Tuesday, 7 January 2025

 


sekarana

**********

మరలా వస్తుంది జాగర్త .. కొత్త కరోనా 


👉 రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా


👉వాటాలు వేసుకొని దోచేస్తున్న డాక్టర్లు మరియూ మెడికల్ షాప్ యాజమాన్యాలు


👉 Rmp లకు Pro లకు 40%  మిగతా 60%  హాస్పిటల్ కు.


👉దాదాపు రోజుకు వేలల్లో op లు


👉మీ రోగమే మా భాగ్యం అంటున్న వైద్యులు


👉పేదల ఆరోగ్యంపై పైసలు దోచుకుంటున్న

 దగా కోరులు

👉చేతికి వేసుకునే ఒక్కో సూది  8 రూపాయల నుంచి 102 రూపాయల వరకు


👉డెంగ్యూ 40 రూ, ఇంజక్షన్ 405 రూపాయలకు అమ్మకాలు.

పేదల నుంచి వేలల్లో వసూళ్లు..


👉 ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోని డెంగ్యూ చికెన్గున్యా బాధ్యతలను ప్లేట్లెట్ పేరుతో మరింత దోపిడీ.


👆ఒకప్పుడు గ్రామ దేవుళ్లుగా ఉన్న RMP లు ఇప్పుడు అత్యంత క్రూరంగా ప్రమాదకరంగా మారారు...


👉 Rmpల ముసుగులో ప్లేట్లెట్ మాఫియా

జ్వరం మాటున భారీ బిజినెస్ దోచేస్తున్న ఆసుపత్రులు ప్రైవేటు యాజమాన్యం డాక్టర్లు.


👉అవసరం లేకున్నా సరే అన్ని రకాల టెస్టులు చేపించాల్సిందే అదే మా హాస్పిటల్ రూల్ అంటున్న వైనం..


👉అసలు ధరల కన్నా 10 రేట్లు ఎక్కువగా మందుల అమ్మకాలు


👉పేదోడి జేబులు లూటీ చేస్తున్న, ఆస్పత్రులు,డయాగ్నిస్టిక్ సెంటర్లు,మెడికల్ స్టోర్స్..


👉ఒక్కో పేషంట్ కు 5 నిమిషాలు కేటాయిస్తే అది బెస్ట్ ట్రీట్మెంట్ అంట..


👉ఒక్కో బెడ్డు కు రోజుకి 5 వేల రూపాయలు వసూళ్లు మందులతో కలిపి రోజుకు 10వేల రూపాయలు వరకు బిల్లు....


👉కేవలం చిన్న చిన్న జ్వరాలుకు కూడా 30-40 వేల రూపాయల వరకు బిల్లు కట్టాలంటే పేదోళ్ళు ఇంకెలా బ్రతకాలి...


👉ఖమ్మం govt హాస్పిటల్స్ కూడా ఇదే తంతు...

రోగులను టెస్టులు చేసి ఒకటి రొండ్రోజులు ఉంచుకోవడం ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించడం జరుగుతున్న వైనం...


👉👉ఖమ్మం నగరం నడిబొడ్డులో విషజ్వరాలతో బెంబేలెత్తుతున్న జనాలు..

ఏ PHC కి వెళ్లినా సరే మందులు,కనీస సౌకర్యాలు లేవు...


👉DH&HO క్రిందనే అన్ని ప్రయివేటు హాస్పిటల్స్ ఉంటాయి...


👉అన్ని రకాల టెస్ట్లు రేట్లు మెడికల్ చార్జీల రేట్లు నోటీస్ బోర్డుల్లో పెట్టాల్సిన,రోగులకు తెలియపర్చాల్సిన బాధ్యత ప్రయివేటు హాస్పిటల్స్ పై ఉంది కాని ఒక్కరు కూడా అనుసరించరు...


👉వాస్తవంగా ప్లేట్లెట్స్ ఎక్కించడానికి అయ్యే ఖర్చు 11000రూ...

అప్పటికే బాగా ఎక్కువ అది

కానీ

18000రూ వరకూ తీసుకుంటున్నారు...రక్త కణాలు విడగొట్టినందుకు 5000 & కణాలను ఎక్కిచ్చినందుకు 13000 రూ వరకు తీసుకుంటున్నారు...


👉అసలు విషయం ఏమిటంటే కొన్ని రకాల ప్రయివేట్ హాస్పిటల్స్ వైద్యులు యాంటీబయోటిక్స్ ద్వారా ఉన్న ప్లేట్లెట్సను తగ్గించి త్వరగా మీకు ప్లేట్లెట్స్ అవసరం ఉందని రోగులను భయబ్రాంతులకు గురిచేసి రోగులను పీల్చి పిప్పిన్ని చేసి రూ... లక్షల్లో వసూళ్లూ చేస్తున్నారు..


👉మెడికల్ ల్యాబ్ టేక్నిషియన్స్ రోజుకు 2 నుంచి 3 వేలు వరకు సంపాదన ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉన్నా సరే తగ్గించి రిపోర్ట్స్ రాసి డాక్టర్ వద్దకు పంపినందుకు ప్రత్యేకంగా కమిషన్స్...


👉వాస్తవంగా పరిశీలిస్తే నలుగురు ల్యాబ్ రిపోర్ట్స్ 4 రకాలుగా వచ్చాయి...🤔🤔🤔


👉#సామాన్యులకు_ముందు_జాగ్రత్త_చర్యలు

1.బొప్పాయి జ్యుస్ ఎక్కువగా త్రాగడం

2.దానిమ్మ,బత్తాయి జ్యుస్ కూడా ఎక్కువ మోతాదులో త్రాగడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్యా పెంచవచ్చు.


3.మరి బాగా నీరసంగా ఉంటే RL మరయూ DNS లతో నయం చేసుకోవచ్చు


4.అసలు ఈ ప్లేట్లెట్స్ అనేవి ఒకే స్థిరంగా ఉండనే ఉండవు...

జ్వరాలు వస్తే ఆటోమేటిక్ గా తగ్గడం పెరగడం అనేది కామన్...

అంత మాత్రాన మీరు భయపడి రోగాన్ని మరింత ఎక్కువ చేసుకోకండి.


👉వాస్తవానికి జ్వరం,మరియూ ప్లేట్లెట్స్ అనేవి 3 నుంచి 4 వేల రూపాయలుతోనే నయం చేసుకోవచ్చు..


👉 అంతకు మించి మీరు ఎంత పెద్ద హాస్పిటల్ కి వెళ్లినా వారికి బెడ్డు,ac, ఫీజులు టాక్సులు కట్టి డబ్బులు వదిలిచ్చుకోవడం తప్ప ఉపయోగం ఉండదు...

ఎవరైనా అదే ట్రీర్ట్మెంట్ చేసేది....


👉పేదోళ్ళు అంతా కుదేలు అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా

🙏🙏🙏🙏

ఇట్లు

✍️✍️✍️

సామాజిక విశ్లేషకులు.


Friday, 3 January 2025

stories



******

*వయసు పెరిగితే మనకేమీ కొత్తగా కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.

”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.

చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు.

అప్పడు చలం…  “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు.     ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో  కొంత విజయం సాధించాలి.

వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.

ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?

మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.

కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా   ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు….            శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.

మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ.

ఏం వదిలివేయాలో చూద్దాం.

”అమ్మాయీ గ్యాసు కట్టేసావా....

గీజర్ ఆఫ్ చేసావా...

ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..

పాలు ఫ్రిజ్ లో పెట్టావా....

...లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.

”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు

వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..

కష్టనష్టాలు కూడా వాళ్ళవే.

ఎవరితో ఏపనీ చేయించుకోకుండా  ప్రతీపనీ మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా..

నా అభిప్రాయం ఏమిటంటే…  అని అనటం తగ్గించి.. నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.

నాకూ తెలుసు తో పాటు. నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ  నాకంటే ఎక్కువ తెలుసు  కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.

మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు.  ఆరోగ్యం బాగుంది కదా అని దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, షుగర్ కీళ్ళనొప్పులు, నిద్ర పట్టకపోవటం. నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. బాబోయ్.. ఎందుకు అడిగామా  అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.

కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం.

పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.

అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...జిహ్వచాపల్యం  తగ్గించుకుని.అన్నింటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించటంలేదు అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...

భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.

ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.

హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.

రోజూ అనుకుందాం ఇలా...

I love my self.I respect my self.

మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.

మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా...

మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్య. అనే  భావం కనిపించాలో...లేక అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా.. అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది.

*****

*అమ్మ"  ఓపికకు మారు పేరు.

మనం ఎంత పెద్ద అయినా, అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. 

మనం ఎప్పటికి అమ్మలా ఆలోచించ గలుగుతాం అని నాకు అనిపించే క్షణాలు ఎన్నో!

 నేను నా పిల్లలతో వున్న ప్రతి సారీ  మా అమ్మ మాతో ఉన్నట్టు నా పిల్లలతో ఉన్నానా? అమ్మలా అన్ని చేస్తున్నానా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించు కుంటాను.

ఒక్కసారీ తృప్తిగా నేను మా అమ్మ మాకు చేసినట్టు నా పిల్లలకి చేస్తున్నాను అని అనిపించదు. అమ్మ తో సరిసమానం కావటం కష్టం అని పోల్చి చూసుకోవటం మానేసాను.

చిన్నప్పుడు రాత్రి అందరి భోజనాలు అయ్యి మేము మంచాలు ఎక్కి రేడియో లో పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ వంటింటిని మర్నాటి కోసం సిద్ధం చేసే పనిలో ఉండేది. స్టవ్ కడగటం, వంటిల్లు కడగటం, మంచినీళ్ల బిందెలు తోమటం ఇలా..అమ్మ పని చేస్తుంటే వెళ్లి సాయం చేయాలి అని తోచక పోగా అమ్మా త్వరగా రా, ఎంతసేపు పని చేస్తావ్ అని పిలిచేదాన్ని. 

అమ్మ వస్తూనే నిద్ర పోయేది. అమ్మా నీకు నీరసం రాదా? రోజంతా పని చేస్తావు? అని అడిగితే అమ్మ స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉండేది , "అమ్మని కదమ్మా ! నీరసం ఉండదు" అని. 

అది విని చిన్నప్పుడు ఓహో అమ్మలకి నీరసం రాదేమో అనుకునేదాన్ని.

ఎక్కడకి అన్నా వెళ్లి వచ్చాకా కాళ్ళు నొప్పులు అని మేమంతా కూర్చుంటే అమ్మ చకచకా పనులు చేసేసేది. మళ్ళి నాది సేమ్ క్వశ్చన్, అమ్మ సేమ్ ఆన్సర్. ఇంక నేను ఫిక్స్ అయిపోయా 'అమ్మలకి నీరసం, కాళ్ళు నొప్పులు, విసుగు లాంటివి వుండవు అని. 

అందుకే రాత్రి అందరం పడుకున్నాకా అమ్మ వీధి గుమ్మం తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతున్నా, బట్టలు ఉతికి ఎర్రటి ఎండలో మోకాళ్ళ నొప్పులతో మేడ ఎక్కి ఆరేసినా నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు. 

అమ్మ కి బోలెడు ఓపిక , అంత పిల్లలకి ఉండదు, కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంతే పని చేయాలి, ఓపిక లేక పోతే రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని. 

ఇప్పుడు 73 ఏళ్ల వయసులో కూడా మేడం చకచకా పనులు చేయటానికి ముందుకు ఉరుకు తుంది. అలసట ఉండదా అంటే 'అమ్మని కదమ్మా , పిల్లల కోసం చేస్తుంటే అలసట గా ఉండదు' అంటుంది. 

మా అందరికి ఇష్టం అయినవి అడగాలే కానీ వంటింటిలోకి ప్రవేశించి ఎన్ని గంటలు అయినా విసుగు లేకుండా వండేస్తుంది. పైగా మేము చేస్తాం అంటే ' వద్దమ్మా , అలసి పోతారు అంటుంది.' ఇన్నేళ్లు వచ్చినా మేము పిల్లలమే  అమ్మ కి.

పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అవుతోంది , ఇప్పటికీ పచ్చళ్ళు, ఆవకాయలు, కారప్పొడులు, మెంతి పొడులు, చారు పొడి ఏవీ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. నాకు రాదు అని అమ్మ గట్టిగా నమ్మి అన్నీ  చేసి పంపిస్తుంటుంది. 

అల్లం పచ్చడితో సహా అమ్మ చేయటం , నాన్న జాగ్రత్త గా ప్యాక్ చేసి పంపించటం. మేము వాటిని అందుకుని తిని అమ్మా సూపర్ అంటే ఆవిడ తృప్తి చూడాలి. పొరపాటున ఎప్పుడన్నా నేను చేసుకుంటాను, నువ్వు ఎందుకు కష్టపడటం అంటే, 'నీ మొహం నీకు రాదు, అయినా నీకు ఖాళీ ఎక్కడ ? అలసి పోతావ్ ,  అలాంటి పనులు పెట్టుకోకు ' అంటుంది.              

అమ్మ కి అలసట ఉండదు ఇది ఇప్పటికీ అమ్మ చెప్పే సూత్రం.

ఆ సూత్రం అర్ధం ఏంటో నేను అమ్మ అయ్యాకా తెలిసింది. అమ్మ ని చూస్తే ఎక్కడ లేని నీరసం వచ్చి , కూర్చుని అమ్మతో పనులు చేయించుకుంటానా?’

మా పిల్లలిద్దరూ ఏమడిగినా ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా నీరసం గుర్తు రాదు. ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు 'అమ్మా నీకు నీరసంగా ఉండదా? అని.' నేను మా అమ్మ నాకు చెప్పిన డైలాగ్ వాళ్ళకి చెబుతాను. రేపు వాళ్ళు అమ్మలు అయ్యాకా దాని అర్ధం తెలుస్తుంది వాళ్ళకి.

తరం తరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు.

****

భారత దేశం లో మరెక్కడా లేని విధంగా   అరుణాచలం లో మాత్రమే శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది.


#పార్వతి దేవి ఒకరోజున   స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు.

#అప్పుడు అమ్మవారు అడిగారు "మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది" అని.. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు.


#పార్వతి.. పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నను అడిగారు.. నేను సరే అన్నాను.


#ఇప్పుడు నేను పునిగు పిల్లి దగరకి వెళ్లి ఇలా అన్నాను "పులగా.. నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులు ని వెంట పడడం జరుగుతుంది.. నువు వెంటనే ని ప్రాణాలని వదిలేయ్" అని అన్నాడు.


#దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది.. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే.. వాటి నుండి వచ్చే సువాసనను నువు స్వీకరించాలి అని అడుగుతుంది.. అందుకు ఆయన అంగీకరిస్తాడు.


#అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు అడ్డుకోవడంతో ఆ సువాసన కి అమ్మ వారు పరవశించి ఉండేది.


#అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు.


#నువు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలం లో ఉండకూడదు.. ఒంటి నిండా నగలు వేసుకోవాలి.. పాములు ఏమి ఉండకూడదు.. నెత్తిన కిరీటం పెట్టుకోవాలి.. పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి.. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్ళి రోజున ఎలా ఉన్నావో అల ఉండాలి.. అంతే కాదు.. భక్తులు ఎవరైనా నిను కోరిక కోరితే అది వెంటనే నెరవేరి పోవాలి.


అని ఇలా ఈశ్వరుణ్ణి అడగడం జరిగింది.. అందుకే మనకి అరుణాచలం లో స్వామి వారు నిండుగ దర్శనం ఇస్తారు.🙏

🙏ఓం అరుణాచలా శివా 🙏

🙏 ఓం నమశ్శివాయ 🙏

******

* మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలంటే మీ జీవితంలోని వివిధ కోణాలని సరి చేసుకోవాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతున్నది.

