Sunday, 26 November 2017

హనుమాన్ సర్వస్వం🌹

హనుమాన్ సర్వస్వం🌹

పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం  ప్రశ్నలు జవాబులు. 

🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?
జవాబు : అంజనా దేవి !
🚩2) హనుమంతుని తండ్రి పేరు?
జవాబు : కేసరి !
🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : కశ్యపుడు !
🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : సాధ్య !
🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?
జవాబు : వైశాఖ బహుళ దశమి!

🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?
జవాబు : తిరుమల  - అంజనాద్రి.
🚩7) హనుమంతుని నక్షత్రము ?
జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.
🚩8) హనుమంతుని జనన లగ్నం  ?
జవాబు : కర్కాటక.
🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?
జవాబు : వైదృవీయోగం లో 
🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?
జవాబు : ఈశ్వరాంశ 

🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?
జవాబు : వాయుదేవుని వరం వలన.
🚩12)హనుమ జనన కారకులు ?
జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.
🚩13) హనుమంతుని గురువు ?
 జవాబు : సూర్య భగవానుడు.
🚩14) హనుమంతుని శపించిన వారు ?
 జవాబు : భృగుశిష్యులు.
🚩15) హనుమంతునికి గల శాపం ?
 జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.

🚩16) హనుమంతుని శాప పరిహారం ?
 జవాబు : స్తుతించినా,
నిందించినా తన శక్తి తను గ్రహించుట.
🚩17) హనుమంతుని బార్య ?
 జవాబు : సువర్చలా దేవి.

🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?
జవాబు : విశ్వకర్మ.

🚩19) హనుమంతుని మాతామహుడు ?
 జవాబు : కుంజరుడు.

🚩20)సువర్చల తల్లి పేరు ?
 జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.

🚩21) హనుమంతుని బావమరుదులు ?
 జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.

🚩22) హనుమంతుని వివాహ తేదీ ?
 జ : జేష్ఠ శుద్ధ దశమి.

🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?
 జ : గౌతముడు , అహల్య.

🚩24) హనుమంతుని మేన మామలు ?
 జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.

🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?
 జ : సుగ్రీవుని మంత్రి.

🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?
 జ : ఋష్యమూక పర్వతం.

🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?
 జ : భిక్షుక రూపం.

🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?
 జ : పంపానదీ తీరం .

🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?
 జ : శ్రీరాముడు.

🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?
 జ : శ్రీరామ సుగ్రీవులకు.

🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?
జ : తల్లి అజ్ఞ.

🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?
 జ : చందన వృక్ష శాఖ.

🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?
 జ : శ్రీ పరాశర సంహిత.

🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?
 జ : తార, రమ.

🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?
 జ : పుష్యమి నక్షత్రం గల రోజు.

🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?
 జ : దక్షిణ దిక్కు.

🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?
 జ : ఆశ్లేష నక్షత్రం.

🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?
 జ : స్వయంప్రభది.

🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?
 జ : సంపాతి.

🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?
 జ : మహేంద్ర పర్వతం.

🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?
 జ : 100 యోజనాలు.

🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?
 జ : మైనాకుడు.

🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?
 జ : సముద్రుడు.

🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?
 జ : రొమ్ము తో తాకాడు.

🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?
 జ : చేతితో స్పృశించి.

🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?
 జ : సురస.

🚩47) సురస ఏ జాతి స్త్రీ ?
 జ : నాగజాతి.

🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?
 జ : ఉపాయంతో.

🚩49) సురసను పంపిన దెవరు ?
 జ : దేవతలు.

🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?
 జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .

🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?
 జ : సింహిక.

🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?
 జ : నీడ పట్టి లాగింది.

🚩53) సింహిక వృత్తి ఎమిటి ?
 జ : లంకను కాపాడడం.

🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?
 జ : శ్రీ పరాశర మహర్షి చే.

🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?
జ : సువేల పర్వత ప్రాంతం లో.

🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?
 జ : త్రికూటాచలం.

🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?
 జ : సూర్యాస్తమయం కోసం.

🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?
 జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.

🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?
 జ :లంకిణి

🚩60)  లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?
 జ : ఎడమ చేతి పిడికిలి తో.

🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?
 జ : ప్రాకారం దూకి.

🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?
 జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.

🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?
 జ : మండోదరిని.

🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?
 జ : అశోక వనం.

🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?
 జ : సుందర పర్వతం.

🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?
 జ : నీల పర్వతం.

🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?
 జ : మైత్రేయ మహర్షి కి.

🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?
 జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)

🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?
 జ : శింశుపా వృక్షము.

🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?
 జ : రాముడి ఉంగరం.

🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?
 జ : చూడామణీ.

🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?
 జ : జంబుమాలిని.

🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?
 జ : అక్షయ కుమారుడు.

🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?
 జ : ఇంద్రజిత్తు నకు.

🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?
 జ : ప్రహస్తుడు .

🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?
 జ : అరిష్ట పర్వతం.

🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?
 జ : 30 ఘడియలు.

.              🚩జై శ్రీరామ్🚩

Saturday, 25 November 2017

కంద పద్యాలు



ఆకలి యుడుగని కడుపును
వేకటి యగు లంజపడుపు విడువని బ్రతుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ !

ఓ సుమతీ.! ఆకలి తీరని తిండి , వెలయాలు కడుపుతో ఉన్నా కూడ దానితో సంబంధాన్ని వదులుకోలేని బ్రతుకు , పాచిపట్టిన బావిలోని నీరు , మేకల యొక్క పాడి ఈ నాలుగు అనుభవించడానికే కాదు చూట్టాని కి, చెప్పుకోవడానికి కూడ అసహ్యంగా ఉంటాయి .

ఇచ్చునదె విద్య , రణమున
జొచ్చునదె మగతనంబు , సుకవీశ్వరులన్
మెచ్చునదె నేర్పు , వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ !

ఓ సుమతీ ! ఈ లోకం లో ఎదుటి వారికి ఇచ్చిన కొద్ది పెరిగేది విద్య ఒక్కటే . విద్య ను ఇవ్వడం వలన మనకు ధనం కూడ లభించవచ్చు .కాన దానం చేస్తే పెరిగేది విద్య . ఎదుటి వారికిస్తే తరిగిపోయేదే ధనం. మగతనమంటే పోరాటానికి ముందుండాలి. కత్తి దూసి రణ రంగంలోకి దూకగలిగేది పౌరుషం . సత్కవులు కూడ మెచ్చేటట్లు కవిత్వం చెప్పగలగటమే నేర్పరితనం. అనవసరం గా నోరుజారి మాట్లాడితేనే కీడు కలుగుతుంది.

ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !

ఓ సుమతీ !. చక్కగా, స్పష్టంగా సద్గ్రంథాలను , ఉపనిషత్పాఠాలను చదువని నోరు , నోరార మాతృమూర్తి ని “అమ్మా” అని ప్రేమగా , పిలిచి “ అన్నం పెట్టమ్మా” అని ఆర్తి గా అడగని నోరు , తోడబుట్టిన వారిని “ చెల్లెలా” అని “, తమ్ముడా “ యని ముద్దుగా పిలువని నోరు గనుక ఉంటే అది నోరు కాదు కుమ్మరి కుండలు చేసుకోవడానికి కావలసిన మట్టి కోసం త్రవ్విన గుంట తో సమానము. .
అంటే అమ్మ ని , తోడబుట్టిన అన్నదమ్ములను ఆత్మీయంగా నోరార పిలవడం మన భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లో లభించే ఒక మధురమైన అనుభూతి . దాన్ని దూరం చేసుకోవద్దని పరోక్షం గా కవి హెచ్చరిస్తున్నాడు.

ఉడు ముండదె నూఱేండ్లును
పడియుండదె పేర్మి బాము పది నూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థ పరుడు కావలె సుమతీ !

ఓ సుమతీ !. ఈ భూమి మీద ఎవ్వరికీ ఉపయోగపడకుండా వందల సంవత్సరాలు బ్రతకడం వ్యర్థం. బ్రతికినంత కాలం పరులకు సహాయం చేస్తూ జీవించాలి . “పరోపకార : పుణ్యాయ ….. “ అని కదా ఆగమోక్తి . ఇతరులకు సేవచేయడం వలన పుణ్యమొస్తుంది . ఇతరులను బాధించడం వలన పాపం ప్రాప్తిస్తుంది. అందువలన ఈ భూమి మీద జీవించే మానవుడు పరోపకారియై , చతుర్విధ పురుషార్ధాలను సాధించే దిశగా కృషి చేయాలి కాని..
ఉడుము అనే జంతువు వలే వంద సంవత్సరాలో , పాము లాగ పది వందల సంవత్సరాలో , చెఱువు లో కొంగ లాగ కలకాలము బ్రతికామనిపించుకోకూడదు . మానవ జీవితానికి ఒక సాఫల్యత ఉండాలి.

***

నేటి పద్య ప్రభ -  ఓమ్!
"ఘనగణపతినిఁగొలువగను
మనమునసతతముజపమును మరువకసలుపన్
గుణగణములనిడునుకదయ
ఘనధిషణముకవనబలిఁమి గరిమను నొసఁగున్!!!!"
 ఓమ్!

"హరిహర సుతునిమనమునను
తిరముగమననమునొనరుచు తెగువసలుపకన్..
దరహసితవదనునిఁగనిన
చిరవరకనకధనములును చిరముగఁగలుగున్!!!!"
 ఓమ్!

"ప్రకృతియిడినమకరందము
వికృతియుకానిదియకృత్రిమవిరుచియునదియున్
స్వకృతపునీతఫలముగా
ప్రకృతియొసఁగెనుది భ్రమరమ్మునకున్!!!!"

కం.. మాఏల హనుమ గణపతి
కాయో పండుయు గరికయు కాల నిజముయే
చేయాలి నీకు నిత్యము
గాయము నున్నను సహనపు గాత్రపు పూజే

