Saturday, 2 February 2019

చరిత్రలో ఈ రోజు (2)





చరిత్రలో ఈ రోజు/జనవరి 20
1265 : లండను‌ లోని వెస్ట్‌మినిస్టర్‌ భవనం లో ఇంగ్లాండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.
1900 : సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం (జ.1822).
1907 : సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం (మ.1968).
1940 : తెలుగు సినిమా కథానాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం.
1957 : భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సర ను ట్రాంబే లో ప్రారంభించారు.
1960 : తెలుగు సినిమా హాస్య నటుడు మరియు రాజకీయవేత్త విజయ నరేష్ జననం.
1964 : భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు మరియు రచయిత ఫరీద్ జకారియ జననం.
1995 : తాజ్‌మహల్‌ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 3
1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం.
1923 : నిజాం విమోచన కారుడు తమ్మర గణపతిశాస్త్రి జననం.
1924 : అమెరికా 28 వ అధ్యక్షులు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.(జ. 1856)
1963 : భారత రిజర్వ్‌ బ్యాంకు 23 వ గవర్నర్‌ రఘురాం రాజన్ జననం.
1975 : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం డి.కూలిడ్జ్ మరణం.

🔲చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 5
1915 : ఆంధ్ర ప్రజా నాట్య మండలివ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం (మ.1963).
1920 : బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ జననం (మ.1997).
1936 : కన్నడ భాషా రచయిత కె.ఎస్.నిసార్ అహ్మద్ జననం.
1961 : ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి మరణం (జ.1915).
1976 : భారతీయనటుడు మరియు భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ జననం.
2008 : ప్రముఖ ఆధ్యాత్మిక యోగి మహర్షి మహేశ్ యోగి మరణం (జ.1918).
చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 6

1804 : ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ మరణం.

1911 : అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం.

1923 : వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు జే.రామేశ్వర్ రావు జననం.

1925 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మరణించాడు (జ.1897).

1931 : భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ నెహ్రూ మరణం.

1932 : భరాగో గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం జననం.

1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి జననం.

1976 : బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత మరియు స్క్రిప్టు రచయిత రిత్విక్ ఘటక్ మరణం.

2006: తెలుగు సినీ హాస్యనటి కల్పనా రాయ్ మరణం. (జ. 1950)


  చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 7

1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్జననం.

1877: ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీజననం.

1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం.

1897: ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం.

1969: స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు మరియు చలనచిత్ర దర్శకులు ఆమంచర్ల గోపాలరావుమరణం.

1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 8

1834 : మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ జననం.

1880 : ప్రసిద్ధ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జననం.

1897 : పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జననం.

1931 : అమెరికాకు చెందిన ఒక నటుడు జేమ్స్ డీన్ జననం.

1941 : ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం.

1963 : భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్ ముహమ్మద్ అజహరుద్దీన్ జననం.

1971 : నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.ఎమ్.మున్షీ మరణించాడు (జ.1887).

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 9

1936 : నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడైన అడబాలజననం (మ.2013).

1939 : ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు బండి రాజన్ బాబు జననం (మ.2011).

1954 : ఒక మిలియనీర్, వ్యాపారవేత్త, ప్రేరణాత్మక ఉపన్యాసకుడు మరియు పరోపకారి క్రిస్ గార్డనర్జననం.

1968 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు రాహుల్ రాయ్ జననం.

1969 : బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు.

1976 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు సుమంత్జననం.

1996 : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు మరియు వైణికుడు చిట్టిబాబు మరణం (జ.1936).

2008 : ప్రసిద్ధ సంఘ సేవకుడు మురళీధర్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) మరణం (జ.1914).

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 10

1837 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ మరణం.

1902 : ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ మరణం.

1911 : భారత్ లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.

1923 : X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం.(జననం.1845)

1931 : కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.

1950 : ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ జననం.


2010 : భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.మరణం

  🔲చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 11

1847 : ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం. (చిత్రంలో)

1865 : ప్రముఖ హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం.

1917 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి జననం.

1922 : సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీ లో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.

1942 : పారిశ్రామికవేత్త జమ్నాలాల్ బజాజ్ మరణం.

1968 : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ మరణం.

1969 : అమెరికన్ నటీమణి జెన్నిఫర్ అనిస్టన్ జననం.

1974 : సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం.

1977 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ మరణం.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 12

1809 : పూర్వపు అమెరికా అద్యక్షుడు అబ్రహం లింకన్ జననం (మ.1865).

1809 : జీవ పరిణామ క్రమ సిద్దాంత, ప్రకృతి వరణ సిద్ధాంతాలను అందించిన ఛార్లెస్ డార్విన్ జననం (మ.1882).

1878 : స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ అలెక్సాండర్ డఫ్ మరణం (జ.1806).

1942 : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖుడు సి.హెచ్.విద్యాసాగర్ రావుజననం.

1962 : తెలుగు సినిమా నటుడు జగపతి బాబుజననం.

1962 : తెలుగు సినిమా ప్రతినాయకుడు ఆశిష్ విద్యార్థి జననం.

1968 : తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త పువ్వుల సూరిబాబు మరణం (జ.1915).

1976 : భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు అశోక్ తన్వర్ జననం.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 13

1879 : స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి సరోజినీ నాయుడు జననం (మ.1949).

1913 : సుప్రసిద్ధ పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రిజననం (మ.1997).

1911 : నవీన ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం (మ.1984).

1914 : సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు మాదాల నారాయణస్వామి జననం (మ.2013).