వివిధ కోణాలు అంటే శారీరకపరమైన కోణం, మానసికపరమైన కోణం,ఆర్థికపరమైన కోణం కుటుంబపరమైనటువంటి కోణం, సామాజికపరమైనటువంటి కోణం మరియు ఆధ్యాత్మికపరమైనటువంటి కోణం

ఈ కోణాలలో మీ జీవన శైలిని, మీ ఆలోచన విధానాన్ని Thought process మార్చుకున్నప్పుడు చాలా తక్కువ మందులతో చాలా తక్కువ ఖర్చుతో అనారోగ్యాలను శాశ్వతంగా జయించగలము అనేది సంపూర్ణ ఆరోగ్యం అనే పదానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్నటువంటి నిర్వచనం.

ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా శారీరక కోణం మాత్రమే సరి చేయబడుతున్నది. మిగతా కోణాలను అంతగా పరిగణలోకి తీసుకోవడం లేదు ప్రస్తుత డాక్టర్లు. అందువలన చిన్న చిన్న సమస్యలు కూడా దీర్ఘకాలం పాటు నిలబడి పోతున్నాయి అందులో ఒకటి ఒత్తిడి Stress.

అన్నీ కోణాలని పరిగణలోనికి తీసుకుంటూ అన్నీ కోణాలలో జీవనశైలిని మార్చుకుంటూ, ఆలోచన విధానాన్ని  Thought process మార్చుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటే ఎంతటి దీర్ఘకాలిక అనారోగ్యమైన శాశ్వతంగా తగ్గుతుంది.

దీని కొరకు మీకు సరిగ్గా సలహాలను అందించేటువంటి, సులువైనటువంటి ఆచరణ మార్గాన్ని నిర్దేశించే ఒక కోచ్/Mentor మీకు అవసరం.

మనకి స్కూళ్లు కాలేజీల్లో ఎలాగైతే టీచర్స్ ఉన్నారో ఎలాగైతే విద్యార్థులకు రకరకాల అంశాలను బోధిస్తూ చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేస్తూ క్రమక్రమంగా పెద్ద లక్ష్యాలను సాధించేలాగా ఎలాగైతే టీచర్స్ మనకి సహకరిస్తున్నారో అలానే మన ఆరోగ్య విషయంలో కూడా మనకి చిన్న చిన్న లక్ష్యాలను Small goals 

ఏర్పాటు చేస్తూ పెద్ద లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతరం సపోర్ట్ అందిస్తూ ఉండేటువంటి ఒక ప్రొఫెషనల్ పర్సన్ హెల్త్ కోచ్.

ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ లా అనిపిస్తుంది కదూ…?

అయితే నేను మీకు ఇలా చెప్తే ఎలా ఉంటుంది. మీరు కన్సిస్టెంట్ Consistent గా మీ జీవన శైలిని, ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ అతి తక్కువ సమయంలో సంపూర్ణ ఆరోగ్యం Holistic Wellness ను  పొందేటువంటి దిశగా ఎటువంటి డివియేషన్స్ లేకుండా 90 నిమిషాలలోనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలిగితే ఎలా ఉంటుంది అది కూడా అనుభవం కలిగినటువంటి హెల్త్ కోచ్ ద్వారా నేర్చుకోవటం అనేది.

90 నిమిషాలలో మీ Migraine (దీర్ఘకాల తలనొప్పి),overthinking,anxiety,depression,Stress ని  తగ్గించు కోవచ్చు  అది కూడా ఎటువంటి శ్రమ లేకుండా, మెడిటేషన్ లేకుండా, ఆహార నియమాలు లేకుండా ,మెడిసిన్స్ లేకుండా 

సరైన అవగాహన ద్వారాఆలోచన విధానాన్ని జీవితంలో రకరకాల కోణాలలో మార్చుకోవటం ద్వారా దీర్ఘకాలిక లేకుండా 90 నిమిషాలలోనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలిగితే ఎలా ఉంటుంది అది కూడా అనుభవం కలిగినటువంటి హెల్త్ కోచ్ ద్వారా నేర్చుకోవటం అనేది.

90 నిమిషాలలో మీ overthinking,anxiety,depression,Stress ని  తగ్గించు కోవచ్చు అది కూడా ఎటువంటి శ్రమ లేకుండా, మెడిటేషన్ లేకుండా, ఆహార నియమాలు లేకుండా ,మెడిసిన్స్ లేకుండా 

సరైన అవగాహన ద్వారాఆలోచన విధానాన్ని జీవితంలో రకరకాల కోణాలలో మార్చుకోవటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాలను శాశ్వతంగా మనం జయించవచ్చు.

[6:28 am, 7/1/2025] Mallapragada Sridevi: 

*****

*హనుమంతుని సింధూర లేపనం 

శ్రీ రామ పాద సేవా దురంధరుడు, రామ భక్తీ సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ  హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరి పించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేమిటో ఆ ఆజన్మబ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంపముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే, వెళ్లి చేతులు జోడించి "రామయ్య తండ్రీ! మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి'' అని ప్రార్ధించాడు .

�శ్రీ రామప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని "భక్తా ఆంజనేయా! సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి, జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద  సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం'' అని వివరించి చెప్పాడు .�ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సింధూరాన్ని తీసుకొని, నువ్వుల నూనెతో కలిపి, తన ఒళ్లంతా పూసేసుకొన్నాడు. ఇలా చేస్తే  ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి "ప్రభూసీతారామా! చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను. మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా?''అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతా రాముడు నవ్వి ఆనందం తో ''హనుమా! ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం భక్తీతో గంధ, సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు.'' అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ, సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు అత్యంత ప్రీతీకరం. అందులోను మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.

శ్రీరామ జయరామ జయ జయ రామ

*******

*గాలి బుడగ జీవితం అంటే ఇదే!

శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి.

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్త మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.

శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.

     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.

84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.💐


శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.


*****

* బ్రహ్మ దేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. 

వరం కోసం తొందర పడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది.

 ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు. 

వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది. 

పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువు కోరడంతో  పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం,  సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి. 

చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురూ నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు. 

అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం. సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. 

సహనంతో మెలిగి వరం కోరిన  భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి.

 సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు. సహనానికి ప్రతిరూపం స్త్రీ. అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు. 

సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి. 

కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది.

 సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది..

 ఎవరన్నా పాడి 


******

*మంగళవారం మంచిదేనా..??

  వెనుకటి కాలంలో ఓ గురుకులంలో తన శిష్యులు ఏవో కొంటె పనులు చేస్తుంటే.. పనికిమాలిన ఏ పనులు చెయ్యకండర్రా వెధవల్లారా మంగళవారం నాడు.. ఆ గురువుకి తరచుగా ఏ వారం ఐతే ఆ వారం పేరు అంటుండటం ఓ అలవాటు. 

👉 ఆ నలుగురు శిష్యులకి.. ఏ పనులు.. అనగానే మంచి పనులు కూడా మంగళవారం చెయ్యరాదని అర్ధం అయ్యింది. ఇది కాస్తా పదిమందికీ తెలియడంతో మంగళవారం మంచి పనులు చేయకూడదన్న ఓ తప్పుడు భావన అందరి జనాల్లో స్థిరపడిపోయింది. 

👉 హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది.

👉 హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది.

👉 శాస్త్రం ప్రకారం.. మంగళవారం చాలా మంచి రోజు.. శుభప్రదమైన మంగళప్రదమైన వారం. ఆంజనేయ స్వామికి, అమ్మవారు దేవతలకి అత్యంత ప్రీతికరమైన వారం ఈ మంగళవారం. అందుకే ఆలయాలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 

👉 మంగళవారం మారు కోరుతుంది.. మారు జరుగుతుంది అంటారు. సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచిన ఏదైనా కొంటే.. చీరలు, నగలు, అలంకరణ సామగ్రి వంటివి.. ఆ తరువాత కూడా మరోమారు ప్రాప్తిస్తాయి అని విశ్వసిస్తారు కొందరు. మంగళవారం మారు కోరుతుంది కాబట్టి మంగళవారం రోజు అప్పులు తీసుకోకూడదు అని చెబుతుంటారు. 

👉 మంచి మనసుతో మంచి పని ఎప్పుడైనా ఏ వారం నాడైనా చేయవచ్చు. మంగళవారం మంచిదికాదని ఏ గురువు చెప్పలేదు.. ఏ పురాణం లోనూ లేదు. కొన్ని విదేశాల్లో ముఖ్యమైన పనులు మంగళవారమే మొదలుపెడతారు.

మంగళవారం మంగళప్రదం శుభప్రదం జయప్రదం.🙏


*

******

*ప్రపంచంలో అత్యంత సుందరమైన...శ్రీనివాసుడి విగ్రహం...!!

🌿 విగ్రహాలలో ఒకటైన 11 అడుగుల  మూలవిరాట్టు మహారాష్ట్ర లోని మెహకర్ లో ఉంది . 

🌸 1888 లో బ్రిటిష్ వారు దీనిని ఎలాగైనా ఇంగ్లాండ్ తీసుకుని పోదామని శతవిధాలా ప్రయత్నించారు . 

🌿అడ్డుకున్న 60 మంది గ్రామస్థులను జైలులో వేసి చిత్రహింసలు పెట్టారు . ఆ రోజుల్లో హిందువులు ధర్మ పరిరక్షణ కోసం పోరాడేవారు .  

🌸చివరికి గ్రామస్థుల ఆందోళనలకు తలొగ్గి ఆ దేవాలయం జోలికి పోకుండా ఊరుకున్నారు . ఈ విగ్రహం కిరీటం లో మరో విష్ణు మూర్తి విగ్రహం చెక్కడం విశేషం .

ఈ ఫోటో ని ఓపెన్ చేసి చూడండి పూర్తి విగ్రహం కనబడుతుంది

ప్రపంచంలో అత్యంత సుందరమైన  శ్రీనివాసుడి విగ్రహాలలో

 ఒకటైన 11 అడుగుల  మూలవిరాట్టు మహారాష్ట్ర లోని మెహకర్ లో ఉంది . 

🌸 1888 లో బ్రిటిష్ వారు దీనిని ఎలాగైనా ఇంగ్లాండ్ తీసుకుని పోదామని శతవిధాలా ప్రయత్నించారు . 

🌹అడ్డుకున్న 60 మంది గ్రామస్థులను జైలులో వేసి చిత్రహింసలు పెట్టారు . ఆ రోజుల్లో హిందువులు ధర్మ పరిరక్షణ కోసం పోరాడేవారు .  చివరికి గ్రామస్థుల ఆందోళనలకు తలొగ్గి ఆ దేవాలయం జోలికి పోకుండా ఊరుకున్నారు . 

🌿ఈ విగ్రహం కిరీటం లో 

 మరో విష్ణు మూర్తి విగ్రహం చెక్కడం విశేషం .ఈ ఫోటో ని ఓపెన్ చేసి చూడండి పూర్తి విగ్రహం కనబడుతుంది...🌞🙏🌹🎻


******

అంతర్యామి 🔱

*# పూలను ప్రేమించు!*సృష్టిలో అత్యంత విలువైనవి పువ్వులు. పరిమళాలతో స్వాగతం పలికే స్వభావం వాటి సొంతం. మనసులకు, పూలకు అవినాభావ సంబంధం ఉంది. పూల నైజం ఎలాంటిదో మనసుల తత్వమూ అలాంటిదే అని భావుకులు నమ్ముతారు. పూలంటే కవులకు ఎనలేని ప్రేమ. దీనికి కారణం పూలకు, కవుల మనసులకు సామ్యమే. పూలలాగే కవుల భావాలు మృదువుగా ఉంటాయి. వారు చెప్పే తీరులో ఆకర్షణ ఉంటుoది.  పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద వంటి రమణీయ కావ్యాలు పూల సొగసులను వేనోళ్ల కొనియాడాయి. ప్రియసఖి కోరిక తీర్చడానికి కృష్ణుడు స్వర్గలోకానికి వెళ్లి పారిజాత పుష్పాన్ని తెచ్చాడు. పూలను ప్రేమించడం వల్ల వాటి సౌకుమార్యం మనకు అలవడుతుంది. మనుషులు ఎలాంటివారిని ఇష్టపడతారో అలాంటివారి గుణాలే సంక్రమిస్తాయి. సహవాసం వల్ల కలిగే పర్యవసానం ఇది. పరుల కోసమే జీవితాన్ని అర్పించే త్యాగగుణాన్ని సొంతం చేసుకున్న పూలను భగవంతుడు ఇష్టపడతాడు. ఆపాదమస్తకం దేవతలను పూలమాలలతో అలంకరించి, పూజించడం భక్తులకు ఆనందం.

🍁మల్లిక, మాలతి, చేమంతి, జాజి, మందారం, పారిజాతం, కుందం, ఉత్పలం, చంపకం, కరవీరం, గులాబీ మొదలైన ఎన్నోరకాల పూలున్నాయి. కొన్ని అందంగా కనబడినా, వాసన లేకపోవడం వల్ల వాటిని ఎవరూ అంతగా ఇష్టపడరు. అలాంటి పూలలో కర్ణికారం(కొండగోగు) ఒకటి. కాళిదాసు కుమారసంభవ కావ్యంలో వసంతంలో పూసిన పూలను వర్ణిస్తాడు. ఆ సందర్భంలో కొండగోగు పువ్వు గురించి- 'మంచి రంగుతో ఆకర్షిస్తున్నప్పటికి' దీన్ని స్త్రీలు ధరించరు. ఎంత అందంగా ఉన్నా పరిమళాలు లేకపోతే పూలకు విలువలేదు.

🍁బ్రహ్మదేవుడు ఈ కొండగోగు పువ్వును సృష్టించే సమయంలో ఏకాగ్రతను కోల్పోయినట్లున్నాడు. అందుకే పువ్వును అందంగా మలిచినా, దానికి పరిమళాలు అద్దడం మరిచిపోయాడు' అని ఎంతో చమత్కారంగా అంటాడు. కొండగోగు పువ్వు మరొక సందేశం కూడా ఇస్తోంది- 'మనుషులు ఎంతందంగా ఉన్నా, మంచిగుణాలనే సుగంధాలు లేకపోతే వారికి విలువ ఉండదు' అని! స్త్రీలకు, పూలకు ఆన్యోన్య సంబంధం ఉంది. భవభూతి మహాకవి తన ఉత్తర రామచరిత నాటకంలో 'స్త్రీల మనసులు సుమాలవలే సుకుమారాలు' అని వర్ణించాడు. వారిని పూజ్యభావంతో చూడాలని పెద్దల ఉపదేశం. స్త్రీలను బాధ పెడితే దేవతలకు కోపం వస్తుందని, అలాంటి కఠిన హృదయులను దేవుడు క్షమించడని, వారి ఇళ్లలో లక్ష్మీదేవి నిలువలేదనీ స్మృతులు చెబుతున్నాయి.

🍁పదకవితా పితామహుడి నుంచి ఆధునిక మహాకవి వరకు అక్షర హాలికులెందరో అందమైన కవన పుష్పాల సాగు చేశారు. 'తిరువేంకటాద్రిపై దిరమై నిలిచినట్టి తుమ్మెదరో/ పరమయోగుల పూలబరిమళములుగొన్న తుమ్మెదరో' అన్న అన్నమయ్య భావన ఉదాత్తమైనది. 'దేశమనియెడి దొడ్డ వృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయి' అన్న గురజాడ వాక్కు సదా స్మరణీయమైనది... ఆచరణీయమైనది. పూలను ప్రేమించి, పూలతో ఇష్టదైవాలను పూజించి, అలంకరణలుగా ధరించేవారికి అష్టశ్వర్యాలు ఇంట్లోనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.🙏

******

*ఋణానుబంధ రూపేణా…!