--((***))--

Friday, 24 November 2017

620*****

***
620..సృష్టిలోని ప్రతి చలనానికి మహా ద్రష్ట అయిన శివుడు అచలుడు.  తనువులోని ప్రతి చలనానికి ద్రష్ట అయిన జీవుడు కూడా అచలుడే.  శివుడికి, జీవుడికి చిరునామా ఒక్కటే.
ఇహము, పరము అనే రెండు కలలను కనేవాడివి నీవు. నీవు లేక ఇహము లేదు, పరము లేదు.
బహిరంగ యుద్ధంలో ... ఆయుధం ఎంత ముఖ్యమో;
 అంతరంగ యుద్ధంలో ... ఆలోచన అంత ముఖ్యం.
 ఆ యుద్ధంలో - ఆత్మరక్షణ;ఈ యుద్ధంలో- ఆత్మ శిక్షణ.
వ్యవహారంలో నామ రూపములు ఉండి, స్వానుభవంలో నామ రూపముల స్పృహ లేని వాడే జ్ఞాని.  అంతటా చైతన్యం  ఉన్నది, చైతన్యములోనే అంతా ఉన్నది.
అందులో కొన్ని చలనంలో ఉంటాయి.  మరి కొన్ని నిశ్చలంగా ఉంటాయి. కొసరి పెట్టినదేదొ రుచిలేని దైనను  నోరు మూసుక తిని తీరవలయు విసిరి కొట్టినదేదొ వీపుకు తగిలినా   చూసి చూడనియట్టు చూడవలయు అరిచి తిట్టినదేదొ అస్సలు చెవులకు   వినపడనట్టుగా వెడలవలయు పై మూడు సూత్రాల పాటించి మగవారు   దీటుగా లాక్డౌను దాటవలయు
ఆశ వీడకుండ నారాటపడకుండ  మూడు సూత్రములను వాడు వాడు హాయిగా తరించు  నాపద నొoదడు
***
621..కలియుగమున కష్ట జీవనులకు కావలసినది ఏకాగ్రత,  అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత  కులము ద్వారా, భక్తి ద్వారా, దేశ శక్తి ద్వారా జ్ఞానమనే చెట్టుద్వారా  వచ్చును .  విజ్ఞాన మెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు ఏకాగ్రత గా  మారును, విజ్ఞాన శాఖల మీదికి ఎగబాకును. వినయ మనే వృక్షమ్మును చేరి మనస్సును యుక్తముగా మార్చి సందర్భోచితముగా ప్రతి వక్కరి మనస్సు లో ఉన్న సమస్యలను ప్రక్షాలను చేయగల శక్తే ఏకాగ్రత .  .
పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింప బడుట‌ ఎందుకు ?. మరియు పొట్ట పోసికొనుటకు డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు టెందుకు?  ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తి విధులను, ధర్మమును తప్పక  తమ కోరికలు తీర్చుకొనుటకు‌ ఏకాగ్రత అవసరము .  కర్తవ్యపాలనము, ధర్మా చరణమునకై సమన్వ యింప‌ చేసిన ఆనందము ఆరోగ్యము ఆద్యాత్మికం మీవెంటే ఉండు .
కొందరు  ధర్మము ‌కన్నా ధనము, అధికారము,‌ కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై‌ అల్పాయుష్కులగుట యే వారుచేసిన కర్మయే, దానికి తోడు అనుకరణ కర్మకూడా ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఇది అవసరమా ? .
సుఖ శాంతులను కలిగించునది దైవానుభూతి‌ ఒక్కటే. ఇట్టి అనుభూతికి‌ సులభము, తీయనైన బోధ యుండ వలయును. వేదాంత గ్రంధములకు‌ ఇట్టి సమర్థత లేదనుకోవటం మూర్ఖత్వం ఏది ఏమైనా ఓర్పు ఓదార్పు నేర్పు తీర్పు నిన్ను ఏకాగ్రతగా మారుటకు ప్రయత్నించినా ఖచ్చితముగా నీవు మారగలవు . .
ఇంద్రియముల ఆకర్షణకు లోనై  జీవించు వారిని గొప్పదయిన, మధురమయిన‌ ఆకర్షణ వైపు లాగును అందులో వయసుకు తగ్గ విధముగా అనుకరించి అనుభూతి ని పొందుటకు ఏకాగ్రత అవసరము.
మనో వాక్కు ఫలం సిద్హించు - ప్రమోదమ్ము జ్ఞానం సృష్టించు
***
622..ప్రాంజలి  ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (4  ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
లక్షణాలను అర్ధం చేసుకొనే శక్తి  మనమేధస్సు కు అర్ధం కావటంలేదు, గౌరవం అగౌరవాల మ ధ్య నలిగి పోతున్నది. అందుకే  విలువ లేని చోట మాట్లాడకు, గౌరవంలేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశ పడకు. అయినా నీ  నిజాయితిని మరచి ప్రవర్తించకు. 
లక్ష్యం అలక్ష్యం మనుషులవెంట కొన్ని విషయాలలో ఉండటం సహజం మంచిచేడు గమనించి బతకటమే లక్ష్యం అందుకే నీకు నచ్చని, ఇష్టంలేని విషయాలకి క్షమాపణ చెప్పకు, నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు, నిర్లక్ష్యంవున్న చోట ఎదురు చూడకు,  అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు.  
వ్యక్తిత్వాన్ని వ్యర్ధంగా ప్రవర్తించకు, అగోరమైనదని అదేపనిగా అనుకున్నా ఫలితముండదు, అందులో ఉన్న నీవుచేసిన తప్పును గమనించు అందుకే  వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు, ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు, చులకనగా చూసే చోట చొరవ చూపకు,  జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు. 
భారం అని దూరం వెళ్ళకు, ఆత్మాభిమానం వదలి ప్రవర్తించుట ఎందుకు అందుకే భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు, ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు. 
ఏ విషయంలో తొందరపడకు, అంతా నేను చేస్తున్నానని అనుకోకు, నావెనుక  దేవుడనే వాడు ఉన్నాడని మరువకు అహం వదలి ప్రేమ పంచి బతుకు అందుకే  ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు, నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు. నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు. 
.    
అందుకే కన్న తల్లితండ్రులు, గురువుల మాటను అనుకరించి జీవితము సాగించు అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. 
***
623..ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏకాగ్రత కోసం అమృతఘడియల్లో - .. ఆత్మబలం
మన : శాంతి కోసం వ్రాస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి
బంధం ఉంటే అద్దంలా ఉండాలి లేదంటే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్దం చెప్పదు నీడ మనల్ని వదిలివెళ్ళదు
(అద్ధం కుడిని ఎడమగా చూపిస్తుంది., కానీ రూపం మారదు,  చీకట్లో నీడ కనుమరుగు అవుతుంది, చీకట్లో మనమే నడవలేము దేనికైనా  కావాలి,  వెలుతురు   ...
బంధం లేకపోవడమే మోక్షం...నిష్కామ కర్మతో బంధం నుండి బయటపడాలి.
మన ఊపిరి ఆగిన మరుక్షణమే బంధాలు అనుబంధాలు మాయమైపోతాయి.
బంధం ఒక మనసు మాయ...ఎదుటి వ్యక్తి నీపై నేరుగా "నెగ్గే దమ్ము " లేనపుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు
గెలవడం / ఓడడం అనేవి మనసు మాయ గెలుపోటములని సమద్రుష్టితో  చూడడం అలవాటు చేసుకోవాలి.
"వ్యక్తిత్వం" మనిషి అస్ధిత్వం  కాని "పరిణతి" వ్యక్తిత్యం పరిష్కరించలేని సమస్యలను
చాలాసార్లు పరిష్కరిస్తుంది
. .వ్యక్తిత్వం మనసుకి పరిణతి బుద్ధికి చెందినవి      ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం" లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని *నమ్మేస్తాం నిజా నిజాలు తెలుసుకొనే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం
"నిజం" అంటే ఒక సంఘటన పట్ల  ఒకరి (ప్రత్యక్షసాక్షి కావచ్చు) వివరణ మాత్రమే
"వాస్తవం'' అనేది నిజంకంటే ఎంతో లోతైనది
నాకు సృజనాత్మకత లేదు, ఊహించడం, కలలు కనడం కూడా రాదు.
వయస్సు పెరిగే కొద్ది దేహం యొక్క శక్తి క్షీణించి,శ రీరం అనారోగ్యాలుపాలు అవుతుంది.
కాని అడ్డం మాత్రం మారదు, నీడ నిన్ను వెడలి పోదు
--(())--

