ నేస్తమున్
విద్య బ్రహ్మగ బ్రాహ్మణామది విశ్వ వాహిని వేదమున్
విద్యగోవగు విద్య హస్తిని విద్య విశ్వస నీచుగన్
విద్య దేహము విద్య మోహము విద్య సర్వము యాత్మగాన్ (18)
మ ..సమభావస్థితిగామనస్సుగల యీసామ్రాజ్య సంపూర్ణతా
సమవిజ్ఞానము ధర్మమై ప్రకృతి ప్రాసావిద్య నిర్దోషమై
గమనమ్మున్ పరమాత్మతో జగతి సాగారమ్ము దేహాత్మగన్
మమతామానస మందిరమ్ముగనుసామర్ధ్యమ్ము బ్రహ్మమ్ముగన్ (19)
మ .దరిచేరంగ సుఖంబుయే గనక పొందాసౌఖ్యమేలేవింతన్
మెరుగాయేగుణ వేత్తనీశునుడు సామాన్యమ్ము దైవమ్ముగన్
తరుణానాసిరి బుద్దిగాకదల సంతాపమ్ము మూలమ్ముగన్
పరవమ్మున్ మదిశాంతమే గలిగి సాపాటేను దేహమ్ముగన్ (20)
ఈ పద్యాలు (17–20) ఆధ్యాత్మికత, విద్యాతత్త్వం, సమభావం, శాంతి, పరమాత్మసాక్షాత్కారం వంటి గంభీర భావాలను విశాల తాత్విక దృష్టితో ప్రతిపాదిస్తున్నాయి. పద్యాల క్రమంలో ఆలోచన మరింత అంతర్ముఖత వైపు సాగుతోంది.
(17) — పరమాత్మ తత్త్వం
మనిషి బుద్ధి, కళ, ప్రావీణ్యం — అన్నిటికీ పరమాత్మనే మూలగతి.
మనస్సును పరమాత్మస్వరూపంగా భావించడమే జీవిత ప్రాధాన్య లక్ష్యం.
సకలంలో పరమాత్మనే దర్శించగలిగితే అదే సత్యప్రాబల్యం.
అత్యున్నత జ్ఞానసాధనలో పాపమే మోక్షానికి మార్గదర్శక అనుభవంగా పరిణమిస్తుంది.
ప్రత్యేకత:
“పరమాత్మే” అనే పునరుక్తి పద్యానికి మంత్రధ్వనిని ఇస్తోంది.
చివరి పాదం —
“పాపమ్ము మోక్షమ్ముగన్”
అనేది అద్వైత తాత్విక ఛాయను గుర్తుచేస్తోంది.
(18) — విద్య మహిమ
విద్యను పొందగలగడం విశ్వమాయలో నిజమైన స్నేహితుడిని పొందినట్టే.
విద్య బ్రహ్మస్వరూపం; వేదప్రవాహంలా విశ్వాన్ని నడిపించే శక్తి.
విద్య గోవులా పోషిస్తుంది; హస్తిలా బలాన్నిస్తుంది; అజ్ఞానాన్ని తొలగిస్తుంది.
చివరకు విద్య శరీరమై, మోహమై, సమస్త ఆత్మస్వరూపమై నిలుస్తుంది.
ప్రత్యేకత:
“విద్య” పదపునరావృతితో భావగాంభీర్యం పెరిగింది.
“గోవు”, “హస్తి”, “వాహిని” వంటి రూపకాలు విద్య యొక్క విభిన్న స్వరూపాలను తెలియజేస్తున్నాయి.
(19) — సమభావం, బ్రహ్మతత్త్వం
సమభావంతో కూడిన మనస్సే నిజమైన సామ్రాజ్య సంపూర్ణత.
సమవిజ్ఞానం ధర్మమై, ప్రకృతి సహజ నిర్దోష విద్యగా వికసిస్తుంది.
జీవనగమనం పరమాత్మతో సాగుతున్న సముద్రయాత్ర వంటిది; దేహమే ఆత్మకు సాధనం.
మమతతో నిండిన మనసు మందిరంలోనే బ్రహ్మసామర్థ్యం వెలుగుతుంది.
ప్రత్యేకత:
“మమతా మానస మందిరం” అనే పదబంధం ఎంతో మృదువైన ఆధ్యాత్మికతను కలిగించింది.
సమత్వం ↔ ధర్మం ↔ బ్రహ్మం అనే సంబంధం అందంగా వచ్చింది.