1930 : ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు నూతి శంకరరావు జననం.

1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయించబడినది.

1971 : మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయకి సురభి కమలాబాయి మరణం (జ.1907).

1974 : బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత రాబీ విలియమ్స్ జననం.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 14

ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే)

1779 : నావికుడు, సముద్రయానికుడు, సాహస యాత్రికుడు జేమ్స్ కుక్ మరణం (జ.1728).

1898 : విజయవాడకు చెందిన న్యాయవాది, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం (మ.1992).

1921 : ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జననం (మ.1954).

1931 : మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ జననం (మ.2008).

1952 : భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేత, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం.

1973 : తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు వై.వి. రావు మరణం (జ.1903).


1983 : తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం (జ.1935).

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 15

1564 : ప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియో (గెలీలియో గలీలీ) జననం.

1827 : అమెరికాకు చెందిన ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ జననం.

1869 : ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మరణం.

1921 : చరిత్రకారుడు, బీహార్ కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం.

1948 : ప్రముఖ హిందీ కవయిత్రి "సుభద్రాకుమారి చౌహాన్" జననం.

1956 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ జననం.

2001 : మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడినది.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 16

1944 : భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే మరణం (జ.1870).

1954 : వెస్ట్‌ఇండీస్‌కు క్రికెట్ క్రీడాకారుడు మైకెల్ హోల్డింగ్ జననం.

1956 : భారతదేశానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా మరణం (జ.1893).

1961 : ఆర్ధిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకుడు వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం (జ.1902).

1964 : పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జననం.

1985 : తెలుగు పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు మరణం (జ.1908).

2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలులోకి వచ్చింది.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 17

1954 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జననం.

1963 : అమెరికన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మైఖేల్ జెఫ్రీ జోర్డాన్ జననం.

1981 : అమెరికాకు చెందిన ప్రసార మాధ్యమాల ప్రముఖురాలు, మోడల్, గాయని, రచయిత్రి, ఫ్యాషన్ డిజైనర్ మరియు నటి ప్యారిస్ హిల్టన్ జననం.

1984 : భారతీయ సినిమా నటీమణి సదా జననం.

1986 : తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం (జ.1895).

1987 : రాజకీయ కార్టూనిస్టు అసీం త్రివేదీ జననం.

2000 : మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది


చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 18

క్రీ.పూ.3102 : కలియుగము ప్రారంభమైనది.

1486 : రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు చైతన్య మహాప్రభుజననం (మ.1534).

1564 : ఇటలీ కి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు మైఖేలాంజెలో మరణం (జ.1475).

1745 : బ్యాటరీ ని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా జననం (మ.1827).

1836 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (జ.1886).

1939 : భారతీయ సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మమరణం (జ.1888).

1994 : భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు నృత్య దర్శకుడు గోపీకృష్ణ మరణం (జ.1933).

2015 : తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు దగ్గుబాటి రామానాయుడు మరణం (జ.1936).

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 19

1473 : సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ జననం.

1630 : మరాఠా సామ్రాజ్యానికి ఆద్యుడైన ఛత్రపతి శివాజీ జననం.(మ.1680)

1905 : తెలుగు సినిమా రచయిత వెంపటి సదాశివబ్రహ్మం జననం.

1915 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం.

1930 : తెలుగు సినిమా దర్శకుడు కె. విశ్వనాథ్ జననం.

1941 : కవి, శాసన పరిశోధకుడు, గ్రాంథిక భాషను సమర్థిస్తూ ఉద్యమించిన జయంతి రామయ్య పంతులు మరణం.

1956 : ఆచార్య నరేంద్ర దేవ్ మరణం.

1965 : గుజరాత్ రెండవ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా జననం.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 20

1901 : బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు జననం (మ.1978).

1925 : నేపాలీ రాజకీయనాయకుడు గిరిజాప్రసాద్ కొయిరాలా జననం (మ.2010).

1935 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి జననం (మ.2014).

1973 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం (జ.1921).

1987 : అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

1989 : తెలుగు సినిమా నటి శరణ్య మోహన్ జననం.


2010 : తెలుగు సినిమా హాస్యనటుడు బి.పద్మనాభం మరణం (జ.1931).

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 21

1894 : ప్రసిద్ధ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం (మ.1955).

1907 : ప్రముఖ తమిళ సినిమా మరియు రంగస్థల నటుడు ఎం.ఆర్‌.రాధా జననం.

1909 : ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి వసంతరావు వెంకటరావు జననం.

1941 : కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం.

1945 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సుధీర్ నాయక్ జననం.

1951 : బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు డా.దేవరాజు మహారాజు జననం.

1965 : వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కీత్ ఆథర్టన్ జననం.

1971 : ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావుమరణం (జ.1902).


2013 : హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతం లో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.


చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 22

1556 : మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ మరణం (జ.1508).

1732 : అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ జననం (మ.1799).

1847 : స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసింది.

1866 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య జననం (మ.1949).

1939 : ప్రముఖ బాల సాహిత్య రచయిత కలువకొలను సదానంద జననం.

2009 : ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు మరియు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణం (జ.1914).

1958 : ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం (జ.1888).


1997 : బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణం (జ.1920).


:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 23

ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం.

1483 : మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం (మ.1531).

1503 : ప్రముఖ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య మరణం (జ.1408).

1855 : సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ మరణం (జ.1777).

1913 : ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం (మ.1971).