***
624..     నిస్పృహ    చెందవలసిన   పనిలేదు శక్తిని  పెంచుకోండి
        అంతర్గత    శక్తిని  గ్రహించి   ధైర్యముతో    పైకి   లేవండి
        సంకల్పానికి   నడుంకట్టి సాధించడానికి సంకల్పిమ్చండి
        భాద్యత మొత్తాన్ని సృష్టి కర్తవల్ల జరిగిందని మరువకండి
        వ్యక్తిత్వ వికాసం ప్రతిఒక్కరు పెంచుకోండి
        లైమ్గిక కోరిక  మనసు లోకి రానీయకండి
        భయం  వదలి   నిర్భయముగా  బ్రతకండి
        అహంకారం అణువంతకుడా రానీయకండి
        బుద్ధిని  వికసిమ్ప చేసే విద్య  నభ్య  సిమ్చండి
        మానసిక శక్తిని పెంచే యోగాసనాలు చేయండి
        భవిషత్ గురించి ఎటువంటి ఆశలు పెట్టుకోకండి
        జగతిలో మిమ్మల్ని  గుర్తించే వారిగా   ఎదగండి
.
        యువకులార     గురువు     వద్ద     విద్యలు    నేర్చు కొండి
        మీ భుజ  బలంతో   పాటు  భుద్ది బలం   కూడ   పెంచు కోండి
        వేదాంత   సారాన్ని  అర్ధం చేసు  కోవ టానికి ప్రయత్నించండి
        దినచర్యలో పెద్దలను,గురువులను గౌరవించటం మరువకండి
        వల్లమాలిన    మంచితనం      ప్రవర్తిమ్చ్  కండి
        ఎప్పుడూ  కష్టాలను     ధైర్య ముగా  ఎదుర్కొండి
        ప్రతి  పనిని నమ్మకంతో  చేయగలనని చెప్పండి
        రాజవంశానికి చెందిన ఆచారాలను మరువకండి
        మచ్చలేని   పవిత్రమైన     రాజ్యముగా   పాలించండి
        అజ్ఞానులకు వెలుగును చూపి జ్ఞానులుగా మార్చండి
        అసమర్ధత,   సోమరితనం  నిజమైన పిరికితనమండి
        ప్రజల   అవసరాలు      తెలుసుకొని   సహకరించండి
        బ్రహ్మ  చర్యమును    నిర్లక్షము     చేయ  కండి
.       ప్రేమ, కారుణ్యం,శాంతి, సంతోషములు పంచండి
.       ప్రజలకు  నిజాఇతి     చిత్త సుద్ధి   కల్పిం   చండి
.       ఆత్మ    విశ్వాసంతో   ధర్మ పరిపాలన  చేయండి
.        విశ్వామిత్రుడు   అయోధ్యకు   వచ్చె  యాగ  రక్షణకు
         యాగ రక్షణకు శ్రీ రాముని  కోరి  దశరధుడు  పంపెను వర్తమానం
        మహ తెజో  వంతుడు   విశ్వామిత్రుడు    అయోధ్యకు ఆగమనం
        పరమ ఉదార స్వభావుడు దశరధుడు విశ్వామిత్రునకు సన్మానం
.       రాజర్షులు   మమ్ము  అనుగ్రహించండి,   తెలపండి మీ  మనోరధం
        నా మనస్సు వెధిస్తూ ఉన్నది కోరిక తీరుస్తారా లేదా అని సంశయం
        మహారాజ నేను సిద్ధినికోరి ప్రారంభించాను మహాయజ్ఞం
        రాక్షసులు    యజ్ఞమునకు   కలిగిస్తున్నారు   ఆటంకం
        వారిని  ఎదుర్కొని   కోప   తాపలతో  చేసే యజ్ఞం వ్యర్ధం
.       వారిని  చంపే   తపశక్తి   ఉన్న చేయను వారితో యుద్ధం
        రాజ యాగ రక్షణకు శ్రీ రామూడ్ని పంపి చేయండి సహాయం
        విశ్వామిత్ర కోరిక  విన్న  దశరధ మహారాజు చెందే విస్మయం
        యాగ రక్షణకు    నేనే   స్వయముగా    వస్తానని   విన్నపం
         దశరధ మాటలయందు తొనికిసలాడుతుంది పుత్రవాత్సల్యం
        విశ్వామిత్రుడు కోపముతో రఘు వంశీయులకు తగదు ప్రతిజ్ఞాభంగం
        వసిష్ఠ మహర్షి దశరధుని పిలిచి శాంతింప చేయండి విశ్వామిత్ర కోపం
        ధైర్యవంతులు కుమారుని విశ్వామిత్రుడుతో పంపుట అనేది మీ ధర్మం
        భార్యలను పిల్లలను సంప్రదించి విశ్వామిత్ర కోరిక తీర్చుట శ్రేయస్కరం
.
        సర్వసాస్త్రములు తెలిసిన  వారితో కుమారుని  పంపుట  కెందుకు భయం
        గురువర్య వయస్సులో చిన్నవాడు రాముడ్నిపంపటమా అనేదే సందేహం
        విశ్వామిత్రుని శక్తి నాకు తెలుసు రాజగురువుగా చేస్తున్నాను హితోపదేశం
        శ్రీ రామునితో   లక్ష్మణుని   కుడా    పంపుటకు   దశరధుడు  అంగీ  కారం
        తల్లి  తండ్రుల  మాటప్రకారం  రాజర్శితో వెళ్ళుట సిద్ధం
        రామ లక్ష్మనులు గురువులకు పెద్దలకు చేసే వందనం
        తల్లులకు ప్రజలకు  తెలిపే  చేయగలం  కార్యస్సఫలం
        మీ అందరి  దీవెనలు  కావాలి   మాకు  ఈ సమయం
        గోభ్రాహ్మణుల   హితము   కొరకు  మేము  సిద్ధం
        దేశ రక్షణకు ఎంతటి  త్యాగాన   కైన   వెనుకాడం
        మహాత్ముల  ఆదేశం   పాటిమ్చటమెమా కర్తవ్యం
        గురువర్యులు చెప్పిన విదముగా నడుచుకుంటాం
        ప్రభాత   సమయమున  రామ   లక్ష్మణులు  ప్రయాణం
        ప్రయాణంలో  భోధించే  రాజకుమారులకు  ఆత్మప్రభోధం
        రామ నీ జన్మ వళ్ళ అజ్ఞానులకు కలుగును జ్ఞానోదయం
.       సర్వులకు ఆదర్సప్రాయులుగా జీవిమ్చుటే మానవధర్మం
***
626..విశ్రాంతి
నారదా శీతల ప్రాంతమునకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకుంటే  బాగుంటుందనిపిస్తుంది,  ప్రకృతి చల్లని వాతా వరణములో అలా అలా  సంచారము చేస్తే మనసుకు ఏంతో  ఉల్లాసముగా, ఉస్చాహంగా  ఉంటుంది కదా నారదా  అన్న విఘ్నేశ్వరుని మాటలకు అవునవును అని నిద్రనుండి లేచినట్లు పలికాడు నారదుడు.
 .
నారదా నీవు ఈలోకంలో  ఉన్నట్లు లేవు ఎక్కడో  విహరిస్తున్నావు, ఏమిటి విశేషము అని  అన్నాడు విఘ్నేశ్వరుడు.
నేను కొన్ని ప్రశ్నలకు   మీనుండి  సమాదానుములు తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు చెపితే సంతృప్తి పడగలను  
అడుగు నారదా నాకు తెలిసినవి చెప్పగలను , తెలియనివి తల్లి తండ్రులనడిగి చెపుతాను, మరి అడగటమే ఆలస్యము, కాస్త ఈ లడ్డులు తినవచ్చా  మీ ప్రశ్నల కేమన్న అడ్డమా.
నారదుడు: మహాప్రభు ఎంతమాట, మీరు తినేటప్పుడు వచ్చానని అనుకోకండి
విఘ్నేశ్వరుడు : అడుగుమరి ఆలస్యమెందుకు     
నారదుడు :(1) ఆనందం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : కామానికి మించిన వ్యాధి లేదు ,మొహానికి మించిన  
         శత్రువు లేదు, క్రోదానికి మించిన అగ్ని లేదు, ఆత్మజ్ఞాన్నానికి 
         మించిన సుఖం లేదు, ఆద్యాత్మికతకు మించిన ఆనందం లేదు. 
          ప్రవహించిన నది సముద్రములో కలసినట్లు, సంసారం కష్ట 
          సుఖాలు పోవటానికి నవ్వుతూ బ్రతకటమే నిజమైన ఆనందం. 
నారదుడు: (2) భార్య భర్త లమధ్య ఉండాల్సినదేది ?. 
విఘ్నేశ్వరుడు: నవ్వు, ఏడుపు మరియు తృప్తి 
నారదుడు : (3) నిరాశవాదులు ఎవరు ?
విఘ్నేశ్వరుడు : చాలామంది ఆశావాదులకు అప్పులిచ్చి తాము నిరాశా 
          వాదులవుతారు. అటువంటి వారే
నారదుడు : (4) తల్లితండ్రుల వ్యత్యాసం ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : తల్లి జీవితాంతము తల్లిగా ఉంటుంది, కాని తండ్రి కొత్త  
           భార్యను తెచ్చుకొనే వరకు తండ్రిగా ఉంటాడు.
నారదుడు :(5) సారధ్యం, ప్రేరణ, దృక్పధం గురించి వివరిస్తారా?
విఘ్నేశ్వరుడు : నీవు ఏమి చేయ గలవో చెప్పేది సామర్ద్యం  
            నీవు ఏమి చేయాలో నిర్ణయించేది  ప్రేరణ 
            నీవు ఎంత నైపుణ్యంతో ఆపని చేయగలవో నిర్ణయించేది  
            దృక్పదం. 
నారదుడు :(6)  ప్రామానికియా గ్రంధం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు: ప్రామాణిక గ్రంధం అంటే ప్రజలు కొనియడేది, కాని 
            చదవనిది
నారదుడు: (7) పిల్లలలో ఎ భావం ఉంటుంది ?
విఘ్నేశ్వరుడు: ప్రేమభావము, మధురభావము, హాస్య భావము 
            మరియు కఠోరభావము.
నారదుడు:(😎 వివాహ కలయిక అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : సంతోష దాయక మైన వివాహము, క్షమ (ఓర్పు ) 
             గుణమున్న ఇద్దరి కలయక.     
నారదుడు :(9) పిల్లలు ఎవరి మాట వింటారు ? 
విఘ్నేశ్వరుడు : పిల్లలు తల్లి, తండ్రి, గురువు మరియు ధనం మాట 
             వింటారు
నారదుడు : (10) టి.వి చూస్తె లాభమా, నష్టమా ?
విఘ్నేశ్వరుడు : లాభం మెదడుకు మించిన మేత, నష్టం:కళ్ళ జోడుకు 
              ఖర్చు 
***
627..నేటి భగవద్గీత
:
"నీవు గాని, ఈ రాజులు గాని వీరందరూ కూడా ఎప్పుడూ లేనివారు కాదు. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఈ దేహాలు నశించినా మనందరం ఎప్పుడూ ఉండేవారమే" అని స్పష్టం చేశాడు భగవానుడు. వేరువేరు దేహాలలోని ఆత్మ ఎప్పుడూ ఉండేదే. దేహాలు నశించినా, నశించకుండా ఎప్పుడూ ఉండే తత్త్వం ఒకటి ఉన్నది. అదే ఆత్మ. అది త్రికాలలోనూ ఉంటుంది. త్రికాలాతీతంగాను ఉంటుంది. అదే జీవుని యదార్థ తత్త్వం. దానికి చావు పుట్టుకలు లేవు. ఏమార్పులూ లేవు.
    కనుక ఓ అర్జునా! ఆత్మ నిత్యమైనది. నీవు ఆత్మవే కాని దేహానివి కాదు. నీవే కాదు, ఈ సమస్త ప్రాణికోటి ఆత్మస్వరూపమే. అందరమూ ఆత్మస్వరూపమే. అన్ని కుండలలోనూ ఒకే మట్టి ఉన్నట్లు, అన్ని ఆభరణములలోనూ ఒకే బంగారం ఉన్నట్లు, అన్ని దేహాలలోను ఒకే ఆత్మ ఉన్నది. ఇక్కడే చాలామందికి సందేహం. అన్ని దేహాలలోను ఒకే ఆత్మ ఉంటే అందరూ ఒక్క విధంగానే ప్రవర్తించరెందుకు? కొందరు ధర్మాత్ములుగా, కొందరు అధర్మపరులుగా; కొందరు పుణ్యాత్ములుగా, కొందరు పాపాత్ములుగా, కొందరు మంచివారుగా; కొందరు చెడ్డవారుగా; కొందరు అందంగా; కొందరు అనాకారంగా ఎందుకుంటున్నారు? ఇలా తప్పుగా చెబితే వేదాంతాన్ని ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నిస్తారు. మరి ట్యూబ్ లైటులోను, ఫ్యాన్ లోను, ఫ్రిజ్ లోను, హీటరులోను ఒకే కరెంటు ఉన్నదా? వేరువేరు రకాల కరెంటు ఉన్నదా? అన్నింటిలోనూ ఒకే కరెంటు. ఒకే తీగ ద్వారా ఇంటిలోనికి వచ్చింది. మరి లైటు వెలుగుతున్నది, ఫ్యాను తిరుగుతున్నది, ఫ్రిజ్ చల్లబరుస్తున్నది, హీటరు వేడిచేస్తున్నదేం? ఇది కరెంటులోని తేడా కాదు, ఆయా పరికరాలలో తేడా. అదేవిధంగా అందరిలో ఒకే ఆత్మ ఉన్నప్పటికీ, వారి వారి దేహమనోబుద్ధులనే పరికరాలలో తేడాల వల్ల వేరువేరుగా కనిపిస్తున్నారు. వ్యవహరిస్తున్నారు. కనుక అన్ని దేహాలలోను ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మయే నేను, నీవు, ఈ రాజులు, అందరూ కూడా. ఆత్మజ్ఞాని ఎంతగా చెప్పినా 'దేహమే నేను' - అనే అజ్ఞానంలో ఉన్న సామాన్యుడు తికమకపడుతూనే ఉంటాడు. అర్జునుడు కూడా తికమకలో ఉన్నట్లు గుర్తించాడు శ్రీకృష్ణుడు. అందుకే -

శ్రీకృష్ణుడు: అర్జునా! నీవిప్పుడున్నావా?
అర్జునుడు: ఆ! లేకేం ఉన్నాను. నీ ఎదురుగానే ఉన్నాను.
శ్రీకృష్ణుడు: శరీరంతో ఉన్నావా? శరీరం లేకుండా ఉన్నావా?
అర్జునుడు: శరీరంతోనే ఉన్నాను. ఇందులో సందేహం ఏముంది?
శ్రీకృష్ణుడు: సరే, ఈ శరీరం ఏం చేస్తే నీకు వచ్చింది?
అర్జునుడు: వెనుకటి జన్మలలో నేను చేసిన పుణ్యపాప కర్మల ఫలితంగా వచ్చింది.
శ్రీకృష్ణుడు: అంటే వెనుకటి జన్మలలో నీవు పుణ్య పాపకర్మలను చేశావా?
అర్జునుడు: అవును, చేశాను, చేయబట్టేగా ఈ జన్మ వచ్చింది.
శ్రీకృష్ణుడు: అయితే అప్పుడు నీవు ఉండే చేశావా? లేకుండానే చేశావా?
అర్జునుడు: నేను లేకుండా కర్మలెలా చేస్తాను? ఉండే చేశాను.
శ్రీకృష్ణుడు: ఉంటే - అప్పుడు ఈ దేహంతోనే ఉన్నావా? లేక మరొక దేహంతోనా?
అర్జునుడు: ఏ దేహమో తెలియదు గాని, మొత్తం మీద ఏదో ఒక దేహంతో ఉన్నాను.
శ్రీకృష్ణుడు: అంటే అప్పుడు నీవున్నావు, ఏదో ఒక దేహం ఉంది, ఆ దేహం ఎలా వచ్చింది?
అర్జునుడు: అంతకుముందు జన్మలలో చేసిన కర్మలను బట్టి.
శ్రీకృష్ణుడు: కనుక ఓ అర్జునా! అనేక జన్మల నుండి నీవున్నావు. దేహం మాత్రం మారిపోతున్నది. అంటే దేహాలు అనిత్యం. నీవు మాత్రం నిత్యం. నీవే కాదు - ఇక్కడ - ఈ లోకంలో అందరూ నిత్యులే. అట్టి నిత్యులైన వారికోసం ఏడుపెందుకు?
    జీవుడి యొక్క అసలు తత్త్వం ఆత్మయని, ఆత్మ నిత్యమని - 
--(())__

628 ..*అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం*..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.
--)(--
629 .. *పిరికితనాన్ని మించిన మహాపాతకం మరొకటి లేదు. పిరికిపందలు రక్షించబడరు. అది నిశ్చయం.