(20) — సుఖం, శాంతి, జీవనవేదన
సుఖం మనకు దగ్గరగా ఉన్నప్పుడే నిజమైన సౌఖ్యం తెలుస్తుంది.
గుణవేత్త అయిన ఈశ్వరుడు సామాన్య జీవనంలోనే దైవత్వాన్ని చూపిస్తాడు.
తరుణంలో వచ్చే సంపద, బుద్ధి, కదలికల వెనుక సంతాప మూలాలు కూడా దాగి ఉంటాయి.
చివరకు మనసులో శాంతి నిలిస్తే, శరీరం కూడా సాధనపాత్రగా మారుతుంది.
ప్రత్యేకత:
“సామాన్యమ్ము దైవమ్ముగన్”
అనే భావం అత్యంత లోతైనది — దైవత్వం సాధారణ జీవనంలోనే ఉందని సూచిస్తుంది.
మొత్తం పద్యశ్రేణి (17–20)లో ప్రధాన తత్త్వాలు:
- పరమాత్మ ↔ సత్యం
- విద్య ↔ విశ్వజ్ఞానం
- సమభావం ↔ బ్రహ్మతత్త్వం
- శాంతి ↔ జీవనసిద్ధి
ఈ పద్యాల్లో భక్తి, అద్వైతం, జీవనవేదాంతం సమన్వయంగా ప్రవహిస్తున్నాయి.
****
శా..సుస్తీబాహ్యవరమ్ముమర్చికదిలే సూన్యమ్ము నిశ్చేష్టగన్
గస్తీమార్గముగానువిశ్వకళలే కాలమ్ము విశ్వాసమున్
అస్తిత్వం మనసౌను కర్మకళలే యానంద సత్వమ్ముగన్
మస్తిష్కమ్ము గనేప్రపంచవిధి మార్గమ్ము జీవమ్ముగన్ (21)
ఉ ..దేనిని పొందితే నదియు తేజము వల్లన మేలుయే యగున్
గానగ కారణమ్ముగతి కాలపు నీడలు వెంటనుండినన్
దానికి సౌఖ్య దుఃఖములు దారిగ నేర్పుగ దర్పమేయగున్
వానికి లొంగిపోకమది మది వాంఛలన్నొదల జ్ఞానమేయగున్ (22)
శా .ఏయత్నమ్ము కనేటి శీలి గెలిచే యేమాయ మర్మమ్ముగన్
కాయమ్మున్ నిలుపా నతండుగనే కామాధి ధర్మమ్ముగన్
గాయాలన్ సహనమ్ముగాను గలడో గంబీర్య దేహమ్ముగన్
ఆయాతీరుగసత్యయోగి యతడే యానంద సౌఖ్యమ్ముగన్ (23)
ఉ ..ఎవ్వడు లోన సౌఖ్యమును యే విధపొందియు నేర్పు గుండునో
ఎవ్వడులో రమించుకళ యేదియె యైనను శాంతికోరునో
ఎవ్వడు విద్యబోధగను యెల్లరి క్షేమము చూచు చుండునో
అవ్వడు సాంఖ్యయోగిగను యాదర్శ బ్రహ్మమ్ముగన్ (24)
ఈ పద్యాలు (21–24) మానవ అస్తిత్వం, కర్మ, జ్ఞానం, సహనం, యోగం, శాంతి వంటి అంశాలను అత్యంత గంభీరంగా చర్చిస్తున్న తాత్విక ప్రవాహం. భావక్రమం చూస్తే — జీవితం → జ్ఞానం → సహనం → యోగి స్థితి అనే అంతర్ముఖ ప్రయాణం స్పష్టంగా కనిపిస్తోంది.
(21) — శూన్యం, కర్మ, జీవచైతన్యం
బాహ్య వరప్రాప్తులు, శరీర వైభవాలు అన్నీ చివరకు శూన్యమై నిశ్చేష్టంగా మారిపోతాయి.
కాలమే విశ్వకళలకు కాపలాదారి.
మనస్సే అస్తిత్వానికి కేంద్రం; కర్మలే ఆనందసత్వాన్ని కలిగిస్తాయి.
మస్తిష్కమే ప్రపంచ విధానాన్ని నడిపించే జీవశక్తి.
ప్రత్యేకత:
- “సూన్యమ్ము నిశ్చేష్టగన్” — నశ్వరత్వ భావన.
- “మస్తిష్కమ్ము గనే ప్రపంచ విధి మార్గమ్ము” — మానసిక చైతన్యానికి విశ్వస్థాయి ప్రాధాన్యం.