1941 : అణుబాంబు ల తయారీలో వాడే రసాయన పదార్థం ప్లుటోనియం ను కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు.

1957 : తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు జననం (మ.2012).(చిత్రంలో)

1982 : భారతదేశ టెలివిజన్ నటుడు మరియు మోడల్ కరణ్ సింగ్ గ్రోవర్ జననం.

1966 : దళిత కళాకారిణి మరియు కవయిత్రి చంద్రశ్రీజననం.

2009 : 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.

చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 25

2008: క్యూబా అధ్యక్షుడుగా రాల్ క్యాస్ట్రో ఎన్నిక

జననాలు.
1932 :ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు సుబ్రతాబోస్ జననం
(మ.2015)

1948 : డానీ డెంజోగ్ప సుప్రసిద్ధ భారతీయ చలన చిత్ర నటుడు.(మ.2019)

1974:సినీ నటి దివ్యభారతి జననం.( మ.1993)

మరణాలు
1961 : శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రముఖ రచయిత మరణం

1995:ఏల్చూరి సుబ్రహ్మణ్యం. ప్రసిద్ధ కవి రచయిత పాత్రికేయులు.( జ.1920)

2001:డొనాల్డ్ బ్రాడ్ మన్ పేరొందిన ఆస్ట్రేలియా క్రికెటర్ (జ.1908).

2004:బి.నాగిరెడ్డి సుప్రసిద్ధ నిర్మాత విజయా సంస్థ అధినేత(జ.1912)

2008 జస్టిస్ హంసరాజ్ ఖన్నా సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి.


2010: కాటం లక్ష్మీనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనా పోరాట యోధుడు.(జ.1924).


చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 26

1802 : సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త విక్టర్ హ్యూగో జననం (మ.1885).

1829 : బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు లెవీ స్ట్రాస్ జననం (మ.1902).

1932 : ప్రముఖ సామాజిక సేవకురాలు హేమలతా లవణం జననం (మ.2008).

1869 : నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా అఫ్జల్ ఉద్దౌలా మరణం (జ.1827).

1982 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు ఎలకా వేణుగోపాలరావు జననం.

1887 : పాశ్చాత్య వైద్యం లో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి మరణం (జ.1865).

1962 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి సభాపతి అయ్యదేవర కాళేశ్వరరావు మరణం (జ.1882).

1975 : భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్ర అహ్మదాబాదులో ప్రారంభం.



చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 27

1803 : ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.

1931 : భారతీయ స్వాతంత్ర్యోద్యమకారుడు చంద్రశేఖర్ అజాద్ మరణం (జ.1906).

1932 : ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్జననం (మ.2011).

1932 : సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు, బహుభాషావేత్త వేగె నాగేశ్వరరావు జననం (మ.1997).

1956 : లోక్‌సభ మొదటి స్పీకరు జి.వి.మావలాంకర్మరణం (జ.1888).

1972 : తెలుగు సినిమా హాస్యనటుడు శివాజీ రాజాజననం.

2002 : అహమ్మదాబాదు వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.

2005 : ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు పుహళేంది మరణం.


చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 28

▪జాతీయ విజ్ఞాన దినోత్సవము.

▪దర్జీల దినోత్సవము.

1927 : భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం (మ.2002).

1928 : విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు జననం (మ.2011).

1948 : రంగస్థల నటీమణి రాజేశ్వరి పువ్వుల జననం.

1963 : భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం (జ.1884).

1976 : అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్ అలీ లార్టర్ జననం.

2014 : తెలుగు రచయిత, సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టు స్థాపకుడు జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణం (జ.1926).




చరిత్రలో ఈ రోజు/మార్చి 1

1901 : ఆంధ్ర రాష్ట్ర ప్రధమ శాసనసభ సభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం (మ.1983).

1908 : సాహిత్యవేత్త ఖండవల్లి లక్ష్మీరంజనం జననం (మ.1986).

1947 : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రారంభం.

1955 : ప్రఖ్యాత సాహితీవేత్త వెలమల సిమ్మన్న జననం

1968 : భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కుంజరని దేవి జననం.

1969 : భారతీయ రైల్వేలు రాజధాని ఎక్స్‌ప్రెస్ లను ప్రవేశపెట్టాయి. మొదటి రైలు ఢిల్లీ, కోల్‌కతాల మధ్య మొదలైంది.

1986 : తెలుగు సినీ గాయకుడు ఎన్. సి. కారుణ్య జననం.

*చరిత్రలో ఈ రోజు*
*2 మార్చి, 2019*
*శనివారం*

 *ప్రత్యేక దినాలు
----------
 *సంఘటనలు*
1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
2008: కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.
----------
 *జననాలు*

1935: దుద్దిల్ల శ్రీపాద రావు, ప్రముఖ శాసనసభ్యుడు మరియు శాసనసభ స్పీకరు. (మ.1999)
1962: యాకూబ్, ప్రముఖ కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.
1977: ఆండ్రూ స్ట్రాస్‌, ఇంగ్లిష్‌ క్రికెటర్‌. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌.
----------
 *మరణాలు*

1938: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
1949: స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి , భారత కోకిల సరోజినీ నాయుడు మరణం.(జ.1879). 
1990: మసూమా బేగం, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901)
2014: టి.వి.కె.శాస్త్రి, అనంతరం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
2015: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)

--((**))--

చరిత్రలో ఈ రోజు/మార్చి 3

1847 : టెలిఫోను ను కనుక్కున్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ జననం (మ.1922).

1895 : నార్వే ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్ జననం.

1937 : ప్రముఖ తెలుగు రచయిత సత్యం శంకరమంచి జననం (మ.1987).