*పాశ్చాత్య ప్రపంచంలో జీవితం పైకి నవ్వులమయంగా ఉంటుంది. కానీ లోలోపలంతా విషాదం, చివరికి అది వేదనగా పరిణమిస్తుంది. భారతీయ సమాజం నరాశా నిస్పృహలు ఆవరించినట్లు కనిపిస్తుంది. కానీ లోలోపలంతా ఉదాసీనత, ఉల్లాసాలతో నిండి ఉంటుంది.

*పగిలిపోయిన మైక్రోఫోన్ ద్వారా మీరేదీ ప్రసారం చెయ్యలేనట్లే. అశాంతి వల్ల అస్థవ్యస్తమయిన మానసిక మయిన మైక్రోఫోను ద్వారా మీరు ప్రార్ధనను నివేదించుకోలేదు. మీ మనస్సనే మైక్రోఫోనును గాఢమయిన ప్రశాంతతతో మీరు మరమ్మత్తు చేసి మీ సహజావబోధానికున్న గ్రాహకశక్తిని పెంచండి. ఆ విధంగా మీరు భగవంతుడికి పటిష్టంగా ప్రసారం చెయ్యగలుగుతారు ; ఆయన దగ్గర నించి సమాధానాలు పొందగలుగుతారు.

*3) నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్|

ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ ||

యువతుల స్తనములను,నాభిని చూచి మోహావేశం పొందకుము.అవన్నీ మాంసపు ముద్దలే అని మరల మరల మనసులో తలచుము.
***

630..*ప్రాంజలి ప్రభ కథలు*

తమిళభాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు

అర్థవంతమైన హిందూ మతము. నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు

1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం,* *హిందూధర్మం.

2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళి తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం* , *హిందూధర్మం.

3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పని సరిగా ఒక్కసారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం.

4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం.*

5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు.

6.  సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం,* *హిందూధర్మం.

7.  హిందువులు ఈ క్రింది వాటిని కూడా* *భగవత్స్వరూపాలుగానే ఆరాధిస్తారు.*

వృక్షాలు దైవ స్వరూపాలే.
రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.
నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.
గాలి కూడా దైవ స్వరూపమే.
వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.
కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.
పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.

8. నువ్వూ దైవ స్వరూపమే.


     *నేనూ దైవ స్వరూపమే* .
     *చక్షు గోచరమైనవన్నీ* 
      *(కంటికి కనిపించేవన్నీ)*
     *దైవ స్వరూపాలే.*

9. చతుర్వేదాలు, నాలుగు ఉపవేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, *హిందూధర్మం.*

10. మన ధార్మిక గ్రంధాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.

కర్మల గురించి తెలియాలంటే వేదాలు చదవాలి.

సమస్త జ్ఞానం పొందాలంటే .. ఉపనిషత్తులు చదవాలి

పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ...... రామాయణం చదవాలి.

రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ...... మహాభారతం చదవాలి.

భగవంతుని తత్త్వం తెలియాలంటే ...... భాగవతం చదవాలి.

చక్కటి పరిపాలన అందించాలంటే ..... కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.

అన్యోన్య దాంపత్యానికి ...... వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.

చక్కటి ఆరోగ్యానికి ...... ఆయుర్వేదం చదవాలి.

మేథస్సుకు ..... వేద గణితం చదవాలి.

శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి పతంజలి యోగశాస్త్రం చదవాలి.

భవన నిర్మాణాలకు ..... వాస్తుశాస్త్రం చదవాలి.

గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి 🌎ఖగోళ శాస్త్రాన్ని చదవాలి

11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం,* *హిందూధర్మం.*

12. ఆహార అలవాట్లలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాఖాహారం, మాంసాహారం ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు)

13. *హిందూధర్మం,* *అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.

14. మోక్షానికి దారి చూపించే ధర్మం, హిందూధర్మం

15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.

16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం

హిందువుగా జన్మించాం. హిందువుగా జీవిద్దాం. హిందువుగా మరణిద్దాం.
*****

    631.. చదువుల మీద అన్నమయ్య రకరకాల పద్ధతులలో తన గీతాలలో వ్యాఖ్యానాలు చేసాడు.

     'ఇదివరకు కొంత చదివాను. ఇంకా కొంత చదువుతాను, కాని ఏం ప్రయోజనం. నాలో ఉన్న నా శత్రువును గురించి తెలుసుకోలేకపోతున్నాను. ఈ పల్లవిలో శత్రువులను ఎదిరించే పద్ధతిని దృఢంగా చదువులు నేర్పలేకపోతున్నాయని ఒక ఆవేదనతో కూడిన విసురు ఉంది. 'తన మనస్సే తనకు బంధువు. తన మనస్సే తనకు శత్రువు.' అనే భగవద్గీతా పాఠాన్ని వివరంగా హృదయానికి హత్తుకొనేటట్లుగా చదువులు నేర్పటంలేదు. అందువల్ల ప్రతి వ్యక్తి తనలో ఉన్న శత్రువును తెలుసుకోలేక పోతున్నాడని, అందువల్ల తనని తాను ఉద్ధరించుకోలేకపోతున్నాడని బాధ పడుతూ, చదువుద్వారా మనిషికి రావలిసిన సిసలైన వ్యక్తిత్వాన్ని చరణాలలో వివరిస్తున్నాడు.

     పుణ్య, పాప, మిశ్రమ కర్మలు, విధి, నిషేధ, ప్రాయశ్చిత్త కర్మలు, సంచిత కర్మలు (అనేక జన్మలలో చేయబడి ఇంతవరకు అనుభవింపబడకుండ సంస్కార రూపంలో నిలిచి ఉండేవి) ఆగామి కర్మలు (ముందు జన్మలలో ఫలితం కలిగించేవి) ప్రారబ్ధ కర్మలు (ఈ శరీరంలో సుఖ దుఃఖాలను కలిగించేవి), కేవల ఐహిక కర్మలు, కేవల ఆముష్మిక కర్మలు, ఐహికాముష్మిక కర్మలు - ఇలా ఎన్నెన్నో కర్మలు. వీటిలో తెలిసి చేసినా తెలియక చేసినా - పాపాన్ని కలిగించే కర్మలు చాలా ఉ న్నాయి. 'నాకు సంబంధించిన కర్మలను ఏనాడు నిందించను, స్వామిని శరణు వేడి వాటిని పోగొట్టుకోవటానికి ప్రయత్నించను కాని ఇతరులను తిట్టడానికి మాత్రం చాలా ఉత్సాహపడతాను' అని అన్నమయ్య ఘాటుగా నిందాపరుల జీవనాన్ని విమర్శించారు. పర నిందలను మానుకొమ్మని, తన జీవితాన్ని నిందా రహితంగా ఉద్ధరించుకొమ్మని ఒక గొప్ప సందేశం ఇందులో ఉంది. 

     ఈ గీతంలో "నేను" అనేదానిని అన్నమయ్యకి మాత్రమే అన్వయించుకోకూడదు. ప్రతి జీవుడు ఈ "నేను" లో కనబడతాడు. కనబడాలి. అన్నమయ్య జీవితంలో దిగజారిపోయిన వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటాయన్నాడు.

1. ఇతరులను దూషించటం, 2. ఇతరులను ఎగతాళి చేస్తూ వెక్కిరించటం, 3. ఊరికే ఇతరుల మీద కోప్పడటం, 4. తాను ఆచరించకపోయినా ఇతరులకు నీతి పాఠాలు చెప్పటం, 5. ఇతరుల గోరంత తప్పులను కొండంతలుగా చేసి ప్రచారం చేయటం, 6. కాలం విలువను తెలుసుకోలేకపోవటం ఆరు లోపాలకు ఆ - 'గీతాచార్యుడు' ఇలా నివారణోపాయాలు చెప్పాడు.

     1. జన్మ జన్మలనుండి వస్తున్న కర్మలను నిందించుకో, 2. నువ్వు ఎత్తుతున్న జన్మ కష్టాలను చూసి నవ్వుకో, 3. కోరిక మొదలైన శత్రువులు మీద కోప్పడు, 4. నీలో ఉన్న వారిని ప్రతి నిమిషం తలుచుకొని నీతిగా బతుకు, 5. ఛండాలమైన ఆశలను తగ్గించుకో, 6. కాలం విలువను తెలుసుకొంటూ హరిని ధ్యానించు మానవుడు కర్మాధీనుడని చెబుతూ (18-60) దాని తర్వాత శ్లోకంలో తనను శరణు వేడమని (18-62) అందువల్ల కర్మల బంధాన్నుంచి, మాయల బంధాన్నుంచి మానవుడు విముక్తుడవుతాడని భగవద్గీతలో స్వామి చెప్పాడు.

భగవద్గీతలోని అటువంటి భావాల ఆధారంగా రాసిన ఇటువంటి చదువు కీర్తనలలో ఆధునిక జీవితానికి పనికివచ్చే వ్యక్తిత్వ పాఠాలు చాలా ఉన్నాయి. అన్నమయ్య కీర్తన వేంకటేశ్వరుని చిరునవ్వు మాత్రమేకాదు, గీత అనే కాంతితో వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరించే పతాక.

.......



బ్రాహ్మణ.. జ్ఞాన సత్యాలు.. ఒకరికొకరిగా పలుకు PRT



No photo description available.
All reacti





























ప్రాంజలి ప్రభ.. బ్రాహ్మణ.. జ్ఞాన సత్యాలు.. ఒకరికొకరిగా పలుకు
గీ..అమ్మ మనసు శాంతిగమార్చ ఆశ నాది
నిత్య సత్య ప్రమాణాలై నిజము వాది
మనసు కనుపాపగను చూడ మార్గ మవధి
వయసు యమ్మ సేవలకేను వాక్కు నాది
ఏడు జన్మల బంధమయ్యేను మాది యీశ్వరా...1

గీ..ఎంత వరకు సమంజసము యేల చెప్ప
యెన్ని వాక్కులు మనసుకు యేల ఒప్ప
కన్న కళలు తీర్చ తనయ కామ్య మోప్ప
ఉన్ననాడు లేని దనియు ఊరు చె ప్ప
విశ్వ మాయ జూప కథలు విప్పి చెప్ప యీశ్వరా...2

గీ..స్నేహ బంధసుఘంధమే సేతు వైన
ప్రేమ వాశ్చల్యము ప్రగతి ప్రీతి యైన
క్షేమ మన్నది చేరువ క్షమయు గాన
ప్రణవ వేదము పలుకుగా ప్రాణ మైన
కాంతి ధార మనసు చేర కాల మైన యీశ్వరా....3

గీ..ఉమ్మడి కుటుంబ జీవితం ఉంచు యోగ
అనుభవించెడి వారికి ఆది భోగ
సమర మైనా సుఖము పొంద సమయ యాగ
నీ దుగా ద్వేష సంపద నీడ రోగ
చెలిమి కలిమి బలిమి చేరు చింత మూగ యీశ్వరా..4

గీ..ఏది చదువు జాగర్తగా యెల్ల వేళ
తల్లి తండ్రుల కష్టము తీపి మేళ
బ్రతుకు బ్రతికించు చదువుయే బంధ మేళ
నీదు శ్రమ నీకు రక్షయు నిత్య మాల
హృదయ తత్త్వము యెరిగియు హృద్య బేల
మొగ మృగాలు వేటాడుతూ మోక్ష లీల యీశ్వరా..5

గీ..మరకత మకుట మణి రత్న మాయ లేల
రాజ్య భోగాల సంపద రక్ష యేల
నిత్య బ్రహ్మాండ వెలుగులే నియమ మేళ
వజ్ర వైడూర్య ముత్యాలు వరుస యేల
ప్రకృతి ప్రభవించు లీలలు ప్రగతి లేల యీశ్వరా....6