పూర్వము ఒక గ్రామములో దంపతులు నివసించుచుండిరి. వారు ఎంతో అన్యోన్యముగా జీవనము సాగించుచుండిరి.

ఎందువల్లో గాని ఆ దంపతులకు చాలాకాలము వరకు సంతానము కలుగలేదు. కన్న బిడ్డలు నట్టింట తిరుగుచుండగ తమ గృహము కళకళలాడవలెనని వారు ఆశించుచుండిరి.

సంతాన ప్రాప్తికై వారు ఎన్నియో పూజలు, నోములు నిర్వహించిరి. పూజా ఫల విశేషముగా కొంతకాలమునకు గృహస్థు భార్య గర్భవతి అయ్యెను. నెలలు నిండగనే ఆమెకు పండంటి మగ కవలపిల్లలు జన్మించిరి.అందులకు దంపతులు ఎంతగానో ఆనందించసాగిరి.

జంతువుల మనోభావములను, పసి పిల్లల భావములను తెల్సుకొనగల జ్ఞానమును భర్త కలిగియుండెను.

ఆ కవలపిల్లలు ఊయలలో పరుండియుండగా వారి మనోభావములను తెలుసుకొనదలంచి తండ్రి వారికి సమీపముగ వచ్చి కూర్చుని వారిని తదేకదృష్టితో వీక్షించసాగెను.

అందులో మొదటి పిల్లవాడు మనస్సులో ఈ విధముగా అనుకొనుచుండెను - "పూర్వజన్మమున నాకు ఈ ఇంటి యజమాని రెండు రూపాయలు బాకీ తీర్చవలసియున్నది. ఆ ఋణము తీరినవెంటనే నాకు ఇక్కడినుండి విముక్తి లభించును."

రెండవ పిల్లవాడు ఈ ప్రకారముగా మనస్సు నందు భావించుచుండెను… "నేను పూర్వజన్మమున ఈ గృహ యజమానురాలికి వందరూపాయలు బాకీపడియుంటిని. ఈ జన్మలో దానిని తీర్చిన తదుపరి నాకు వీరితో గల సంబంధము విడిపోవును."

వారిరువురి మనోభావములను గ్రహించిన తండ్రి - 'ఆహా! ఋణానుబంధము వలననే భార్యాసుతులు ఏర్పడుచుందురు గదా! లేకలేక మాకు జన్మించిన వీరు ఇక ఎంతకాలము మా ఇంట ఉందురో' అని తలంచుకొని చింతించసాగెను. అయినను ఈ విషయము భార్యకు తెలుపకుండ రహస్యముగ ఉంచదలచెను.

పిదప అతడు "నీవు నేరుగా మన పిల్లలకు పైకము ఇవ్వకు. మరియు వారి వద్దనుండి నేరుగా తీసుకొనకు" అని భార్యను హెచ్చరించెను.

భర్త మాటలయొక్క అంతరార్థమేమియు బోధపడకున్నను భార్య 'సరే' అనెను.

తదుపరి ఆ ఇద్దరి పసిబిడ్డలకు ఆముదము పెట్టుటకు రెండు, రెండు రూపాయలతో రెండు వేర్వేరు సీసాలలో ఆముదము తెప్పించిరి. కొన్ని రోజులకు ఆ సీసాలలోని ఆముదము పూర్తిగా పిల్లలకు వినియోగింపబడినది.

మొదటి పిల్లవాని రెండు రూపాయలు బాకీ తీరగానే అతడు మృతినొందెను. అది గాంచి తల్లి హృదయ విదారకముగా ఏడ్వసాగెను.

మరణించిన పిల్లవానిని చూచి తండ్రి, 'ఆహా! విధి ఎంత బలీయమైనది కదా!' అని అనుకొని, జీవించియున్న రెండవ పిల్లవానిని చూచియైనను ఊరడిల్లు మని భార్యను ఓదార్చెను.

రెండవవాడు సద్గుణములు అలవరచుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టుడయ్యెను. పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుచు సంపాదించినదానిలో రోజూ కొంత పైకమును ఒక డబ్బాలో నిలువచేయసాగెను.

ఒకనాటి సాయంకాలము వారు ఉన్న పెంకు టిల్లు తగలబడిపోవుచుండెను. అది చూచిన ఆ పిల్లవాడు పరుగిడుచు పోయి తాను పైకమును - దాచిన డబ్బాను కొనివచ్చి ద్వారము వెలుపలగల తల్లికి ఒసంగెను. మరుక్షణమే సగముకాలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలుని పై పడెను. వెంటనే అతడు మరణించెను.

ఆ దుర్ఘటనను చూచి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయిరి. ఉన్న ఒక్క కుమారుడుకూడ దూరమై పోయినందులకు తల్లి యొక్క బాధ చెప్పనలవి కాకుండెను. బాలునియొక్క ఋణవిషయము తండ్రికి స్మృతికి వచ్చెను.

ఆ డబ్బాలోని పైకము లెక్కచూడగా ఖచ్చిత ముగ అందు రు.100/-లు ఉండెను.

ఆనాడు తాను గ్రహించిన సంగతులను భార్యకు తెలియజేసి, "ఋణానుబంధము వలననే బంధువులు, మిత్రులు, పుత్రులు మొదలగు వారితో కలయిక ఏర్పడును. మరియు ఆ ఋణములు తీరగనే ఎవరిదారి వారు వెడలెదరు" అని చెప్పి భర్త ఆమెను సము దాయించెను.

కల్సియున్న కొద్ది రోజులలో వారిపై మమకారము పెంచుకొనుట అవివేకమగును. ఋణానుబంధము తీరిపోయిన పిమ్మట లోకములో ఏదియై నను మనచెంత నుండదు. కనుక మన ధర్మమును మనము సక్రమముగా నెరవేర్చుచు దైవేచ్ఛపై ఆధారపడియుండవలెనని ఆ దంపతులు గ్రహించిరి. శేషజీవితమును ధర్మాచరణ యందు, దైవకార్య నిర్వహణము నందు గడపి వారు తమజన్మలను సార్థకం చేసుకొనిరి.

నీతి:

ఋణానుబంధము వలన, కర్మబంధము వలన లోకములో మనుజునకు, భార్యాపుత్రబంధుమిత్రాదులు ఏర్పడుచుందురు. సమయము ఆసన్నమైనపుడు ఎవరి మార్గమున వారు వెడలిపోవుదురు. కనుక జనులు, బంధ్వాదులపై అనురాగమమకారాలను పెంచుకొనరాదు.

శరీరము శాశ్వతముకాదని అది ఏనాటికైనను నశించిపోవును అను సత్యమును గుర్తెఱిగి మనుజుడు ధర్మప్రవర్తన కలవాడై, భగవంతుని యెడల అకుంఠిత విశ్వాసము, భక్తిని పెంపొందించుకొని కృతకృత్యుడు కావలెను.✍️


*****

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.

ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.

కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు... ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా... ఎంత మంది తినటంలేదు... నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా...'  అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.

దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.

పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.

*జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు...

*🔱 అంతర్యామి 🔱*

*# ప్రాణస్నేహితులు*

సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు. కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతఃకాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.

🍁స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడగలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.

🍁స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహసౌదానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించేవారే ప్రాణ స్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతోమందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తుల తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.

# " నీకు నేనున్నాను. నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువులాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్టవంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.

🍁నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు.
మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.

🍁తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచుకోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.🙏
*******

🙏🙏🙏🌹🌹🌹
మహాకుంభమేళా 2025 లో జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే.....

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు.
మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా ఏఏ ప్రాంతాల్లో ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది 2025, ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకుముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా నిర్వహించారు.

పుణ్యస్నానాలు- తేదీలు

మొదటి పుణ్యస్నానం జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున జరగనుంది.

జనవరి 14న మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారు.

జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.

ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్యస్నానాలు చేయనున్నారు.

ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు చేయున్నారు.

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు.

మహాకుంభమేళాలో పుణ్యస్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగా సాధువులు, ఇతర శాఖల మహంత్‌లు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తరువాత సామాన్య భక్తులకు పుణ్యస్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది హిందువులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడకు తరలి వస్తుంటారు. మహాకుంభమేళా జరిగే సమయంలో త్రివేణిసంగమంలోని నీరు అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.

పుణ్యస్నానాలు- ప్రాంతాలు

ప్రయాగ్‌రాజ్‌....
యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్యస్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు.

హరిద్వార్....
కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగానది.. పర్వతాలను వీడి ఇక్కడి నుంచే మైదానాలలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్.. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది. హరిద్వార్‌ను తపోవన్, మాయాపురి, గంగాద్వార్, మోక్ష ద్వార్ అని కూడా పిలుస్తుంటారు.

నాసిక్....
నాసిక్‌లో జరిగే కుంభమేళాను నాసిక్ త్రయంబక్ కుంభమేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా, వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

ఉజ్జయిని...
ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన ఉంది.
🌹🌹🌹🙏🙏🙏
*అపరిచితుని గ్లోబల్ వాక్*

లోకానికి అతడు ఒక అపరిచితుడు. లోకోపవాదాలకు అతీతుడు. వంచినది
తలే, అభిమానాన్ని కాదు. ఆలోచనల
బరువుతో అతని చూపు అవని వైపే,
దృష్టి మాత్రం సుదూరాలకు. జీవితం
పరుగు పెట్టమన్నా, వినక తన నడకపై
మెండైన ఆత్మవిశ్వాసం. చలికి చేతులు
జేబులో దూర్చినా, బిగిసిన పిడికెళ్ళలో
మాత్రం లక్ష్యాన్ని పట్టు సడలనివ్వని
వేళ్ళమధ్య పట్టుదల.. పొగ మంచులా!
వర్తమానం, భవిత, అస్పష్టం అయినా
అడుగులు ముందుకే వేయించే
గుండె దిటవు. మందితో హాస పరిహాసాలకు అపరిచితుడు కాడు.. కానీ అవసరమైతే
ఏకాకిగా జీవన నౌకపై అనంత దూర
తీరాలకు పయనం ఆపడు. తాను
ముందుకు కదులుతుంటే వెనుకకు
తరలిపోయే తరువుల్లా జీవన
మాధుర్యాలు గతోన్ముఖమైనా,
జీవిత సంఘర్షణలో వెనకడుగు లేదు.
పరిచితాపరిచిత లోకంలో క్షణ క్షణం
మారిపోయే రూప గుణ శబ్ద స్పర్శ రస
గంధాదులు తాత్కాలిక అతిధులు.
అనంత శాశ్వతత్వం చిరునామా
వెతికేవాడికి ఐకాంతిక పయనం
ఇసుమంతైనా అసౌకర్యం అనిపించదు. ఉషోదయం.. మబ్బులు కమ్మినా,
స్వచ్ఛ నిర్మలంగా మెరిసినా సంధ్యా
స్వర్ణిమ కాంతులు, ఆపై చిరు చీకట్లు
పెను చీకట్లు.. వేటికవే వాటి స్థానాలలో చిరంతనంగా! క్షణభంగుర అస్తిత్వం
భౌతికంగానే. అనంతమైన యాత్ర
ఎప్పటికప్పుడు పునరావృతం అవుతూ..
అనంత పథికుడితో అపరిచిత బాటలే
తమని పరిచయం చేసుకుంటూ
అపరిచితుడితో పాద'చాలనాలు చేసి
వెనుకకు తొలగిపోతుంటాయి.

మల్లేశ్వర రావు ఆకుల



నేటి లోకం తీరు

జీవితంలో శాంతి సౌఖ్యము సమంగా ఉండాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు, నా సొంతం అనే భావన రాకూడదు.
చిరునవ్వు లాగా స్నేహం కలుపుతూ, చిదానంద స్వామిల  నిత్యం నవ్వుతూ నవ్విస్తూ, డబ్బుతో దేనినైనా కొనగలం కానీ కొన్ని కొనలేని ఉన్నాయని మాత్రం గమనించు అవి ఏమిటంటే మానవత్వం, నిజాయితీ, సంస్కారం, విధేయత, గౌరవం.
మన చుట్టూ ఉన్న సమాజం  నీవు గెలిస్తే అసూయ పడుతుంది, నీవు  ఓడిపోతే అవమానిస్తుంది. వదిలేస్తే జారిపోయేవి కొన్నే అయితే, పట్టుకుంటే మనతో ఉండి పోయేవి ఇంకా ఎక్కువే.

ప్రపంచంలో ఉన్న ఒక దేశం భారతదేశం ఇందులో ఆరోగ్యం, ఆత్మీయత, ఆనందం ఆధ్యాత్మికత, వివిధ మతాలు, కులాలు ఒక్కత్రాటిపై యిచ్చిపుచ్చుకునే విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ జీవన విధానాలు విద్యా, శ్రామిక కర్షక విధానాలతో,పారిశ్రామిక సంపదలతో, సహజ సంపదలతో, విజ్ఞాన సామాన్య సాంఘిక శాస్త్రాలతో పాడిపంటలతో నిలయమైన ఉండే దేశం. పాలకపక్షం, ప్రతిపక్షం అంతా అయోమయం ఎవరికి వారు అందుకున్నంత అందుకోవడమే ఆర్థిక సంపద అనుకుంటూ వారిని ప్రశ్నించే హక్కులు వ్యవస్థలలో నాయస్థానాలలో లేని పరిస్థితి అంతా ప్రజలు భవచించిన నాయకులు ప్రజలు హింసిస్తున్నారే తప్ప ఆదుకునే వాళ్లే రాజ్యాంగం భారతదేశం. కనీసం అర్హతలు లేని రాజకీయ నాయకులు వారి జీతాలు మాత్రం లక్షల మీద లక్షలు. సరైన విద్యాసంస్థలు లేవు,  ఆదరణ లేదు, మాతృభాషలో చదువులేదు, చదువుకున్నవాడికి ఉద్యోగం లేదు, ప్రజలు నిజం తెలిపితే ఎన్కౌంటర్ చేసే ప్రభుత్వం . ఎన్నాళ్లే మనకి కష్టాలు శక్తి సేణ లుగా సాధిద్దాం మన దేశానికి ఉన్న మేధావిజ్ఞాన సంపత్ని ఏ దేశానికి లేదు లోపం కేవలం రాజకీయం. న్యాయస్థానాలు కూడా నాయక వ్యవస్థకు తో డు నీడగా ఉండటం, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్సి కూడా నాయకులకు వత్తాసు నేటి దుర్భర పరిస్థితి.
ఎప్పుడు మారుతుంది ఈ రాజకీయ ప్రచారం.

భవ భవితా సహాయముయు భాద్యత ధర్మము నిత్య ధ్యేయమే     
వివరణ లక్ష్య సాధనలు విద్య వినమ్ర విధేయతన్ శుభమ్
సవరణ నిత్య జీవితము సాక్షిగ తల్లి సమమ్ము పోషణన్            
కవి కవితా మహత్వమును గాయకు గానము గవ్వ సేయునే

చింతకు జేరిపంతమగు చేష్టబలమ్ముయులేక బంధమున్
శాంతిమనస్సులేనిగతి సామ్యసుఖంబుయులేని వైనమున్
బ్రాంతి ప్రభావమేతపము బంధ ప్రభోదము ప్రశ్న లేయగున్
"ఇంతకు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుడన్"
*****

జనకసభ

         పూర్వం విదేహరాజ్యాన్ని పరిపాలించే రాజులకు ‘జనకుడు’ అనే నామాంతరం ఉండేది.  వారిలో ఒకానొక జనక మహారాజు ఒకసారి బహుదక్షిణం అనే పేరు కలిగిన గొప్ప యజ్ఞం చేశాడు.  ఆ యజ్ఞానికి నానా ప్రాంతాల నుండి అనేకమంది వేదపండితులు శాస్త్రపండితులు విచ్చేశారు.  వారిని, వారి అపరిమేయమైన వైదుష్యాన్ని గమనించిన జనకమహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.  ఆ సమయంలోనే అతడికి ఒక జిజ్ఞాస కూడా కలిగింది.  “కో ను ఖలు అత్ర బ్రహ్మిష్ఠః?” (వీరందరిలోనూ అతి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వారు ఎవరు?) అని.  కాని, ఆ మాటను నేరుగా ఆ విద్వత్పరిషత్తులోనే అడగటం మర్యాద కాదు.  అందువలన జనకమహారాజు ఒక ఉపాయం చేశాడు.