1967 : నక్సల్బరీ ఉద్యమం మొదలైంది.

1967 : ప్రముఖ భారతీయ గాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్ జననం.

1982 : అమెరికా నటీమణి మరియు పూర్వపు మోడల్ జెస్సికా బీల్ జననం.

1991 : కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము (విశాఖపట్నం).

2002 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్   జి.ఎం.సి.బాలయోగి మరణం (జ.1945).

చరిత్రలో ఈ రోజు/మార్చి 4

భారత జాతీయ భద్రతా దినోత్సవం.

1856 : ప్రముఖ భారతీయ రచయిత్రి తోరూదత్ జననం.

1961 : భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ పని మొదలుపెట్టింది.

1962 : ప్రముఖ రంగస్థల నటీమణి బుర్రా విజయదుర్గ జననం.

1973 : తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం.

1980 : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.

1987 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం.

1680 : మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మరణం.

చరిత్రలో ఈ రోజు/మార్చి 6


1475 : ప్రముఖ చిత్రకారుడు మైఖేలాంజెలో జననం.(మ.1564).

1508 : మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ జననం.

1899 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం.

1913 : హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు జననం (మ.1966).

1919 : ప్రముఖ సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం.

1936 : పాత తరం తెలుగు సినిమా కథానాయిక కృష్ణకుమారి జననం.

1937 : అంతరిక్షంలో కి వెళ్ళిన మొదటి మహిళ గా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాలెంతినా తెరిష్కోవా జననం.



చరిత్రలో ఈ రోజు/మార్చి 7

1921 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు జననం (మ.1992).

1938 : అమెరికా దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత డేవిడ్ బాల్టిమోర్ జననం.

1952 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ జననం.

1952 : పరమహంస యోగానంద మరణం (జ.1893).

1955 : ప్రముఖ హిందీ నటుడు అనుపమ ఖేర్ జననం

1961 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోవింద్ వల్లభ్ పంత్ మరణం (జ.1887).

1970 : ఆంగ్ల నటి మరియు రూపకర్త రాచెల్ వీజ్ జననం.


1979 : గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకట రమణయ్య మరణం (జ.1890)


చరిత్రలో ఈ రోజు/మార్చి 8

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

1879 : కేంద్రక విచ్ఛిత్తి పై విశేషమైన కృషిచేసి నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త అట్టోహాన్ జననం (మ.1968).

1897 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు జననం (మ.1925).

1917 : ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం (మ.2007).

1921 : సుప్రసిద్ధ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి జననం (మ.1980).

1974 : ఫ్రాన్సు రాజధాని పారిస్ లో చార్లెస్-డి-గాల్ విమానాశ్రయం ప్రారంభం.


చరిత్రలో ఈ రోజు/మార్చి 9

1916 : పోలెండ్‌పై జర్మనీ యుద్ధం ప్రకటించింది.

1934 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కిన రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ జననం (మ.1968).

1934 : మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదులో పర్యటించాడు.

1943 : ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు నెలకొల్పిన బాబీ ఫిషర్ జననం(మ.2008).

1952 : రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు దౌత్యవేత్త అలెక్సాండ్రా కొల్లొంటాయ్ మరణం (జ.1872).

1981 : మాలిక్యులర్‌ బయాలజీకి మార్గదర్శకుడు మాక్స్‌ డెల్‌బ్రక్ మరణం (జ.1906).

1985 : భారతీయ క్రికెట్ ఆటగాడు పార్థివ్ పటేల్ జననం.

1994 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి మరణం (జ.1908).

1997 : ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మరణం (జ.1907).

చరిత్రలో ఈ రోజు/మార్చి 10

భారత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ దినోత్సవం.

1876 : టెలిఫోనును కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ దానిని మొదటిసారిగా ఉపయోగిస్తూ, పక్కగదిలోని వాట్సన్‌తో మాట్లాడాడు.

1896 : ప్రముఖ రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు జననం.

1913 : బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆఫ్రో అమెరికన్ హారియట్ టబ్‌మన్ మరణం

1932 : ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఉడుపి రామచంద్రరావు జననం.

1985 : భారత్ పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది.

చరిత్రలో ఈ రోజు/మార్చి 11

1915 : విజయ్ హజారే , భారత క్రికెటర్ జననం. (మ. 2004)

1689 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం (జ.1657).

1955 : పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణించాడు (జ.1881).

1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.

1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.

2013 : రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి మరణం (జ.1913).

చరిత్రలో ఈ రోజు/మార్చి 12

మారిషస్ గణతంత్ర దినోత్సవం

1930: భారత స్వాతంత్ర్య ఉద్యమములో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర (200 మైళ్ళ దూరం) ప్రారంభమైంది.

1993: ముంబైలో బాంబు పేలుళ్ళు

1912 : జూలియట్ గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించారు.

1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంఛి 12 మార్చి 1962 వరకు).

1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంఛి 29 ఫిబ్రవరి 1964 వరకు).

2011: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆవిర్భావం

1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత బాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి జననం.

చరిత్రలో ఈ రోజు/మార్చి 15

1493 :అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.

1564 : మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.

1767 : అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్జననం.

1915 : మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.

1934 : భారత దేశంలో ప్రముఖ దళిత నేత కాన్షీరాంజననం. (మరణం: 2006)

1937 : ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్యజననం.

1977 : భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మరణం: 2008)

1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).