గీ..ఇష్ట సఖుని బంధాలలో యిచ్ఛ యేల
మరచి కరిగిపోతూ లోక మనసు లీల
నెచ్చెలికి ఇంతకన్నాను నీడ లేల
భాగ్యముండునా యనకయే బాధ లేల
ఇంతికి సుఖమే యిమ్తని ఇష్ట మేళ యీశ్వరా...7

గీ..ఎండలో యండ దంచేస్తు ఏడ్పు తెచ్చె
వేడి గాల్పులతో మండ వింత తెచ్చె
నాల్కలు తడి దాహార్తితో నాడి విచ్చె
గుండెలాకలితో శబ్ద గుర్తు తెచ్చె
నలుదిశలలొ కాలుష్యంతొ నటన న చ్చె యీశ్వరా....8

గీ..పసిదన ముసలివేషము పాఠముయిది
అక్షయ నిరంతరపరిమాణమ్మగు విధి
ప్రాణి బాధల సంతోష పాశమె నిధి
జీవ సూత్రధారి సృజన జీవిత మిది
నిత్యము జగద్వితముగాను నీడయెతిధి యీశ్వరా...9

ఉ..చక్కని మాటలే మనసు జాతరశోభకు మార్గదర్శగన్
చెక్కెర తీపియే కవిత చేష్ట వయస్సగు లీలమార్గమున్
మక్కువయేవిశాలమగు మానస సౌఖ్యత సర్వవేళగన్
తక్కువ యెక్కువేయగుట తత్త్వపు కావ్యసమర్ధతేయగున్
చుక్కల చంద్రసూర్యకళ సూత్రమనంతము యంబరమ్ముగన్ యీశ్వరా....10

ఉ..కొంత యహమ్ము కారమగు కొందరి చూపు యహం కనొచ్చుటే
ఇంతిగ దాహమే గతియు యిష్టసహాయము కొంత చేయుటే
కాంతిగ కాలనిర్ణయము కానుకయేయగు తృప్తి పర్చుటే
శాంతిగ కోపతాపములు సాధన శోధన సౌఖ్య మిచ్చుటే
బ్రాంతిగ జీవితమ్మగుట బాధల బంధము చెప్పి వచ్చుటే యీశ్వరా...11

కొంత మనస్సు కారమగు కోప మయమ్మగు నేస్త నొచ్చుటే
కొంత ఉషస్సు కారమగు పొందుకళే మది యాట నొచ్చుటే
కొంత యశస్సు కారమగు కొత్తవిధానము మాట నొచ్చుటే
కొంత తమస్సు కారమగు కోర్కెల కాలము గొప్ప నొచ్చుటే
కొంత వయస్సు కారమగు కోరిక తీర్చియు శోభ పంచుటే యీశ్వరా....12

మ..మనమున్ యేకము సేవ భావమగు మానమ్మున్ విశ్వాసమ్ముగన్
కనులన్ కమ్మెను శాస్త్రముల్ కథలు కార్యమ్మేను శాంతమ్ముగన్
తనువుల్ తత్త్వము తాపసమ్మ గుట తత్వార్ధమ్ము గావీధిగన్
శునకమ్ములు పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగా జూడగన్
ప్రణయమ్మేమది గా సుఖాలయము ప్రాబల్యమ్ము చూపే గతిగన్ యీశ్వరా....13
శా ..తెల్లారిందనిసాగు కాలపరుగే నిష్టౌను సర్వాంతరం
తెల్లారిందని జన్మగానుకదిలే జీవమ్ము విద్యాంతరం
తెల్లారిందని ధర్మ చక్ర గమనం తీవ్రమ్ము భావాంతరం
తెల్లారిందనిభక్తి యుక్తి సమయం తెల్పేటి దేశాంతరం
తెల్లారిందని కష్ట నష్టములుగా తిండౌను ప్రమాంతరం యీశ్వరా...14

ప్రాంజలి ప్రభ.. బ్రాహ్మణ.. జ్ఞాన సత్యాలు(2).. ఒకరికొకరిగా పలుకు 
[28/04, 6:37 am] Mallapragada Ramakrishna: 

గీ.పలుకు పలికించు ప్రేమతో పరువ మొచ్చి 
మాట పెంచు మనసునొచ్చు మమత చచ్చు 
ద్వేషమును పంచు మనుగడ దీన మెచ్చు 
పెదవిమాట హృదయపుయాట పిదప చొచ్చు 
మాన్యుల పలుకు మంటనే మచ్చ తెచ్చు యీశ్వరా..15

గీ..ఇపుడుచదవగలమనసు యిష్టమన్న 
అపుడుకదలికకలుగును యాశసున్న 
కపుల యనుకరణ మనము కాలమన్న
కవులమనసుభావములున్న కాసుసున్న
చెవుల విన్నది తెలుపుట చెంతనున్న యీశ్వరా........16

గీ..అణుకువ యనుకున్నది చెప్ప ఆశ్రితమగు 
మనసు యనుకోనిదితృప్తి మాయ  జరుగు 
కణము కదలిక జీవిత కాలపరుగు 
క్షణసుఖము తీర్పు మననేర్పు క్షమయు కలుగు 
ప్రణయ మిచ్చిబాధలుతెచ్చి ప్రభల పరుగు యీశ్వరా..17

గీ..నడుము వంగి నమ్మక ద్రోహ నటన యేల
నడక సాగదింక నరుల నాడి యేల 
విజయ మంది నట్టెకదలు విశ్వ మేళ
చేయి పట్టి నడుపుచున్న చేష్టలీల 
పాలపుంత సోయగముల పాఠమేళ యీశ్వరా...........18

గీ..నువ్వుజుట్టునువిరబోసిసుఖ కదలిక
మత్తురేపుయశాంతి తో మానగిలక 
నల్లకురులచాటున మోము నటన కనక 
నీదుకళ్ళుచూడనులేక నిలువ లేక 
నీ వెవరవో నె నెవరినో నిజముకాక యీశ్వరా.............19

గీ..చివికినచలిబారినరోత చినుకు తడిపి 
ఒదల కున్నకన్నుప్రేమ వలపు చిలిపి 
చెదలుదులిపిసహనమోపి చిరుగు జూపి 
చివరికేంమిగలదు రోగచీమ చెరిపి 
గీతమల్లె జీవితముయే గిరగిరకపి యీశ్వరా...............20

గీ..పూల పరిమళం ప్రతిరోజు పుట్టుచుండు 
పూజ్య మైసోకు కదలిక పుడమి తోడు 
పురులు విప్పి సొగసులుగా పువ్వుకనుడు 
పులకరింపుకలుగు చుండు పురుడు గోడు 
పురము పలకరింపుకదలి పూజ్యరేడు యీశ్వరా...........21

గీ..సొంత జీవితంబన మన సొమ్ము ప్రేమొ 
యితర జీవుల కారీతి యింప ప్రేమొ 
యిది తెలిసినట్టి మాన్యులు యిష్ట ప్రేమొ
కాంతురు సకల జీవులన్ క్రాంతి ప్రేమొ
ప్రాణులకు తమ కరుణను పంచ ప్రేమొ యీశ్వరా..........22

గీ..నానుట జలము నొద్దని నాన్న నన్ను
కోపమొచ్చే పనులు చేయ గొప్ప తన్ను 
ఊడి పోయింది బరకుడు ఊరి పన్ను 
కనులు కన్నీరు పన్నీరు కార్చు కన్ను 
అమ్మ పెట్టింది తినమని ఆశ జున్ను యీశ్వరా...............23

గీ..శ్రద్ధ సన్నుత భక్తియు సమయ శక్తి 
శ్రద్ధ మనసు కవచముగా సమయ రక్తి 
శ్రద్ధగ నినుఁ గొలుచు శక్తి సమయ యుక్తి 
శ్రద్ధరూపవు చక్కగ సమయ వ్యక్తి 
శ్రద్ధను విడఁజేసియుశ్రద్ధ సమయ ముక్తి యీశ్వరా..........24

గీ..మనువు వారసులే వీళ్ళు మనసు మారె 
వర్ణధర్మాల పేరుతో వరుస చేరె 
స్వేచ్చ లో స్వతంత్రాలుగా సేవ మారె 
మనిషి నోరెత్తటానికి మాయ చేరె 
ఎంత విర్రవీగుడు వీళ్ళ యేల మారు యీశ్వరా..... ........25

గీ..భావయిత్రి లోని భవ్యపు భాష లన్ని 
సరస కవిత యగుచు విరియు లన్ని 
మధురసధుని వోలె మనసు మాయ లన్ని 
సరస జనులు గనుచునున్న  సంతలన్ని 
ఒకరికొకరు వడిసి పట్టు వాక్కు లన్ని యీశ్వరా..............26

గీ..ఆగె గడియార కాలము అరవలేక
వీడె మేఘాలు కురిసాక విలువలేక
వెన్నెల పరచ నెలవంక వీడ లేక 
నీటి మీద రాత కలలు నీడ లేక
జ్ఞాపకాల ఫలములన్ని జ్ఞప్తి రాక యీశ్వరా...................27

గీ..మాయభయములేని మనిషి మాట లేల
మాయలో మనుగనివాడు మనిషి యేల
కాయము కరిగి పోచుండు కాల మేల
రోజుకో పద్య మనసుగా గోల యేల
విశ్వ మాయ వలన మేము విడువ టేల యీశ్వరా.........28

గీ..లోపలిస్వేచ్ఛ కనుగొను లోకమేది
ఒట్టి పోయిన ఆకాశ వోట మేది
మంచులాకరిగేసుఖ మనసుయేది 
ఉడుకుతత్త్వముఊహలఊపు యేది 
ఉలుకుపలుకులేనితనముఉట్టి యేది యీశ్వరా........... 29

గీ..తలపు రెక్కలు కథలుగా గలత చెంది  
ధరణిపైన ధూర్తులకళ దారి పొంది 
పరుగు పరుగున జొరబడు పలుకు నాంది 
అన్నదమ్ములాత్మీయుల  వెన్ను కంది 
సుఖము భోగము గలుగును శుభ్రత  చెంది యీశ్వరా.... 30

గీ..మాట పడనిమనిషినిద్ర మనసుబట్టి
శాంతి విశ్రాంతి తోడుగా వాక్కు బట్టి
బంధ క్షోభకు గురియైన భయము తట్టి
న్యాయ అన్యాయ జీవితం నాడి బట్టి
పగలు రేయిబతుకు జీవి పాఠమెట్లు యీశ్వరా..............31

ఆకలి భరించ గలిగేటి ఆట నీది 
నియమ అవమానము భరించ నీడ నాది 
నిత్య ఆత్మభి మానమ్ము నిలకడేది 
కాని పని నాది కాదను కాల మేది 
ఉన్న వారు లేదను వాక్కు ఊహ మాది యీశ్వరా...........32

శా..నన్నున్ కన్నులు చుట్టి చూచి నగవుల్ నాదాహమై నీడగా 
మిన్నంటేమురిపింబుతోడ తడుమున్ మేనెల్ల మోదంబుగా 
వెన్నుoదన్నుగ నిల్చినాను మురియున్ వేనోళ్ళకీర్తించగా
మూన్నాళ్ళస్వరమేసహాయ సుఖమే ముచ్చట్ల దేహమ్ముగా 
నన్నీలోకము తెచ్చె ! నీవె భువిపై నాదైవమేనాటిగా యీశ్వరా..33

పండితపరమమిత్రుని పాఠమేను 
సంచితసహననేస్తము సాధ్యమేను 
సంఘపుకథలుపంచెద శ్రావ్యమౌను 
సంతసమ్మువిజయవాంఛ సాధనౌను 
కాంతివలనగలుగుశాంతి కామ్య మౌను యీశ్వరా           ....  ... 34