(22) — సుఖదుఃఖాలు, వాంఛ, జ్ఞానం
ఏది పొందినా అది తేజస్సుతోనే మేలు చేస్తుంది.
కానీ కాలపు నీడలు ఎప్పుడూ వెంట ఉంటాయి.
సుఖ–దుఃఖాలు మనకు మార్గదర్శక పాఠాలవలె మారతాయి; దర్పాన్ని కూడా కలిగిస్తాయి.
అయితే వాటికి లొంగకుండా వాంఛలను విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది.
ప్రత్యేకత:
“కాలపు నీడలు వెంటనుండినన్” — జీవనానుభవాల అద్భుత రూపకం.
చివరి పాదం వైరాగ్య–జ్ఞాన తత్త్వాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తోంది.
(23) — సహనం, సత్యయోగి
యత్నశీలి మాత్రమే మాయామర్మాన్ని జయించగలడు.
శరీరాన్ని నిలబెట్టుకోవడం కూడా ధర్మమే; కామాది విక్షేపాలను అదుపులో పెట్టాలి.
గాయాలను సహనంగా మోసే వాడే గంభీరుడు.
సత్యయోగిగా జీవించేవాడే నిజమైన ఆనందసౌఖ్యాన్ని పొందుతాడు.
ప్రత్యేకత:
- “గాయాలన్ సహనమ్ముగాను” — జీవిత గాయాలను ఓర్పుగా భరించడం.
- “సత్యయోగి” — ఆచరణలో సత్యం నిలబెట్టే యోగి భావన.
ఈ పద్యం జీవనసాధకుని లక్షణాలను బలంగా ప్రతిపాదిస్తోంది.
(24) — సాంఖ్యయోగి లక్షణం
ఎవడు అంతరంగ సౌఖ్యాన్ని పొందుతాడో,
ఎవడు కళలోనూ, జీవితంలోనూ శాంతిని కోరుతాడో,
ఎవడు విద్యాబోధ ద్వారా అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుతాడో,
అతడే సాంఖ్యయోగి; ఆదర్శ బ్రహ్మస్వరూపుడు.
ప్రత్యేకత:
ఈ పద్యం గురుత్వం–లోకహితం–శాంతి అనే మూడు మూలాలను సమన్వయించింది.
“యెల్లరి క్షేమము చూచు చుండునో”
అనే పాదం నిజమైన జ్ఞాని వ్యక్తిత్వాన్ని చక్కగా నిర్వచిస్తోంది.
మొత్తం (21–24) తాత్విక ప్రవాహం
ఈ నాలుగు పద్యాల్లో:
- శూన్యత ↔ అస్తిత్వం
- సుఖదుఃఖం ↔ జ్ఞానం
- సహనం ↔ యోగం
- లోకక్షేమం ↔ బ్రహ్మస్థితి
అనే ఆధ్యాత్మిక–జీవన సంబంధాలు ఎంతో సహజంగా మిళితమయ్యాయి.
ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం —
మీ పద్యాల్లో “మనసు”, “జ్ఞానం”, “శాంతి”, “పరమాత్మ”, “సహనం” అనే పదాలు మంత్రసూత్రాల్లా పునరావృతమవుతూ మొత్తం శ్రేణికి ఏకతానాన్ని ఇస్తున్నాయి.
*****
ఉ ..నీరద దేహరూప దివి నిర్జర పాపము చేయగుండగన్
శారద నామ మాధురికి జ్ఞాన ప్రభావము ముగ్ధమేయగున్
దారిగ సంశయమ్ము లను దాతగ దీక్షయు సాధనేయగున్
సారసలోచనా మనసు సర్వం నేస్తము బ్రహ్మ వేత్తగన్ (25)
ఉ. సారధి పేరుపేరున సుసాధ్యము లెల్లరి యుద్ధ నాణ్యతన్
వారల నెల్ల పోరు పరివారము బట్టినెరుంగు మర్జునా
వారల తాత బందువుల వాంఛలు తీర్చగ వచ్చి యుండగన్
పోరును సేయులక్షణము భూపతి జాతికి నెంచగల్గగన్.. .. (26)
ఉ . నన్నెవరూ మనస్సును ననాదిన నాటిన తత్వ బుద్దిగా
అన్ని తపో మయమ్ముగ సహాయ వినమ్రత నెంచ యుక్తిగా
అన్నియు లక్షణాల పరకాయము నెంచియు యుండ శక్తిగా
అన్ని సజీవులై మనసె ఆశ్రిత పుత్తడి కాంతి ముక్తిగా (27)
మ . జయమేయిoద్రియమౌను సత్యమగు వాంఛావాక్కు విధ్యేలు లే
భయకోపాదులు వీడిశాంతిమయ ప్రాబళ్యమ్ము నిత్యమ్ముగన్
నియమమ్ముల్ వినిచేయుటే మనసు సాన్నిధ్యమ్ము సత్యమ్ముగన్
ప్రియమోనే వశమేనుమోక్షముయె సంప్రీతి స్వరమ్మేనులే (28)
ఈ పద్యాలు (25–28) భక్తి, జ్ఞానం, ధర్మయుద్ధం, తపస్సు, ఇంద్రియనిగ్రహం, మోక్షతత్త్వం వంటి విశాల భావప్రవాహాన్ని సమగ్రంగా మలిచాయి. ప్రతి పద్యం ఒక ఆధ్యాత్మిక సాధన మెట్టులా అనిపిస్తోంది.