             తన గోశాలనుండి వేయి మంచి ఆవులను తెప్పించాడు.  ప్రతి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి కదా.  ఒక్కొక్క కొమ్ముకు ఐదేసి పాదముల బంగారాన్ని కట్టించాడు.  తరువాత అక్కడ చేరిన విద్వత్పరిషత్తును ఉద్దేశించి, “మహాత్ములారా! యో వో యుష్మాకం బ్రహ్మిష్ఠః సః ఏతాః గాః ఉదజతామ్” (మీ అందరిలోనూ అతిశయించిన బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో, వారు ఈ ఆవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చును.) అని ప్రకటించాడు.

             అప్పుడు అక్కడున్న వారు ఎవరూ నేనే అందరికంటే గొప్ప బ్రహ్మిష్టుడను అని చెప్పలేక మౌనంగా ఉండి పోయారు.

             అప్పుడు అక్కడున్న యాజ్ఞవల్క్యమహర్షి తన శిష్యుడిని పిలిచి, “ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా3” (సామశ్రవా, ఈ ఆవులను మన ఇంటికి తోలుకుపో నాయనా) అని చెప్పాడు.

             ఆ మాట విన్న పండితులందరికీ చాల కోపం వచ్చింది.  వారిలో అశ్వలుడు ఒకడు.  ఆయన జనక మహారాజు గారి యాజ్ఞికులలో హోత.  “త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోఽసి?” (ఓ యాజ్ఞవల్క్యా, మన అందరిలోనూ నువ్వేనా అతి గొప్ప బ్రహ్మవేత్తవు?)  అని తీవ్రంగా అడిగాడు.

             “మనలో ఎవరైతే అతి గొప్ప బ్రహ్మిష్ఠుడో అతడికి నా నమస్కారం.  నాకు ఆవుల అవసరం చాలా ఉన్నది.  అందుకనే నేను తోలుకుపోదామని అనుకున్నాను” అని యాజ్ఞవల్క్యుడు మందహాసం చేశాడు.

             “నీకు ఎంత అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆవులు అతి గొప్ప బ్రహ్మవేత్త కోసం ఉద్దేశింపబడ్డాయి.  కాబట్టి మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీవు ఆవులను తీసుకొని పోవచ్చును” అని అశ్వలుడు సవాలు చేశాడు.

         యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి, “సరే ప్రశ్నించండి” అని అడిగాడు.

         అశ్వలుడు యజ్ఞానికి, యజ్ఞము చేయించే విధానానికి, యజ్ఞం చేయించేవారికి సంబంధించిన అతి కఠినమైన ప్రశ్నలను వేశాడు.  యాజ్ఞవల్క్యుడు వాటికి అతి సులువుగా సమాధానం చెప్పాడు.  అశ్వలుడు యాజ్ఞవల్క్యుని సమాధానాలను ఆమోదించి, ఇక అడుగవలసిన ప్రశ్నలు తన వద్ద లేవని విరమించుకున్నాడు.

     అప్పుడు జరత్కారువంశీయుడైన కృతభాగుని పుత్రుడైన ఆర్తభాగుడు అనే మహర్షి ప్రశ్నించేందుకు పూనుకున్నాడు.  అతడు గ్రహములను గూర్చి అతిగ్రహములను గూర్చి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చక్కగా సమాధానం చెప్పాడు.  (ఇక్కడ గ్రహములు అంటే planets కావు.  గ్రహించే వాటిని గ్రహములు అంటారు.). మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు.  అప్పుడు యాజ్ఞవల్క్యుడు అజేయుడు అని గ్రహించిన ఆర్తభాగుడు మౌనం వహించాడు.

         అప్పుడు లహ్యుని కుమారుడైన భుజ్యుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.  పారిక్షితుల స్థానాన్ని గూర్చి అతడు అడిగాడు.  (పారిక్షితులు అంటే అశ్వమేధయాగాన్ని చేసిన మహాత్ములు). యాజ్ఞవల్క్యుడు దానికి కూడా సరైన సమాధానం చెప్పాడు.  దాంతో భుజ్యుడు కూడా మౌనం వహించాడు.

         అప్పుడు చక్రుని కుమారుడైన ఉషస్తి ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు.  ఆత్మకు సంబంధించిన అతని ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు సులువుగా సమాధానం చెప్పాడు.  దాంతో ఉషస్తి కూడా తన ప్రయత్నాలను విరమించుకున్నాడు.

         అప్పుడు కుషీతకుని పుత్రుడైన కహోలుడు తన ప్రశ్నలను ప్రారంభించాడు.  అతడు కూడా ఆత్మను గురించి విభిన్నంగా ప్రశ్నించాడు.  యాజ్ఞవల్క్యునినుండి తనకు సరైన సమాధానం లభించడంతో మౌనం వహించాడు.

         అప్పుడు వచక్నుని కుమార్తె అయిన గార్గి తన ప్రశ్నలను ప్రారంభించింది.  వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది -

గార్గి

“ఒక వస్త్రం దారాలలో ఓత ప్రోతంగా ఎలా వ్యాపించి ఉన్నది కదా, ఆ విధంగా నీరు దేనిలో వ్యాపించి ఉన్నది?”

యాజ్ఞవల్క్యుడు

“వాయువులో”

గార్గి

“వాయువు దేనిలో వ్యాపించి ఉన్నది?”

యాజ్ఞవల్క్యుడు

“అంతరిక్షలోకాలలో”

గార్గి

“అంతరిక్షలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

యాజ్ఞవల్క్యుడు

“గంధర్వలోకాలలో”

గార్గి

“గంధర్వలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి”

యాజ్ఞవల్క్యుడు

“ఆదిత్యలోకాలలో”

గార్గి

“ఆదిత్యలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

యాజ్ఞవల్క్యుడు

“చంద్రలోకాలలో”

గార్గి

“చంద్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

యాజ్ఞవల్క్యుడు

“నక్షత్రలోకాలలో”

గార్గి

“నక్షత్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

యాజ్ఞవల్క్యుడు

“దేవలోకాలలో”

గార్గి

“దేవలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

యాజ్ఞవల్క్యుడు

“ఇంద్ర లోకాలలో”

గార్గి

“ఇంద్రలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

యాజ్ఞవల్క్యుడు

“ప్రజాపతిలోకాలలో”

గార్గి

“ప్రజాపతిలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

యాజ్ఞవల్క్యుడు

“బ్రహ్మలోకాలలో”

గార్గి

“బ్రహ్మలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

గార్గి ఆ ప్రశ్నను వేసేసరికి యాజ్ఞవల్క్యుడు ఆమెను కనికరం నిండిన దృష్టులతో చూశాడు.  “ఓ గార్గీ, అతిప్రశ్నలను వేయకు. నీ తల ఊడి పడుతుంది” అని హెచ్చరించాడు.

         (బ్రహ్మలోకం అనిర్వచనీయమని, అతీంద్రియమని, అవాఙ్మానసగోచరమని శాస్త్రం చెబుతుంది.  ఆ విధంగా కన్నులకు గాని, మనసుకు గాని ఇతర-ఇంద్రియాలకు గాని అందని విషయాన్ని గురించి ప్రశ్నించడాన్ని అతిప్రశ్న అంటారు.  ఎందుకంటే ఇంద్రియాలకు మనసుకు అందని దానిని ఎవరికి వారు స్వీయానుభవంతో తెలుసుకోవాలి.  బ్రహ్మలోకాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ విధంగా ప్రయత్నించకుండా అవి ఎలా ఉంటాయి అవి ఎందులో ఉంటాయి అని ప్రశ్నించడమే ఈ సందర్భంలో అతి ప్రశ్న.  అంతేకాక, వేదవాక్కును మించిన ప్రమాణం లేదు.  దానిని పక్కకు త్రోసి అనుమానప్రమాణాన్ని ఆశ్రయించి అది వేదం కంటె గొప్పదనటం కూడా అతి.  ఆ విధంగా వేదాన్ని అతిక్రమించి అనుమానప్రమాణానికి అధికప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే అప్పుడు కూడా అది అతి ప్రశ్న అవుతుంది.)

         యాజ్ఞవల్క్యుడు అలా చెప్పేసరికి తన పొరపాటున గ్రహించిన గార్గి కూడా మౌనం వహించింది.

         అప్పుడు అరుణపుత్రుడైన ఉద్దాలకుడు ప్రశ్నించడం ప్రారంభించాడు.  “ఓ యాజ్ఞవల్క్యా! నాకు సూత్రాత్మగా ఉన్న అంతర్యామిని గూర్చి తెలుసును. నీకు కూడా ఆ అంతర్యామి తెలిసినట్లయితే సరే.  కాని, అంతర్యామిని గూర్చి ఏమీ తెలియకుండా నీవు ఆవులను తీసుకువెళ్లదలిస్తే నీ తల ఊడి పడుతుంది” అని హెచ్చరించాడు.  యాజ్ఞవల్క్యుడు అంతర్యామిని గురించి చక్కగా వివరించాడు.  సరైన సమాధానం లభించేసరికి ఉద్దాలకుడు మౌనం వహించాడు.

         అప్పుడు గార్గి మరలా నిలబడింది.  యాజ్ఞవల్క్యుని మరొకసారి ప్రశ్నించేందుకు పండితసభ అనుమతిని కోరింది.  “ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగలిగితే ఇక ఈ సభలో ఎవరూ యాజ్ఞవల్క్యుని ఓడించలేరు.  అటువంటి ప్రశ్న వేసేందుకు మీ అనుమతిని కోరుతున్నాను” అని వినయంగా అడిగింది. సభ అందుకు అనుమతినిచ్చింది.  అప్పుడు గార్గి ఈ విధంగా సవాలు చేసింది.

            “ఓ యాజ్ఞవల్క్యా, నేను వేయబోయే ప్రశ్న ధనుస్సును ఎక్కు పెట్టి సంధింపబడి విడుదలకాబోతున్న పదునైన బాణం వంటి ప్రశ్న.  నీ దగ్గర సమాధానం ఉందా?” అని అడిగింది.

             యాజ్ఞవల్క్యుడు మందహాసం చేసి "వెంటనే ప్రయోగించవమ్మా నీ బాణాన్ని" అన్నాడు.

“ద్యు లోకానికి పైన, పృథ్వీలోకానికి క్రిందన, ఏది వ్యాపించి ఉన్నదో, ఈ ధ్యావాపృథ్వీలోకాలకు నడుమ ఏది ఉన్నదో, దేనికి భూతము భవము భవిష్యత్తు (Past, Present, Future) అనేవి ఉండవో, అయ్యది దేనిలో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నది?”

         ఈ విధంగా గార్గి అడిగిన ప్రశ్నను విని అందరూ దిగ్భ్రాంతి చెందారు.  అసలు ఆ ప్రశ్నలోని విషయం కూడా ఊహకు అందదు.  ఇక దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అనుకున్నారు.  మునుపు గార్గి వేసిన ప్రశ్న మాటలకు అందనిదైనందున అతి ప్రశ్న అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.  కాని, ఇప్పుడు గార్గి తన మాటలతో వర్ణించినందువలన అది అతి ప్రశ్న కాజాలదు.  యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం వచ్చింది.

         అయితే ఆ విద్వత్పరిషత్తులోని మిగిలిన విద్వాంసులందరూ వేరు, యాజ్ఞవల్క్యుడు వేరు.  అతడికి గార్గి వేసిన ప్రశ్న కరతలామలకంలా అనిపించింది.

         “ఓ గార్గీ, అది ఆకాశంలో వ్యాపించి ఉన్నది” అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.

     సభ నిశ్చేష్టమై నిశ్శబ్దంగా మారిపోయింది.  గార్గి మ్రాన్పడిపోయింది.  తన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు అంత సులువుగా సమాధానం చెబుతాడని ఆమె ఊహించనేలేదు.  నిజానికి ఆమె అడిగినది ఊహాతీతమైన పరబ్రహ్మ గురించి.  పరబ్రహ్మ వర్ణింప వీలుకానిది. కాబట్టి, యాజ్ఞవల్క్యుడు మౌనం వహించాలి.  గార్గి అడిగినది అతిప్రశ్న కాకపోయినప్పటికీ, సమాధానం చెప్పలేక మౌనం వహిస్తే, ఆమె ప్రశ్నకు సమాధానం నావద్ద లేదని యాజ్ఞవల్క్యుడు తన పరాజయాన్ని అంగీకరించినట్లే.  అందువల్ల గార్గి చాల తెలివిగా యాజ్ఞవల్క్యుని ఇరుకున పెడదామని ఆ విధంగా ప్రశ్నించింది.  కాని, ఆమె తన ప్రశ్నలో ఒక పొరపాటు చేసింది.  ద్యావాపృథ్వీలోకాలు అని ఆమె ఉచ్చరించడంతో అవి కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే అయినాయి.  అందువల్ల అవి ఆకాశంలో ఉంటాయని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.  ఆ సమాధానం లౌకికంగానూ శాస్త్రీయంగాను కూడా సత్యమే.  మొదటి సారి నీవు అడిగినది అతిప్రశ్న అయితే రెండవసారి నీవు అడిగిన ప్రశ్న అతి సాధారణమైన ప్రశ్న అన్నట్లుగా యాజ్ఞవల్క్యుడు తేల్చేశాడు.  అంతే కాదు, ఈ ఆకాశం కంటె కూడా నీవడగదలుచుకున్న పరబ్రహ్మ మరింత గొప్పది అని పరోక్షంగా తగిన సమాధానం కూడా సూచించాడు.  (తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని తైత్తిరీయవాక్కు.)

         తెల్లబోయిన గార్గి కాసేపటికి తేరుకుని, “ఆ ఆకాశం దేనిలో వ్యాపించి ఉన్నది?” అని అడిగింది.  “దానిని అక్షరం అంటారు” (అక్షరం = క్షరము కానిది = నాశనం లేనిది) అని యాజ్ఞవల్క్యుడు చెప్పి, దాని స్వరూపం వర్ణింప వీలులేనిది కాబట్టి, నేతి (న+ఇతి) వాదం ప్రకారం సమాధానం చెప్పాడు.  (ఆ అక్షరస్వరూపం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండదు అంటూ వర్ణించాడు.). అటువంటి అక్షరంలో ఈ ఆకాశం వ్యాపించి ఉన్నది అని చెప్పాడు.  గార్గికి తగిన సమాధానం లభించింది.  ఆమె పన్నిన ఉచ్చులో యాజ్ఞవల్క్యుడు ఇరుకున పడలేదు.  తామరతూడు ఏనుగును బంధించలేదు కదా.

ఆ సమాధానం విన్న గార్గి వినమ్రురాలయింది. యాజ్ఞవల్క్యునికి సవినయం నమస్కారం చేసింది.  వినీతులు ఎంతటి జిగీషులైనప్పటికీ, మహాత్ముల చెంత వారి సహజస్వభావం పెల్లుబుకుతూనే ఉంటుంది కదా. “అయ్యా పండితులారా! మీరు కూడా ఈయనకు నమస్కారం చేసి, ఈయన మనలో అతి గొప్ప బ్రహ్మవేత్త అని అంగీకరించండి.  సత్యాన్ని అంగీకరిస్తే అది మనకు విజయమే కాని పరాజయం కాదు. మీరెవరు ఈయనను జయింపలేరు” అని సభలోని విద్వాంసులతో హితవు పలికింది.