ఒకరికొకరుమనసువిప్పి వొక్క పలుకు 
ఓడిగెలుచుసేవలుచేయ ఓర్పు చిలుకు 
లోకమందుసమస్యలే కోరి కెలుకు 
సుఖ శుభోదయం నిత్యము సూత్ర థలుకు 
ఈప్రపంచంబ్రతుకునేర్పు ఇష్ట కులుకు యీశ్వరా..    ... .....   35

వేషమ్ము వేసేసి - కాలమ్ము మింగేసి
మోసమ్ము చేసేసి - మౌనమ్ము మార్చేసి
దేహమ్ము కమ్మేసి  - శాపమ్ము ముంచేసి
మోహమ్ము దాటేసి - మోక్షమ్ము తీర్చేసి  
దాహమ్ము తీర్చేసి - ధ్యానమ్ము చేసేసి యీశ్వరా          ....  .....  36 

ప్రాణమ్ములో నుండు - ప్రాణమ్ము నీవందు
గానమ్ములో నిండు - గానమ్ము నీవందు
ధ్యానమ్ములోఁ జిందు - ధ్వానమ్ము నీవందు
నేనాటి బంధమ్మొ - యీనాఁడు నీవిందు 
మౌనములో నుండు - మోక్షమ్మునే తీర్చు యీశ్వరా    ... ....     37

లీలల్ వినోదమ్ము - లీలల్ ప్రమోదమ్ము
చాలించు మాయాట - జాలమ్ము లీమమ్ము 
నీలాలు నీవంటి - నేలన్ వెతన్ మమ్ము 
నాలించు మోనాథ - యాలించు మీ దమ్ము  
పాలించు దేశమ్ము -  పాశము పాఠమ్ము యీశ్వరా    ... .....        38

గాలిలో గాలినై, గాయానికి మందునై , 
మాలలో మాలనై, మార్గానికి దారినై   
కేళిలో కేళినై, కామ్యాతగ మంచునై 
పాలలో నీటినై, ప్రాముఖ్యత భార్యనై    
చేతిలో చేతినై, చేయూతగ ఉండునై యీశ్వరా      ...  ......        39

రాగమై సాగెనే రాజ్యానికి రాణివై 
భోగమై సేవలే భోజ్యానికి భూమివై 
యోగమై హాయిగా యోగ్యముగ యోగివై 
మూగవై మొహమై ముఖ్యాతివి మార్గవై 
భగమై బంధమై బాంధవ్యము దేహివై యీశ్వరా    .... ......        40
 
మానసమ్మేనులే మాణిక్యము అవ్వుటే
దానమానమ్ములే దాస్యమ్ముగ తెల్పుటే
గానమాధుర్యమే గమ్యమ్మగు సల్పుటే
వానవళ్ళే మనో వాకిళ్లుగ  గెల్చుటే                        
ప్రాణమళ్లే విధీ ప్రావిన్యము చూపుటే యీశ్వరా    ... ....            41

గారాబానికి నీడనై, గాలంగా పనికొచ్చే   
ఆశాపాశము వేదనై, ఆనందాలను పంచే
ప్రేమాబావము కాలమై, ప్రేమానందము ఇచ్చే 
సేవాలక్ష్యము దాహమై, స్వేత్సాదేహము నిచ్చే 
భావాతీతము మూలమై, భాంధవ్యమ్మగు పంచే యీశ్వరా ..     42
                
సాకారమ్ముయు సాక్షినై, సందర్భం మదిపంచే 
సామర్ఢ్యమ్ముయు దీక్షనై, సంధేహం మది తీర్చే 
పాధాన్యమ్ముయు శిక్షనై,  ప్రాముఖ్యం మనసిచ్చే
సామర్ద్యమ్ముయు రక్షనై, సంతోషం జయమిచ్చే          
ఆకాశానికి నీడనై,  శబ్దంగా కదిలొచ్చే యీశ్వరా    .. ..... .....        43
  
సందేహానికి తీర్పునై, దేహంగా ఉదయించే 
ప్రోత్సాహాన్ని విధీతిధీ, ప్రోద్బల్యం కళపంచే 
ఆత్మీయానికి విద్యగా,  ఆదర్శం సహ వాంచే              
సాదృష్టమ్మును సాగుటే, సామర్ధ్యం తలపించే 
ప్రావీణ్యమును చూపుటే, ప్రాధాన్యం సుఖమిచ్చే యీశ్వరా  ..  44     

సంకల్పానికి తోడునై, సద్భావం బదులిచ్చే 
కైంకర్యానికి నీడనై, కైవల్యాణము తలపించే    
ప్రాచుర్యానికి దీపమై, ప్రావిణ్యం సహనము పంచే   
విశ్వాసమ్ముయు ప్రేమయే, విన్యాసం విజయము నిచ్చే   
సత్యా సత్యము కామమే, సామర్ధ్యం సమయము పంచే యీశ్వరా 45 

ప్రాంజలి ప్రభ.. బ్రాహ్మణ.. జ్ఞాన సత్యాలు(4).. ఒకరికొకరిగా పలుకు

గీ..నిన్నునీవుతెలుసు కొనేనిజము వెంట 
నమ్మకాన్ని నిలిపినయనాల వెంట 
ఇతరలకు సేవ తో ప్రేమ ఇష్ట వెంట 
చెలిమి బలిమి కలియుగము చేష్ట వెంట 
మంచినేపంచు కార్తవ్య మనసు వెంట యీశ్వరా   ...    ...      ... 46

గీ..పండితపరమమిత్రుని పాఠమేను 
సంచితసహననేస్తము సాధ్యమేను 
సంఘపుకథలుపంచెద శ్రావ్యమౌను 
సంతసమ్మువిజయవాంఛ సాధనౌను 
కాంతివలనగలుగుశాంతి కామ్య మౌను యీశ్వరా   ...   ...       ..  47

గీ..అనుభవం వయసునుబట్టి ఆటపట్టు 
కంటి కణత కదలినట్లు కథలకట్టు 
మనము అనుభవముంటేను మనకుజ ట్టు 
ఏది ఏమైన మనసున వుంచుగుట్టు 
కాలమాయకుబలియగు కావ్యమెట్టు యీశ్వరా    ...  ......      ..    48

గీ..శివ శివ యనరాధ్యానమై  శిరము వంచు 
భవహర మనబంధమగుట భక్తి పంచు 
నవ విధముగాను పూజలు నమ్మి యెంచు 
అవసరము తీర్చు మహిమ ఆశ యుంచు 
సవరణ బతుకు నిత్యము సమయ మెంచు యీశ్వరా .... ....     49

గీ..వందనాలు తెలుప మది వాక్కు మనది 
చందన చరిత కవితల చెలిమి మనది 
చక్కని మకుటం సన్మాన చరిత మనది 
నలుగురి బతుకు తెలుగుగు నయనము యిది 
తెలుప చుండి తెలుగు నేల తేట పరిధి యీశ్వరా    ...   ....       50 

గీ..సూర్య బింబముపొద్దెక్కిసూపుమారి 
చంద్ర చెలిమిగా పిలుపులై చలువచేరి 
కవిహృదయ వేడి వెన్నెల కలలు తీరి 
జనుల మనసునే తట్టుతూ మమతమీరి
ప్రజల నాల్కుల యందునే ప్రభలు మీరె యీశ్వరా  ...  ....       51

అమ్మ ఒడిని మించి..ప్రేమనగరి ఉందెక్కడ..!
నాన్న కలిమి మించి ... స్నేహానగరి ఉందెక్కడ
అన్న చెలిమి మించి .....శాంతి నగరి ఉందెక్కడ
కన్న బలిమి మించి ..... కాంతి నగరి ఉందెక్కడ
పెన్నిధి కలనెంచి.... ప్రేమల నిధి ఉండెక్కడ యీ శ్వరా ..  ..   52

మనసు లోతు లెక్కగట్టు..... మాత్రమొకటి ఉందెక్కడ ..
సొగసు మోజు కానిదంటు .... సూత్రమొకటి ఉందెక్కడ..
వయసు పోరు లేని దంటు .... ఆత్రమొకటి  ఉందెక్కడ
తనువు ఆశ లేని దంటు ........ తం త్రమోకటి ఉందెక్కడ  
పనులు మాటలెన్ని దంటు..పాత్రమొకటిముందెక్కడ యీశ్వరా ..53

అమ్మ భుజం పైన గాక... . మధురాపురి ఉందెక్కడ..!
నాన్న మౌనం పైన గాక .... సమయాపురి ఉందెక్కడ
కన్న ప్రేమమ్ పైన గాక ..... తపమాపురి ఉందెక్కడ
అన్న మాటే పైన గాక ...... వినయాపురి ఉందెక్కడ  
ప్రాణమేలే దైవ శక్తి..... సమయానికి ఉందెక్కడ యీశ్వరా        54 

నాన్న శ్రమకు అభినందన..చందనమది ఉందెక్కడ..!
అమ్మ ప్రేమకు అభినందన ... పొంతనమది ఉందెక్కడ 
కన్నవారికి అభినందన ..... శాంతిగ మది ఉందెక్కడ 
ఉన్న చోటనె అభినందన ....  కాంతి గ మది ఉందెక్కడ 
కన్న వారితొ సుఖమొందెడి... కాల గమన ముందెక్కడ యీశ్వరా ... 55 

ప్రేమలేఖ అందుకున్న..అందెలసడి ఉందెక్కడ..!
ప్రేమభాష చెప్పుకున్న .... మద్దెలసడి ఉందెక్కడ
ప్రేమశక్తి పొంచియున్న .... ఊహలసడి ఉందెక్కడ
ప్రేమభక్తి కొంచమున్న ...... దేహము సడి ఉందెక్కడ 
కామ్య రక్తి పంచుకున్న... కామము సడి ఉందెక్కడ యీశ్వరా   .. 56

నీ మెఱుపుల ఆ తోటకు..కంచెన్నది ఉందెక్కడ..
నీ అరుపుల ఆ మాటకు .... పొత్తన్నది ఉందెక్కడ
నీ పెదవుల ఆ పాటకు ''''''' ముద్దన్నది ఉందెక్కడ
నీ తలపులు ఆ రాత్రికి ..... పొందన్నది ఉందెక్కడ  
నీ పలుకులు ఆ వేళకు..... కాదన్నది ఉందెక్కడ యీశ్వరా   ..    57

వినయము విజయమ్ము నీ పొందుకోరేనులే నీడగా   
మనసున మదిలోన మాటేను లే చెప్పుటే తోడుగా
మనుగడ విధితోను మీ ఆత్రుతే తేల్పుటే నీతిగా 
అణువణువున ఉండు ఆశాయిదే మానవత్వముగా  
తనువున స్థమకమ్ము తత్వమ్ము తీర్చేనులే యీశ్వరా        ... ..    58   
   
సిరినిఁగనుగొ నే వశీ కార్యమే సామ్యమై పండుగా 
విరియ పరిమళంబు పుష్పాలులే ధర్మమై నిండుగా 
కురిసె చినుకులై కుకూ కూతలే పక్షులే పిల్వ గా   
మెరియు మదిన సేవమాధుర్యమే స్వేచ్ఛగా సాగగా 
తరుణము విధిసేవ తీర్మానమ్మే సత్యమై యీశ్వరా        ... .....     59

విననిమనసుమాట వింతే సహాయమ్ముగా నీతిగా 
మనసు మెరయ మోహమాటేనులే ప్రేమతో ఆశగా 
ఘనము గరువుచెప్పు ఘాదే మనో మాయనే తుంచగా     
ఘనత వలననే విఘాతమ్ములే జర్గకా నుండెగా
మనము యనెడి దేవా మార్గమ్ములే ధర్మమై యీశ్వరా  ... ....      60