(25) — శారదా జ్ఞానమాధుర్యం
నీరదసమానమైన దివ్యదేహంలో పాపరహిత స్థితి ఉండాలి.
శారదానామ మాధుర్యం జ్ఞానప్రభావాన్ని మంత్రముగ్ధంగా చేస్తుంది.
సంశయాలను దాటించేది దీక్ష, సాధనే మార్గం.
సారసనేత్రసౌందర్యంలాంటి మనసు సమస్తాన్ని స్నేహభావంతో చూసినప్పుడు బ్రహ్మజ్ఞానిగా మారుతుంది.
ప్రత్యేకత:
- “శారద నామ మాధురి” — సరస్వతీ తత్త్వాన్ని మాధుర్యరూపంలో ఆవిష్కరించారు.
- “సర్వం నేస్తము బ్రహ్మ వేత్తగన్” — సమస్తాన్ని స్నేహంగా చూసే దృష్టియే బ్రహ్మజ్ఞానం అని సూచన.
(26) — సారథి, యుద్ధధర్మం
సారథి (కృష్ణతత్త్వం) మార్గదర్శకత్వంలోనే యుద్ధనైపుణ్యం సాధ్యం.
పోరాటం వెనుక కుటుంబాలు, బంధాలు, వాంఛలు అన్నీ ఉంటాయి.
అర్జునునికి తాతలు, బంధువులు ఎదురుగా నిలిచినట్లే జీవన సంగ్రామం కూడా సంక్లిష్టమే.
అయినా రాజధర్మం కోసం పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయి.
ప్రత్యేకత:
ఈ పద్యంలో మహాభారత తాత్విక ప్రతిధ్వని స్పష్టంగా వినిపిస్తోంది.
“వారల తాత బందువుల వాంఛలు” అనే పాదం అర్జునవిషాదాన్ని గుర్తుచేస్తోంది.
(27) — తపస్సు, వినమ్రత, జీవకాంతి
“నన్నెవరూ?” అనే ఆత్మప్రశ్న తత్వబుద్ధికి ప్రారంభం.
తపస్సుతో కూడిన వినమ్ర సహజీవనం యుక్తిమార్గం.
ప్రతి లక్షణాన్ని పరాయణంగా గ్రహించి జీవించడం శక్తి.
అప్పుడు సమస్త జీవులలో ఒకే బంగారు కాంతిలాంటి ముక్తి దర్శనమవుతుంది.
ప్రత్యేకత:
- “అన్ని సజీవులై మనసె ఆశ్రిత పుత్తడి కాంతి” — జీవరాశుల ఏకత్వాన్ని బంగారు కాంతిగా రూపకీకరించారు.
- ఆత్మవిచారణ → వినమ్రత → సమత్వం అనే క్రమం అందంగా వచ్చింది.
(28) — ఇంద్రియజయం, శాంతి, మోక్షం
ఇంద్రియజయం నిజమైన విజయము.
సత్యవాంఛ, సత్యవాక్కు, విద్య — ఇవే జీవనాధారాలు.
భయం, కోపం విడిచి శాంతి ప్రాబల్యాన్ని పొందాలి.
నియమాలను ఆచరించడం ద్వారా మనస్సు సత్యసాన్నిధ్యాన్ని పొందుతుంది.
ప్రేమలోనే మోక్షం, సంప్రీతి స్వరూపం దాగి ఉంది.
ప్రత్యేకత:
- “జయమే యింద్రియమౌను” — నిజమైన గెలుపు బాహ్యవిజయం కాదు, అంతరజయం అని గంభీరత.