         అయితే గార్గి మాటలను శాకల్యుడు సహించలేకపోయాడు.  తాను కూడా ప్రశ్నించి యాజ్ఞవల్క్యుని పరీక్షిద్దామని ముందుకు వచ్చాడు.

శాకల్యుడు

“వైశ్వదేవంలో దేవతల సంఖ్య ఎంత?”

యాజ్ఞవల్క్యుడు

“3306 మంది”

శాకల్యుడు

“సరే, ఎంతమంది దేవతలు?”

యాజ్ఞవల్క్యుడు

“33 మంది”

శాకల్యుడు

“సరే, ఎంతమంది దేవతలు?”

యాజ్ఞవల్క్యుడు

“ఆరుగురు”

శాకల్యుడు

“సరే, ఎంతమంది దేవతలు?”

యాజ్ఞవల్క్యుడు

“ముగ్గురు”

శాకల్యుడు

“సరే, ఎంతమంది దేవతలు?”

యాజ్ఞవల్క్యుడు

“ఇద్దరు”

శాకల్యుడు

“సరే, ఎంత మంది దేవతలు?”

యాజ్ఞవల్క్యుడు

“ఒకటిన్నర మంది”

శాకల్యుడు

“సరే, ఎంతమంది దేవతలు?”

యాజ్ఞవల్క్యుడు

“ఒక్కరు”

ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు తాను చెప్పిన ఆయా దేవతల సంఖ్యలను గురించి కూడా చక్కగా వివరించాడు.

         అయినప్పటికీ శాకల్యుడు శాంతించలేదు.  ఏ విధంగానైనా యాజ్ఞవల్క్యుడిని జయించాలనే కోరికతో ప్రశ్న మీద ప్రశ్నలను అడుగుతూ పోయాడు.  (సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కాకుండా, తనకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ఎంతమాత్రం ప్రతిపాదించకుండా, కేవలం తన ప్రత్యర్థి మాటలను నిరాధారంగా నిష్కారణంగా అసూయతో ఖండిస్తూ వాదించడాన్ని వితండవాదం అంటారు.).

         చివరకు శాకల్యుని దురాగ్రహాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు, ఠఓ శాకల్యా, నీకు సమాధానం తెలియని ప్రశ్నను నన్ను అడుగవద్దు.  సమాధానం తెలియకుండా నన్ను ప్రశ్నించినట్లయితే నీ తల తెగిపడుతుంది” అని హెచ్చరించాడు.  అయినప్పటికీ, శాకల్యుడు తనకు సమాధానం తెలియని ప్రశ్నను అడిగేశాడు.  దాంతో శాకల్యుని తల అందరి సమక్షంలోను తెగి క్రింద పడింది.

      అప్పుడు యాజ్ఞవల్క్యుడు, సభను ఉద్దేశించి, “అయ్యా, మీలో ఇంకా ఎవరెవరు ఏమేమి ప్రశ్నలను అడగదలుచుకున్నారో విడివిడిగా అడగవచ్చు.  లేదా అందరూ కలిసి ఒకే ప్రశ్నను వేయవచ్చు.  నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నాను” అని పలికాడు.

         అప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.

       అప్పుడు యాజ్ఞవల్క్యుడే స్వయంగా పండితపరిషత్తును ఉద్దేశించి ప్రశ్నించాడు.  ఆత్మ అనే పురుషుని వృక్షంతో పోల్చి చెప్పి, చెట్టును వేళ్లతో సహా విత్తనంతో సహా నాశనం చేస్తే ఆ చెట్టు మరల మొలకెత్తదు.  కాని, మన ముందే మరణించి, శరీరం కాల్చివేయబడినప్పటికీ, ఆ వ్యక్తి మరలా జన్మిస్తాడు. (ధ్రువం జన్మ మృతస్య అని శాస్త్రం)  “కో న్వేయం జనయేత్ పునః?  (మరణించిన వ్యక్తిని మరలా పుట్టేట్లుగా చేస్తున్న ఆ శక్తి ఏమిటి?) అని అడిగాడు.

     ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.  యాజ్ఞవల్క్యుడు సభకు నమస్కరించి, ఆవులను తోలుకొని పోయాడు.

“విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతుః పరాయణం తిష్ఠమానస్య తద్విద ఇతి” – అని బృహదారణ్యకోపనిషత్తు ఆ శక్తిని గూర్చి చెబుతుంది.  ఆ శక్తి పేరు విజ్ఞానం.  ఆ శక్తి పేరు ఆనందం.  ఆ శక్తి పేరు బ్రహ్మ.  అదే పరమగతి.
*****
అనగనగా రామాపురమనే గ్రామం. ఆ గ్రామంలో సాంబయ్యనే రైతు ఉన్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఐతే గత కొన్ని సంవత్సరాల నుండి కరవు కారణంగా పంటలు పండలేదు.

సాంబయ్య రకరకాల పనులు చేసినా కలిసిరాలేదు. కుటుంబ పోషణ భారమైపోయింది. కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తన పొలంలో ఉన్న నూతిలో దూకి, ఆత్మహత్య చేసుకోబోతుండగా..
'ఆగు మిత్రమా' అన్న మాటలు వినిపించాయి. చుట్టూ చూడగా చెట్టు మీద ఒక రామచిలుక కనిపించింది. రామచిలుక మాట్లాడం చూసి అశ్చర్యపోయాడు. 'నేనూ, నా కుటుంబం నీ పొలంలో పండిన జామపళ్ళు తిని ఇంతకాలం బతికాం. మేము నీకు ఋణపడి ఉంటాం. ఆ ఋణం తీర్చుకునేందుకు నీకు సహాయం చేస్తాను. ఆత్మహత్య మహా పాపం. బతకటానికే ప్రయత్నం చేయాలి. నేను నీతో వస్తాను. నన్ను ఓ పంజరంలో ఉంచి, చిలుక జోస్యం అంటూ డబ్బులు సంపాదించు. కుటుంబాన్ని పోషించు' అన్నది చిలుక. సాంబయ్యకు చిలుక చెప్పింది నచ్చి, చిలుక చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు.

సాంబయ్య ఊర్లన్నీ తిరుగుతూ మధ్యాహ్నం వరకూ చిలుక జోస్యం చెబుతుండేవాడు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద సేద తీరేవాడు. ఈ ఖాళీ సమయంలో చిలుక ఇండ్లపై ఎగిరి.. ఆ ఇండ్ల వివరాలు తెలుసుకుని, సాంబయ్యకు చేరవేసేది. ఆ వివరాలనే చిలుక జోస్యం పేరిట జనాలకి చెప్పేవాడు. తక్కువ కాలంలోనే సాంబయ్య మంచిపేరు సంపాదించాడు. అది సాంబయ్య శత్రువులకు నచ్చలేదు. చిలుక జోస్యమంటూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాడని రాజుకు ఫిర్యాదు చేశారు.
రాజు సాంబయ్యను పిలిపించాడు. 'నేను ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా రాజ్యంలో పేదవారు తగ్గకపోవడానికి కారణం ఏమిటో? వారం రోజుల్లో జోస్యం చెప్పాలి. సరిగ్గా చెపితే మంచి కొలువు ఇస్తాను.. లేదంటే శిక్షిస్తాను' అన్నాడు రాజు. 'అలాగే ప్రభు' అంటూ సెలవు తీసుకుని, ఇంటికి వెళ్ళాడు సాంబయ్య. చిలుక సాయంతో ఆ రాజ్యంలో పేదరికం తగ్గకపోవటానికి అవినీతి అధికారులు, వేగులు ఒకటైపోవడమని ఆ జాబితా రాజుకు అందించాడు.
రాజు సాంబయ్య చెప్పిన అవినీతి అధికారులు, వేగులను కొలువు నుంచి తప్పించి, కొత్తవారిని నియమించగా రాజ్యంలో పేదరికం తగ్గింది. రాజు సాంబయ్యను మెచ్చుకుని, తన ఆస్థానంలో మంచి కొలువు ఇచ్చాడు. ఆ విధంగా చిలుక చేసిన సాయంతో సాంబయ్య కష్టాల నుంచి బయటపడ్డాడు.
******
🔱 *నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి* 🔱
*పరమేశ్వరుడు భక్తదయాళువు. భక్తులు అడగడమే ఆలస్యం అలవోకగా వరాల వర్షం కురిపిస్తాడు. ఆయన శివతాండవం భక్తకోటికి ఆనందదాయకం. ఎర్రటి శిరోజాలతో హిమపర్వతాలపై ఆయన తాండవం చేసినట్టు పురాణగ్రంథాలు పేర్కొంటున్నాయి. స్వామివారు తన హస్తాల్లో డమరుకం, అగ్ని, అభయముద్రతో పాటు ఒక చేయిని తన చరణాల దిశగా చూపిస్తుంటాడు. ఆయన పాదాలను నిర్మలమైన మనసుతో ప్రార్థిస్తే చాలని దీనర్థము.*

*నటరాజు నాట్యము.*
*నటరాజ అంటే నాట్యముతో ప్రకాశించువాడు.ఆ త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యము చేసినట్టు ప్రాచీన వాజ్మయము ద్వారా తెలుస్తోంది.*
*ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి.ఆ పంచక్షేత్రాలివే..*

*🔱 చెన్నై సమీపంలోని తిరువళన్‌గడులోని వాద ఆరణ్యేశ్వర్‌ ఆలయంలోని కాళితాండవము.*
*🔱 చిదంబరంలోని నటరాజ ఆలయంలో ఆనందతాండవము.*
*🔱 మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో సంధ్యాతాండవము.*
*🔱 తిరునల్వేలిలోని నెల్లైఅప్పార్‌ ఆలయంలో ముని తాండవము.*
*🔱 కుట్రాళంలోని కుట్రాళనాథర్‌ ఆలయంలో త్రిపుర తాండవము.*
*జయ జయ జయ జయ జయ శ్రీ శివా!*
*******
*🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు*
       *(తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️*
👨‍👩‍👧‍👦👩‍👩‍👧‍👧👨‍👨‍👧‍👦👨‍👩‍👧‍👦👩‍👩‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👩‍👧‍👦👩‍👩‍👧‍👧👨‍👩‍👧‍👦

*🌎ప్రపంచములో.... ఆహ్వానం లేకుండా.... మనం... ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు "అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు 🏘️*

*🏖️ఈ ఒకే ఇల్లు ఒక్కటే... స్వతంత్రముగా.... మనమే తాళం తీసికొని.... నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు.🏪*

*💝ఈ ఇల్లు.... ఒక్కటే....  ప్రేమతో నిండిన కళ్లతో...., మీరు కనిపించే వరకు.... మీ కోసం.... తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది.💖*

*💪మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం.... మరచి పోకుండా... గుర్తు చేసే ఇల్లు.🤝*

*🙏ఈ ఇంట్లో మాత్రమే.... మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ.... ఉండటం.... ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం... వెంటనే లభించే పూజ ఫలితం.🙏*

*❣️మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే.... ఆ ఇంటి యజమానుల (అమ్మ నాన్నలు ) మనస్సులు.... కృశించి.... గుండెలు.... గూడలుగా మారతాయి. మీరు నొప్పించినా.... వాళ్లు బాధపడతారు.💘*

*⚜️ఈ ఇల్లు.... ప్రపంచాన్ని చూడటానికి...., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి... దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన  ఇల్లు.📛*

*🍇🍍ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది... మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు.... స్థలమే లేనిది.🍑🍎🍈*

*🫢ఇక్కడ మాత్రమే... మీరు భోజన సమయానికి తినకపోతే.... ఆ ఇంటి యజమానుల గుండెలు విరగిపోతాయి మరియు బాధపడతాయి. 😪*

*🥰ఈ ఇంట్లోనే.... మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి.😍*

*🧭కారణాలు ఏవయినా కావొచ్చు....  ఈ ఇళ్లకు దూరమవుతున్నా....  పిల్లలారా.... ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి.... ఆలస్యం   కాకముందే....⏰*

*💕తల్లిదండ్రులతో గడుపుతూ.... మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ... అందుబాటులో ఉండే
ఆవకాశం ఉన్నవారు అదృష్టవంతులు... ధన్యులు. 🙏💐🙏💐🙏💐🙏💐
🙏ఆంజనేయ వైభవం ప్రవచనం:🙏

హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథ !

యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని, భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్ల రణానికి తరలివెళుతున్న తమవాళ్ళను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామికార్యం, మరొకవైపు పేగుబంధం – ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామికార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్ళు కారుతున్నా 'విజయోస్తు…దిగ్విజయోస్తు' అని అంటున్నారు కుటుంబ సభ్యులు.

ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు. కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డాడు. తుది వీడ్కోళ్ళు ముగిసాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు –

'ఓ వానరులారా! ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అఋణిని. ఎవరీ ఋణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి. కనుక, ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో, అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను.' అని అన్నాడు.

జనన-మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారియై వాగ్దానం చేసాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమవారు తప్పక తిరిగివస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానర జాతి……………..

రామ సేవ కోసం కదలిన కపిసైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు 'సింగిలీకలు' అని పిలువబడే పొట్టి పొట్టి…మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడియైన గోళ్ళు – ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం.

రామ-రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడ ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే. రావణుడు – కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే, తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన, ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టివున్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా, వికటాట్టహాసంతో వానరులప విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు.రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది.

అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో వెయ్యిమంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి, నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం. కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది…ఆ వెయ్యి కోతులూ గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది.
ఏ చప్పుడూ వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక, ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడ సాగింది. “మనల్ని కాపాడ్డానికి ఎవరూ రాలేదు. అప్పుడు ఒక ముసలి కోతి సహనంతో ఉందాం. రామ నామ స్మరణ చేద్దాం.' అంది. ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామ నామాన్ని చేయసాగాయి. అలా అలా కొద్ది కాలంలోనే, అన్ని కోతులు రామ నామ సంకీర్తనలో మునిగిపోయాయి.

ఈలోపు, గంట బైట ఏం జరిగిందో చూద్దాం! రాముడు రావణున్ని సంహరించాడు. సీతమ్మను చేపట్టాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేసాడు. ఇక అయోధ్యకు బయల్దేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి, తన వాగ్దానాన్ని గుర్తు చేసాడు. కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 'ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నా' యని చెప్పాడు. మళ్ళీ లెక్కవేయమన్నాడు రాముడు. మళ్ళీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయల్దేరాడు.

ముందు హనుమ దారి చేస్తుండగా, యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాటన్నింటి మధ్యా ఎక్కడైనా వానరులు పడివున్నారేమో స్వయంగా వెదుకుతున్నాడు రాముడు. అంతలో, స్వామి దృష్టి ఒక గంటపై పడింది.'హనుమా…' అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయింది. వెంటనే తోకను పెంచి…గంటను పైకి లేపాడు.అక్కడ….ఆ గంట క్రింద….పెదవులపై రామనామం తాండవిస్తుండగా, మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చునివున్న కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్కవేసాడు. వెయ్యి సింగిలీక కోతులు. లెక్కసరిపోయింది. చుట్టూవున్న వానర సైన్యం ఒకపెట్టున 'జయ జయ రామ….జయ జయ రఘురామా” అంటూ జయఘోషను చేసింది.

అప్పటి వరకూ చీమ చిటుకుమన్న శబ్దం కూడ వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ ఘోషలా వినబడిన జయజయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడినపోయిన కళ్ళతో ధగధగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక, కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకుని, నెమ్మదిగా చూడసాగాయి.అదిగో…ఎదురుగా….ఆజానుబాహుడు…అరవిందదళాయతాక్షుడు …నిశాచరవినాశకరుడు, భక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడివున్నాడు.