శా.. కాదో నన్న సరే కధల్ని తెలిపే కాలమ్ము బత్కేందుకే
చేదో తీపి మనస్సు వెంట పడుటే చేదోడు వాదోడుకే   
పేదో గొప్ప సరే ఉషస్సు వెలుగూ ప్రేమమ్ము పంచేందుకే
రాదోనన్నయనే తమస్సు పనిగా రాజ్యమ్ము యేలేందుకే     
లేదో ఉన్నదియో యశస్సు మలుపే లీలౌను విశ్వాసమే యీశ్వరా ..61

ఉ.మోదము సర్వ యుక్తిగను మోక్షపు యాటలు లాలపించగన్
క్రోధము కొంత శాంతమగు కోరిక చే ష్టలు లాలపించగన్  
వేదన మర్చి  నెల్లరును వేడుకతోడుత *హోళి**యాడగన్
మేధిని లీల సంపదలమేయ సుఖంబులు చెప్పనేరుగన్
చందన తత్వమే సకల జాతులయంబులు చెప్పిమార్చుమున్ యీశ్వరా ..62

విజ్ఞాన కావడి మోసు కొచ్చా..విశ్వ మాన వత్వ విలువ పంచేందుకు  
అజ్ఞాన కాలుడి అడ్డు వచ్చా. ఆమె ఆత్మ రక్ష మలుపు నిచ్చేందుకు  
సుజ్ణాత నానుడి తెడ్డు తెచ్చా. సుఖము దుఃఖ కష్ట పలుకు ఉండేందుకు 
సజ్జను నావను తోడు తెచ్చా... సమయ సఖ్యతగను బ్రతుకు పండేందుకు 
ప్రజ్ఞను చూపెడి నిత్య స్వేచ్ఛ .. ప్రతిభ తోడు నీడ కలియు జీవమును యీశ్వరా ..63

స్వార్థాన్నే తరమాలని వచ్చా... సమర నిస్వార్ధులను బ్రతికించడానికి
అర్ధాన్నే తెలపాలని వచ్చా.... ఆశయ ఆశల్ని తుంచకుండ టానికి
అర్ధాంగే ఆధారమని వచ్చా... ఆలనా పాలన  స్త్రీ విలువ తెలుపడానికి
వ్యర్థాన్నీ తుడవాలని వచ్చా.. వ్యసన మార్పు పరమార్ధాన్ని తెలపడానికి
ప్రార్ధన్లే  మనసవ్వాలని వచ్చా -- ప్రభల తీర్పు సన్మార్గాన్ని చూపడానికి యీశ్వరా .. 64

అక్షర పొలాన్ని దున్నాలని వచ్చా.. అంకిత విద్యను పెంచడానికి
కక్షల లోకాన్ని  తీయాలని వచ్చా... కర్మల  స్వార్ధాన్ని తరమడానికి
సాక్షులు వైనాన్ని తిన్నారని వచ్చా.. సాగు అక్షర సాహిత్యం పెంచడానికి
మోక్షపు మోహాన్ని మార్చాలని వచ్చా.. మౌన ధర్మాన్ని తెలపడానికి
సాక్షిగా దేహాన్ని చేర్చాలని వచ్చా ... సామరస్య జీవం నిలపడానికి యీశ్వరా  .. 65

అందరినీ ఆదుకోవాలని వచ్చా.... ఆనందం పంచడానికి
కొందరినీ వేడుకోవాలని వచ్చా... కోర్క ఆత్మీయులను కలపడనికి
ఎందరినో మార్పు తేవాలని వచ్చా... ఏదని కలిసి విలువ పెంచడానికి
బంధమయే ఓర్పు ఇవ్వాలని వచ్చా.. భావ సుఖము పెంచడానికి
సుందరుడే తీర్పు ఇవ్వాలని వచ్చా .. సూత్ర సఖ్యత నిలపడానికి యీశ్వరా  .. 66

ధైర్యమే బతికిస్తుందని వచ్చా  ... ధర్మము సత్యము న్యాయము నిలపడానికి  
శౌర్యమే కలిపేస్తుందని వచ్చా ... సౌఖ్యము సంపద సంబరం నిలపడానికి  
వీర్యమే మనసిస్తుందని వచ్చా ... విజయము విశ్వాస విజానము నిలపడానికి  
కార్యమే నలిపేస్తుందని వచ్చా .... కాల నిర్ణయము ప్రకృతిపరము నిలపడానికి
పర్యావరణము రక్షగా వచ్చా ... పరుల సేవయే పనికి ముఖ్యమని తెలపడానికి యీశ్వరా 67  
   
గానమ్ములు నీ - గళనిస్వనమే 
ప్రాణమ్ము లు మీ - కళల స్వనమే 
మౌనమ్ముగ మీ - మనసు స్వనమే
తానమ్ముగ యే - తలపు స్వనమే 
వానీ పలుకే వరము స్వనమే యీశ్వరా    .. 68   
    
తానమ్ములు సం-తత నృత్యములే 
గా ణమ్ము లు సం - తత సత్యములే 
వైనమ్ము లు భా - వన  నిత్యములే 
నాన మ్మ యె కా - న న భత్యములే 
దానమ్ములు సా - ధన ముత్యములే యీశ్వరా  .. 69 

పాశమ్ములు నీ - పలువల్వలెలే 
యాసాకదా  నీ - యనురాగములే
పాశమ్ములునీ - పలుకే మెదిలే 
రోషమ్ములు నీ  - రగడే కదిలే   
వేషమ్ములు నీ - విలువే చెదిరే యీశ్వరా       .. 70

ఇంకెంతయు నీ - యిహ జీవనమో 
పంకమ్ము గదా - భవ దుష్కృత మో  
పంకేజసమం - బగు పాదజమో  
వెంకన్నవి నా - పెనురక్ష సమో
సంకేతము నీ - సమ యుక్తి నమో యీశ్వరా    ...   71

పారాయణ సం -పదయే మనలో 
గారాబము  బం - గరమే మనలో 
ప్రారంభము సం - రముయే మనలో 
దారుఢ్యము బం - దముగా మనలో   
వైరాగ్యము సం - వైరమే మనలో యీశ్వరా    ...     72
  
తారామణు లం-దముగా మతితో    
యీరాతిరిలో - హృదయంగముతో  
చేరంగను రా - చిరునవ్వులతో 
నారాజ సకా - నయగారముతో
మారాము విధీ - మనరాగముతో యీశ్వరా     ...      73   
మోటకము - త/జ/జ/లగ UU IIU - IIU IIU
**

గీ..చూడ చక్కనోడా కనుచూపు నాది 
అర్ధభాగము నిచ్చావు అభయమె మది 
బంధ ప్రేమ హస్తమువేసి భయ మరుపది 
పార్వతీపరమేశ్వర పాశ మవధి
శిల్పసౌందర్యసుఖవాంఛ స్థితియుపార్వతీశ్వరా     74

ప్రామాభిషేకమ్మిది జిహ్వ ప్రేమా 
ప్రేమమ్ము జూపంగ సుఖమ్ము ప్రేమా 
క్షేమంబు దాహంబని చెప్ప ప్రేమా 
కామంబు కార్యంబని శబ్ద ప్రేమా 
ప్రేమా సదా శంకర సాంబ శంభో 
టంటంట టంటంట టటంట టం టం                      75

శా..కళ్యాణం కమనీయమౌను కనులే కర్తవ్యలక్ష్యమ్ముగన్ 
కళ్యాణం సుఖసేవగాను వినయా కారుణ్య దేహమ్ముగన్ 
కళ్యాణం స్థితియేవినమ్ర చరితం కామాక్షి ప్రేమమ్ముగన్ 
కళ్యాణం కవితా సుకావ్య విదితం కాలమ్ము దాహమ్ముగన్ 
కళ్యాణం సుఖ సంగమం బ్రతుకుగా కాపాడే సంసారిగన్ యీశ్వరా    76 

మ. కో.పాడు యీడు పసందు సందుల పాఠమే గతి దైవమై 
వాడు వీడు యన పంత మవ్వుట వాని కోర్కెయు నేస్తమై 
తోడు నీడని చెప్పు చుండుట తోయజాక్షులు  మోక్షమై 
వేడి - గాలుల సన్నుతించిరి ప్రేమమీరక జీవమై 
మాడ విధుల మర్మమేవిధి మాయ చేరియు మార్పుకై యీశ్వరా    77

ఉ.. సారము నున్నచోట మది సాగువినమ్రత విశ్వవాసిగన్ 
భారము నెంచకుండగను బాధ్యత గానుభరించగల్గుటన్ 
నేరము సేయకుండగను నీడన నేకము నిర్ణయంబుగన్ 
వైరము నెంచకాపురము వైనమనోమయ శక్తియుక్తిగన్ 
మారణ హోమమేతలపు మార్చు మనస్సగు నిత్య సత్యమున్ యీశ్వరా    78
 
ఉ. మెచ్చెను తెల్గుజాతి తమ మేటినటుండని కీర్తినొందియున్
సచ్ఛరితంబు,సంపదను,సంతునుగల్గి సతీ వియోగుడన్ 
మెచ్చెను యన్టియారు తన మీదనె శోధనజేయు నాతినిన్,
లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చె జెచ్చెరన్
మచ్చిక మానసమ్ముయగు మాయల నీడనధర్మయుక్తిగన్ యీశ్వరా   79

మ.. చూడు చూడుము తూర్పుకొండలు, సూర్య తేజపు వెల్గులున్ 
ఆడి పాడెడి సేవలన్నియు వావివర్శలు చూపకన్ 
వాడి వేడిగ మండు టెండలు వాసి కేక్కెను నేటిగన్ 
దాడి యేలను నీదు వేడిని దాత వైనము యేలగన్ 
వీడుమింకను మమ్ము కావుము  వేకువాయెను మిత్రమై యీశ్వరా   80

మ.. అవరోధాలణ నీరుజారగతి ఆనందమ్ము గానేవిదీ 
నవరాగాలనుపాడుచున్నగతి నమ్మేజీవితమ్మే మదీ 
వివరాలన్నియుతెల్పినా బ్రతుకు విశ్వాసమ్ము మీదే నిధీ 
భవ భావమ్మగుట దైవమైపలుకు బాంధవ్యమ్ము ప్రేమే సుధీ 
వ్యవసాయమ్ముగను జీవమై బ్రతుకు వ్యాపారమ్ము చేసే స్థితీ యీశ్వరా   81
  
గీ.. తెలుగు కళలను తెలిపేది తేట తెలుగు 
మనమనే మాతృ భూమియు మనది తెలుగు 
మానమన్నది జీవితం మచ్చ తెలుగు 
మౌన మేల మీరు జగతి మౌఖ్య తెలుగు 
కామ్య కథలుగా స్వాగత కాల తెలుగు యీశ్వరా    82

గీ.. నమనమస్కారములుమీకు నరుడి గాను 
నక్షత్రకుని కాదు జగతి నాడి గాను 
పంతమే తెలుగు బతుకు పాట గాను 
నిత్య సత్య పద్యములగా నీడ గాను 
సేవ చేయు చుంటి తెలుగు వెల్గు గాను యీశ్వరా   83

ఉ..నమ్మక ముంచి పోరువిధి నాన్చక మిత్రుని సమ్మతింపుగన్ 
రమ్మని పిల్వగన్ నతడు రానని తెల్పక వచ్చి యుండినన్ 
కమ్మని సేవచేసెడి సకామ్యపు యుద్ధము నమ్మ శఖ్యమున్ 
నమ్మెద రంగరాజును ధనంజయ మిత్రుడటంచు బల్కినన్?*
నెమ్మది మార్పు నేర్పగుట నిర్మల మానస మేలుయీశ్వరా   84

మ.. కోర్కె తీర్చెడి కాలనిర్ణయమో మదీభయవేడిగన్ 
కోర్కె లున్నను యేండతాపము కొల్లగొట్టుచు భీతిగన్
కోర్కెతాకిన మేమికాదుగు కొండ యడ్డుగ యండగన్ 
కోర్కెకొందరి జీవమేయగు కొల్వ నేస్తము చల్లగన్ 
కోర్కె సంద్రము నీటిఆవిరి కోరి చేరెను   యీశ్వరా        85