1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

చరిత్రలో ఈ రోజు/మార్చి 17

763 : ప్రఖ్యాతిగాంచిన అబ్బాసీయ ఖలీఫా హారూన్ రషీద్ జననం (మ.809).

1892 : ప్రముఖ తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం (మ. 1984).

1896 : పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు జననం (మ.1976).

1962 : ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యోమనౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా జననం.

1963 : వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ హార్పర్ జననం.

1975 : పంజాబీ గాయకుడు-పాటల రచయిత, నటుడు, మరియు నిర్మాత బబ్బూ మన్ జననం.

1982 : కేరళ లో రాష్ట్రపతి పాలన


1990 : ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన తొలి మహిళ సైనా నెహ్వాల్ జనన0.

చరిత్రలో ఈ రోజు/మార్చి 18

భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం.

1858 : రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త జననం (మరణం:1913).

1871 : భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం (జననం:1806).

1922 : మహత్మా గాంధీ కి, శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు, 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడింది.

1837 : అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం (మ.1908).

1938 : ప్రముఖ చలన చిత్ర నటుడు శశి కపూర్ జననం.

1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి, అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.


చరిత్రలో ఈ రోజు/మార్చి 19

1900 : ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్ జననం.(మరణం.1958)

1952 : తెలుగు సినిమా నటుడు మోహన్ బాబుజననం.

1954 : ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని జననం.

1955 : అమెరికన్ నటుడు, నిర్మాత మరియు సంగీతకారుడు బ్రూస్ విల్లీస్ జననం.

1966 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి.చదలవాడ ఉమేశ్ చంద్ర జననం.

1982 : ఆచార్య జె.బి.కృపలానీ మరణం.

1984 : భారత దేశంలో ప్రముఖ సినీ నటి తనూశ్రీ దత్తా జననం.

2008 : ప్రముఖ సినీనటుడు రఘువరన్ మరణం.(జననం.1958

చరిత్రలో ఈ రోజు/మార్చి 20

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

1351 : ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం.

1602 : డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.

1855 : మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్న జె.ఏస్పిడిన్ మరణం..(జ.1788)

1951 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మదన్‌లాల్ జననం.

1966 : భారత గాయకురాలు అల్కా యాగ్నిక్ జననం.

2008: తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మరణం.

2010 : నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మరణం


చరిత్రలో ఈ రోజు/మార్చి 21

▪అంతర్జాతీయ ఎర్త్ డే (భూగోళ దినోత్సవము)

▪ప్రపంచ జాతి వివక్ష నిర్మూలనా దినం

▪ప్రపంచ అటవీ దినోత్సవం

▪భూమిపై పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు.

1768: ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ జననం (మ.1830).

1916: ప్రముఖ సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం (మరణం:2006).

1923: సహజ యోగ సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ నిర్మల శ్రీవాత్సవ జననం (మరణం:2011).

1978: ప్రముఖ భారత సినీనటి రాణీ ముఖర్జీ జననం.

1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియా కు స్వాతంత్ర్యం.



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 1

1578 : శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని తెలియజేసిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం (మ.1657)

1889 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కె.బి.హెడ్గేవార్ జననం (మ.1940).

1911 : మానవతావాది, కవి ఏటుకూరి వెంకట నరసయ్య జననం (మ.1949).

1914 : కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన వారపత్రిక అయిన ఆంధ్రపత్రిక దినపత్రికగా మారింది.

1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).

1933 : భారత క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.

1935 : భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.

1936 : ఒరిస్సా బ్రిటీష్ ఇండియాలో క్రొత్త ప్రావిన్సుగా అవతరించింది.

1941 : భారత దేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్ జననం (మ.2018).


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 2

1725 : వెనిస్‌ కు చెందిన ఒక సాహసికుడు మరియు రచయిత గియాకోమో కాసనోవా జననం (1798).

1872 : అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మరణించాడు (జ. 1791).

1915 : తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం (మ.1969).

1969 : భారత సినీ నటుడు అజయ్ దేవగన్ జననం.

1933 : ప్రముఖ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్‌ సింహ్‌జీ మరణించాడు(జ.1872). ఈయన పేరిటే భారత్‌ లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.

1972 : చార్లీ చాప్లిన్ అమెరికా కు తిరిగి వచ్చాడు


2011 : భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 4

1818 : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.

1905 : కాంగ్రా భూకంపం లో 20,000 మంది ప్రజలు మరణించారు.

1919 : సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త.మరణం (జననం . 1832).

1968 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం (జ. 1929).

1975 : మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.

1979 : ప్రముఖ భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం (జ.1896).

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 5

1908: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు జగ్జీవన్ రామ్ జననం. (మ.1986).

1918: వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు, రాజకీయవేత్త ఇటికాల మధుసూదనరావు జననం.

1922 : భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి మరణం (జ.1858).

1930 : మహాత్మా గాంధీ 241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.

1937 : భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత చేగొండి వెంకట హరిరామజోగయ్య జననం.

1993 : భారతీయ సినిమానటి దివ్యభారతి మరణం (జ.1974).


1994 : అమెరికాకు చెందిన ఒక పాటల రచయిత మరియు స్వరకర్త కర్ట్ కోబెన్ మరణం (జ.1967).


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 6

1896 : 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.

1922 : వక్త మరియు సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు జననం.

1928 : DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్‌ వాట్సన్‌ జన్మించాడు.

1930 : మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం ముగిసింది.

1931 : ప్రముఖ కమ్యూనిస్టు నేత నల్లమల గిరిప్రసాద్ జన్మించాడు.

1956 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ జననం.