అంతే….సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. వానరసైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది. 'జై శ్రీరామ…జై శ్రీరామా”అప్పుడు తెలిసింది ఏం చేయాలో…వెంటనే రామపాదారవిందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. 'రాముడు మోసగాడు' అన్న ఈ కోతిని, 'హనుమంతుడు బుద్ధిహీనుడు' అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం 'తారక మంత్రమే త్రోవ' అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది.

'సుందరే సుందరం కపిః' – ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట. మురిపెంగా చూసాడు ముగ్ధమోహనుడైన రాముడు. 'హనుమా! రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా, తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో – వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుంద'ని వరమిచ్చాడు శ్రీరాముడు. వాలంలో ఘంటను కలిగిన వానరశ్రేష్టుణ్ణి దర్శించేప్పుడు, పూజించేప్పుడు ఈ సింగిలీక కథను గుర్తుచేసుకోండి.

🚩🚩 సర్వేజనా సుఖినోభవంతు 🚩🚩
చిన్న కథ చెప్తా చదవండి
🙏పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు.
వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.
-
'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.
-
అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
-
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
-
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.🙏
చేతనైనంత వరకు అన్నదానం చేద్దాం
ఆ పరమాత్మ ప్రేమను పొందుధాం 🙏

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏
......
*వాణిజ్య  సందర*
మంచు కొండల మనోహరం పచ్చని చెట్ల కోలాహలం  పసందైన *ప్రకృతి* ఓ వరం
చల్లని వాతావరణ పర్యావరణ ప్రామాణికం నిత్య వాన శోభిత మయం  *సుందర దృశ్య* మనో కావ్యం

పోలీసు కానరాని **కూడలి వ్యవస్థ రూపం* * నిశ్శబ్ద నిరంతర వాహన చోదక  *కాలుష్య  రహిత* గమన గమ్య రాగం  కాల వేగ ఘమనంలో *ఏకాకులు* వారాంతపు కలయికలో *ప్రాంతీయ  వాదులు* శుభ్రతకు పరిశుభ్రతకు మార్గదర్శకులు నిర్దేశకులు

పాదచారులను గౌరవించే_ *వివేకవంతులు* ఉన్నంతలో విజ్ఞానవంతులు వివేకవంతులు
శారీరక కష్టానికి  నోచుకోని జీవులు దూర ధారాల బాధ తప్పితే గగన శోభిత సుందర ప్రదేశం అతి మనోహరం ఆనందకరం ఆరోగ్యకరం సంపాదించే వారికి ఐశ్వర్య వకరం పోర్టు ల్యాండ్.. వెరసి ఒక *వాణిజ్య  సందర* *మనోహహర నగరం*  *ప్రశాంతతకు* నిలయం
*******

పాదసేవ    

మనిషి శరీరంలో ప్రతీ అవయవము స్వచ్చంగా, అప్పుడే తీసిన పాలలా ఉండాలంటే అవి దేవునివైపు కదలాలి.  పెదవులు రుచికరమైన ఆహారాన్ని తినడమేకాక, భగవంతుని నామాన్ని నోరారా పలకాలి.  చేతులను  ఆయన సేవకు వినియోగించాలి,  కళ్ళు ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి,  కాళ్ళు ఈదేహాన్ని ఆయన సన్నిధికి తీసుకెళ్లాలి,  చెవులు స్వామి నామాన్ని విని విందు చేసుకోవాలి, నాలుక ఆయన ప్రసాదాన్ని రుచి చూడడానికి ఉవ్విళ్లూరాలి, గొంతు తీర్థాన్ని తీసుకుని పరవశించిపోవాలి.  ఇవన్నీ జరిగినప్పుడే ఆయన దృష్టిలో మనం పడతాము.

అంతేకానీ గుడి బయట రోడ్డుమీద వాహనం పైనుండి  వేగంతో వెడుతూ మనం పెట్టే నమస్కారం గురించి ఆయన ఏమీ కరువాచిపోలేదు.  వేగంగా వెళ్ళే రైలులోనుండి చూసినపుడు చెట్లు ఎంతో వేగంగా కదులుతున్నట్లు, కనిపిస్తాయి.  కనీసం ఆ చెట్టు వివరంగాకూడ కనిపించదు,  అలాగే మనం వేగంగా వెడుతూ పెట్టె నమస్కారంకూడ అయనకు అలాగే అందుతుంది.  గుడిలోకి వచ్చి నమస్కారం పెట్టే సమయం మనకి లేనపుడు ఈ భువనాన్ని ఏలే ఆయనకి దాని స్వీకరించే  సమయం ఉంటుందని నేను అనుకోను! 

మనం దేవుడిని దర్శించాలి అంటే, మనం మన స్నేహితుని ఇంటికివెళ్లి “ఒరే! సుబ్బడూ! బయటికిరా!” అని పిలవగానే బయటకు వచ్చినట్లుగా ఆయన బయటకు రాడు.  “దేవుడిని చూడాలి అంటే మనం నదిలో స్నానం చేసేటప్పుడు, ఎవరైనా తల పట్టుకుని గట్టిగా నీటిలోంచి బయటకురాకుండా అదిమిపెట్టిన సమయంలో, పైకిరావాలని ఎంతగా గిలగిలలాడతామో, దేవుని చూడాలంటేకూడా అంతే గిలగిలలాడాలి, అప్పుడే ఆయన మన ముంగిట ఉంటాడు” అంటారు ఓపెద్దాయన.

కొండ అంచున ఉన్న రాయి “ నేను ఇలాగే పాషాణంలా ఉండిపోతానేమో అని వందలయేళ్ళు రామ నామాన్ని స్మరిస్తూ కాలం వెళ్లదీస్తుంటే, మునుపెన్నడూ ఎరుగని గాలివాన రావడం, అప్పుడు కొండపైనుండి దొర్లుకుంటూ కిందకు రావడం, అది ఒక శిల్పి దృష్టిలో పడి, చక్కని విగ్రహంగా మారి పూజలండుకోవడం  వంటివి భగవానుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉంటేకానీ జరగవు.

పూజారి దేవునికి సమర్పించడానికి పువ్వులను కోసేటప్పుడు, అందరికీ కనిపించాలని విర్రవీగిపోతూ చిటారుకొమ్మకి ఎక్కి కూర్చున్న పువ్వు అందక,  కిందుగా పూచాను, పశువులు తింటాయేమోనన్న భయంతో ఉన్న పువ్వును ఆయన కోసుకెళ్లి దేముని పాదాల మీద ఉంచినప్పుడు, చిటారుకొమ్మన అందని పువ్వు పడే బాధ,  కిందుగా పూచిన పువ్వు ఆనందం వర్ణనాతీతం.  

****


****
సృష్టి ఆవిర్భావం
స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు.
లోకం లో సహజం గా వినిపించే మాట పురుషుడే అధికుడని . శంకరుని విషయములో అది సరికాదు . శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు . పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి -- శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిదమాత్రమే ఒంటికి పూసుముటాడని , ఇల్లు లేని కారణముగా శ్మశానములోనే ఉంటాడని , నిత్యము బిక్షకోసము తిరుగుతూ ఉంటాడని , బిక్షపాత్రకూడా లేని కారణముగా పర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని ... ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకేఒక్క ప్రియుడు శంకరుడు . లోకములో ప్రేముకులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా. -
తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు . ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం , ఆమె పెట్టే అన్నము జ్ఞానాని సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది " జ్ఞాన (అన్న) భిక్ష " తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు . అందుకే " అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి !. అంటుంది శ్లోకము అర్ధనారీశ్వరుడంటే ఎవరు, ఆపేరు ఎలా వచ్చింది ?

****


****

*అర్ధనారీశ్వరుడంటే ఎవరు, ఆపేరు ఎలా వచ్చింది ?

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి.
 
అర్ధనారీశ్వరుడు -లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.
 
అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహాశివరాత్రి నాడు ఆది దంపతులు - జగత్పితరులు
 
'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు
 
బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.
 

చిన్న కథ చెప్తా చదవండి
🙏పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. 
వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.
-
'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.
-
అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
-
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
-
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు. 
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. 
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.🙏
 చేతనైనంత వరకు అన్నదానం చేద్దాం
 ఆ పరమాత్మ ప్రేమను పొందుధాం 🙏

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏
......

*వాణిజ్య  సందర*

మంచు కొండల మనోహరం పచ్చని చెట్ల కోలాహలం  పసందైన *ప్రకృతి* ఓ వరం

చల్లని వాతావరణ పర్యావరణ ప్రామాణికం నిత్య వాన శోభిత మయం  *సుందర *దృశ్య* మనో కావ్యం

పోలీసు కానరాని **కూడలి వ్యవస్థ రూపం* * నిశ్శబ్ద నిరంతర వాహన చోదక  *కాలుష్య  రహిత* గమన గమ్య రాగం  కాల వేగ ఘమనంలో *ఏకాకులు* వారాంతపు కలయికలో *ప్రాంతీయ  వాదులు* శుభ్రతకు పరిశుభ్రతకు మార్గదర్శకులు నిర్దేశకులు

పాదచారులను గౌరవించే_ *వివేకవంతులు* ఉన్నంతలో విజ్ఞానవంతులు వివేకవంతులు 

శారీరక కష్టానికి  నోచుకోని జీవులు దూర ధారాల బాధ తప్పితే గగన శోభిత సుందర ప్రదేశం అతి మనోహరం ఆనందకరం ఆరోగ్యకరం సంపాదించే వారికి ఐశ్వర్య వకరం పోర్టు ల్యాండ్.. వెరసి ఒక *వాణిజ్య  సందర* *మనోహహర నగరం*  *ప్రశాంతతకు* నిలయం

******

విస్తరాకు.....మనిషి జీవితం


 "విస్తరాకును" ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని 'భోజనానికి' కూర్చుంటాము.

 భోజనము తినేవరకు "ఆకుకు మట్టి" అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం 'ఆకును' (విస్తరిని) మడిచి 'దూరంగా' పడేస్తాం.

 "మనిషి జీవితం" కూడా అంతే ఊపిరి పోగానే "ఊరి బయట" పారేసి వస్తాము..

 'విస్తరాకు' పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే 'పొయేముందు ఒకరి ఆకలిని' తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న 'తృప్తి' ఆకుకు ఉంటుంది.

 'సేవ' చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ 'సేవ' చేయండి.

 మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని "వాయిదా" వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే 'కుండ' ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు

 'విస్తరాకుకు' ఉన్న 'తృప్తి' కూడా మనకి ఉండదు..

  ఎంత 'సంపాదించి' ఏమి లాభం? 'ఒక్కపైసా' కూడా తీసుకుపోగలమా?

  కనీసం  'మన ఒంటిమీద బట్ట' కూడా మిగలనివ్వరు..

 అందుకే 'ఊపిరి' ఉన్నంత వరకు "నలుగురికి" ఉపయోగపడే విధంగా 'జీవించండి'...                                           ఇదే జీవిత పరమార్ధం

****


ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం  ఆలస్యం  అవడంతో  దారిలో  ఒక చీరలు  నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి  సేద తీరుతాడు 

వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి  మర్యాదలు  చేసారు.అలసిపోయిన  రాజు ఉదయం లేవడం  కాస్త ఆలస్యం  అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో  వారు ఉన్నారు .

రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు  

అతడి  చేతికి ఒక తాడు  కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా  ఆ వ్యక్తి రాజు అడిగే  ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే  ఇవ్వడం మొదలు పెట్టాడు 

ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు  బాబు కదిలినప్పుడల్లా  ఈ తాడు లాగితే  బాబు నిదుర పోతాడు  అని చెప్పాడు .

అతనికి దగ్గరలో  ఒక కట్టె కనిపించింది రాజుకి.

 అదేందుకు  అని అడిగాడు రాజు 

బయట నా భార్య ధాన్యాలను  ఎండబెట్టి  వెళ్ళింది పక్షులేవైనా  వస్తే  ఈ కట్టె కు కట్టిన  నల్లగుడ్డ  ఊపితే  అవి వెళ్లిపోతాయి  అని బదులిచ్చాడు  ఆ వ్యక్తి .

ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని  ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి

 ఇంట్లో ఎలుకలు  బెడద  ఎక్కువగా ఉంది. అవి  వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు 

ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు  వ్యక్తులు  కనిపించారు రాజుకి.

వాళ్ళు ఎవరు అని అడిగారు  ??

పని చేస్తున్నది నా చేతులే కదండి  నా నోరు ఏ పని చేయట్లేదు  అందుకు నాకు వచ్చిన  కొన్ని పాటలు  వాళ్లకు నేర్పిస్తాను  వాళ్ళు నేర్చుకుంటారు  అని చెప్పాడు .

రాజు మళ్ళీ సందేహంగా  ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం  ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా  అని అడిగారు అందుకు ఆ వ్యక్తి 

నేర్చుకుంటున్నది నోటితోనే...  కాళ్ళు ఊరకనే  ఉంటాయి కదండి!  పాట  నేర్చుకుంటూ  వాళ్ళు కుండలు  తయారు  చేయడానికి మట్టిని  తొక్కుతుంటారు  అని బదులిచ్చాడు .

రాజుకి  చాల ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు  చేయగలడా  అని !!

అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది  తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో  ఓ పది పదాలు  రాసిపెట్టి  వెళ్తుంది. అన్ని అయ్యాక  అవి నేర్చుకుంటుంటాను  అని బదులిచ్చాడు .

రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని .

సోమరిగా తిరిగేస్తున్న  వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి  అనే పట్టుదల రావటానికి.

నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.

.......

అమరావతి - హైదరాబాద్

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ఏపిలో ఏకంగా జీరో డిగ్రీ ఉష్ణోగ్రత.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం, రాత్రి వేళ ఇళ్ళలోంచి బయటకు వచ్చేందుకు తెలుగు ప్రజలు భయపడిపోతున్నారు. అంత చల్లగా వుంటోంది వాతావరణం.

పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ ప్రజలు చలికి గజగజా వణికిపోతున్నారు. బారెడు తెల్లారేవరకు సూర్యుడు కనిపించడంలేదు. దీంతో తెల్లారిపోయినా చలి తగ్గకపోవడంతో ప్రజలు కూడా ముసుగుతన్ని పడుకుంటున్నారు.

గత రెండుమూడు రోజులుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఈ నెలంతా ఇదే పరిస్థితి వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సంక్రాంతి సమయంలో చలి మరింత పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి పండక్కి పిల్లాపాపలతో పల్లెలకు వెళ్లేవారు జాగ్రత్త వుండాలని సూచిస్తున్నారు.

రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నమోదవుతున్నారు. ఇక తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇలా ఎముకలు కొరికే చలితో అప్రమత్తంగా వుండాలని ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరించారు. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం వుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసారు.

ఏపీలో జీరో ఉష్ణోగ్రత

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ మన్యం ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రాంతమంతా చలిమంటలు కనిపిస్తుంటాయి. తెల్లవారుజామున పొగమంచుతో ఆ పల్లెలన్నీ కప్పేసి వుంటాయి.

ఇలా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ శీతాకాలంలో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రా కాశ్మీర్ గా పిలిచే లంబసింగిలో అయితే 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే రోజుల్లో మరింత చలి పెరిగి మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలుంటాయి.