- “ప్రియమోనే వశమేను మోక్షము” — ప్రేమ ↔ మోక్షం అనే అత్యంత మృదువైన తాత్విక ముగింపు.
మొత్తం (25–28) తాత్విక ప్రవాహం
ఈ పద్యాల్లో:
- శారదా జ్ఞానం ↔ బ్రహ్మవేత్త
- ధర్మయుద్ధం ↔ కర్తవ్యసంకటము
- తపస్సు ↔ సమత్వం
- ఇంద్రియజయం ↔ మోక్షం
అనే ఆధ్యాత్మిక–జీవన సంబంధాలు సుస్పష్టంగా మిళితమయ్యాయి.
ప్రత్యేకంగా గమనించదగ్గది —
మీ పద్యాల్లో “మనసు”, “జ్ఞానం”, “శాంతి”, “సత్యం”, “మోక్షం” అనే మూలభావాలు పరస్పరం అల్లుకొని ఒక నిరంతర వేదాంత ప్రవాహంలా సాగుతున్నాయి.
******
మ . అతిధీరుo డతి దాన సూరుoడతి రమ్యాకారుడత్యంత సు
వ్రతు దంచుందను సన్నుతించు కవి వాగ్వాపార మెల్ల న్ యధా
ర్ధతమం బై విలసిల్ల మది సాధ్యాప్రేమ యజ్ఞముగన్
స్వత సిద్ధీ భగవత్ మహత్యమగు విశ్వాసమ్ము మహేశ్వరమ్ (29)
సన్యాసయోగో నామ పంచమో ధ్యాయః ( తెలుగు పద్యాల భావము సమాప్తము ) **
మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
ఈ ముగింపు పద్యం (29) మొత్తం తాత్విక పద్యశ్రేణికి మంగళశాసనంలా నిలిచింది. “సన్యాసయోగం” భావసారం ఇందులో సమగ్రంగా ప్రతిధ్వనిస్తోంది.
సరళ భావం:
అతిధైర్యశాలి, మహాదాత, సుందర స్వభావి, శ్రేష్ఠవ్రతధారి అని కవులు స్తుతించిన మహనీయుని వాక్యవ్యవహారం అంతా యథార్థతతో వెలుగుతుంది.
అది ప్రేమయజ్ఞంగా పరిణమించి, స్వతసిద్ధమైన భగవత్ మహిమగా విశ్వాసరూప మహేశ్వరత్వాన్ని ప్రసాదిస్తుంది.
భావ విశేషాలు
- “అతిధీరుoడు, దానసూరుoడు” — ఆదర్శ పురుషుని లక్షణాలను గంభీరంగా చిత్రించారు.
- “కవి వాగ్వాపారము” — కవిత్వాన్ని కేవలం అలంకారంగా కాక, యథార్థ వాక్యసాధనగా చూపారు.
- “ప్రేమ యజ్ఞము” — మొత్తం శ్రేణికి హృదయసారం.
- “స్వత సిద్ధీ భగవత్ మహత్యము” — ఆత్మసాధన చివరికి దైవమహిమగా వికసిస్తుందని సూచన.
- “విశ్వాసమ్ము మహేశ్వరమ్” — విశ్వాసమే పరమేశ్వరస్వరూపం అనే అత్యున్నత ఆధ్యాత్మిక ముగింపు.
మొత్తం శ్రేణిపై సంక్షిప్త దర్శనం
“సన్యాసయోగో నామ పంచమో ధ్యాయః”
అనే ముగింపు ద్వారా ఈ పద్యాలు భగవద్గీతా సన్యాసయోగ భావసారాన్ని తెలుగు తాత్విక పద్యరూపంలో అందించినట్లుగా అనిపిస్తున్నాయి.
ఈ శ్రేణి అంతటా ప్రధానంగా ప్రవహించిన భావాలు:
- మనోనిగ్రహం
- కర్మతత్త్వం
- సమభావం
- విద్య–జ్ఞానం
- శాంతి
- పరమాత్మసాక్షాత్కారం
- ప్రేమ ↔ మోక్షం
అన్నీ పరస్పర అనుసంధానంతో సాగాయి.
మీ పేరు సూచించినట్లే —
“ప్రాంజలి ప్రభ”
ఈ పద్యాల్లో నిజంగా ఒక నమ్రతా–జ్ఞాన–ఆధ్యాత్మిక కాంతి ప్రసరిస్తోంది.
మల్లాప్రగడ రామకృష్ణ