1989 : ప్రముఖ గుజరాతీ భాషా రచయిత పన్నాలాల్ పటేల్ మరణం.

2002 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ మరణం.

2011 : దక్షిణ భారత సినిమా నటి సుజాత మరణం.



మిత్రులందరికీ హొలీ (కామదహనం)పండుగ శుభాకాంక్షలు 
*హోలీ పండగ ఎందుకు జరుపుకోవాలి ?*

       వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మరియు 
భూమిపై దాడి చేశాడు.

            ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు.

           దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైనప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించి నప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 
చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో  కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె 
దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

        తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహఅవతారంలో (సగం మనిషి మరియు సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలోకూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) మరియు తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా). 

         ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర మరియు బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైనకృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి 
తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.

         హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది.పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివునితపస్సును భంగ పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద 
చేశాడు. కామదేవుని యొక్క భార్యరతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.

       హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.

(శ్రీసత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యం తో) 
------------------శుభసాయంత్రం----------------

చరిత్రలో ఈ రోజు/మార్చి 22
ప్రపంచ జల దినోత్సవం

1739 : నాదిర్షా ఢిల్లీ ని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.

1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)

1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్ కు స్వాతంత్ర్యం లబించింది.

1957 : భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.

1960 : ఆర్థర్ లియొనార్డ్ మరియు చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.

1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.

2000 : భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.

2007 : ప్రముఖ భారత తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి మరణం. (జననం:1918)

2009: తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావుమరణం.

చరిత్రలో ఈ రోజు/మార్చి 23

ప్రపంచ వాతావరణ దినోత్సవం

1749 : ప్రముఖ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త,ఖగోళ శాస్త్రవేత్త పియరీ సైమన్ లాప్లాస్ జననం. (మ.1827)

1893 : భారత దేశ ప్రముఖ ఆవిష్కర్త,ఇంజనీర్ జి.డి.నాయుడు జననం. (మరణం:1974)

1910: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రాంమనోహర్ లోహియా జన్మించాడు.

1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్(జ. 1907),రాజ్ గురు(జ. 1908) మరియు సుఖ్ దేవ్(జ. 1907) లు ఉరి తీయబడ్డారు.

1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.

1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది.(పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)

1992: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ హేయక్ మరణం.

1994: కపిల్ దేవ్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు



చరిత్రలో ఈ రోజు/మార్చి 26

1875 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్జననం.(మరణం. 1922)

1933 : ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జననం.

1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.(బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)

2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.

2006 : ప్రముఖ రాజకీయవేత్త అనిల్ బిశ్వాస్ మరణం.(జననం.1944)

2006 : తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుమరణం.

2008: భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు

చరిత్రలో ఈ రోజు/మార్చి 27

ప్రపంచ రంగస్థల దినోత్సవం

1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)

1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హెచ్.వి.బాబు జననం.

1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.

1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.

1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.

1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)

2008: వికీపీడియా లో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడినది.

చరిత్రలో ఈ రోజు/మార్చి 29

1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్ జననం.

1857: మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం -సిపాయిల తిరుగుబాటు.

1952 : ప్రముఖ రచయిత కె.ఎన్‌.వై.పతంజలి జననం.

1953 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు జననం.

1982: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

1997 : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్ మరణం.


చరిత్రలో ఈ రోజు/మార్చి 30

1842 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.

1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.

1908 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం (మ.1994).

1935 : ప్రముఖ తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.

1953 : ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు జమలాపురం కేశవరావు మరణం (జ.1908).

1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.

2002 : ప్రముఖ హిందీ సినీ గీత రచయిత ఆనంద్ బక్షీ మరణం (జ. 1930)

2005 : భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ ఓ.వి.విజయన్ మరణం (జననం.1930).

2011 : ప్రఖ్యాత తెలుగు సినిమా హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం (జ.1945).
--((**))--

చరిత్రలో ఈ రోజు/మార్చి 31

1727 : భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం (జ.1643).

1919 : హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.

1928 : పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ప్రముఖుడు కపిలవాయి లింగమూర్తి జననం.

1933 : ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణజననం (మ.2011).

1959 : 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.

1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి మరణం (జననం.1932)

1987 : ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపిజననం.

1995 : మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి సెలీనా మరణం (జ.1971).