ఇక అల్లూరి జిల్లాలోని సుందర పర్యాటక ప్రాంతం అరకులో కూడా ఉష్ణోగ్రతల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇక్కడ అత్యల్పంగా 3.8 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. చింతపల్లిలో 4 డిగ్రీలు, డుంబ్రిగూడలో 6 డిగ్రీలు, జి. మాడుగులలో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడంటే

తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతుంటాయి. ఇలా ఇప్పటికే ఇక్కడ చలి చంపేస్తోంది. చాలాప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

అత్యల్పంగా సిర్పూర్ లో 6.5, సంగారెడ్డిలో 6.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లాల్లో 7.1 డిగ్రీ సెల్సియస్ గా నమోదయ్యింది. కుమురం భీం,నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి వుంది. కాబట్టి ఈ మూడు జిల్లాల్లో రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 

మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, నారాయణపేట, జగిత్యాల జిల్లాల్లోనూ 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇక రాజధాని హైదరాబాద్ లో కూడా గత రెండుమూడు రోజులుగా చలి వణికిస్తోంది. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో నగర రోడ్లను పొగమంచు కమ్మేస్తోంది. ఈ చలికి ఉదయం వాకింగ్, జాగింగ్ కు వెళ్లేవారితో పాటు రోడ్లు ఊడ్చే, చెత్తను సేకరించే జిహెచ్ఎంసి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ లోనే ఈ పరిస్థితి వుంది. మరి చుట్టుపక్కల జిల్లాలో చలి తక్కువగా వుంటుందా అంటే అక్కడ కూడా చలి పంజా విసురుతోంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా వుంది. రేపు కూడా ఇలాగే అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది..

****

ప్రాంజలి ప్రభ 

ప్రతిరోజూ తెలుగు లోమాట్లాడాలి , తెలుగులో వ్రాయాలి , తెలుగు మన మాతృ భాష అంటూ  ఫేసుబుక్లో , (5000 ) ప్రాంజలి ప్రభ వాడ్సప్ (౩౦౦ మంది )  లో పోస్టు చెయ్యటం నా కర్తవ్యంగా 

భావిస్తూ వ్రాస్తున్న  మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ, విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్ , ఏ గ్రూప్ కు నేను పంపుటలేదు  మీరే  దయచేసి పేస్ బుక్ వారి సహకారాన్ని అర్ధిస్తున్నాను, ఒక రచయితగా యీ వయసులో (68) నా రచనలు పోస్టు చేస్తున్నాను, కానీ 5000  మందిలో ఒక్కరు కూడా చూసే వారు లేకపోవడం నాకే అవమానంగా వుంది కనుక ఇప్పుడైనా కళ్ళు తెరవండి నేను దేనిని ఆశించుట లేదు కేవలం తెలుగుని బ్రతికించండి.    ఆనందం .. ఆరోగ్యం .. ఆధ్యాత్మికం .. నా కర్తవ్యం 

****

సిటీ మార్కెట్‌లో, ఒక ప్రత్యేకమైన దుకాణం పెద్ద సైన్‌బోర్డ్‌తో తెరవబడింది:

 "ఇక్కడ మీరు భర్తలను కొనుగోలు చేయవచ్చు."

 దుకాణం తెరిచిన వెంటనే, లోపలికి వెళ్లడానికి ఆసక్తిగా మహిళలు గుమిగూడారు.  కానీ దుకాణం వెలుపల ఒక హెచ్చరిక వ్రాయబడింది:

 "భర్తని కొనడానికి నియమాలు"

 - ప్రతి స్త్రీ ఒక్కసారి మాత్రమే దుకాణంలోకి ప్రవేశించవచ్చు.

- దుకాణంలో మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి మరియు ప్రతి ఫ్లోర్‌లో వివిధ రకాల భర్తల గురించి వివరించబడింది.

 - కస్టమర్లు ఏ అంతస్తు నుండి అయినా భర్తను ఎంచుకోవచ్చు.

 - మీరు ఒక్కసారి పైకి వెళ్తే, దుకాణం నుండి నిష్క్రమించడం తప్ప, మీరు తిరిగి క్రిందికి రాలేరు.

 ఓ యువతి ఉద్వేగంతో షాపులోకి ప్రవేశించింది.

 *మొదటి అంతస్తు:*

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం మరియు నిజాయితీగా ఉన్నారు."

 ఇంకొంచెం చూస్తాను’’ అనుకుని ఆ అమ్మాయి ముందుకు కదిలింది.

 *రెండవ అంతస్తు:*

సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు మరియు పిల్లలను ప్రేమిస్తారు."

 “ఇంకా మంచిదేదో చూస్తాను” అని ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచించి ముందుకు సాగింది.

 *మూడో అంతస్తు:*

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగంలో ఉన్నారు, నిజాయితీపరులు, పిల్లలను ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉన్నారు."

 ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగింది కానీ ముందుకు వెళ్లకుండా ఉండలేకపోయింది.

 *నాల్గవ అంతస్తు:*

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం, నిజాయితీ, అందమైన మరియు ఇంటి పనులలో సహాయం చేస్తారు."

 “ఇంతకంటే ఏం బాగుంటుంది?” అనుకుంది ఆ అమ్మాయి.  కానీ ఆమె హృదయం "ఇంకో అంతస్తు చూద్దాం" అని చెప్పింది.

 *ఐదవ అంతస్తు:*

 సంకేతం ఇలా ఉంది:

 "ఇక్కడ, భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు, అందమైనవారు, ఇంటి పనులలో సహాయం చేస్తారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు."

 ఆ అమ్మాయి నమ్మలేకపోయింది.  “అలాంటి భర్త ఉండగలడా?” అనుకుంది.  కానీ ఉత్సుకత ఆమెను చివరి అంతస్తుకు తీసుకెళ్లింది.

 *ఆరవ అంతస్తు:*

 సంకేతం ఇలా ఉంది:

 "మీరు ఈ అంతస్తుకు వచ్చిన 3339వ మహిళ. ఇక్కడ భర్తలు లేరు. మహిళలను పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు. మా దుకాణాన్ని సందర్శించినందుకు ధన్యవాదాలు! ఎడమ వైపున ఉన్న మెట్లు బయటికి దారితీస్తాయి."

 *ముగింపు:*

 నేటి కాలంలో,  చాలా కుటుంబాలు మరియు అమ్మాయిలు "అత్యుత్తమమైన" అన్వేషణలో వివాహానికి సరైన వయస్సు మరియు అవకాశాన్ని కోల్పోతున్నారు.  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం గొప్ప జ్ఞానం మీకూ మరియూ మీ కుటుంబ సభ్యులకూ శుభోదయం శుభాకాంక్షలతో 

ప్రాఞ్జలిప్రభా కథలపై భిప్రాయాలు 6281190539  లో తెలుపగలరు, మరియు కొత్తగా చేరాలనుకున్నవారు తెలపగలరు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ     

***

*అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది...!!

అసలు జన్మలు 3 రకాలు..!

1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.

జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి?

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.

అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు.

అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు.

అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే...

*క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని... మానవ లోకాన్ని చేరుకోవలసిందే!

మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!

ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.

ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు.

కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జంతుజన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. 

కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!

ఇక పుణ్యపాప కర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.

పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది.

ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. 

కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 

84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను..“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది. 

ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి...

ప్రాంజలి ప్రభ .. మల్లాప్రగడ రామకృష్ణ 

  *మత్స్యేంద్రనాథ్ ఇచ్చిన స్పష్టమైన సందేశం


మత్స్యేంద్రనాథుడు, గోరఖ్ నాథుడి గురించి ఒక కథ ఉంది. మత్స్యేంద్రనాథుడు ఒక గొప్ప యోగి. ఈయనని సహజంగా అందరూ శివాంశ గానే భావించేవారు. దీని అర్థం శివుడు మళ్ళీ జన్మించాడని కాదు. మనం ఆయనను శివ స్వరూపం అన్నప్పుడు, ఆయన జ్ఞానం, సామర్థ్యంలో శివుడికి ఏమాత్రం తీసిపోరని అర్థం. మనకి శివుడిలో ఉన్న ఆసక్తి ఆయనలో ఉన్న స్వభావాల బట్టే కదా ..!

 మత్స్యేంద్రనాథుడి లక్షణాలు అందుకు ఎంతో దగ్గరగా ఉండేవి. అందుకే ప్రజలు ఆయనను సాక్షాత్తూ శివుడే అని అన్నారు. ఆయనతో గోరఖ్ నాథుడు అనే ఒక శిష్యుడు ఎంతో సాన్నిహిత్యంతో ఉండేవాడు. తరువాతి కాలంలో గోరఖ్ నాథుడు కూడా ఒక దిగ్గజం అయ్యారు. ఈ దేశంలో మనం ఎరిగిన యోగులలో ఈయన ఎంతో ప్రాముఖ్యం కలిగినవారు. గోరఖ్ నాథుడు ఈ దేశంలో ఎంతో విశిష్టమైన పనిని చేశారు. బహుశా భారతదేశంలో ఈయన గురించి విననివారు ఉండనే ఉండరు.

ఒకసారి మత్స్యేంద్రనాథుడు, గోరఖ్ నాథుడితో నడుచుకుంటూ వెళుతూ, ఒక చిన్న పిల్ల కాలువను దాటారు. మత్స్యేంద్రనాథుడు ఒక చెట్టు క్రింద కూర్చొని,” నాకు కాసిని మంచినీళ్ళు తీసుకురా” అని అన్నారు. గోరఖ్ నాథుడు మంచి నీళ్ళ కోసం పరుగెత్తాడు. గోరఖ్ నాథుడు ఎలాంటివాడంటే, ఆయన గురువు ఏమి అడిగినా సరే ఒక క్షణంలో చేసెయ్యాలనుకుంటారు. ఈయన ఆ చిన్న పిల్ల కాలువ దగ్గరకు వెళ్లారు. అప్పుడే కొన్ని ఎడ్ల బండ్లు దాటడంవల్ల నీరు మురికిగా ఉండడం చూసారు. తిరిగి గురువు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి, ఇక్కడ నీరు మట్టిగా ఉంది, ఒక పదినిముషాల దూరంలో మరొక నది ఉంది, నేను అక్కడికి వెళ్లి నీళ్ళు తెస్తాను” అని చెప్పారు.

అందుకు మత్స్యేంద్రనాథుడు, “వద్దు, ఈ కాలువనుంచే మంచినీళ్ళు తీసుకుని రా.. అదే చోటునుండి" అని చెప్పారు. “ కానీ, అది అక్కడ మట్టిగా ఉంది “ అన్నాడు  గోరఖ్ నాథుడు. దానికి  మత్స్యేంద్రనాథుడు, “కానీ, నాకు అక్కడినుంచే నీళ్ళు కావాలి, అదే చోటునుంచి. నాకు దాహం కూడా వేస్తోంది” అన్నారు. సరే, గోరఖ్ నాథుడు మళ్ళీ పరుగెత్తుకు వెళ్లి, అది ఇంకా మట్టిగానే ఉండడం చూశారు. ఆయనకు ఏమి చెయ్యాలో తెలియలేదు. తిరిగి గురువు దగ్గరకు పరుగెత్తుకుని వచ్చాడు.

మత్స్యేంద్రనాథుడు ”లేదు నాకు ఆ కాలువ నుంచే నీళ్ళు కావాలి” అని అనడంతో ఏం చెయ్యాలో తోచక, అతను తిరిగి అక్కడికే వెళ్ళాడు. ఈపాటికి నీళ్ళు కొంచెం సర్దుకోవడం మొదలుపెట్టాయి.

అతను నిరీక్షించడం మొదలు పెట్టాడు. ఐదు నిముషాల తరువాత, నీళ్ళు శుభ్రంగా, స్వచ్చంగా తయారయ్యాయి. ఈయన ఆ నీటిని ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో గురువుగారి వద్దకు తీసుకునివచ్చి ఆయనకు ఇచ్చాడు. మత్స్యేంద్రనాథుడు, ఆ నీటిని పక్కన పెట్టారు. దానిని త్రాగలేదు. ఆయనకి దాహం వెయ్యడంలేదు. గోరఖ్ నాథుడు ఎలాంటివాడంటే, మీరు ఆయనకు ఒక మంత్రమిచ్చి పదిసార్లు జపించమంటే, ఆయన దానిని పదివేలసార్లు చేస్తారు. అటువంటివారు ఆయన..! మీరు ఆయనకి ఏమి చెప్పినాసరే, ఎంతో గొప్ప ఉత్సాహంతో చేస్తారు. ఇది ఒక అద్భుతమైన లక్షణం.

కానీ, ఆయన మరో పార్శ్వం లోనికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. అందుకు, దానిని మత్స్యేంద్రనాథుడు ఆయనకు ఈ విధంగా తెలియపరచారు. “నువ్వు పరుగెత్తవలసినదంతా పరుగేత్తేశావు. తీక్షణతో ఏవైతే చెయ్యాలో, అవన్నీ బాగా చేశావు. ఇప్పుడు సమయం ఆసన్నమైనది. కేవలం నిరీక్షించాలి. అప్పుడు, అదే అంతా స్ఫటికంలాగా స్పష్టంగా మారిపోతుంది” అని అన్నారు.

శబ్దం అనేది నీ మనస్సులో ఉన్నదే! ఏవైతే మోగుతున్నాయో, ఒకవేళ మీరు నిద్రపోతే, అవుతున్న శబ్దాలు మీకేమీ పట్టవు కదా ? మీకు సరిగ్గా నిద్ర పట్టకపోయే సమస్య ఉంటే తప్పితే..! లేకపోతే బయట ఎటువంటి శబ్దాలు ఉన్నా; మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, వాటి గురించి మీకేం పడుతుంది?? మీరు సృష్టించుకునే శబ్దాలవల్లే మీ మనస్సంతా కూడా ఇలా మురికిగా ఉంది..!! అవి మాటలుగా రూపు దిద్దుకుంటాయి. వాటికి మీరు అర్థాన్ని ఆపాదిస్తున్నారు.. ఈ అర్థంలేని శబ్దాలకు.

అందుకని కేవలం నిరీక్షించండి. అంతా మరొకసారి స్పష్టంగా మారిపోతుంది. అన్ని శబ్దాలూ సద్దుమణిగినప్పుడు.. మీరు వాటికి అర్థాలను తగిలించడం మానేసినప్పుడు.. అన్నీ వాటంతటవే విడిపడిపోతాయి.

***
Pranjali prabha .. Mallapragad ramakrishna 

యముడు చేతిలో పెట్టె (కధ ) 

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.  ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి.  తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

--((**))--
***********
Pranjali prabha .. Mallapragada Ramakrishna 

*స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టిప్స్.......ఒత్తిడి నిర్వహణ చిట్కాలు...*


1. *మనసారా నవ్వండి*

మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నిస్తే మీకూ ఆనందం, ఆహ్లాదం కలగడమే కాక ఇతరుల్నీ ఆనందంగా ఉంచుతారు. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవుతారు. నవ్వడం వల్ల ఫేషియల్‌ మజిల్స్‌, చెస్ట్‌, భుజాలు, మెడ, స్కల్‌ మజిల్స్‌ రిలాక్స్‌ అవుతాయి.

2. *నడక - వ్యాయామం*

ఉదయం పూట నడక మంచిది. అలా కుదరని పక్షాన సాయంత్రం పూట కూడా నడవచ్చు. నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించండి. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం రిలాక్స్‌ అవడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

3. *చక్కటి నిద్ర*

రోజుకు 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్రవల్ల మంచి రిలాక్సేషన్‌ ఏర్పడుతుంది. మనస్సు, శరీరం చక్కగా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. మధ్యమధ్యలో నిద్రాభంగం కలగకుండా చక్కటి గదివాతావరణం మంచి పడక, మంచిగాలి ఉండేటట్లు చూసుకోవాలి.

4. *చల్లటి నీళ్లతో స్నానం*

మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనయినప్పుడు చల్లటి నీళ్లతో స్నానం చేసినట్లయితే శరీరం, మనస్సు హాయిగా ప్రశాంతంగా ఫీల్‌ అవుతారు. అలా కుదరని సందర్భాలలో చల్లటి నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని, కావాల్సిన మంచినీరు త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఫీలవుతారు.