గీ.. తెలుగు కళలను తెలిపేది తేట తెలుగు 
మనమనే మాతృ భూమియు మనది తెలుగు 
మానమన్నది జీవితం మచ్చ తెలుగు 
మౌన మేల మీరు జగతి మౌఖ్య తెలుగు 
కామ్య కథలుగా స్వాగత కాల తెలుగు యీశ్వరా         86

గీ.. నమనమస్కారములుమీకు నరుడి గాను 
నక్షత్రకుని కాదు జగతి నాడి గాను 
పంతమే తెలుగు బతుకు పాట గాను 
నిత్య సత్య పద్యములగా నీడ గాను 
సేవ చేయు చుంటి తెలుగు వెల్గు గాను యీశ్వరా       87

ఉ..నమ్మక ముంచి పోరువిధి నాన్చక మిత్రుని సమ్మతింపుగన్ 
రమ్మని పిల్వగన్ నతడు రానని తెల్పక వచ్చి యుండినన్ 
కమ్మని సేవచేసెడి సకామ్యపు యుద్ధము నమ్మ శఖ్యమున్ 
నమ్మెద రంగరాజును ధనంజయ మిత్రుడటంచు బల్కినన్?*
నెమ్మది మార్పు నేర్పగుట నిర్మల మానస మేలుయీశ్వరా    88

మ.. కోర్కెతీర్చెడి కాలనిర్ణయమో మదీభయవేడిగన్ 
కోర్కె లున్నను యేండతాపము కొల్లగొట్టుచు భీతిగన్
కోర్కెతాకిన మేమికాదుగు కొండ యడ్డుగ యండగన్ 
కోర్కెకొందరి జీవమేయగు కొల్వ నేస్తము చల్లగన్ 
కోర్కె సంద్రము నీటిఆవిరి కోరి చేరెను   యీశ్వరా       89

శా.. కాదో నన్న సరే కధల్ని తెలిపే కాలమ్ము బత్కేందుకే
చేదో తీపి మనస్సు వెంట పడుటే చేదోడు వాదోడుకే   
పేదో గొప్ప సరే ఉషస్సు వెలుగూ ప్రేమమ్ము పంచేందుకే
రాదోనన్నయనే తమస్సు పనిగా రాజ్యమ్ము యేలేందుకే     
లేదో ఉన్నదియో యశస్సు మలుపే లీలౌను విశ్వాసమే యీశ్వరా  90

ఉ.మోదము సర్వ యుక్తిగను మోక్షపు యాటలు లాలపించగన్
క్రోధము కొంత శాంతమగు కోరిక చే ష్టలు లాలపించగన్  
వేదన మర్చి  నెల్లరును వేడుకతోడుత *హోళి**యాడగన్
మేధిని లీల సంపదలమేయ సుఖంబులు చెప్పనేరుగన్
చందన తత్వమే సకల జాతులయంబులు చెప్పిమార్చుమున్ యీశ్వరా  91

విజ్ఞాన కావడి మోసు కొచ్చా..విశ్వ మాన వత్వ విలువ పంచేందుకు  
అజ్ఞాన కాలుడి అడ్డు వచ్చా. ఆమె ఆత్మ రక్ష మలుపు నిచ్చేందుకు  
సుజ్ణాత నానుడి తెడ్డు తెచ్చా. సుఖము దుఃఖ కష్ట పలుకు ఉండేందుకు 
సజ్జను నావను తోడు తెచ్చా... సమయ సఖ్యతగను బ్రతుకు పండేందుకు 
ప్రజ్ఞను చూపెడి నిత్య స్వేచ్ఛ .. ప్రతిభ తోడు నీడ కలియు జీవమును యీశ్వరా  92

స్వార్థాన్నే తరమాలని వచ్చా... సమర నిస్వార్ధులను బ్రతికించడానికి
అర్ధాన్నే తెలపాలని వచ్చా.... ఆశయ ఆశల్ని తుంచకుండ టానికి
అర్ధాంగే ఆధారమని వచ్చా... ఆలనా పాలన  స్త్రీ విలువ తెలుపడానికి
వ్యర్థాన్నీ తుడవాలని వచ్చా.. వ్యసన మార్పు పరమార్ధాన్ని తెలపడానికి
ప్రార్ధన్లే  మనసవ్వాలని వచ్చా -- ప్రభల తీర్పు సన్మార్గాన్ని చూపడానికి యీశ్వరా  93

అక్షర పొలాన్ని దున్నాలని వచ్చా.. అంకిత విద్యను పెంచడానికి
కక్షల లోకాన్ని  తీయాలని వచ్చా... కర్మల  స్వార్ధాన్ని తరమడానికి
సాక్షులు వైనాన్ని తిన్నారని వచ్చా.. సాగు అక్షర సాహిత్యం పెంచడానికి
మోక్షపు మోహాన్ని మార్చాలని వచ్చా.. మౌన ధర్మాన్ని తెలపడానికి
సాక్షిగా దేహాన్ని చేర్చాలని వచ్చా ... సామరస్య జీవం నిలపడానికి యీశ్వరా  94

అందరినీ ఆదుకోవాలని వచ్చా.... ఆనందం పంచడానికి
కొందరినీ వేడుకోవాలని వచ్చా... కోర్క ఆత్మీయులను కలపడనికి
ఎందరినో మార్పు తేవాలని వచ్చా... ఏదని కలిసి విలువ పెంచడానికి
బంధమయే ఓర్పు ఇవ్వాలని వచ్చా.. భావ సుఖము పెంచడానికి
సుందరుడే తీర్పు ఇవ్వాలని వచ్చా .. సూత్ర సఖ్యత నిలపడానికి యీశ్వరా  95

ధైర్యమే బతికిస్తుందని వచ్చా  ... ధర్మము సత్యము న్యాయము నిలపడానికి  
శౌర్యమే కలిపేస్తుందని వచ్చా ... సౌఖ్యము సంపద సంబరం నిలపడానికి  
వీర్యమే మనసిస్తుందని వచ్చా ... విజయము విశ్వాస విజానము నిలపడానికి  
కార్యమే నలిపేస్తుందని వచ్చా .... కాల నిర్ణయము ప్రకృతిపరము నిలపడానికి
పర్యావరణము రక్షగా వచ్చా ... పరుల సేవయే పనికి ముఖ్యమని తెలపడానికి యీశ్వరా  96

చం..కలతలువచ్చిమానసము కాలమునెంచి సుఘంద జీవితం 
కళలుయశస్సుమెప్పుకు సుఖమ్ముయుదుఃఖమువరమ్ము జీవితం
కలయిక నిత్య సత్యమగు కమ్మని సేవలు చేయ జీవితం 
కలలు నిరూపణవ్వకయు కాలపు భాధయుబంధ జీవితం 
కలకలమౌను మార్గముయు కావ్య చరిత్ర  సజీవ జీవితం యీశ్వరా  97 

చల్ల గాలి వీచఁగాఁ - జందురుండు తోఁచఁగా 
తల్ల డిళ్లి పోయెగా - తొందరొద్దు మూగగా 
కల్ల లేల ముందుగా - కాని దంటూ లేదుగా 
చల్లఁ కొచ్చి నావుగా -  చప్పరింత ఏలగా 
కళ్ల లాడ మానమూ - కారు చిచ్చు మాయగా యీశ్వరా              98
       
మల్లె తావి పర్వఁగా - మానసమ్ము వేఁగఁగా 
జల్లు వాన కుర్వగా  - జాము రాత్రి తియ్యగా 
ఒళ్ళు నంత తాడ్వగా - వాట మంత వేడిగా 
కళ్ళ నంత తిప్పగా  - కాళ్ళ బెర్త్ మొచ్చెగా 
గళ్ళు శబ్ద మవ్వగా - గమ్య మౌను నిత్యమై యీశ్వరా               99   

ఉల్లమందుఁ గోర్కెలే - యూహలందు నీవెలే 
కల్ల లొల్లి మాటలే  - కాల యాప నొద్దులే 
తల్ల క్రింద లాయెలే - తాప సమ్ము వద్దులే 
వళ్ళ మాలి నైనదే  - వ్యాధి కాదు ముద్దులే  
ముళ్ళు చేరె మోజులో - ముఖ్య మైన మార్పులే యీశ్వరా      100

యెల్ల లేని ప్రేమమే - యిందు మన్కి తీఁగగా 
కాల మాయ ప్రేమమే - కానీ దంటు లేదుగా 
జాలి చూపు ప్రేమమే - చాల దంటు లేదుగా 
ఆలి తెల్పు ప్రేమమే - ఆశ నెంచ లేదుగా     
లాలి చూపి నిద్రయే - లాస్య మేమి లేదుగా యీశ్వరా          101
  
నన్ను జూడు రాధికా - నవ్వు లిందుఁ మ్రోఁగఁగా 
చిన్న చిన్న యాశలే - చిత్తమందు రేఁగఁగా 
వన్నె చిన్నె లెన్నొ యీ - భావ వీథి వెల్గఁగా 
గన్నుదోయి వ్రాయునో - కావ్య మొండు సాఁగఁగా 
కన్న ప్రేమ మూగదై - కానీ దంటు లేదుగా యీశ్వరా           102
 
004 సుధాధరా - ర/జ/త/ర/లగ UI UI UIU - UI UI UIU
==

కాలము నీదే ను కలిసి యే పోదా ము
అలకలు వొద్దులే అలసి యే ఉందా ము
తాళము వేయ కే దానము చేద్దాము
మేళ ము దేని కే మక్కువ గుందాము
జ్వాలలు కమ్మేను జాతర చేద్దాము యీశ్వరా              103

ఎగిరి పో చిలక వై ఎక్కడి కైనను
రగిలిపో గిలక వై రవ్వల లైనును  
ఎక్కడో ఉండు ట ఎందుకో కానను
మక్కవే వుందిలే మౌనము పల్కను
చిక్కులు లేవులే చింతయు లేదును యీశ్వరా          104

దండించు వాడినే దయచూపు వాడిని
ప్రేమించు వాడినే ఫలమిచ్చు వాడిని
ద్వేషించు వాడినే దరిజేర్చు వాడిని
కవ్వించు వాడినే కథ చెప్పు వాడిని
నవ్వించు వాడినే నవరాగ ధాటిని యీశ్వరా               105

దాంపత్య మనునది దర్పణం మగుటయే
ప్రేమత్వ మనునది ప్రేరత్వం యగుటయే
దేహత్వ మనునది ధర్మమ్మే  యగుటయే
సౌమ్యత్వ మనునది సౌందర్యం యగుటయే
దాతృత్వ మనునది దానత్వం యగుటయే యీశ్వరా   106  
***

సాక్షము లేదుయు సంఘము సాధన శోధ్యము యే
వీక్షణ చెందక ధర్మము వేదము తెల్పుట యే
శిక్షణ నేస్తము లేనిది చిత్తము నిశ్చిత  యేలటయే 
కక్షల దర్పము ఓట్ల వికాసము పొందికయే
సాక్షిగ నుండియు తప్పులు తెల్పక ఉండుటయే యీశ్వరా  ..107
  
ఉ.. అక్షరుఁడేకనంగవలెనాంధ్రఁపు కష్టపరిస్థితిన్ వెసన్
అక్షరమందురే తెలుఁగు భాషను విజ్ఞులు గొప్పగా సదన్ 
శిక్షణనీయఁగావలెను సేమముఁగోరుచు పల్కులందునన్
కక్షయెసాగుచున్నదిఁట కమ్మని వాణికి చూడఁబోయినన్ .."
సాక్షిగ ఉన్ననేమివిధి సాధన శోధన నిత్య మీశ్వరా                 108
-----