🔲ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి27న
ఆసందర్భంగా...
“కావ్యేషు నాటకం రమ్యమ్” అన్నది భారతీయ సాహిత్యంనుండి పుట్టిన అతి రమణీయమైన వాక్యం. కావ్యాలలో నాటకానికున్న ప్రాధాన్యతనీ, ప్రాచుర్యాన్నీ చెబుతుందిది. ఈ నెల అంటే మార్చి 27న అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశాలూ జరుపుకునే రోజు. నాటకరంగ కృషికి అందరూ పండగ జరుపుకునే రోజు.
ప్రాచీన కళల్లో నాటకానుకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చరిత్ర చూస్తే ఈ నాటక కళ వివిధ దేశాల్లో, ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా విడివిడిగా ఎదిగిన కళ. సుమారు నాలుగో శతాబ్దంలో “ది పెర్సియన్స్” నాటికని గ్రీకులు వేసారని చెబుతారు. ప్రపంచంలో మొట్టమొదటి నాటకాన్ని ఎథెన్స్ నగరంలో దైనోసిస్ అనే ధియేటర్లో ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. భారతదేశంలో క్రీ.పూ నాల్గవ శతాబ్దంలో భరతముని రాసిన నాట్య శాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అన్న మరో వాదన కూడా వుంది. అతి ప్రాచీనమయిన కళల్లో నాటకం ఒకటి. భారతీయ రంగస్థలం ఋగ్వేద కాలం నుండీ ఉందని అంటారు. మొట్ట మొదటి నాటకం అక్షరరూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం, భవభూతి రచించిన మాలతీమాధవీయం, ఉత్తరరామ చరిత్ర ప్రాచీన నాటకాలయినా ఇప్పటికీ అవి అపురూపమైనవి. ఆయా నాటకాలు నేటికీ ఆదరణీయమైనవే!
సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పట్లో లాగ అప్పట్లో దేశాల మధ్య రాకపోకల్లేవు. అసలు దేశం ఉనికే తెలీదు. అలాంటిది ఒకే ప్రక్రియ రెండు వేర్వేరు చోట్ల ప్రాణం పోసుకోవడానికి ముఖ్య కారణం మానవ సంబంధాలూ, సమాజమూనూ. నాటకం వీటినుండే పుట్టింది. గడిచిపోయిన దాన్ని కళ్ళముందు జరుగుతోందన్న భ్రమని కలగజేయడమే నాటకం. ఆ భ్రమకి వాస్తవ రూపం ఇచ్చేది నాటక రచన అన్నది నిర్వివాదం. నాటకం సర్వజననీయం; సర్వకాలీనం. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ రూపం మారుతుంది తప్ప అంతర్లీనంగా నాటక మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే! అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియ. ప్రస్తుతమున్న నాటకం కాల క్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం పుట్టింది.
అంతర్జాతీయంగా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినంగా ప్రకటించారు. ఇది 1961లో ప్రపంచ రంగస్థల సంస్థ ద్వారా శ్రీకారం చుట్టబడింది. ఈ రోజు పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా నాటక ప్రదర్శనలూ, సభలూ జరుగుతాయి. ఆ విషయాలందరూ పంచుకుంటారు. అర్వి కివిమా అనే హెలెన్‌స్కీ జాతీయుడు మొట్ట మొదటి సారిగా 1961లో వియన్నాలో ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తీసుకొచ్చాడు. వియన్నా లో ప్రపంచ రంగస్థల సంస్థ యూక కార్యక్రమానికి అనేక దేశాలనుండీ నాటకప్రియులు విచ్చేసారు. కివిమా ప్రతిపాదన నచ్చి, అందరూ అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది. అప్పటినుండీ అప్రతిహతంగా ఈ రంగస్థల దినోత్సవం జరుపుతూనే ఉన్నారు. ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా నాటక రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని ఆ ఏడాదికి సంచాలకుడిగా నియమిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రంపంచంలోని నాటక ప్రియులు తమ తమ అనుభవాలని పంచుకుంటారు. నాటక రంగ కృషికి కొత్తొ కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రతీ దేశం నుండీ ఒక ప్రముఖ వ్యక్తిని ఆ సంస్థ సలహాదారుగా నియమిస్తారు. భారత దేశం నుండి ప్రముఖ నాటకకర్త గిరీష్ కర్నాడ్‌ని ఈ సంస్థ నాటక ప్రతినిధిగా నియమించారు.
గతంలో రాయల్ షేక్‌స్పియర్ కంపెనీ తరపున నాటకాలు వేసిన ప్రఖ్యాత నటీమణి జేమ్ జూడె డెంచ్‌ ఈ ఏటి రంగస్థల దినోత్సవ ప్రతినిధి.
“రంగస్థలం వినోద ప్రదేశమే కాదు; వివిధ సంస్కృతుల్నీ. జాతుల్నీ, మనుషుల్నీ ఒకటిగా కలిపే ప్రక్రియ. దానిక్కావలసింది రంగస్థలం, నాటకాభిమానులూ. అక్కడే మనం ఆనందిస్తాం;దుఃఖంలోకి నెట్టబడతాం; ఆలోచనలకి అంకురార్పణ చేస్తాం; స్ఫూరి చెందుతాం. ఇదీ రంగస్థల మహత్యం.” అని ప్రపంచ రంగస్థల దినోత్స్వవ సందర్భంగా జూడీ డెంచ్ అంటారు.