5. *వీకెండ్‌ ఎంజాయ్‌ చేయండి*

బయటకు వెళ్లండి. అందుకోసం చక్కటి ప్రణాళికలు వేయండి. అలా కొన్ని కొత్త ప్రదేశాలకు కాని, మీకు ఇష్టమైన ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్‌తో వెళితే బాగా ఎంజాయ్‌ చేస్తారు. అలా చేస్తే మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు.

6. *సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి.*

సంగీతం, సాహిత్య కార్యక్రమాలు మరి కొంతమందికి స్పోర్ట్స్‌, గేమ్స్‌, నృత్యం లాంటి ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా తిలకించడం చేయడం వల్ల ఒత్తిడికి దూరమవుతారు.

7. *వీలుకానప్పుడు నో చెప్పండి.*

మీ పరిమితులు, పరిధులు మీకున్నాయి. ప్రతి ఒక్కరు మీతో ఏదో పని చేయించాలని చూస్తారు. అందరినీ సంతోషపెట్టడం అనేది మీకు అలివి కాని పని అని తెలుసుకోండి. ఎదుటివారికి కోపం వస్తుందనుకుని అందరి సమస్యలు మీ నెత్తిన వేసుకుంటూ ఉంటే మీరు మానసిక ఒత్తిడికి గురి అవుతారని తెలుసుకోండి.

8. *టైమ్‌ మేనేజ్‌మెంట్‌ (సమయ పాలన)*

ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే కొంతమంది తమకున్న సమయాన్ని వివిధ కార్యక్రమాలకు చక్కగా ఉపయోగించుకుంటారు. అలా కాలాన్ని సద్వినియోగ పరిచే స్కిల్‌ మీలో ఉంటే ఒత్తిడిని అధిగమిస్తారు. అంటే మీరు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో ఒక ప్రయారిటీ లిస్ట్‌ ప్రతిరోజూ రాసుకోవాలి. ముందు ఏ పని చేయాలి. రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనే అంశాలు ముందుగా నిర్ణయించుకోవాలి. దానిప్రకారం మీ పనులు సక్రమంగా నిర్వహించుకుంటే ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. కొన్ని పనులు అర్జంట్‌ కానివి ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైనవి, ఇంకొన్ని ముఖ్యమైనవి కానివి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాటా ప్రాధాన్యత గుర్తించగలిగితే మీకు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

 9. *ప్లానింగ్‌ (ప్రణాళిక)*

మనకు రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా చేరుకోవాలి అనే విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఒక చక్కని ప్రణాళికను ఏర్పరుచుకున్నట్లయితే ఆ ప్రణాళిక ప్రకారం ఈజీగా ముందుకు వెళ్లగలుగుతాం. కాని కొంతమంది ఎటువంటి ప్రణాళిక లేకుండా పనులు తలపెడుతుంటారు. ఇటువంటి వారు ఒత్తిడికి లోనవుతుంటారు. కనుక మీరు ఏది చేయాలన్నా మంచి ప్రణాళిక వేసుకోవడం మరిచిపోవద్దు.

10. *ఎమోషనల్‌ ఇంటెలిజెన్సీ (ఉద్వేగ ప్రఙ్ఞ)*

అంటే మీలోని ఎమోషన్లను బేలెన్స్‌ చేసుకునే ప్రజ్ఞ మీలో ఉండాలి. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే ఒత్తిడికి లోనుకాకుండా ఉంటారు. మీరు ఇతరులపై కోపం ప్రదర్శించాలనుకున్నప్పుడు అది మీకు మీతోటి వారికి మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండే విధంగా సున్నితంగా ఉండాలి. అలాకాకుండా అవతలివారిని బాధించే విధంగా ఉన్నా లేదా మీరు అతిగా భావోద్వేగానికి గురి అయినా ఒత్తిడి మిమ్మల్ని వెంబడిస్తుంది.

11. *పాజిటివ్‌ థింకింగ్‌ (సానుకూల ఆలోచన)*

ఆశావహ దృక్పథంతో ఉన్న వ్యక్తులలో సహనం ఎక్కువగా ఉంటూ వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా సున్నితంగా ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. వారిలో ప్రొయాక్టివ్‌ బిహేవియర్‌ ఉంటుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. వారి ఆలోచనలు ఆచరణ ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటివారిలో ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఒత్తిడి ఏర్పడ్డా దాన్నించి బయటపడగల నేర్పుకూడా వారిలో ఉంటుంది.

12. *స్కిల్‌  నాలెడ్జ్‌*

ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మీరు చేసున్న ఉద్యోగంలో మీకు మంచి నైపుణ్యం ఉండాలి. అలాగే ఆ పనిలో మీకు నాలెడ్జ్‌ కూడా బాగుండాలి. అలా మీలోని నైపుణ్యాలను పెంచుకోకుండా ఉంటే మీరు తరచుగా ఒత్తిడికి గురి అవక తప్పదు. మీరు మీకు ఇచ్చిన పనుల్ని సరిగా చేయలేకపోవడం, సరి అయిన సమయంలో మీరు మీబాస్‌కు ఆ పనిని అప్పగించలేక పోవడం తద్వారా ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. కనుక స్కిల్‌`నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.

13. *ఎసెర్టివ్‌ (దృఢమైన ప్రవర్తన) బిహేవియర్‌*

మీరు ఎగ్జిక్యూటివ్‌ కావచ్చు. లేదా ఆ క్రింది స్థాయి వ్యక్తి కావచ్చు. మీ ప్రవర్తన ఎసెర్టివ్‌గా ఉండాలి. అంటే ప్రతివ్యక్తిలోనూ మూడు రకాలైన ప్రవర్తనలు ఉంటాయి. అంటే పాసివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ అలాగే ఎసెర్టివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ వల్ల ఇద్దరి మధ్యా ట్రాన్సాక్షన్స్‌ దెబ్బతింటాయి. అలాగే ఎవరైతే ఎగ్రెసివ్‌గా ఉంటారో వారు మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా అప్‌సెట్‌ అవుతారు. తొందరగా ఒత్తిడికి గురవుతారు. పాసివ్‌ బిహేవియర్‌ ఆమోదయోగ్యం కాదు. అది ఇతరుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంది. కనుక ఇతరుల్ని అభిమానించి, గౌరవించేది అంతేకాక వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేది. ఎసెర్టివ్‌ బిహేవియర్‌ను అనుసరించడం వల్ల ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఒత్తిడి లేకుండా ఉంటుంది.

అలాగే భార్యాభర్తలు మధ్యకాని స్నేహితుల మధ్యకానీ, ఆఫీసులో మీతోటి ఉద్యోగస్తుల మధ్యకాని ఎసెర్టివ్‌నెస్‌ అనేది ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఉదాహరణకు మీ అభిప్రాయం బాగుంది. మీరు చెప్పింది కూడా పరిశీలించాల్సిన అంశమే. నేను ఇలా అనుకుంటున్నాను. మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు... ఇలా సంభాషణ కొనసాగితే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది.

14. *డెలిగేషన్‌*

అన్ని పనులు మీరు ఒక్కరే చేయాలనుకోవడం సాధ్యం కాదు. ఆఫీసులో కాని, ఇంట్లో కాని కొన్ని పనులను మీరు ఇతరులకు కేటాయించాలి. ఆయా పనుల ప్రాధాన్యతను బట్టి మీ క్రింది ఉద్యోగులకు, అసిస్టెంట్స్‌కు అలాగే ఇంట్లో అయితే కొన్ని పనులు ఇతర కుటుంబ సభ్యులకు కేటాయించడం వల్ల పని పంచబడుతుంది. దీనివల్ల ఒత్తిడి ఏర్పడదు.

15. *సానుభూతి గల*

ఇతరులు ఉన్న పొజిషన్‌లో మీరు ఉంటే ఎలా ఫీల్‌ అవుతారు. అనే కోణంలో ఆలోచిస్తే మీ ఆలోచనా ధోరణి సవ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు ఇతర వ్యక్తులతో అనుబంధం సవ్యంగా ఉంటాయి. ఎంపతీ ఫీలింగ్‌ మనిషిని ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది.

16. *డెడ్‌లైన్స్‌*

మీ ఆఫీసులో మీకు ఇచ్చిన జాబ్‌ ఆఖరి క్షణం వరకూ పూర్తి చేయకుండా ఉంటే లెవెన్త్‌ అవర్‌ టెన్షన్‌కు గురి అవుతారు. దాంతో మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన పనులు డెడ్‌లైన్‌కు ముందే ముగించండి.

17. *కుటుంబ సభ్యులతో సరదాగా*

ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం చాలా ఆరోగ్యకరమైన విషయం. ఇలాంటివారు ఎంతో కాన్ఫిడెంట్‌గా సరదాగా ఉంటారు. అందరితో మంచి కమ్యూనికేషన్‌, సత్సంబంధాలు ఉంటాయి. దాంతో ఒత్తిడి మీ దరికి చేరదు.

18. మీ లైఫ్‌ పార్టనర్‌తో

ఆఫీసులో బిజీ షెడ్యూల్‌తో ఇంటికి లేటుగా వచ్చి హడావుడిగా మీ కార్యక్రమాలు ముగించుకుని మంచం మీద మౌనంగా పడుకుంటే మీ పార్టనర్‌తో మీకు మంచి రిలేషన్స్‌ ఎలా ఉంటాయి? అందుకు మీ లైఫ్‌ పార్టనర్‌కు కొంత టైమ్‌ కేటాయించండి. మాట్లాడండి... అభినందించండి.... ప్రేమించండి, ముద్దూ ముచ్చట్లతో ఆనందంగా గడపండి. ఇక ఒత్తిడి పరార్‌!

19. పిల్లలతో ఎక్కువ ఆనందం

మీకు పిల్లలు ఉన్నారా? అయితే పిల్లలతో ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వారితో మాట్లాడండి.... వారి ఎమోషన్స్‌, వారి అభిరుచులు, వారితో కలిసిపోండి. ఆడుకోండి. ఆనందించండి.... వారు చిన్న పిల్లలయితే ఎత్తుకోండి. ముద్దాడండి... టీనేజర్స్‌ అయితే వారితో స్నేహితులుగా మారిపోండి. ఇక ఒత్తిడిని మీరు దూరం అవుతారు.

20. బుక్‌ రీడింగ్‌

పుస్తకాలు చదివే అలవాటు మిమ్మల్ని అనేక విషయాలవైపు ఆలోచింపచేస్తుంది. మీలో విజ్ఞానంతో పాటు క్రియేటివిటీ, ఆనందం కలుగుతాయి. ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

21. ఫోటో ఆల్బమ్‌

మీరు టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నారా? మానసికంగా గజిబిజిగా ఉందా? ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే మీ ఇంట్లో ఆల్బమ్‌ ఒకసారి తీయడి. ఎన్నో ఫోటోలు, చిన్నప్పటి మీ అనుభూతులు పరిశీలించండి. హాయిగా ఫీల్‌ అవుతారు.

22. గార్డెనింగ్‌

మీ ఇంట్లో గార్డెన్‌ ఉందా? పూలకుండీలు చక్కగా సర్దండి... వాటికి నీరు పోయండి. అలా మీరు ఒక అరగంట సమయాన్ని పూలమొక్కలతో గడపండి... రిలాక్స్‌గా ఫీల్‌ అవండి.

23. మ్యూజిక్‌ వినడం

మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటే మీరు ఎంతో ప్రశాంతతకు లోనవుతారు. ఒంటరిగా ఆలోచించే దాని కన్నా ఓ మంచి సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది.

24.  ఆఫీసు - ఇల్లు పరిశుభ్రత

ఆఫీసు కావచ్చు. ఇల్లు కావచ్చు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు మంచి రిలాక్స్‌డ్‌గా ఉన్న కలర్స్‌ వాడాలి. వస్తువులు టేబుల్స్‌, పుస్తకాలు, బట్టలు చిందరవందరగా ఉండకూడదు.... ఇల్లూ, ఆఫీసు మంచి వాతావరణం స్ఫురించాలి.

25. టెలిఫోన్‌ కాల్స్‌

మీ సెల్‌ఫోన్‌ కాల్స్‌ను పరిమితం చేసుకోండి. ఎక్కువ సమయం పిచ్చాపాటీ విషయాలతో విపరీతమైన కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. కాల్స్‌కు హద్దులు పెట్టండి.

26. ఫైల్‌ - టేబుల్‌ మేనేజ్‌మెంట్‌

ఆఫీసులో మీ టేబుల్‌ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ వహించండి. ఫైల్స్‌ ఎలా మెయింటైన్‌ చేయలో తెలుసుకుంటే మీ టేబుల్‌పై ఏఏ ఫైల్స్‌ మీ దగ్గరుండాలో, ఏ ఫైల్స్‌ దాచిపెట్టాలో వాట ఆర్డర్‌ నెంబర్‌ ఎలా ఉండాలి. తిరిగి వాటిని తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్త పడండి.

27. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

ఆఫీసులో కాని ఇంట్లో కాని కమ్యూనికేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్‌ సరిగా లేకుంటే చాలా టైమ్‌ గ్యాప్‌ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్‌ కూడా దెబ్బతింటాయి. దాంతో ఒత్తిడి ఏర్పడుతుంది... మంచి కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోండి.

28. టైప్‌ ఎ పర్సనాలిటీ నుంచి.... టైప్‌ బి పర్సనాలిటీకి మారండి.

కార్డియాలజిస్టులు వ్యక్తులలో టైప్‌ ఎ అని టైప్‌ బి పర్సనాలిటీ అని రెండు రకాలుగా గుర్తించారు. టైప్‌ ఎ పర్సనాలిటీ గల వ్యక్తులు ఎక్కువ టెన్షన్‌కు గురి అవుతారు. ఎప్పుడూ హర్రీబర్రీగా ఉంటారు. దీంతోవారు స్ట్రెస్‌కు ఈజీగా లోనవుతారు. అలాగే టైప్‌ బి పర్సనాలిటీ వారు నిదానంగా ఆలోచిస్తూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారివారి పనులు చక్కదిద్దుకుంటారు. వీరిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు రిలాక్స్‌డ్‌గా పనులు చేస్తారు. దీనిని గురించి మరింత వివరంగా మీరు - మీ వ్యక్తిత్వంలో చదవండి.

29. ఇంటర్‌ పర్సనల్‌ రిలేషన్స్‌

ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా మనకు ఏర్పడే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. నిత్యం మనం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటే మనం ఇతరులు సంతోషంగా ఉంటారు.

30. ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌

మన మనసుతో మనకు ఉండే సంబంధాన్ని ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌ అంటారు. మన మనసుని మనం ఎలా నియంత్రించుకుంటున్నాం? మనం ఎలా ఆలోచిస్తున్నాం... మనం ఎటువంటి అభిరుచులు కలిగివున్నాం... మన లావాదేవీలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? నా బాధ్యతలు  నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా అనే ఆలోచనల్ని మనం నిరంతరం గమనిస్తుంటాం. ఈ రిలేషన్‌ సక్రమంగా ఉన్నట్లయితే ఒత్తిడి లేకుండా ఉంటుంది.

31. అంతర్మధనం వద్దు.... ఓపెన్‌ అవ్వండి!

ఏదో ఒక సమస్యపై మీలో మీరు తర్కించుకుంటూ బాధపడేదానికన్నా మీ స్నేహితులకు లేదా మీ లైఫ్‌ పార్టనర్‌కు సమస్య వివరించండి. మీకు సొంతంగా పరిష్కారం దొరకని విషయలకు ఇతరుల అనుభవాల నుంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అందుకే మనలో మనం మానసికంగా కుంగిపోవడం కన్నా మిత్రులతో పంచుకుంటూ ఉంటే చాలా రిలాక్స్‌ అవుతాం.

pranjali prabha ..Mallapragada Ramakrishna