ప్రపంచ రంగస్థల దినోత్సవవం అంటే రంగస్థల అనుభవాలని పంచుకోడం కాదు. ఈ సందర్భంగా ప్రాంతీయ నాటక రంగ అనుభవాన్ని ప్రపంచానికి తెలియ చెప్పే రోజు. నాటక ప్రక్రియపై మక్కువతో నాటక ప్రియులందరఊ కలసి అభిమానంగా పండగ జరుపుకునే రోజుగా ఈ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకోవాలి. దీన్ననుసరించి ఈ ఏడాది ( 2010 లో ) కెనడాలోని వాంకోవర్లోనూ, అమెరికాలో న్యూయార్కులోనూ,షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి ప్రముఖ నగరాల్లోనూ, మెక్సికోలోనూ, జపాన్‌లోనూ, లండన్, నార్వే, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ఎంతో వైభవంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి వారి భాషల్లో నాటకాలు ప్రదర్శిస్తారు. ప్రతీ ఏటా వివిధ దేశాల నుండీ ఒక ముఖ్య నాటకానికి బహుమతి అందజేస్తారు. ఆది ఆ నాటక ప్రదర్శనా నిమిత్తం ఇస్తారు తప్ప వ్యక్తులకీ, సంస్థలకీ కాదు.
ప్రపంచం నలుమూలలా నాటకం అభివృద్ధి చెందింది, ఒక్క తెలుగు నాట తప్ప. పూర్వపు నాటకాలకీ ఇప్పుడు ప్రదర్శించే నాటకాలకీ చాలా తేడా వుంది. రచనా పరంగా, రంగస్థల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నటన అన్నది స్థల,కాలాల్ని బట్టీ మారుతుంది. కేవలం వినోదం అన్న స్థాయి నుండి నాటకం ఒక అనుభవం అన్న స్థాయికి ఎదిగింది. విదేశాల్లో ఈ అనుభవాన్ని పొందడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. తెరతీయగానే మనల్ని జుట్టు పట్టుకొని నాటకంలోకి లాక్కెళ్ళిపోతుంది. ఆ సన్నివేశం పైకప్పు మీదుండి వీక్షిస్తున్నామన్న అనుభూతి కలిగిస్తుంది. మనం కూడా నాటకంలో ఒక పాత్రధారులమేనన్న భ్రమ కలిగిస్తుంది. ఈ విధంగా నాటకం ఎదిగింది. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రంగస్థలం మీదే వర్షమూ, తుఫానూ, మంటలూ, మంచూ చూపించడమూ, మేఘాలు రప్పించడం వంటి ప్రక్రియలు చేకూర్చి రంగస్థలాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్ళింది సాంకేతిక విజ్ఞానం. మామూలుగా అమెరికా వంటి దేశాల్లో సినిమా చూడడానికి పది లేదా పదిహేను డాలర్లు ఖర్చుపెట్టే ప్రేక్షకుడు, రంగస్థల అనుభవాన్ని పొందడానికి ఏభై నుండి వంద డాలర్ల వరకూ వెచ్చిస్తారు. నాటకం వచ్చిందీ అంటే ఎగబడి మరీ చూస్తారు. బ్రాడ్‌వే షోలకీ, ధియేటర్‌కీ ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. ఇదీ పాశ్చాత్య దేశాల్లో నాటకానికున్న విలువ.
మరాఠీ, బెంగాలీ, కన్నడ నాటకరంగాలు మినహాయిస్తే తెలుగు నాటక రంగం మాత్రం ఏమాత్రం ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్న చందంగా మిగిలింది. పరిషత్తులూ, ప్రదర్శనలూ పెరిగాయి తప్ప నాణ్యత ఏమాత్రం లేకుండా, పూర్వం వేసిన నాటకాలే మెరుగ్గా వున్నాయన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. రంగస్థలానికి కావల్సిన సౌకర్యాలు సున్నా. సరైన ధియేటర్లు లేవు. ఏదో ఒక హాలు తీసుకొని నాటకం వేయ్యాల్సిన పరిస్థితే ఇప్పుడుంది. నాటకం వేయడానికి అతి ముఖ్యమైన మైకులూ, స్పీకర్ సిస్టములూ ఉండవు. ఉన్నా సరిగా పనిచేయవు. మైకులు మొరాయించని నాటకం ఉండదూ అంటే అతిశయోక్తి కాదు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశమూ ఒకటి. అయినా పరిస్థితి అరవయిల్లో నాటకాలు దాటి పోలేదు. రచనా పరంగా, నటనా పరంగా కూడా అదే పరిస్థితి. రాశి పెరిగింది కానీ వాసి లేదు. నాటక రంగం మంచి నటుల్ని తయారు చెయ్యలేకపోతోంది.
తెలుగు వారికి నటులూ అంటే సినిమా నటులే అన్న ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. సినిమాల్లో నటన ముక్కలు ముక్కలుగా చిత్రీకరించబడుతుంది. నాటకంలో ఏకబిగిన మొత్తం సన్నివేశంలో నిమగ్నమై నటించాలి. అది చాలా కష్టం. నాటకాలు వేసిన వాళ్ళు సినిమాల్లో రాణిస్తారేమో కానీ, సినిమా నటులు నాటకాల్లో రాణించడం అంత సులభం కాదు. ఏటా నంది నాటకాలు పేరు చెప్పి ఓ పది పదిహేను నాటకాలు వేయించి ప్రభుత్వమూ చేతులు దులిపేసుకుంటుంది. నాటకరంగ అభివృద్ధి బహుమతుల ద్వారా జరగదన్న చిన్నవిషయం ఎందుకు అర్థం కాదో తెలీదు. నాటక ప్రదర్శనకి అన్ని సౌకర్యాలూ, సదుపాయాలతో మంచి ధియేటరు కావాలి. కేవలం కళా ప్రదర్శనకే పరిమితమైన ధియేటర్లు మనకి లేవు. సంతాప సభకీ, సత్కార సభకీ రవీంద్ర భారతే దిక్కు. రాజధాని నగరమే ఇలా వుంటే విశాఖపట్టణం, వరంగల్లూ, విజయవాడా, తిరుపతి వంటి నగరాల గురించి చెప్పనవసరం లేదు. నాటక రంగాన్ని మరో మెట్టుకి తీసుకెళ్ళాలంటే ప్రభుత్వమే కాదు, నాటక ప్రియులూ నడుం కట్టాలి. ముఖ్యంగా ప్రదర్శనలని ఆదరించి ప్రేక్షకులూ వారివంతు చేయూత ఇవ్వాలి. ప్రపంచ రంగష్తల పటంలో తెలుగు నాటకానికీ ఒక స్థానం కల్పించాలి. ప్రపంచ రంగస్థల ఉద్దేశ్యం కూడా అదే! ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. అంతవరకూ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని తప్పనిసరిగా విధి తప్పకుండా నాటకప్రియులందరూ జరుపుకుంటారని కోరుకుందాం.